Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ఆయన కంఠస్వరంలో రసవాహిని ఉప్పొంగుతోంది.. మాధుర్యం అంబరాన్ని తాకుతుంది.

ఆయన సంగీతం ఖండాంతరాల్లో


ఉండే భారతీయ సంతతిని సైతం ఉత్తేజింపజేస్తోంది. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ప్రత్యేక కథనం....

సంగీతం అనేది విశ్వజనీయం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది.
ఏకాలమైనా, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే
పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహనపరిచే సంగీతానికి ఎల్లలులేవు.
వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీసంగీతానికి పునాది వేసి
జాగృతం చేశారు. తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది 'బాలు' అని ముద్దు గా పిలుచుకొనే శ్రీపతి
పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎంత ఎత్తు కెదిగినా ఎల్లలు దాటని యోగి పుంగవుడు. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే
సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. బాలు సినీ సంగీత ప్రపంచానికి పరిచయమై 50 ఏళ్లు దాటిన ఆ
కంఠస్వరంలోని మాధుర్యం అంబరాన్ని తాకుతోంది. 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' వంటి రాగసాగరికల ద్వారా
ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇంతితై.. వటుడింతై.. నభోవీధిపైనంతై.. ప్రభారాశిపైనంతై.. బ్రహ్మాండాంత సంవర్ధియైన ఈ
బాల సంగీత విద్వాంసుడు సింహపురి (నెల్లూరు) పట్టణంలో జూన్‌4 వ తేదీన జన్మించారు.

*గాయకుడు కావాలని*

1964 లో మద్రాస్‌సోషల్‌అండ్‌కల్చరల్‌క్లబ్‌వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న 'బాలు'కు అందులో ప్రథమ
బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తు లు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల
నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతేకాదు మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకులలో కూర్చుని ఆ
పాట విన్నారు. 'బాలు' పాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ణి అభినందించారు. గొంతు లేతగా వుంది. కొన్నాళ్లు పొతే
సినిమాల్లో పాటలు పాడిస్తా నని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత
సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకు ద్వితీయ బహుమతి వచ్చింది.
ముఖ్య అతిధి జానకి మాట్లా డుతూ బాలుకే ప్రథమ బహుమతి పొందే అర్హత ఉందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి
అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు బాలు గుండెలో
ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకు సలహా ఇచ్చారు. మద్రాసులో ఇంజనీరింగు
చదువు కొనసాగిస్తూ, సినిమా అవకాశాలకోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరిదగ్గరా
నేర్చుకోకపోయినా, రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడం వల్ల ట్యూన్ ఒకసారి వింటే య‌ధాత‌థంగా
పాడగలిగే విద్వత్తు బాలుకు సొంతం కావడం లాభించే అంశం. అంతేకాదు స్టేజి ఫియర్‌తెలియకపోవడం.. అన్నింటికి మించి
బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరం!

*తొలిప్రయత్నమే నిష్ణాతులలో...*

ఇచ్చిన మాటకు కట్టు బడి కోదండపాణి బాలుకు 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ
సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం, కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. వేటూరి రాయాగా మాల్కోస్,
యమన్, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లిన 'యేమి ఈ వింత మొహం' అనే రాగమాలికను రేఖా అండ్‌మురళీ ఆర్ట్స్‌వారి
కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు
కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ఓరోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, కల్యాణం
రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌కనిపించారు..

తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి 'యేమి ఈ వింత మొహం' పాట మొత్తా న్ని బాలుచేత పాడించి
వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966 న విజయా
గార్డెన్స్‌లో రికార్డిస్ట్ స్వామినాథన్‌అధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం విశేషం. 1967 జూన్‌2 న
విడుదలైన ఈ సినిమా.. చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు 'బాలు' ప్రభంజనానికి తెరలేపింది. బాలు సగర్వంగా
ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది.

'కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద
యెంత నమ్మకముందంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రు లకు కూడా లేదు. నా మొదటి పాట విజయా గార్డెన్స్‌ఇంజనీరు
స్వామినాథన్‌గారితో చెప్పి ఆ టేప్‌చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే ఉంచేట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు అక్కడికి
వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి ఋణం నేను తీర్చుకోలేను'. ఈ
మాటలు చాలావా బాలుకు కోదండపాణి మీద ఎంతటి భ
పనిచేసే జి.వి.సుబ్రహ్మణ్యం అనే మాస్టా రు బాలుచేత 'చెంచులక్ష్మి' సినిమాలో సుశీల ఆలపించిన 'పాలకడలిపై శేషతల్పమున' అనే
పాటను పాడించి టేప్‌మీద రికార్డు చేశారు. బాలుకు అదొక మధురానుభూతి. మరో మేష్టా రు రాధాపతి ప్రోత్సాహంతో ‘ఈ
ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’, వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌కాలేజిలో
పి.యు.సి. చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం
వచ్చింది. తరువాత విజయవాడ ఆకాశవాణిలో తను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఓ లలిత గీతానికి బహుమతి
లభించింది. పి.యు.సి. పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొని బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు.

మిత్రు లతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్‌సీటు రావడం వల్ల అక్కడి వాతావరణం
నచ్చక తిరిగి నెల్లూరు వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్‌విద్యకు సరిసమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో
చేరారు. అక్కడ చదువుతో బాటు సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేశారు. ఇంజనీరింగ్‌కోర్సు రెండో సంవత్సరం
వచ్చేనాటికి బాలుకు సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్‌బిన్‌తుగ్లక్‌’ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు
వేడుకలో ‘హ్యాపీ బర్త్‌డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద దర్శనమిచ్చారు. తరువాత ఎన్నో
సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటుడికి పదును పెట్టా రు.

*మరిన్ని విశేషాలు...*

'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రంలో పాడిన వారం రోజులకే 'నక్కరే అదే స్వర్గ' అనే కన్నడ సినిమాలో పాడే అవకాశం బాలుకు
వచ్చింది. తమిళంలో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌బాలుచేత 'హోటల్‌రంభ' అనే చిత్రం కోసం 'టంతానోడు ఇప్పడి ఇరుందు ఎత్తనై
నాలాచు' అనే పాటను తొలిసారి పాడించారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. తర్వాత 'శాంతినిలయం'
చిత్రంలో సుశీలతో కలిసి 'ఇయరకై ఎణ్ణుమ్‌ఇల్లయ కణ్ణి' అనే పాట పాడారు.

కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌సారథ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలాగే ఒకేరోజు
తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి మరో రికార్డు సాధించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్‌
మిలింద్‌కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. బాలు మంచి డబ్బింగ్‌
ఆర్టిస్ట్, ... ఓ మంచి నటుడు కూడా. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట 'మన్మధలీల' తెలుగు చిత్రానికి డబ్బింగ్‌
చెప్పారు. తదనంతరకాలంలో కమల్‌హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నాగేష్, కార్తిక్, రఘువరన్, సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్‌
వంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. ముఖ్యంగా 'దశావతారాలు' చిత్రంలో కమల్‌నటించిన ఏడు పాత్రలకు వైవిధ్యమైన
గొంతుతో సంభాషణలు పలికిన తీరు అద్భుతమనే చెప్పాలి. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాల్లో డబ్బింగ్‌చెప్పినందుకు
బాలు ఉత్తమ డబ్బింగ్‌కళాకారునికి ఇచ్చే నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్‌అటెన్‌బరో నిర్మించిన 'గాంధీ' తెలుగు
వెర్షన్‌లో గాంధీ పాత్రధారి బెన్‌కింగ్స్‌లేకు గాత్రదానం చేసింది బాలూనే. ఉత్తమ గాయకుడిగా బాలు ఆరు జాతీయ
బహుమతులు అందుకున్నారు. అవి శంకరాభరణం (1979), ఏక్‌దూజే కే లియే (1981), సాగరసంగమం (1983),
రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్‌(1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం).

జాతీయ స్థా యిలో ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి ఫిలింఫేర్‌బహుమతి అందుకున్నారు. దక్షిణ భారత
సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్‌బహుమతులు బాలును ఏడుసార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది
బహుమతులతో బాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో
నటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు నాలుసార్లు , కన్నడ సినిమాల్లో పాడిన
పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకుని బహుమతులు కూడా బాలుకు దక్కాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్‌సేన్,
అక్కినేని, లతామంగేష్కర్‌జాతీయ బహుమతుల తోబాటు లెక్కలేనన్ని ఇతర బహుమతులు బాలును వరించాయి. 2001 లో
భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు నిచ్చి ఈయన్ను సత్కరించింది. 2011 లో పద్మభూషణ్‌అవార్డు ను అందుకున్నారు. బాలు
తనయుడు చరణ్‌.. మంచి గాయకుడుగా, సినీ నిర్మాతగా స్థిరపడ్డా రు.

You might also like