Professional Documents
Culture Documents
శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 35
శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 35
ఈ అధ్యాయంలో కూడా ఊది గురించి చెపుతూ ఒకరిద్దరు భక్తు లు బాబాను ఎలా పరీక్షించారు అన్న
విషయాలు చెప్పారు. ముందుగా మనం ఆధ్యాత్మిక విషయంలో ముందుకు నడవాలి అంటే, దీనిలో
ఉన్న శాఖలు మనకు ఎలా అడ్డు పడతాయి అన్న సత్యాన్ని చెప్పారు. కొందరు ఒక దారి సరి అయినది
అంటే మరొకరికి ఇంకో దారి నిజమనిపిస్తుంది. ఇలా ఏ దారి మంచిది అనే చర్చలోనే మనం
ఆగిపోతాము. యోగీశ్వరులు మామూలు మనుషులే కదా వారికి ఎందుకు నమస్కరించాలి అని
కొందరి వాదన. ఇలా ఎన్నో వాదనల మధ్య మనం నలిగిపోతాము. బాబా అందుకే శ్రద్ధ సభూరి అనే
రెండు సాధనలు చెప్పారు. ఏ మార్గంలో నువ్వు నడిచినా ఈ రెండు చాలా అవసరం.
ఇలానే ఒక సారి కాకా మహాజని యజమానికూడా బాబాను పరీక్షించడం జరిగింది. ఠక్కర్ అనే
ఆయనకు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉంటాడు. కాకా ఎప్పుడు బాబా
దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు ఉంది వస్తా డు అన్న సంగతి ఆయనకు తెలుసు. ఒక సారి బాబాను
పరీక్షించాలి అన్న ఆసక్తితో తనతో ఇంకో వ్యక్తిని తీసుకొని కాకాతో సహా షిర్డీకి వస్తా రు.దారిలో కాకా
బాబాకు అర్పించేందుకు ద్రాక్ష పండ్లు కొంటాడు. వాటికి గింజలు ఉంటాయి. అక్కడ తర్కడ్ ఉంటె
ఏమైనా మహిమలు చూసావా అని ఠక్కర్ అడుగుతాడు. లేదు బాబా దర్శనం కోసం వచ్చాను అని
అతను చెప్తా డు. బాబా భక్తు లు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని తర్కడ్ చెప్తా డు.
ఇంతలో బాబా అడ్డు ద్రాక్ష పండ్లు అందరికి పంచమంటారు. ఠక్కర్కు ద్రాక్ష కడగకుండా తినవద్దని తన
డాక్టర్ చెప్పిన విషయం గుర్తు కు వచ్చి ఏమి చేయాలో తెలియక అలానే దాన్ని తిని గింజలను తన దగ్గరే
ఉంచుకుంటాడు. అప్పుడు బాబా గొప్ప యోగి అయినచో నాకు గింజలు ఇష్టంలేదు అని తెలియదా!
అని అనుకుంటాడు. అంతలో బాబా మరల ద్రాక్ష ఠక్కర్ కు ఇవ్వమంటె అతనికి మరల ఇస్తా రు. ఈ
సారి మొహమాటం పడుతుంటే బాబా తినమని చెప్తా రు. ఆశ్చర్యం ఈ సారి వాటిలో గింజలు ఉండవు.
ఇలా బాబా తన మనసులో ఉన్న ఆలోచనను తెలుసుకొని తనకు కావాల్సిన విధంగా చేశారు.
తరువాత శ్యామా ఠక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేస్తా రు. బాబాకు నమస్కరించి
వాడాకు వెళ్తా రు. మరల వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఒక చంచల మనిషి ఉండెను. అతనికి
అన్ని ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం మీద వేసుకొని తిరుగుతూ
మనసులో శాంతిని పోగొట్టు కుంటున్నాడు. ఒక్కోసారి అన్నింటిని వదిలివేస్తా డు. ఇలా ఉండేబదులు
ఒక దానిమీద నిశ్చలంగా ఉండు" అని అంటారు. ఇది తన స్వభావమే అని ఠక్కర్ అర్ధం
చేసుకుంటాడు. తరువాత కాకా కూడా నాతొ వస్తే బాగుండు అనుకుంటాడు. బాబా కాకాను కూడా
తనతో వెళ్ళమని ఆదేశిస్తా రు. కాకా దగ్గర బాబా 15 రూపాయల దక్షిణ తీసుకొని ఇలా చెప్తా రు. " నేను
ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనైనా పుచ్చుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలెను. నేను ఊరికే
ఎవరిని అడగను. ఫకీరు ఎవరిని చూపునో వారినే అడిగెదను. పూర్వజన్మల బట్టి లేదా ఈ జన్మలో
ఉన్నదాని బట్టి అడుగుతాను. దానము చేయువాడు ఇచ్చునది విత్తనాలు నాటడం వంటిది. ముందు
ముందు గొప్ప పంటను ఇస్తుంది. గత జన్మలో నీవు ఇచ్చివుంటే కాని ఇప్పుడు నీవు అనుభవించలేవు.
ఇచ్చినచో వైరాగ్యం పెరుగును. దీని వలన భక్తిజ్ఞానములు కలుగును అని బాబా సెలవిచ్చిరి. ఇది విని
వెంటనే ఠక్కర్ కూడా 15 రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తా డు. ఇలా బాబా అతనిలో నమ్మకాన్ని
కలుగచేసి తనను సరి ఐన దారిలో నడిపించారు.
ఒక సారి బాంద్రా నివాసి అయిన ఒక వ్యక్తి నిద్ర పట్టక మిక్కిలి బాధ పడుతూ ఉండే వాడు. నిద్రపోతే
చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిడుతూ ఉండే వాడు. చాలా రోజులు నిద్రలేక
అతని ఆరోగ్యం పాడవుతుంది. ఒక స్నేహితుడు బాబా ఊది నీటిలోకలుపుకొని తాగి పడుకో అని
సలహా ఇస్తే తాను అలా చేసి కొంచెం ఊది తన తలగడ కింద ఉంచి నిద్రపోతాడు. ఇక ఆ రోజు తన
తండ్రి కలలో కనిపించడు. సుఖంగా నిద్ర పోతాడు. తరువాత బాబా పటం ఒకటి ఉంచి రోజూ
పూజిస్తూ ఉండేవాడు.
బాలాజీ పాటిల్ నెవాస్కర్ బాబాకు మంచి భక్తు డు. బాబా నడిచే దారులన్నీ శుబ్రపరిచేవాడు. అతని
తరువాత రాధాకృష్ణమాయి ఈ పని చేసేవారు అని మనం విన్నాము. ఆయన ప్రతి ఏడాది పండిన
పంటను బాబాకు ఇచ్చి, బాబా తనకు ఎంత ఇస్తే అంత తీసుకొని జీవించేవాడు.ఒక సారి బాలాజీ
సాంవత్సరీకం నాడు ఆయన కుటుంబం కొంతమంది బంధువులను భోజనాలకు పిలిచారు.
అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తా రు. అప్పుడు బాలాజీ భార్యకు ఏమి చేయాలో తెలియక
ఆదుర్దా పడుతూ ఉంటె ఆమె అత్తగారు కొంచెం బాబా ఊది తీసుకొని వాటిలో వేసి
వడ్డించమంటుంది. ఆ తరువాత అందరికి తృప్తిగా భోజనం సరిపోతుంది.
ఇంకో సారి రఘు పాటిలన్న వ్యక్తి బాలాజీ నెవాస్కర్ ఇంటికి వెళ్తా డు. అప్పుడు ఒక పాము వస్తే అందరు
భయపడుతూ ఉంటె, బాలాజీ ఆ పామును బాబాగా తలిచి గిన్నెడు పాలు తీసుకొని దాని ముందు
ఉంచుతాడు. తరువాత ఆ పాము అక్కడ కనిపించకుండా మాయం అవుతుంది. ఇలా బాబా బాలాజీ
నెవాస్కరును అతని కుటుంబాన్ని దగ్గర ఉండి నడిపించారు.
ఓం శ్రీ సాయినాథార్పణమస్తు !