Professional Documents
Culture Documents
బీటెకలకే గిరాకీ
బీటెకలకే గిరాకీ
eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122234841
కొత్త సంవత్సరంలో తాజా బీటెక్గ్రాడ్యుయేట్లకు డిమాండ్అధికంగానే ఉండనుంది. ప్రస్తు త ఏడాదిలో వివిధ కంపెనీల్లో
కొలువులు సాధించిన వారిలో 32 శాతం మంది బీటెక్పట్టభద్రు లు ఉండగా.. 2023లో 31 శాతం మందిని
నియమించుకోవాలని సంస్థలు భావిస్తు న్నాయి.
ఈనాడు - హై దరాబాద్
1/4
కొత్త సంవత్సరంలో తాజా బీటెక్ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ అధికంగానే ఉండనుంది. ప్రస్తు త ఏడాదిలో వివిధ కంపెనీల్లో
కొలువులు సాధించిన వారిలో 32 శాతం మంది బీటెక్ పట్టభద్రు లు ఉండగా.. 2023లో 31 శాతం మందిని
నియమించుకోవాలని సంస్థలు భావిస్తు న్నాయి. దేశవ్యాప్తంగా భర్తీ చేసే కొత్త ఉద్యోగాల్లో దాదాపు మూడో వంతు బీటెక్
అభ్యర్థు లకే దక్కనున్నాయి. తాజాగా విడుదలైన భారత నైపుణ్యాల నివేదిక-2023 ఈ విషయాన్ని వెల్లడించింది.
ముఖ్యంగా ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, ఎలక్ట్రా నిక్స్, కంప్యూటర్సైన్స్అభ్యర్థు లకు అత్యధిక డిమాండ్ఉందని తెలిపింది. అదే
సమయంలో మెకానికల్ ఇంజినీర్లు పనిచేసే రంగాల్లో గణనీయ వృద్ధి ఉందని పేర్కొంది. ‘బీటెక్ అభ్యర్థు లకు బ్యాంకింగ్,
ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో అత్యధికంగా 41 శాతం గిరాకీ ఉంది. ఈ రంగంలో 1-5 సంవత్సరాల
అనుభవం ఉన్న వారికి స్వల్పంగా డిమాండ్ పెరగనుంది. ఆటోమోటివ్లో 30 శాతం మందికి ఉపాధి అవకాశాలు
లభిస్తా యి. ఇంటర్నెట్ బిజినెస్(ఈ-కామర్స్, ఆన్లై న్ తదితరాలు)లో 38 శాతం డిమాండ్ ఇంజినీరింగ్ అభ్యర్థు లకే
ఉన్నట్లు ’ నివేదిక పేర్కొంది.
నివేదికలో ముఖ్యాంశాలు
2/4
* ఐటీ, సాఫ్ట్వేర్ పరిశ్రమలు బీటెక్ అభ్యర్థు లతో దాదాపు సమానంగా అంటే 25 శాతం మందిని ఎంటెక్, ఎంసీఏ,
ఎంఎస్సీ, ఎంకాం పూర్తి చేసిన వారిని నియమించుకోనున్నాయి. ఫార్మా/హెల్త్కేర్రంగంలోనూ బీటెక్తో సమానంగా బీఏ,
బీసీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ తదితర విద్యార్థు లను తీసుకోనున్నాయి.
* ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం కోసం 90 శాతానికిపైగా విద్యార్థు లు ఇంటర్న్షిప్ అవకాశాలను కోరుకుంటున్నారు.
అందులో అత్యధికంగా ఏపీ నుంచి 93.50 శాతం మంది(వీబాక్స్నేషనల్ఎంప్లా యిబిలిటీ టెస్ట్రాసినవారిలో) ఇంటర్న్షిప్
కావాలని కోరుకున్నారు.
తాజా గ్రాడ్యుయేట్లకు డిమాండ్పెరుగుతోంది. యువత తమలోని లోపాలను, ఇంకా ఎటువంటి నైపుణ్యాలు అవసరమో
తెలుసుకోవాలంటే ఇంటర్న్షిప్ చేయాలి. దీని వల్ల ప్రత్యక్ష శిక్షణ లేకుండానే పనిచేసేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం
పెరుగుతుంది. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, ఏఐసీటీఈ, యూజీసీ లాంటి సంస్థలు ఇంటర్న్షిప్ అవకాశాలను
పెంచాలి. కళాశాలలూ దృష్టి సారించాలి. లేకుంటే మంచి అవకాశాలను యువత కోల్పోతారు.
3/4
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తు లు, సంస్థల నుంచి వస్తా యి. కొన్ని
ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి,
ఉత్పత్తు లు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తు లు / సేవల నాణ్యత లేదా
లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
4/4