Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

కర్మ ఫలితం

ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రా యబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..

'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?
ఈ గొప్ప స్థా నం నాకే ఎందుకు దక్కింది అని?

'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...

అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు.
ఆయనను కలవండి. జవాబు దొ రుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..

అపుడు ఆ సన్యాసి బొ గ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపో యి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే
ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి
వున్నాడు , ఆయన్ను కలవండి.''

నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..

రాజు కాస్త ఇబ్బందిపడ్డా డు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి
అక్కడినుండి వెళ్ళిపొ మ్మంటాడు...
రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తు ండగా ఆ సన్యాసి రాజుతో ఇలా
అంటాడు..

''ఇదే దారిలో వెళితే ఒక గ్రా మం వస్తు ంది, అక్కడ ఒక బాలుడు చనిపో వడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని
కలవండి..
'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..
చనిపో వడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...
అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...

గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తు ంటే వాళ్ళ దగ్గ రున్న
రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగివుంటారు.. తినబో తుంటే

అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...
ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొ గ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...
రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..
మూడవ వాడు '' రొట్టె తినకపో తే ఈ రాత్రికే చస్తా వా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లా డాడు...
కానీ నాల్గ వ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబో తున్న
రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...

ఆ నాల్గ వ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...


రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రా ణం వదిలాడు..
రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తు లు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు...
మనం గతంలో చేసినదేదీ వృథాగా పో దు అని చెప్పడానికే..

🙏శ్రీ మాత్రే నమః🙏

You might also like