Professional Documents
Culture Documents
2. శ్రీశైలే మల్లికార్జునమ్......
2. శ్రీశైలే మల్లికార్జునమ్......
2. శ్రీశైలే మల్లికార్జునమ్......
ఇప్పుడు ఆ శ్లో కంలోని రెండో క్షేత్రా న్ని చూద్దా ం. అదే శ్రీశైలంలోని మల్లికార్జు నుడు. ఈ క్షేత్రం మన
తెలుగు రాష్ట్రా లలోనే వుంది. ఆంధ్రపద
్ర ేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్ల మల అటవీ ప్రా ంతంలో
వుంది. చక్కని ఆహ్లా దకరమైన ప్రదేశం అది. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలం. మనసుకు
ప్రశాంతతని ఇచ్చే క్షేత్రం. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఈ విధంగా చెప్పారు.
ఈ శ్లో కార్ధం ఏమిటంటే, శ్రీశైలమనే శిఖరం మీద వివిధ దేవీ దేవతలతో కలిసి ఉంటూ, ఆ కొండ
ప్రా ంతానికంతా నిత్య వసంతాన్ని కలగచేస్తూ , మల్లిక, అర్జు న వృక్షాలతో నిండి వుండి భక్త జనులకు
ఈ సంసారసాగరాన్ని దాటడానికి ఒక వారధి వలే వున్న శ్రీ మల్లికార్జు నునకు నమస్కారం అని.
అంటే శ్రీశైలము అనే ఆ కొండకొమ్ము అంతా నిత్యవసంతాన్ని తలపిస్తూ అంతా మల్లె, మద్ది చెట్లతో
నిండి ఉందని శంకరులు గుర్తు గా చెప్పారు. ఈ కొండకే శ్రీగిరి అనే పేరు కూడా వుంది.
సంస్కృతంలో గిరి అన్నా, శైలం అన్నా కొండ అని అర్థం. కొండపై వాతావరణం చాలా హాయిగా
ఉంటుంది. అన్ని సౌకర్యాలూ వున్నాయి. గదులూ, భోజన వసతులూ బావున్నాయి. ఇక్కడి
హో టళ్ళని మఠాలంటారు. వాళ్ళే తమ దగ్గ ర బస చేసిన యాత్రికులకు ఉచిత భోజనం మూడు
వేళలా ఇస్తు న్నారు. ఆ పక్కనే చక్కటి షాపింగ్ వీధి వుంది. గుడికి, పూజకి సంబంధించి ఏమి
కావాలన్నా అక్కడ కొనుక్కోవచ్చు. ఇది అంతా అడవి కనుక మంచి అరుదైన ఔషధ మొక్కలూ,
మూలికలూ దొ రుకుతాయి. అడవి కనుక రాత్రివేళల్లో జంతువుల భయంతో ఘాట్ దారి
మూసేస్తా రు. ఘాట్ దారికి వేరే టోల్ టాక్స్ కూడా ఉంటుంది.
ఇక్కడ గర్భగుడిలో వున్న లింగం స్పర్శలింగం. ఎవరైనా తాకొచ్చు. కానీ ఈ మధ్య పెరిగిపో యిన
రద్దీ దృష్ట్యా కొన్నినిర్ణీత సమయాల్లో మాత్రమే లింగం వరకు భక్తు లను వెళ్ళనిస్తు న్నారు. ఇక్కడ
ఇంకో ప్రత్యేకత వుంది. అదేమిటంటే, భక్తు లు ధూళి దర్శనం చెయ్యచ్చు (చెయ్యాలి). ధూళి
దర్శనం అంటే శ్రీశైలం చేరిన తరువాత కాళ్ళైనా కడుక్కోకుండా, పరుగెత్తు కెళ్లి , ఆ దేవుని దర్శనం
చెయ్యచ్చు. ఆ శివుడు, తన కోసం వచ్చిన వారిని వారి ఆతృతను గమనించి వెనువెంటనే
దర్శనానికి రావడానికి అనుమతిస్తా డట. ఇక్కడ ఒక బావిలో వున్న జలం సరస్వతి నదీ జలం
అని ఒక నమ్మిక. ఇక్కడ బసవన్న కూడా చాలా పెద్దది. నిరంతరం గుడిలో శివనామజపం,
ఢమరు, మద్దెల, రుంజ, తప్పెట్లు , తాళాలు, శంఖం, ఇత్యాది వాయిద్యాలతో శివభక్తు లు భజన
చేస్తూ నే వుంటారు. ఒక్క క్షణం వీళ్ళే ప్రమథగణాలా అని అనిపిస్తు ంది. ఆ ప్రా ంతమంతా ఎల్ల వేళలా
ఒక దైవీభావన మన చుట్టూ అలుముకుని ఉన్నట్టు అనిపించేది.
కేవలం మూడు ప్రా ంతాల్లో నే జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒక్క చోటే కొలువై వున్నాయి. ఒకటి ఈ
శ్రీశైల క్షేత్రమైతే, రెండో ది ఉజ్జ యిని, మూడో ది వారణాసి. శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబాదేవి. ఈ
దేవత గురించి ఇప్పుడు కేవలం తలచుకుంటున్నాను, అంతే. ఆ తల్లి గురించిన ఇతర
విశేషాలన్నీ అష్టా దశ శక్తిపీఠాల గురించి వ్రా సినప్పుడు తలచుకుందాం. ప్రస్తు తం భ్రమరాంబాదేవి
గురించి మాత్రం వదిలేసి మిగిలిన దేవీ దేవతల గురించి చెప్తా ను. ఇక్కడ ముఖ్య దేవతల్లో సాక్షి
గణపతి మొదటివాడు. శ్రీశైలంకు వచ్చిన వారు ముందుగా ఈ సాక్షి గణపతిని దర్శించి "స్వామీ,
మేము వచ్చాము" అని హాజరు వేయించుకోవటం ఒక ఆచారం. తరువాత మల్లికార్జు నుడు,
వృద్ధ మల్లికార్జు నుడు, కుమారస్వామి, వీరభద్రు డు, దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటాం.
ఇక దేవాలయనిర్మాణం సంగతికి వస్తే, పెద్ద పెద్ద ప్రా ంగణాలూ, అద్భుతమైన శిల్పాలూ, బంగరు
పూతల శిఖరాలూ, ఎత్తైన గోపురాలూ, వాటిపై ధగద్ధ గాయమానంగా వెలిగిపో తున్న కలశాలూ,
నాలుగు వైపులనుంచీ ద్వారాలూ, పెద్ద పెద్ద గ్రా నైట్ రాళ్ల తో చేసిన స్త ంభాలూ, వాటి నిండా
అందంగా చెక్కిన శిల్పాలూ, ఎటు చూసినా శివమయం. ఆస్తికులైనా, నాస్తికులైనా తప్పనిసరిగా
చూడదగ్గ ప్రదేశం. ఏదైనా ప్రదేశాన్ని కానీ, వస్తు వును కానీ, కళ్ల తో పాటు, మనసుతో కూడా
చూడగలిగితే, ఆ ఆనందానుభూతే వేరు. ముఖ్యంగా ఈ శ్రీశైలంలో శిఖరాన్ని చూస్తే పునర్జన్మ
రాదనేది ఒక విశ్వాసం. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అని నానుడి. శ్రీశైలం వెళ్లే
దారిలో శిఖరేశ్వరం అనే చోట ఒక చిన్నకొండ పై నుంచి ఈ శ్రీశైల ఆలయ గోపుర శిఖరం చూడాలి
అంటారు. అక్కడ పూర్వం ఒక రాతిలో రోలు వలే గుంత చేసి, అందులో ఒక చిన్ననంది ప్రతిమను
ఉంచి దానికి రాపిడి ఏర్పడకుండా ఓ గుప్పెడు నువ్వులు వేసి నూరుతూ, దాని దిశను మారుస్తూ
నంది కొమ్ముల మధ్యలో నుంచి దూరంగా కనిపిస్తు న్న శ్రీశైల గోపుర శిఖరం చూసేవాళ్ళం.
బైనాక్యులర్స్ లోనో, టెలిస్కోప్ లోనో మనక్కావల్సిన బొ మ్మ స్పష్ట ంగా కనపడేదాకా తిప్పుతూ
ఉంటామే, అలా అన్నమాట. ప్రస్తు తం ఆ నంది భిన్నమై పో యిందట. అప్పుడు మరో నంది
ప్రతిమను తెచ్చి వాళ్ళే కావాల్సిన డైరెక్షన్ లో అమర్చి పర్మనంట్ గా ఫిక్స్ చేసేసారు. పాతదేదీ
అని అడిగితే, కింద ఇతర రాళ్ళ మధ్యలో చూపించారు. దిగి, దాన్ని తాకి కాసేపు బాధపడ్డా , మళ్ళీ
పాత ఏర్పాటు లాంటిది చెయ్యచ్చు గదా అని అనిపించింది. శిఖరేశ్వరం ఆలయంలో గోడమీద ఒక
శ్లో కం కనిపించింది. ఆ శ్లో కం ఇది. ఇది మనుస్మృతి లోని శ్లో కం. ఈరోజుల్లో ఎంతమంది
అర్చకులకు ఈ లక్షణాలు ఉన్నాయీ, అనిపించింది.
ఇంకొంచం ముందుకు వెళితే, రోడ్డు కు హఠకేశ్వరం ఒకవైపు, పాలధార, పంచధార రెండో వైపు
కనిపిస్తా యి. పాలధార, పంచధార చూడాలంటే, చాలా........ మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. అక్కడ
పాలవలె స్వఛ్ఛమైన తెల్లని నురుగుతో కూడిన నీరు, పంచ అంటే, ఐదు ధారలుగా కొండల
పైనుంచి జలపాతం వలె దూకుతూ కనపడుతుంది. అక్కడే ఒక మూల ఆది శంకరులు తపస్సు
చేసుకున్న గుర్తు లుగా ఆయన పాదాలు, శివలింగం కనిపిస్తా యి. ఆ శివలింగానికి ఈ ధారలతో
నిత్యాభిషేకం . హాఠకేశ్వరంలో శివాలయం, దానికెదురుగా సంతానఫల వృక్షం ఉంటాయి. పిల్లలు
లేరని బెంగ పడేవారు అక్కడ పూజ చేయించి రవికలబట్ట లో పసుపు, కుంకుమ, అక్షతలు,
కొబ్బరికాయ వేసి మూట కట్టి, ఆ ముడుపుని ఆ చెట్టు కు కడతారు. వారికి తప్పక సంతానం
కలుగుతుందని ఒక నమ్మిక. ఇది కూడా సత్యమని నాకు ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది. అసలు
పిల్లలే పుట్టా రనుకున్న వారికి కూడా, వారి తరఫున వేరేవారు ప్రా ర్ధించినా కూడా సంతానం
కలిగింది. అందుకే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపో యేరు, అంటారు.
ఇక్కడ ప్రవహించే కృష్ణ మ్మను, పాతాళగంగ అంటారు. చాలా కిందకు దిగాలి. సులభంగా
వెళ్ళడానికి ఈమధ్య కాలంలో రోప్ వే కూడా వేశారు. కిందకు నీటివరకూ దిగాక బో టులో వెళ్లి
అక్కమహాదేవి గుహలు చూసుకోవచ్చు. మాకు కుదరక మేము వెళ్ళలేదు. ఈ అక్కమహాదేవి
విగ్రహం మనకు గర్భాలయంలో కూడా కనిపిస్తు ంది. ఆమె శివునకు గొప్ప భక్తు రాలు, తపస్వి. ఈ
ఆలయంలో వున్న ఉపాలయాల్లో అర్థనారీశ్వరమూర్తి, సహస్రలింగం, సో మస్కంధమూర్తి కూడా
కనిపిస్తా యి. సో మస్కంధమూర్తి అంటే, స, ఉమ, స్కంధ, మూర్తి అని అర్థం. అంటే ఉమతో,
స్కంధునితో కూడిన శివుడు అని. అసలు శివపార్వతులు ఇక్కడకు రావడానికి స్కంధుడే కదా
కారణం. ఈ ఆలయ చరితల
్ర ో ఇక్కడ దేవుణ్ణి, కృతయుగంలో హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో
సీతారాములు, ద్వాపరంలో పాండవులు అర్చించారని వుంది. ఈ ఆలయం గురించిన అన్ని
వివరాలూ ఈ లింక్ లో పొ ందవచ్చు. http://www.srisailamonline.com
శ్రీశైలానికి రావాలంటే, నాలుగు దిక్కులా నుంచి నాలుగు మార్గా లున్నాయి. అవి తూర్పున
త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధవటం, పడమట అలంపురం, ఉత్త రాన ఉమామహేశ్వరం. ఈ నాలుగూ
శ్రీశైలానికి ప్రధానమైన ముఖద్వారాలు. మేము ఒక్కోసారి ఒక్కోవైపు నుంచి వెళుతూ మేము ఈ
నాలుగు దేవాలయాలూ కూడా చూసేసాము. ఈ నాలుగు క్షేత్రా ల గురించీ మరో శీర్షికలో వివరంగా
రాస్తా ను. ఈ నాలుగు కూడా చాలా చక్కటి, చిక్కటి అటవీ ప్రా ంతంలో, జలపాతాల మధ్య వుండే
ప్రదేశాలు. తపస్సు చేసుకోవటానికి హిమాలయాలు అక్కరలేదు. ఇవి కూడా అందుకు అనువైన
ప్రదేశాలే.
ఇక్కడ అడవుల్లో వున్న ఇష్ట కామేశ్వరి మరొక మహిమ గల దేవత. ఆ ఆలయానికి అటవీశాఖ
అధికారుల అనుమతి లేనిదే వెళ్లలేము. ఒక్కోసారి తొమ్మిది, పదిమందిని గ్రూ పులుగా చేసి ఒక
జీపులో పంపిస్తు ంటారు. అయినప్పటికీ కూడా వెళ్లే వారి అందరి వివరాలూ, ఆధార్ కార్డు
నంబర్ల తో సహా నమోదు చేసుకుని, ఆతరువాత, గ్రూ ప్ కి అంతా ఒక ఫో టో తీసుకుని కానీ
పంపించరు. ఆ అడవిదారుల్లో జీపులు నడపడానికి బాగా ప్రా వీణ్యం, అనుభవం వున్న డ్రైవర్లు
వుంటారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపో యినా ప్రమాదమే. మనిషికి వెయ్యి రూపాయలు
తీసుకున్నారు. ముందర, అమ్మో, అంతా, అనుకున్నా, వాళ్ళు శ్రీశైలం బస్ స్టా ండుకి తిరిగి
తీసుకువచ్చేసరికి, అప్పటిదాకా ఎక్కడో వున్న ప్రా ణాలు తిరిగి శరీరంలోకి వచ్చి చేరాయి. అసలు
చాలామంది మమ్మల్ని ముందే వెళ్ళొద్ద ని భయపెట్టా రు, మీరు ఆ కొండ, అడవి దారిలో వెళ్ళలేరు,
వద్దు అని. మేమే సాహసించాము. ఎందుకంటే, మాకు ఇటువంటి ప్రయాణాలు, ముఖ్యంగా
బాంధవ్ ఘర్ టైగర్ సఫారీకి వెళ్లి న అనుభవం వుంది. ఇద్ద రం ఏమీ ఫరవాలేదు, వెళదాము,
అనుకున్నాము. ఇల్లా ంటి సాహసాలేమైనా చెయ్యాలంటే, మా వారు ఫస్ట్, ఇంతదాకా వచ్చి, ఇది
చెయ్యకపో తే ఎలా అని, చాలాసార్లే సాహసాలు చేయించారు మరి. నాకే భయం వేసి మా క్యాబ్
డ్రైవర్ ని మాతో కూడా రమ్మన్నాను. అతడు ఈ ప్రయాణం ఎక్స్పెన్సివ్ అని, ఆ ప్రా ంతానికి
చెందిన వాడే అయినా ఎప్పుడూ వెళ్ళలేదుట. ఇష్ట ంగా వచ్చాడు. ఈ ప్రయాణం ఒక మూడు,
నాలుగు గంటలు పడుతుంది రానూ పో నూ. అసలక్కడ రోడ్డే ఉండదు. ఆ రాళ్ళ దో వలో
అనుభవం వున్నవారే దారిని గుర్తించగలరు. రాళ్లు అంటే మామూలు రాళ్లు అనుకునేరు. పెద్దపెద్ద
రోళ్ల ంత సైజులో వుండే నున్నటి గుండ్రా ళ్ళు. మనల్ని ఎక్కడా జీప్ దిగనివ్వరు. జంతువుల
భయం మరి. అలా ఈ జీపు మనతో సహా ఆ గుండ్రా ళ్ల మీద దొ ర్లు తూ పో తూ ఉంటుంది. పైగా
మధ్య మధ్యలో సుమారు ఇరవై, ముప్ఫయి అడుగులు జుయ్యిమని దిగటం, అలాగే ఎక్కటం.
ఇవ్వన్నీ కాక రానూ, పో నూ ఒకటే దారి. ఎదురుగా మరో జీప్ వస్తు ంటే, ఒక్కోసారి భయం
వేస్తు ంది. బండి ఎక్కడా ఆపుకునే లాగానూ ఉండదు. భయానికి మా జీపులో వాళ్ళు, పెద్ద పెద్ద
మగవాళ్ళు కూడా గావుకేకలు పెట్టా రు. డ్రైవర్ ని బండి ఆపమని గోల పెట్టా రు. ఆ భయానికి
గుండె ఆగిపో తోందని అరిచారు. ఆపకపో తే జీపు కంపు చేస్తా మని గోల. ఆ గోల పడలేక డ్రైవర్
ఒకసారి ఆపాడు. వాళ్ళు దిగి వెళ్లి , పొ ట్ట ఖాళీ చేసుకుని వచ్చారు. మేము, మాతో వున్న మా
క్యాబ్ డ్రైవర్, ఇంకొంత మంది మాత్రం నింపాదిగా జీప్ లోనే కూర్చునివున్నాం. మొత్తా నికి గుడికి
సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో జీప్ ఆగింది. అక్కడి నుంచీ నడక, అదీ ఎగుడుదిగుడు
రాళ్ళమీద, మధ్యలో ఒక సన్న వాగు పారుతూ ఉంటుంది. నీళ్లు చచ్చే చల్ల గా ఉంటాయి. కానీ
చుట్టు పక్కల చూస్తే అంతా రమణీయంగా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న వాగులు,
సన్నసన్నగా కొండల పైనుంచి జాలువారే సహజ సిద్ధమైన ఔషధీయుక్త మైన జలధారలు,
ఒకప్పుడు అక్కడ తపస్సు చేసుకునేవారేమో అనిపిస్తూ , అక్కడక్కడా కొండలలోనే తొలిచినట్టు
సరిగ్గా ఒక మనిషి పట్టేంత చిన్నచిన్న గూళ్ళు, వినాయకుడి విగ్రహం, మహాబిల్వం మొక్కలు,
ఏవేవో పేరు తెలియని పూల మొక్కలు, ఇవి అన్నీ చూస్తూ నెమ్మదిగా అమ్మవారి గుడికి
చేరాము.
ఇష్ట కామేశ్వరి అమ్మవారి గుడి చాలా చిన్నది. అక్కడి చెంచులే పూజారులు. భూమి లెవెల్ కి ఒక
ఏడెనిమిది అడుగులు కింద ఉంటుంది. పై నుంచి కిందకు జారాలి. వెంటనే గయలో మంగళగౌరీ
ఆలయం గుర్తొ చ్చింది. గుడి బయట వున్న చిన్న ప్రా ంగణంలో హో మగుండాలు, కొన్ని ఖండిత
విగ్రహాలు వున్నాయి. కొంచెం రాళ్ళ మీంచి కిందకు దిగితే ఒక వాగు. హాయిగా నెమ్మదిగా
కదులుతున్నాయి నీళ్లు . ఆ నీళ్ళల్లో కాళ్ళు పెట్టు కుని కూర్చుంటే అలసట అంతా పో యింది.
కాసిన్ని నీళ్లు తాగితే అమృతంలా వున్నాయి. కొన్ని తాగి, ముఖం కడుక్కుని, కిందకు రాలేని
వాళ్ళు బాటిల్స్ ఇస్తే వాళ్ల కు నీళ్లు పట్టి, తీరిగ్గా పైకొచ్చాను. అప్పటికి అమ్మవారి దగ్గ రకు
లోపలకు వెళ్లే వారి సంఖ్యా కొంచం తగ్గింది. ఒక్కసారే రెండు, మూడు లేదా ఇంకా ఎక్కువ జీపులు
కలిసి బయలుదేరతాయి మరి. నెమ్మదిగా దారిలో కోసిన మహాబిల్వం ఆకులు, పువ్వులు, కొత్త
కుంకుమడబ్బా తీసుకుని నేనూ, మావారూ, మా డ్రైవరూ లోపలకు జారాం. నేను కోసిన పూలు,
మహాబిల్వం ఆకులు, మాతో వచ్చిన చాలా మందికి కూడా ఇచ్చాను.
భట్టిప్రో లు విజయలక్ష్మి
9885010650