వేములవాడ భీమకవి సంస్కృతంలో రచించిన జ్యోతిష్య గ్రంథమును తెలుగులో అనువదిస్తూ ఒక కవి భీమకవి జన్మవృత్తాంతాన్ని పై సీస పద్యంలో వివరించాడు.
తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామమునకు ఐదారు క్రోసుల దూరంలో వేములవాడ అను గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను సంతాన ప్రాప్తి కోసం ఎన్నో దానధర్మాలు చేసాడు. శివభక్తి పరాయణుడై యాగములను చేస్తూ యెన్నో విధములుగా పరమేశున్ని ఆరాధించాడు. బిడ్డ కోసం ఐదుగురిని పెళ్లాడుతాడు.ఇదిలా ఉండగా ఇతనికి భీమేశుడు ఒకనాడు స్వప్నంలో కనపడి నీ మరణం తర్వాత నీకు పుత్రుడు ఉదయిస్తాడు. అందువలన నీకు పుణ్యలోకసిద్ధి కల్గుతుంది” అని చెప్పి మాయం అవుతాడు. ఆనాటి నుంచి దిగులు చెందక ఇహ లోక సుఖాన్ని అనుభవించి మరణిస్తాడు. ఇతని ఇదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. లోకజ్ఞానం తెలియని అమాయకురాలు. నిష్కల్మశమైన మనసు, పరమేశుని మీద అపారమైన భక్తి కలిగినది.
భర్త మరణము తర్వాత స్వతంత్రురాళ్ళు అయిన సొమనాథుని భార్యలు తీర్థయాత్ర చేయాలన్న కోరిక కలిగి వారందరూ క్షయనామ సంవత్సరము (క్రీ.శ.1086)మాఘశుద్ధ పౌర్ణమినాడు సమీపాన ఉన్న ద్రాక్షారామ భీమేశ్వరున్ని సందర్శించడానికి వెళ్ళారు. భీమేశ్వరాలయంలో మహోత్సవాలు జరుగుతున్న సమయమది. దేవాలయమంతనూ అసంఖ్యాకముగా వచ్చిన భక్తుల “జయ జయ హర హర మహాదేవ” అనెడి ధ్వనులతో మార్మోగిపోతోంది.
చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి ముత్తైదువులందరూ తమ భర్తలతో కానీ లేదా స్నేహితురాళ్ళతో కానీవచ్చి సప్తగోదావరీ స్నానమాచరించి భీమేశ్వరుని దివ్య సుందరమూర్తిని దర్శించి తమ తమ కోర్కెలను కోరసాగిరి. సవతులతో వచ్చిన మాచెమ్మ కూడా భీమేశ్వరుని దర్శించి అందరి వలెనే నిర్మలమగు మనసుతో తనకు కుడా ఒక సుపుత్రుడను అనుగ్రహించమని ప్రార్థించింది. తనతో పాటి వచ్చిన యువతులందరు అది విని ఫక్కున నవ్వి భర్త లేని నీకు సంతానమెలా కలుగుతుంది. అలా కోరకూడదని అనగా, అందుకు మాచెమ్మ నలుగురితో పాటి నారాయణ కులముతో పాటి గోవిందా అన్నట్లు “ఆందరిలాగానే నేను కోరాను. సంతానానికి మీరొక్కరేనా నేను అర్హురాలిని కానా?దయా సాగరుడైన ఆ భీమేశ్వరుడు అందరినీ సమానముగానే చూస్తాడు గాని ఒకరింట సున్నము మరొకరింట వెన్నను పెట్టడు గదా? మీ అందరికీ పుత్రుడను అనుగ్రహించి నాకు మాత్రం అనుగ్రహించక పోడు కదా!” అని పలికి వెళ్ళిపోయింది.
అలా కోరిన యువతులందరికీ భీమేశ్వరుడు సంతానప్రాప్తి కల్గించాడో లేదో కానీ మాచెమ్మకు మాత్రము ఒక సుపుత్రుడిని ప్రసాదించాడు. భీమేశుని కటాక్షం వలన మాచెమ్మ గర్భవతి అయ్యింది. ప్రభవ నామ సంవసత్సరమున (క్రీ.శ. 1087) శ్రావణ మాసమున శుక్లపక్షమున పంచమి రొజున శుక్రవారమునాడు(శ్రావణ మాసం అమావాస్య తర్వాత వచ్చే పంచమి) ఒక శుభముహూర్తాన కన్యాలగ్నము నందు కుమారునకు జన్మనిచ్చింది. అలా భీమేశ్వరుని వరము వలన కలిగిన కుమారుడు అవ్వడం వలన భీమన్న అని పేరు పెట్టి మాచెమ్మ గారాభముగా కుమారున్ని పెంచసాగింది.
వేములవాడ భీమకవి సంస్కృతంలో రచించిన జ్యోతిష్య గ్రంథమును తెలుగులో అనువదిస్తూ ఒక కవి భీమకవి జన్మవృత్తాంతాన్ని పై సీస పద్యంలో వివరించాడు.
తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామమునకు ఐదారు క్రోసుల దూరంలో వేములవాడ అను గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను సంతాన ప్రాప్తి కోసం ఎన్నో దానధర్మాలు చేసాడు. శివభక్తి పరాయణుడై యాగములను చేస్తూ యెన్నో విధములుగా పరమేశున్ని ఆరాధించాడు. బిడ్డ కోసం ఐదుగురిని పెళ్లాడుతాడు.ఇదిలా ఉండగా ఇతనికి భీమేశుడు ఒకనాడు స్వప్నంలో కనపడి నీ మరణం తర్వాత నీకు పుత్రుడు ఉదయిస్తాడు. అందువలన నీకు పుణ్యలోకసిద్ధి కల్గుతుంది” అని చెప్పి మాయం అవుతాడు. ఆనాటి నుంచి దిగులు చెందక ఇహ లోక సుఖాన్ని అనుభవించి మరణిస్తాడు. ఇతని ఇదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. లోకజ్ఞానం తెలియని అమాయకురాలు. నిష్కల్మశమైన మనసు, పరమేశుని మీద అపారమైన భక్తి కలిగినది.
భర్త మరణము తర్వాత స్వతంత్రురాళ్ళు అయిన సొమనాథుని భార్యలు తీర్థయాత్ర చేయాలన్న కోరిక కలిగి వారందరూ క్షయనామ సంవత్సరము (క్రీ.శ.1086)మాఘశుద్ధ పౌర్ణమినాడు సమీపాన ఉన్న ద్రాక్షారామ భీమేశ్వరున్ని సందర్శించడానికి వెళ్ళారు. భీమేశ్వరాలయంలో మహోత్సవాలు జరుగుతున్న సమయమది. దేవాలయమంతనూ అసంఖ్యాకముగా వచ్చిన భక్తుల “జయ జయ హర హర మహాదేవ” అనెడి ధ్వనులతో మార్మోగిపోతోంది.
చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి ముత్తైదువులందరూ తమ భర్తలతో కానీ లేదా స్నేహితురాళ్ళతో కానీవచ్చి సప్తగోదావరీ స్నానమాచరించి భీమేశ్వరుని దివ్య సుందరమూర్తిని దర్శించి తమ తమ కోర్కెలను కోరసాగిరి. సవతులతో వచ్చిన మాచెమ్మ కూడా భీమేశ్వరుని దర్శించి అందరి వలెనే నిర్మలమగు మనసుతో తనకు కుడా ఒక సుపుత్రుడను అనుగ్రహించమని ప్రార్థించింది. తనతో పాటి వచ్చిన యువతులందరు అది విని ఫక్కున నవ్వి భర్త లేని నీకు సంతానమెలా కలుగుతుంది. అలా కోరకూడదని అనగా, అందుకు మాచెమ్మ నలుగురితో పాటి నారాయణ కులముతో పాటి గోవిందా అన్నట్లు “ఆందరిలాగానే నేను కోరాను. సంతానానికి మీరొక్కరేనా నేను అర్హురాలిని కానా?దయా సాగరుడైన ఆ భీమేశ్వరుడు అందరినీ సమానముగానే చూస్తాడు గాని ఒకరింట సున్నము మరొకరింట వెన్నను పెట్టడు గదా? మీ అందరికీ పుత్రుడను అనుగ్రహించి నాకు మాత్రం అనుగ్రహించక పోడు కదా!” అని పలికి వెళ్ళిపోయింది.
అలా కోరిన యువతులందరికీ భీమేశ్వరుడు సంతానప్రాప్తి కల్గించాడో లేదో కానీ మాచెమ్మకు మాత్రము ఒక సుపుత్రుడిని ప్రసాదించాడు. భీమేశుని కటాక్షం వలన మాచెమ్మ గర్భవతి అయ్యింది. ప్రభవ నామ సంవసత్సరమున (క్రీ.శ. 1087) శ్రావణ మాసమున శుక్లపక్షమున పంచమి రొజున శుక్రవారమునాడు(శ్రావణ మాసం అమావాస్య తర్వాత వచ్చే పంచమి) ఒక శుభముహూర్తాన కన్యాలగ్నము నందు కుమారునకు జన్మనిచ్చింది. అలా భీమేశ్వరుని వరము వలన కలిగిన కుమారుడు అవ్వడం వలన భీమన్న అని పేరు పెట్టి మాచెమ్మ గారాభముగా కుమారున్ని పెంచసాగింది.
వేములవాడ భీమకవి సంస్కృతంలో రచించిన జ్యోతిష్య గ్రంథమును తెలుగులో అనువదిస్తూ ఒక కవి భీమకవి జన్మవృత్తాంతాన్ని పై సీస పద్యంలో వివరించాడు.
తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామమునకు ఐదారు క్రోసుల దూరంలో వేములవాడ అను గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను సంతాన ప్రాప్తి కోసం ఎన్నో దానధర్మాలు చేసాడు. శివభక్తి పరాయణుడై యాగములను చేస్తూ యెన్నో విధములుగా పరమేశున్ని ఆరాధించాడు. బిడ్డ కోసం ఐదుగురిని పెళ్లాడుతాడు.ఇదిలా ఉండగా ఇతనికి భీమేశుడు ఒకనాడు స్వప్నంలో కనపడి నీ మరణం తర్వాత నీకు పుత్రుడు ఉదయిస్తాడు. అందువలన నీకు పుణ్యలోకసిద్ధి కల్గుతుంది” అని చెప్పి మాయం అవుతాడు. ఆనాటి నుంచి దిగులు చెందక ఇహ లోక సుఖాన్ని అనుభవించి మరణిస్తాడు. ఇతని ఇదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. లోకజ్ఞానం తెలియని అమాయకురాలు. నిష్కల్మశమైన మనసు, పరమేశుని మీద అపారమైన భక్తి కలిగినది.
భర్త మరణము తర్వాత స్వతంత్రురాళ్ళు అయిన సొమనాథుని భార్యలు తీర్థయాత్ర చేయాలన్న కోరిక కలిగి వారందరూ క్షయనామ సంవత్సరము (క్రీ.శ.1086)మాఘశుద్ధ పౌర్ణమినాడు సమీపాన ఉన్న ద్రాక్షారామ భీమేశ్వరున్ని సందర్శించడానికి వెళ్ళారు. భీమేశ్వరాలయంలో మహోత్సవాలు జరుగుతున్న సమయమది. దేవాలయమంతనూ అసంఖ్యాకముగా వచ్చిన భక్తుల “జయ జయ హర హర మహాదేవ” అనెడి ధ్వనులతో మార్మోగిపోతోంది.
చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి ముత్తైదువులందరూ తమ భర్తలతో కానీ లేదా స్నేహితురాళ్ళతో కానీవచ్చి సప్తగోదావరీ స్నానమాచరించి భీమేశ్వరుని దివ్య సుందరమూర్తిని దర్శించి తమ తమ కోర్కెలను కోరసాగిరి. సవతులతో వచ్చిన మాచెమ్మ కూడా భీమేశ్వరుని దర్శించి అందరి వలెనే నిర్మలమగు మనసుతో తనకు కుడా ఒక సుపుత్రుడను అనుగ్రహించమని ప్రార్థించింది. తనతో పాటి వచ్చిన యువతులందరు అది విని ఫక్కున నవ్వి భర్త లేని నీకు సంతానమెలా కలుగుతుంది. అలా కోరకూడదని అనగా, అందుకు మాచెమ్మ నలుగురితో పాటి నారాయణ కులముతో పాటి గోవిందా అన్నట్లు “ఆందరిలాగానే నేను కోరాను. సంతానానికి మీరొక్కరేనా నేను అర్హురాలిని కానా?దయా సాగరుడైన ఆ భీమేశ్వరుడు అందరినీ సమానముగానే చూస్తాడు గాని ఒకరింట సున్నము మరొకరింట వెన్నను పెట్టడు గదా? మీ అందరికీ పుత్రుడను అనుగ్రహించి నాకు మాత్రం అనుగ్రహించక పోడు కదా!” అని పలికి వెళ్ళిపోయింది.
అలా కోరిన యువతులందరికీ భీమేశ్వరుడు సంతానప్రాప్తి కల్గించాడో లేదో కానీ మాచెమ్మకు మాత్రము ఒక సుపుత్రుడిని ప్రసాదించాడు. భీమేశుని కటాక్షం వలన మాచెమ్మ గర్భవతి అయ్యింది. ప్రభవ నామ సంవసత్సరమున (క్రీ.శ. 1087) శ్రావణ మాసమున శుక్లపక్షమున పంచమి రొజున శుక్రవారమునాడు(శ్రావణ మాసం అమావాస్య తర్వాత వచ్చే పంచమి) ఒక శుభముహూర్తాన కన్యాలగ్నము నందు కుమారునకు జన్మనిచ్చింది. అలా భీమేశ్వరుని వరము వలన కలిగిన కుమారుడు అవ్వడం వలన భీమన్న అని పేరు పెట్టి మాచెమ్మ గారాభముగా కుమారున్ని పెంచసాగింది.