Professional Documents
Culture Documents
భారత చైనా యుద్ధం 1962
భారత చైనా యుద్ధం 1962
వికీపీడియా నుండి
భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధా నికి మూల
కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. 1959లో టిబెటన్ల తిరుగుబాటు తర్వాత బౌద్ధ భారత్ చైనా యుద్ధం 1962
గురువు దలైలామాకి భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద ఎన్నో హింసాత్మక ఘటనలు
చోటుచేసుకున్నాయి.
1962 అక్టో బరులో హిందీ-చీనీ భాయి, భాయి అంటూ స్నేహ హస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది.
ఈశాన్య భారతంలో భారత్కు పెట్టని కోటలుగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. దురాక్రమణను నిలువరించలేని
నిస్సహాయ స్థితిలో భారత్పరాభావాన్ని మూట గట్టు కోవాల్సి వచ్చింది.
ప్రత్యర్థు లు
ప్రదేశం
India China
1962 అక్టో బరు 20 పంచశీల సూత్రా లను సమాధి చేసి భారత్పై చైనా దండెత్తి న రోజు. ఈశాన్య భారతంలోని 3,225
కిలోమీటర్ల హిమాలయ సరిహద్దు లతో పాటు టిబెట్ కూడా చైనాలో అంతర్భాగమని వాదిస్తో న్న చైనా పాలకులు సేనాపతులు, నాయకులు
యుద్ధా నికి సిద్దమైన రోజులవి. 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్ మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్ Brij Mohan Kaul
Zhang Guohua[2]
ఆశ్రయమివ్వడం వంటి ఘటనలతో భారత్పై చైనా అక్కసు పెంచుకుంది. సరిహద్దు ల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా Jawaharlal Nehru
Mao Zedong
మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అల్లర్లు కాస్తా Pran Nath Thapar Liu Bocheng
చొరబాట్లు గా మారాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి. Lin Biao
టిబెట్ సరిహద్దు లపై స్వాతంత్ర్యానికి ముందు నెలకొన్న వివాదాలపై 1914లోనే బ్రిటన్, చైనా, టిబెట్ల మధ్య సిమ్లా లో Zhou Enlai
చర్చలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి భారత్ తరపున బ్రిటన్, టిబెట్లు అమోదం తెలిపినా చైనా మాత్రం భారత
తూర్పు సరిహద్దు గా నిర్ణయించిన ప్రాంతంపై అభ్యంతరాలతో ఒప్పందానికి నిరాకరించింది. అప్పట్నుంచి తూర్పు బలం
సరిహద్దు ల్లో ని 1,35,148 కి.మీ. భూభాగంపై భారత అధికారాల్ని చైనా ప్రశ్నిస్తోంది ఇవి కాస్తా ఇరు ప్రాంతాల మధ్య 10,000-12,000 80,000[3][4]
ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పద మెక్మోహన్ లైన్ను దాటుకుని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు ప్రా ణ నష్టం, నష్టా లు
భారత్లో చొరబడ్డా యి.
1,383 Killed[5] 722 Killed.[5]
స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకు దేశ పాలకులు సరిహద్దు ల భద్రతపై అనుసరించిన ఉదాసీన వైఖరికి భారీ 1,047 Wounded [5] 1,697 Wounded[5][6]
మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓ వైపు దేశ విభజన మరోవైను స్వదేశీ సంస్థా నాల విలీనం, దేశంలో అంతర్గత 1,696 Missing[5]
భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల సదుపాయాల కల్పన, పాలనపై పట్టు 3,968 Captured[5]
సాధించడం వంటి అంశాలపైనే దృష్టికేంద్రీకరించడంతో సైన్యంలో అప్రమత్తత కొరవడింది. ఇక స్వతంత్ర భారత
ఆవిర్భావంతో లక్ష్యాన్ని సాధించినట్లేననుకున్న పాలకుల భావన తర్వాతి కాలంలో కష్టా లను తెచ్చిపెట్టింది. ఇక బ్రిటిష్ కాలం నాటి ఆయుధాలతో ఏర్పడ్డ భారత సైన్యం ఆయుధ
సంపత్తి ని స్వదేశీ పాలనలో ఆధునీకరించుకోలేకపోవడం సమస్యలకు కారణమైంది. అదే సమయంలో భారత భూభాగాలపై కన్నేసిన చైనా సైన్యాన్ని తరలించడానికి వీలుగా
ఏర్పాట్లు చేసుకుంది. నిఘా వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడం, ఈశాన్య భారతంలో ఏం జరుగుతుందో గుర్తించేలోపే చైనా పనులు చక్కబెట్టేసింది. జమ్మూ కశ్మీర్లో భాగమైన
అక్సాయ్చిన్లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించి, భారత నిఘా వ్యవస్థలకు తెలియకుండా ఝింజియాంగ్-టిబెట్ల మధ్య సైన్యాన్ని తరలించడానికి
ఏకంగా హైవేనే నిర్మించేసింది. 1957లో చైనా అధికారికంగా ప్రకటించే వరకు హైవే నిర్మాణ పనుల్ని కూడా గుర్తించలేకపోయారు.
1962 యుద్ధంలో భారత భూభాగాల్ని ఆక్రమిస్తూ చైనా దురాక్రమణ సాగినా దాని ప్రభావం ఇప్పటికీ భారత్పై చూపిస్తూ నే ఉంది. భారత్కు బుద్ధి చెప్పాలంటూ మావో జెడాంగ్
సర్కార్ దురహంకారంతో పిఎల్ఏ సేనల్ని భారత్పైకి దండెత్తించడానికి చాలా కారణాలే ఉన్నాయి. . ఛాంగ్కై, జపాన్, అమెరికాలతో తలపడ్డ ధైర్యంతో భారత ప్రధాని నెహ్రూ
తలపొగరును అణచాలంటూ చైనా సేనలకు మావో నూరిపోశాడు. యుద్ధా నికి ముందు నుంచి భారత తూర్పు సెక్టా ర్లోని అక్సాయ్చిన్ప్రాంతంలోని 43,128 చదరపు కిలోమీటర్ల
భూభాగం తమదేనని వాదిస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లా సహా 90వేల చదరపు కిలోమీటర్లు , సెంట్రల్ సెక్టా ర్లోని 2వేల చదరపు కిలోమీటర్ల భూభాగం
చైనాదేనని వాదనలు ప్రా రంభించింది. అక్సాయ్చిన్జమ్మూకశ్మీర్లో భాగమని భారత్ఆధారాలు చూపినా అది చైనా ఝింజియాంగ్ ప్రా విన్స్లోనిదని వితండవాదన చేస్తోంది. ఇక
అరుణాచల్ ప్రదేశ్లో కీలక ప్రాంతమైన తవాంగ్ జిల్లా చైనాదేనని డిమాండ్ చేస్తోంది. తూర్పు సరిహద్దు ల్లో ని బార్హో టి మైదాన ప్రాంతాలు తమవేనంటూ చైనా కలిపేసుకుంది.
వివాదాస్పద ప్రాంతంలోని ఉత్తర సరిహద్దు ను మెక్మోహన్ లైన్గా గుర్తించినా చైనా అభ్యంతరాలు మాత్రం ఆగలేదు. వివాదాస్పద భూభాగాలపై ఇరుదేశాల మధ్య చర్చలు
జరిగినా అవి కొలిక్కి రాలేదు. 1960లో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో యథాతథ స్థితికి చైనా తరపు చౌఎన్లై ప్రతిపాదించినా అవి ఒప్పందాల వరకు వెళ్లలేదు. ఫలితంగా
1962లో చైనా భారత్పై దురాక్రమణకు దిగింది.
చైనా దురాక్రమణకు భారత సైన్యం, నాయకత్వ వైఫల్యాలు కూడా కారణాలే......రకరకాల సమస్యలతో కొట్టు మిట్టా డుతున్న భారత్ చైనా నుంచి ఊహించని దాడిని
ఎదుర్కొవాల్సి వచ్చింది. ఉపఖండంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భారత్ను భావించిన చైనా మొదట్లో నే కట్టడి చేయాలని భావించింది. అందుకు దేశ భద్రతపై దార్శనికత కొరవడిన
భారత పాలకుల వైఫల్యం కలిసొచ్చింది. కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునీకరణ కోసం ఎదురుచూస్తో న్న భారత సైన్యం చైనాతో బలవంతపు యుద్ధా నికి దిగాల్సి వచ్చింది.
దీనికితోడు చైనా దురాక్రమణ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ , రక్షణ మంత్రి కృష్ణ మీనన్, సైనిక కమాండర్లు అనుసరించిన వ్యూహాలపై కూడా రకరకాల కథనాలు ప్రచారం
ఉన్నాయి. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం భారత్కు శాపంగా పరిణమించిందని భారత్-చైనా యుధ్ధంపై నివేదిక సమర్పించిన జనరల్ హెండర్సన్-బ్రూ క్స్,
బ్రిగేడియర్పిఎస్ల నివేదికల్లో తప్పుపట్టడం కూడా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది.
యుద్ధం మిగిల్చిన విషాదం జవహర్లాల్ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. చైనాతో సోదరభావం నినాదంతో సాగిన విధానాలు విఫలమవడం నెహ్రూ కు
అంతులేని విషాదాన్ని తెచ్చిపెట్టింది. సైన్యం, ప్రభుత్వ విభాగాల నుంచి పెద్ద ఎత్తు న విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధంలో అంతులేని సైనిక నష్టా నికి దేశం మొత్తం నెహ్రూ ,
కృష్ణమీనన్లను వేలెత్తి చూపించాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఒకటిన్నర దశాబ్దా ల తర్వాత కూడా సైనిక ఆయుధ సంపత్తి ని ఆధునీకరించుకోని వైఫల్యాన్ని ఎండగట్టా యి. హిందీ ఛీనీ
భాయి భాయి అంటూ సాగిన భారత విధానాలు ఎందుకు పనికి రావని తేలిపోయాయి. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా యుద్ధా నికి సన్నద్దమవడంలో
నెహ్రూ నిర్లక్ష్యం వహించారంటూ విమర్శించడం ప్రధానికి మింగుడు పడలేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిందని భారత్పై విమర్శలు
వెల్లు వెత్తా యి. సరైన ఎయిర్బేస్లు లేని చైనాను గగనతలం నుంచి కట్టడి చేసే అవకాశాలను భారత్ వినియోగించుకోలేకపోయింది. భారీ సంఖ్యలో ఉన్న చైనా మిలటరీ
బలగాలను చూసి భారత్ సైన్యం మనోధైర్యాన్ని కోల్పోయిందని నివేదికలు తేల్చి చెప్పాయి. యుద్ధం మిగిల్చిన ఓటమితో నాటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ పదవిని కోల్పోవాల్సి
వచ్చింది. రక్షణ శాఖ ఆధునీకరణకు జరగకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మీనన్ రాజీనామా చేశారు. అదే సమయంలో చైనా యుద్ధం స్ఫూర్తితో జమ్మూ కశ్మీర్లో పాక్
చొరబాట్లు ప్రా రంభించింది. చివరకు అది కాస్త 1965 రెండో కశ్మీర్ యుద్ధా నికి దారి తీసింది. ఆ తర్వాత ఇండో-పాక్ యుద్ధా నికి పాక్ తెగించడానికి కూడా చైనా చొరబాట్లే
ప్రేరకమయ్యాయి. యుద్ధం మిగిశాక కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం నియమించిన హెండర్సన్ బ్రూ క్స్-భగత్ రిపోర్టు లో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టడం నెహ్రూ ను
తీవ్రంగా కుంగదీసింది. అదే సమయంలో అంతర్జా తీయంగా కూడా భారత్తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ మాత్రం సన్నద్ధత లేని సైన్యంతో సముద్ర మట్టా నికి అత్యంత
ఎత్తు లో యుద్ధా నికి దిగడం ఆత్మహత్యా సాదృశ్యమని తెలిసి భారత్ మొండిగా యుద్ధా నికి దిగిందని బ్రిటిష్ పత్రికలు విమర్శించాయి. నిజానికి యుద్ధ సమయంలో భారత్
అమెరికా వైమానిక సాయాన్ని కోరినా కెన్నడీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. చైనా చేసిన నమ్మకద్రో హం, నెహ్రూ విదేశాంగ విధానాల విఫలమవడంపై పెద్ద ఎత్తు న విమర్శల్ని
ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కుంగుబాటుతోనే యుద్ధం జరిగిన రెండేళ్లకు 1964లో నెహ్రూ కన్నుమూశారు.
ఇండో చైనా యుద్ధం భారత్ చాలా గుణపాఠాలే నేర్పింది. దేశ పాలకులు, సైన్యం సన్నద్ధత సంగతి పక్కనపెడితే ఆర్థిక భారంతో అస్థిరంగా ఉన్న దేశానికి యుద్ధం కొత్త సమస్యల్ని
తెచ్చిపెట్టింది. పరువు కోల్పోయే పరిస్థితిలో నాటి ప్రధాని నెహ్రూ అమెరికా వైమానిక సాయం కోసం ఆర్ధించినా ఫలితం లేకపోయింది. చైనాతో యుద్ధా నికి నెహ్రూ నైతిక బాధ్యత
వహించాల్సి వచ్చింది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నాలు సత్ఫలితానివ్వలేదు. 1962 యుద్ధ సమయంలో భారత్తో మిశ్రమ
సంబంధాలను కొనసాగించిన పాకిస్తా న్ తర్వాతి కాలంలో చైనాకు ఆప్త దేశంగా మారిపోయింది. సోవియట్ యూనియన్తో రాసుకుపూసుకు సాగిన భారత్-రష్యా సంబంధాలపై
కూడా విమర్శలు వెల్లు వెత్తా యి. అలీనోద్యమానికి కృషి చేసిన నెహ్రూ ఓ దశలో తీవ్ర ఒత్తి డిని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో భారత్ సాయం కోసం అర్ధించినా
అమెరికా సహజబుద్ధిని ప్రదర్శించింది. యుద్ధ సమయంలో వైమానిక దళాలను వినియోగించడానికి అవసరమైన ఇంధనం, ఎయిర్బేస్లు లేకపోయినా చైనా గెలవడానికి ఇలాంటి
సమాచార లోపం కూడా కారణమైంది. చైనా బలగాల ముప్పెట దాడితో ఉక్కిరిబిక్కిరైన భారత్ వైమానిక దళాల సాయం కోసం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి లేఖలు
కూడా రాశారు. 12స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్లను, ఆధునిక రాడార్ వ్యవస్థను పంపాలని అర్దించారు. చైనా బలగాలను అడ్డు కోడానికి ఫైటర్ జెట్లతో పాటు భారత పైలెట్లు శిక్షన పొందే
వరకు అమెరికా పైలట్లను కూడా పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే కెనడీ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది. యుద్ధ సమయంలో క్యూబన్ మిస్సైల్ చిక్కుల్లో ఉన్న అమెరికా
భారత్కు సాయం చేయడానికి నిరాకరించింది. ఫలితంగా అమెరికాతో సంబంధాలు కూడా దెబ్బతినడం మొదలైంది. అయితే చైనాతో యుద్ధ సమయంలో భారత్విజ్ఞప్తి అమెరికా
నుంచి 50లక్షల డాలర్ల విలువైన ఆటోమెటిక్ ఆయుధాలను పంపినట్లు 1962లో టైం వంటి పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. వీటిల్లో హెవీ మోర్టా ర్లు , లాండ్మైన్స్, సి-130
హెర్క్యులెస్ ట్రా న్స్పోర్టర్లతో పాటు సాంకేతిక సిబ్బందిని కూడా అమెరికా పంపిందని వార్తలు వచ్చాయి. ఇక బ్రిటన్ బ్రెన్, స్టెన్ గన్లతో పాటు 150టన్నుల ఆయుధాల భారత్కు
పంపిందని, ఆరు సరకు రవాణా విమానాలను కెనడా పంపించిందని, ఆస్ట్రేలియా కూడా భారీగా సహకరించిందని చెబుతారు. వీటి సంగతెలా ఉన్నా చైనా సైన్యాన్ని
తిప్పికొట్టడానికి భారత్కు అవసరమైన ఫైటర్జెట్లను పంపకపోవడం యుద్ధంలో ఓటమికి కారణమైంది.
పర్యవసానాలు
1962 యుద్ధం దేశంపై పెనుప్రభావాన్నే చూపించింది. యుద్ధం చేసిన గాయం నుంచి కోలుకోడానికి భారత జాతికి చాలా కాలమే పట్టింది. విధానపరమైన వైఫల్యాలను
సరిదిద్దు కుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన నేతలపై పడింది. సోవియట్ యూనియన్తో స్నేహం, అపత్కాలంలో అమెరికా వైఖరితో
కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డా రని చెబుతారు. ద్వైపాక్షిక సంబంధాలన మెరుగుపరుచుకునేందుకు చైనాతో హిందీ చీనీ భాయి భాయి అంటూ స్నేహ హస్తం
చాచినా అది చేసిన నమ్మకద్రో హం నెహ్రూ ను కలిచివేసింది. యుద్ధం తర్వాతి కాలంలో శత్రు వు శత్రు వు మిత్రు లంటూ పాక్, చైనా మధ్య మైత్రి నెహ్రూ ను కలవరపెట్టింది. ఫలితంగా
యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారు. నిజానికి దేశంలో కాంగ్రెస్ పార్టీకి, గాంధీ-నెహ్రూ ల రాజకీయ వారసత్వానికి ఎదురులేకుండా చూడాలనుకున్న నెహ్రూ
కలలు కూడా చైనా యుద్ధంతో కల్లలయ్యాయి. తన వారసురాలిగా ఇందిరాగాంధీకి సుస్థిర స్థా నాన్ని ఏర్పరచాలనుకున్న నెహ్రూ ఆశలు నెరవేరకుండానే కన్నుమూయాల్సి
వచ్చింది.ఆ తర్వాతి కాలంలో అది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు సైతం దారి తీసింది. నెహ్రూ చివరి దశలో లాల్ బహదూర్ శాస్త్రితో విభేదాలకు కూడా కారణమైంది. ఇందిరను
రాజకీయ వారసురాలిగా చేయాలనుకున్న నెహ్రూ వైఖరితో మనస్తా పం చెందిన శాస్త్రి సొంత బలం పెంచుకునే వరకు వెళ్లింది. నిజానికి 1962 ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభావం
తగ్గు ముఖం పడుతూ వచ్చింది. అప్పటికే దేశంలో కుంభకోణాలు వెలుగుచూడటం, కమ్యూనిస్టు పోరాటాలు ఉధృతమవ్వడం, సోషలిస్టు ఉద్యమాలు, భారతీయ జన సంఘ్
ఆవిర్భావంతో కాంగ్రెస్ వన్నె తగ్గూ వచ్చింది. చివరకు నెహ్రూ మరణం తర్వాత వారసుల సమస్య తలెత్తి నపుడు ప్రధాని పదవిని త్యాగం చేసేంత సాధువును కాదంటూ లాల్
బహదూర్ శాస్త్రి ధిక్కార స్వరం వినిపించే వరకు వెళ్లడానికి 1962 పరిణామాలు కూడా కారణం కావొచ్చు. ఓ వైపు యుద్ధం వల్ల కలిగిన అవమానం మరోవైపు సొంతపార్టీ నేతల
ధిక్కారం, కుటుంబానికి వారసత్వం దక్కదనే ఆందోళన నెహ్రూ ను తీవ్రంగా కలిచివేసిందని కొందరు చరిత్ర కారుల అభిప్రా యం. అదే సమయంలో పార్లమెంటరీ సంప్రదాయాలకు
భిన్నంగా వ్యవహరించిన ఇందరి వైఖరి కూడా నెహ్రూ మనస్తా పానికి కారణమని చెబుతారు.
నెహ్రూ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన లాల్బహదూర్శాస్త్రి అలీనోద్యమానికి కట్టు బడి ఉంటూనే దేశ భద్రతకు పెద్దపీట వేశారు సోవియట్యూనియన్సహకారంతో దేశ
రక్షణ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నాలు ప్రా రంభించారు. చైనా పీపుల్స్రిపబ్లిక్, పాకిస్తా న్ల మైత్రీ నేపథ్యంలో భారత రక్షణ బడ్జె ట్ను గణనీయంగా పెరంచారు. 1962 యుద్ధంలో
భారత ఓటమి, చైనాతో స్నేహం ఇచ్చిన ధైర్యం దాయాదీ దేశం పాకిస్తా న్ భారత్ చొరబాట్లకు తెగించింది. దేశ విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలను కాలరాసి భారత
భూభాగాల్లో చొరబాట్లను ప్రా రంభించింది. కశ్మీర్ ఆక్రమణే ధ్యేయంగా గిరిజన తెగల్ని ఊసిగొల్పడం ప్రా రంభించింది. జమ్మూ కశ్మీర్లో పాక్ చొరబాట్లు పెరగడంతో వాటిని తిప్పి
కొట్టా లని లాల్బహదూర్ శాస్త్రి సైన్యాన్ని ఆదేశించాల్సి వచ్చింది. సెప్టెంబరు 20, 1965లో పాక్ సైన్యం దుందుడుకు వైఖరితో కశ్మీర్లో ఘర్షణల్ని ప్రేరేపించింది. దీంతో ఎల్ఓసి
వెంబడి భారత్ సైన్యాన్ని మోహరించింది. పంజాబ్ సరిహద్దు ల్లో ఇరువైపులా భీకర కాల్పులుజరిగాయి. సరిహద్దు ల్లో కొన్ని ప్రాంతాల్లో పాక్ పైచేయి సాధించిన కశ్మీర్లో కీలకమైన
హాజీపూర్ పోస్టు ను భారత్ సైన్యం స్వాధీనం చేసుకుందిి. పాక్తో యుద్ధం కొనసాగుతుండగానే భారత్పై దాడికి చైనా మరోమారు సిద్ధమైంది. చైనా సరిహద్దు ల్లో భారత్
ఆయుధాలను, ట్యాంకర్లను మోహరించిందని, వాటిని తొలగించకపోతే దాడికి దిగాల్సి ఉంటుందని లేఖరాసింది. అయితే శాస్త్రి సర్కారు వాటిని లెక్కచేయలేదు. చైనాకు గట్టి బుద్ధి
చెప్పాలనే నిర్ణయంతో ఆరోపణల్ని తిప్పికొట్టింది. చైనా దురాక్రమణకు సిద్ధమైతే త్యాగాలకు సిద్ధపడాలని శాస్త్రి సైన్యానికి పిలుపునిచ్చారు. సరిహద్దు ల్లో కి చొరబడితే చైనా సైన్యంతో
తాడేపేడో తేల్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత చైనా వెనక్కు తగ్గింది. అయితే ఈ యుద్ధంలో భారత్-పాక్లకు చెందిన 8వేల మమంది సైనికులు ప్రా ణాలు కోల్పోయారు.
చివరకు 1965 సెప్టెంబరు 23న ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరుదేవాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. పాక్, చైనాలతో అనుసరించాల్సిన వైఖరిపై కఠినంగా వ్యవహరించిన
లాల్బహదూర్శాస్త్రి దేశ రక్షణ విషయంలో ఏనాడు రాజీ వైఖరిని ప్రదర్శించలేదు.
ఇండో-చైనా యుద్ధం జరిగి యాభై ఏళ్లు పూర్తైనా సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదు. తూర్పు, పశ్చిమ సెక్టా ర్లతో పాటు, హిమాలయ పర్వత శ్రేణుల్లో 3వేల కిలోమీటర్ల
పొడవైన సరిహద్దు సమస్యల్ని ఇరుదేశాలు పరిష్కరించుకోలేకపోయాయి. టిబెట్ సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సహా వేల కిలోమీటర్ల
భూభాగం విషయంలో తలెత్తి న వివాదాలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. భారత్-చైనాల యుద్ధా నికి యాభై ఏళ్లు పూర్తైన తర్వాత కూడా ఈ పరిస్థితికి చాలా కారణాలే
ఉన్నాయి. భారత్-చైనాలు పరస్పర అపనమ్మకంతోనే బంధాన్ని కొనసాగిస్తు న్నాయి. లడఖ్, ఆక్సాయ్చిన్లలో చైనా భూభాగాలుగా గుర్తించడానికి నాటి ప్రధాని నెహ్రూ 1960లోనే
అంగీకరించారని చైనా ఇప్పటికీ వాదిస్తోంది. చౌ ఎన్లై, నెహ్రూ ల మధ్య జరిగిన చర్చల్లో సెక్టా ర్ల వారీగా సమస్యను పరిష్కరించుకోడానికి అంగీకరించిన భారత్ అందుకు
కట్టు బడలేదని ఆరోపిస్తోంది. 1962 యుద్ధం తర్వాత రెండు దశాబ్దా ల పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. 1980లో చర్చలు తిరిగి
ప్రా రంభమయ్యాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ విషయంలో ఇరుదేశాలు పట్టు వీడకపోవడంతో అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి.
చివరకు సెక్టా ర్ల వారీగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునేందుకు 1993లో భారత్ అంగీకరించినా అవి కూడా ముందుకు కదల్లేదు. 2005లో చైనా వైఖరి మళ్లీ మొదటికి
రావడంతో ఈ ప్రయత్నాలు కాస్త నిలిచిపోయాయి.
ఇక భారత్-చైనా సంబంధాల్లో మరో ప్రధాన సమస్య టిబెట్, టిబెట్శరణార్ధు లకు భారత్ఆశ్రయమివ్వడాన్ని మొదట్నుంచి తప్పుపడుతున్న చైనా, భారత్ను శత్రు దేశంగా భావించే
వరకు వెళ్లింది. 1958లో టిబెట్లో పెద్ద ఎత్తు న అల్లర్లు చెలరేగడం, దలైలామాకు భారత్ ఆశ్రయమివ్వడంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు భారత్లో టిబెట్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోడానికి అంగీకరించడం చైనాకు మింగుడుపడలేదు. దీనికితోడు టిబెట్వేర్పాటు వాదులకు సిఐఏ సహకారంతో భారత్ఆయుధాలు, ఆర్థిక సహకారం
అందిస్తోందనే అపోహ చైనాలో బలపడింది. 1962లో భారత్పై చైైనా దాడి చేయడానికి ఇది కూడా ఓ కారణమని చరిత్రకారుల అభిప్రా యం. భారత్లో ఏర్పాటైన టిబెట్ ప్రభుత్వం
ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకపోయినా, దానిని భారత ప్రభుత్వం గుర్తించకపోయినా చైనా అనుమానాలు మాత్రం తీరలేదు. ఇక చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య
సంబంధాలు 1950లోనే మొదలయ్యాయి. మొదట్లో చైనా నుంచి కోల్కత్తా మీదుగా మీదుగా టిబెట్కు ఆహార పదార్దా లను దిగుమతి చేసుకోడానికి భారత్ అనుమతించింది.
1954లో చేసుకున్న పంచశీల సూత్రా ల్లో ప్రధానంగా చైనాకు చెందిన టిబెట్ రీజియన్-భారత్ల మధ్య వాణిజ్యం, సహకారం కూడా ఉంది. వాణిజ్య లావాదేవీల విలువతో
సంబంధం లేకుండా పరస్పర సహకారం కోసమే ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే 1961 నాటికి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భారత్ నిరాకరించింది. దీనికి కారణం
టిబెట్ ప్రాంతంలో తలెత్తి న ఉద్రిక్తతలతో పాటు పట్టు కోసం చైనా చేస్తో న్న ప్రయత్నాలు భారత్కు ముప్పుగా పరిణమిస్తా యనే ఆందోళనతో ఒప్పందాలను కొనసాగించడానికి
త్తి క్త ట్టు చై స్తో న్న త్నా ప్పు స్తా ప్పం
నిరాకరించింది. అయితే చైనా మాత్రం టిబెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తు న చేస్తో న్న అభివృద్ధి పనులపై వ్యతిరేకతతోనే భారత్ వాణిజ్యానికి నిరాకరించిందని ఆరోపించింది. ప్రస్తు తం
భారత్-చైనాల మధ్య 60బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. 2015నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా.అయితే ఇందులో ఎక్కువగా చైనా దిగుమతులు
ఉండటం ఆ దేశానికి లబ్ధి చేకూరుస్తోంది. భారత్మాత్రం ఐటి, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తు ల ఎగుమతికే పరిమితమవుతోంది.
1962 యుద్ధంతో భారత్కు కొంత మేలు కూడా జరిగింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సమయంలో సోవియట్ యూనియన్తో భారత్ బంధం బలపడింది.
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తు లుగా ఎదిగేందుకు భారత్, చైనాలు పోటీ పడటం కూడా అప్పుడే మొదలైంది. అంతులేని మానవ వనరులున్న రెండు దేశాలు పాశ్చాత్య దేశాలకు
దీటుగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 1960 తర్వాత సోవియట్-చైనా సంబంధాలు బలహీనమవడం, ఆ తర్వాత భారత్తో చైనా యుద్ధం ఆ దేశ విస్తరణ
కాంక్షను బయటపెట్టింది అదేసమయంలో మాస్కో-ఢిల్లీల మధ్య మైత్రి బలపడింది. అదే సమయంలో చైనా-అమెరికాలు విభేదాలను పక్కనపెట్టి సహకరించుకోవడం మొదలైంది.
సోవియట్ యూనియన్ పతనాననంతరం సమీకరణల్లో గణనీయమైన మార్పు వచ్చింది. అమెరికా పోటీదారుగా చైనా అవతరించే ప్రమాదం ఉందని గ్రహించి ఆ దేశం భారత్తో
మైత్రిని కోరుకుంది. యుద్ధం తర్వాత విదేశీ సంబంధాల్లో భారత్కు ఎన్నో అవకాశాలు కలిసొచ్చినా అన్ని దేశాలతో మైత్రిని కొనసాగించాలనే విధానానికి కట్టు బడింది. 50ఏళ్ల కిందటి
యుద్ధం తర్వాత ఎన్నో సమీకరణలు మారిపోయినా ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం మాత్రం కుదరలేదు.
ఓ వైపు చైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తు న్నా వాటిని భారత పాలకులు పసిగట్టలేకపోయారు. టిబెట్వ్యవహారంలో 1958 నుంచే విభేదాలు
మొదలైనా వాటిని పరిష్కరించడంలో భారత్విఫలమైంది. ఇక సైన్యాన్ని తరలించడానికి వీలుగా టిబెట్లో పెద్ద ఎత్తు న రోడ్ల నిర్మాణం జరిగిన నిఘా వర్గా లు గుర్తించలేకపోయాయి.
వీటన్నంటికంటే చైనా యుద్ధా నికి సన్నద్దమవుతున్న సమయంలో దేశ పాలకులు విదేశాల్లో చక్కర్లు కొట్టా రు. ఇదేదో రాజకీయ నేతలు చేసిన విమర్శ కాదు నాటి విదేశాంగ శాఖ
కార్యదర్శి ఆర్కె.కల్హా వెల్లడించిన చేదు వాస్తవం. యుద్ధ మేఘాలు ముంచుకొచ్చిన సమయంలో రక్షణ మంత్రి వికె.కృష్ణమీనన్1962 సెప్టెంబరు 17 నుంచి 30వరకు న్యూయార్క్లో
జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభల్లో పాల్గొ నడానికి వెళ్లిపోయారు. ఇక ప్రధాని నెహ్రూ 1962 సెప్టెంబరు 8న కామన్వెల్త్ దేశాల ప్రధానుల సమావేశంలో పాల్గొ నడానికి
వెళ్లిపోయారు. అట్నుంచి అటే పారిస్, లాగోస్, అక్రా లలో పర్యటించి అక్టో బరు2న స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి అక్టో బరు 12న కొలొంబో పర్యటనకు వెళ్ళి 16న తిరిగి ఢిల్లీ
చేరుకున్నారు. ఇక చీఫ్ ఆర్మీ స్టా ఫ్ లెఫ్ట్నెంట్ జనరల్ కౌల్ వ్యక్తిగత సెలవుపై కశ్మీర్ పర్యటనకు వెళ్లిపోయారు. ఇక డైరెక్టర్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ ఎయిర్క్రా ఫ్ట్ క్యారియన్ విక్రాంత్
వ్యవహారాల్లో మునిగిపోయారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన జాప్యానికి భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. పాలనా నేతలు, ఆర్మీ అధికారులు
అందుబాటులో లేకపోవడంతో అక్టో బరు20న చైనా దండెత్తి నపుడు భారత సైన్యం నిస్సహాయంగా లొంగిపోవాల్సి వచ్చింది.
భారత్పై చైనా దాడికి కారణాలేమైనా చైనా వైఖరిని మాత్రం సందు దొరికినపుడల్లా బయటపెడుతూనే ఉంది. టిబెట్ విషయంలో భారత్ వైఖరిపై ఉన్న అక్కసుతో నెహ్రూ కు బుద్ధి
చెప్పాలని మావో భావించాడని నాటి చైనా ప్రధాని లీ షావో వెల్లడించారు. 1962యుద్ధం భారత్కు బుద్ధి చెప్పడానికేనని స్వీడన్రాయబారితో కూడా లీ వ్యాఖ్యనించడం ఇందుకు
ఉదాహరణ. భారత్చైనాల మధ్య ప్రధాన సమస్య మెక్మోహన్లైన్కు సంబంధించింది కాదని టిబెట్విషయంలోనే తమ అభ్యంతరాలని 1964లో నేపాలీ రాయబార బృందంతో
మావో జెడాంగ్స్పష్టం చేశారు. హిమాలయాల విషయంలో తమకెలాంటి సందేహం లేదని, సరిహద్దు ల సమస్యను పరిష్కరించాలన్నదే తమ అభిమతమని మావో రష్యాతో కూడా
స్పష్టం చేసినట్లు రక్షణ శాఖ నివేదికలు వెల్లడించాయి. చైనాకు వ్యతిరేకంగా భారత్ను ముందుంచి రష్యా, అమెరికాలు దాగుడుమూతలాడుతున్నాయనే అనుమానం కూడా
1962 యుద్ధా నికి దారితీసిందని రక్షణ రంగ నిపుణుల అంచనా.కెన్నడీ, కృశ్చేవ్లను కట్టడి చేయాలంటే భారత్కు బుద్ధి చెప్పడమే మార్గమని మావో భావించినట్లు చెబుతారు.
మూలాలు
1. Webster's Encyclopedic Unabridged Dictionary of the English language: Chronology of Major Dates in History, page 1686. Dilithium Press
Ltd., 1989
2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Garver అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
3. H.A.S.C. by United States. Congress. House Committee on Armed Services — 1999, p. 62
4. War at the Top of the World: The Struggle for Afghanistan, Kashmir, and Tibet by Eric S. Margolis, p. 234.
5. The US Army [1] (http://www.strategicstudiesinstitute.army.mil/pdffiles/PUB52.pdf) Archived (https://web.archive.org/web/20120205072610/htt
p://www.strategicstudiesinstitute.army.mil/pdffiles/PUB52.pdf) 2012-02-05 at the Wayback Machine says Indian wounded were 1,047 and
attributes it to Indian Defence Ministry's 1965 report, but this report also included a lower estimate of killed.
6. http://books.google.com/books?
id=PsoDGLNmU30C&pg=PA188&lpg=PA188&dq=sino+indian+war+wounded&source=web&ots=goq1pcQc50&sig=FOQDKdciOn6VAd3fOCIn
7. Dutta, Sujan (6 October 2012). "Himalayan Blunder (Part II) - Air chief revives China war and Kargil debates" (http://www.telegraphindia.com/1
121006/jsp/frontpage/story_16058738.jsp). The Telegraph. Calcutta. Retrieved 10 June 2013.