Krishnapatnam Adanai

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

అదానీ చేతిలో కృష్ణ పట్నం

పో ర్టు లో 100 శాతం వాటా కొనుగోలు చేసిన ఏపీసజ్


ె ‌

విశ్వ సముద్ర హో ల్డింగ్స్‌నుంచి 25 శాతం వాటాకు రూ.2,800 కోట్ల చెల్లి ంపు

ఇప్పటికే 75 శాతం వాటాను రూ.12,000 కోట్ల కు దక్కించుకున్న అదానీ పో ర్ట్స్‌

2025 నాటికి కృష్ణ పట్నం పో ర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తా మని ప్రకటన

ఆదాయంలో 2.6% రాష్ట ్ర వాటా కొనసాగుతుంది: ఏపీ మారిటైమ్‌బో ర్డు

కృష్ణ పట్నం పో ర్టు లో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూ పు కొనుగోలు చేసింది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి

ఉన్న అదానీ పో ర్ట్స్‌అండ్‌స్పెషల్‌ఎకనామిక్‌జోన్‌(ఏపీసెజ్‌) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది.

కృష్ణ పట్నం పో ర్టు లో విశ్వ సముద్ర హో ల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్ల కు కొనుగోలు చేసినట్లు

ఏపీసెజ్‌స్టా క్‌ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది.

దీంతో కృష్ణ పట్నం పో ర్టు లో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరింది. గతేడాది అక్టో బర్‌నెలలో 75 శాతం

వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టా కు(చెల్లి ంచాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ

లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణ పట్నం పో ర్టు విలువను రూ.13,765 కోట్లు గా

మదింపు వేసినట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్‌టన్నుల వ్యాపార కార్యకలాపాలు

నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లు గా పేర్కొంది.


విస్త రణ దిశగా కృష్ణ పట్నం పో ర్టు

ప్రస్తు తం 64 మిలియన్‌టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణ పట్నం పో ర్టు ను భారీగా విస్త రించనున్నట్లు ఏపీసెజ్‌సీఈవో

కరన్‌అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తు త పో ర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు తెలిపారు.

డీప్‌వాటర్‌పో ర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్ట ర్‌ప్లా న్‌ప్రకారం పో ర్టు సామర్థ్యం 300 మిలియన్‌టన్నుల

వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొ చ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రపద


్ర ేశ్క
‌ ు కృష్ణ పట్నం పో ర్టు ను

ముఖద్వారంగా తీర్చిదిద్దు తామని, ఏపీ, కర్ణా టక రాష్ట్రా లకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు.

తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి

2025 నాటికి ఏపీసెజ్‌నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్‌టన్నులకు తీసుకువెళ్లా లన్న లక్ష్యంతో తూర్పు తీర

ప్రా ంతంపై అదానీ గ్రూ పు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్ట పల్లి, ఎన్నోర్‌పో ర్టు లను

కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట ం్ర లో కృష్ణ పట్నం, గంగవరం పో ర్టు లను కొనుగోలు చేసింది. కృష్ణ పట్నం పో ర్టు లో 100

శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పో ర్టు లో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్ల కు

కొనుగోలు చేసింది. అదాని గ్రూ పు రాష్ట ం్ర లోని ఈ రెండు పో ర్టు లో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం

చేసింది.

రాష్ట ్ర ఆదాయంలో మార్పు ఉండదు

కృష్ణ పట్నం పో ర్టు లో ఏపీసెజ్‌100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట ్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం

చూపదని ఏపీ మారిటైమ్‌బో ర్డు స్పష్ట ం చేసింది. కృష్ణ పట్నం పో ర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట ్ర ప్రభుత్వానికి

చెల్లి స్తు ందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్త ం రాష్ట ్ర ప్రభుత్వానికి చెల్లి ంచాల్సి ఉంటుందని ఏపీ

మారిటైమ్‌బో ర్డు సీఈవో మురళీథరన్‌చెబుతున్నారు

You might also like