Professional Documents
Culture Documents
8
8
అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంక ప్రా రంభము అవుతారు మనకి ఆశ్చర్యము వేస్తు ంది
ఏమిటిరా వీళ్ళ జీవితాలు, ఏమి మహర్షు లురా అనిపిస్తు ంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి
వరుసగా వీళ్ల ందరూ వస్తా రు, వీళ్ల o దరినీ మించి మకుటాయమానమయిన వ్యక్తి మహానుభావుడు
అగస్త్యుడు వీళ్ల ందరూ వస్తా రు. వీళ్ల ందరి అనుగ్రహాన్ని పొ ందుతాడు, చిట్ట చివర కూడా యుద్ధ కాండలో
రామచంద్రమూర్తి రావణాసురుడిమీద యుద్ధ ము చేసేటప్పుడు అలసటకు లోనయితే ఒకరు
పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్యహృదయాన్ని ఉపదేశము చేసన
ి టువంటివాడు
అగస్త్యుడు. మనకి రామాయణము జీవితములో గొప్ప ధైర్యాన్ని ఇస్తు ంది, నువ్వు సత్యధర్మాల్ని
పట్టు కో వెతుక్కోవలసింది ఏమీ ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చుకు దాచుకుంటావు, ఎన్ని
తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి రావాలిసనటువంటి కష్ట ము నుంచి గట్టెక్కగలవు. ఎన్ని
తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చిపెట్టు కోండి కష్ట ము అనేటటువంటిది వెన్నాడుతూనే ఉంటుంది. మీ
శక్తితో కష్టా న్ని అధిగమించగలను అనుకున్నంతకాలము కూడ అహంకారము లోపల ఉన్నంత
కాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది.
దీనికి మెట్లు ఎలా ఎక్కాలో జీవితము ఎలా ఉంటుందో ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో
ఎలా మాట్లా డుతుందో మనకి నిజంగా శల్యులాయిడ్ మీద సినిమా చూపించినట్టు ఎంత అందముగా
వాల్మీకిమహర్షి ఆ పాత్రలని చూపిస్తా రో ఎక్కడెక్కడ ఏ పాత్ర వైక్లభ్యాన్ని పొ ందుతుంటుందో
సత్యధర్మాలని అనుష్టా నము చెయ్యడములో ఒక్క రాముడు మాత్రము మారకుండా ఎలా
నిలబడతాడో , రాముడిని పట్టు కున్నవాడిని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ
నిరూపిస్తు ంది. అందుకే నాకయితే అనిపిస్తు ంది వ్యక్తిగతముగా అయోధ్యకాండ లాంటి కాండ
రామాయణములో ఇంకొకటి లేదు, సుందరాకాండ పరమోత్కృష్ట మయిన కాండ సందేహము లేదు
కానీ అది ఉపాసన కాండ. కానీ సామాన్యమయినటువంటి వ్యక్తి జీవితము దగ్గ రనుంచి ఎలా
నడవాలో, నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యఖాండే . అంత పరమోత్కృష్ట మయిన
కాండని ఇవాళ ప్రా రంభము చేస్తు న్నాము.
ఇందులో వాల్మీకిమహర్షి మొట్ట మొదట శ్లో కాన్ని రచిస్తూ అంటారు గచ్చతా మాతులకులం
భరతేనా తదానఘః, శత్రు ఘ్నో నిత్యశత్రు ఘ్నోనీతః ప్రీతిపురస్కృతః అంటూ మొదలుపెట్టా రు.
గచ్చతా అంటూ మొదలుపెట్టా రు అదో గమ్మత్తు వాల్మీకి రచనావైచిత్రి ఎంత అందముగా
మాట్లా డుతారో చూడండి గచ్చతా వెళ్ళాడు అన్నారు. వెళ్ళిపో యినది అన్న శబ్ద ముతో ప్రా రంభము
అయ్యింది అయోధ్యఖండ. అయోధ్యకాండ పూర్తిఅయిపో యేటప్పటికి రాముడు అరణ్యవాసానికి
వెళ్లి పో తాడు, లక్ష్మణుడు రాముడి వెంట వెళ్లి పో తాడు, భరతుడు నందిగ్రా మానికి వెళ్లి పో తాడు.
గురువు యందు నీకు విశ్వాసము ఉంటే ఆ గురువు వెంట వెళ్లి పో వాలి, ఆ గురువు
తీసుకుపో తాడు అంతే నిన్ను ఎలా, తన వెంట ఒక వస్తు వుని తీసుకుపో యినట్టు తీసుకుపో తాడు
భక్తు డు, తీసుకుపో తే ఆ భాగవతులను అనుసరించి అలా వెళ్లి పో తాడు. ఎలా వెళ్లి పో యాడు తను
రాజకుమారుడు, తను కూడా దశరధమహారాజుగారి కొడుకే, భరతుడూ దశరధమహారాజుగారి కొడుకే
నువ్వు మేనమామగారింటికి వెడితే నన్ను తీసుకువెళ్లి పో వడము ఏమిటయ్యా నేనెందుకు వస్తా ను
అనడు, భరతుడు ఎక్కడుంటే అక్కడుంటాడు, ఎప్పుడూ భరతుడి సేవ చేసుకుంటాడు, ఎప్పుడు
చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు, ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది. తన
సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తు ల యొక్క సేవ చేసిననాడు
భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు.
ఇన్ని అస్త్రా లు ఉన్నా శస్త్రా లు ఉన్నా ఇంత ధనుర్విద్య తెలిసినా నిష్కారణముగా ఎన్నడూ
ఒక బాణప్రయోగము చెయ్యనివాడు. ఎప్పుడూ అవతలవారి ఉపకారాన్ని స్మరించి ఓర్పుతో
ఉండగలిగనటువంటి వాడు. ఇన్ని గుణములు ఉన్నాయయ్యా రాముడి దగ్గ ర అందుకే రాముడంటే
అందరికీ ఎంత సంతోషమో అందరిని సంతోషింపచేయగలిగనటువంటి గుణములతో
ప్రకాశించేటటువంటి స్వరూపము ఉన్నవాడు కనుక తన కుమారుడిని చూసుకుని దశరధ
మహారాజుగారు మరింత ప్రీతి పొ ందుతాడుట. నలుగురినీ ప్రేమించినా గుణములు అధికముగా
ఉండడము చేత రాముడంటే దశరధమహారాజుగారికి మరింత ప్రీతిట. ఇంత ప్రీతి కలిగినటువంటి
దశరధమహారాజుగారు ఒకసారి మంత్రు ల్ని, ఇతర రాజులని, ప్రభుత్వోద్యోగులని, జానపదుల్ని,
అయోధ్యా పట్ట ణవాసుల్ని, కోసలదేశములో ఉన్నటువంటి ప్రధానమయిన వ్యక్తు లని అందరినీ పిలిచి
పేద్ద సమావేశము ఏర్పాటుచేసారు.
ఎంత పరీక్ష పెట్టా డో చూడండి, తన కొడుకు అని అంత తొందరగా రాజ్యమేమి ఇవ్వలేదు
దశరధమహారాజుగారు. దశరధమహారాజుగారు రాముడికి రాజ్యము ఇవ్వాలంటే ప్రజలందరిలో
కూడా ఆమోదము ఉందో లేదో ఎంత పరిశీలన చేసాడో చూడండి ఇది దశరధుడు అంటే . ఇది అసలు
ప్రజాస్వామ్యము అంటే, ఇది ప్రజలయొక్క మనసుల్లో ఉన్న అభిప్రా యాన్ని కనిపెట్టి
పరిపాలించడము అంటే. అంటే వాళ్ల న్నారు, మాకందరికి ఎందుకు ఇష్ట మో తెలుసా రాముడంటే
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః, సాక్షాద్రా మాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ
రాముడు సత్పురుషుడు ఈలోకము మొత్త ము మీద. ఆయన సత్యధర్మ పరాయణుడు, ఆయనకు
సత్యము ధర్మము ఈ రెండే కావాలి, అన్నిటినీ మించి రాముడి దగ్గ ర ఉన్న గొప్ప గుణము ఏమిటో
తెలుసా దశరధా, ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడము రాముడికి తెలుసు అన్నారు.
వచ్చి ప్రతీ వాళ్ళ దగ్గ రకు వచ్చి పూర్వభాషీచ రాఘవ ముందు ఆయనే పిలుస్తా డు నువ్వు
సంతోషముగా ఉన్నావా ఇన్ని ప్రశ్నలు వేస్తా డు, తల్లి దగ్గ రనుంచి, తండ్రి దగ్గ రనుంచి, అఘ్నిహో త్రా ల
దగ్గ రనుంచి, గురువుల దగ్గ రనుంచి, శిష్యుల దగ్గ రనుంచి ఇన్ని ప్రశ్నలు ఏనుగో, రధమో ఎక్కి ప్రతీ
ఇంటిముందు నుంచి వెడుతూ కనపడ్డ వాళ్ల ందరినీ ముందు తను పిలిచి తను ప్రశ్నిస్తా డు.
ఎవరయ్యా రాజు ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవాడు, అటువంటి గుణము నీ కొడుకులో ఉంది
అందుకు మాకు కావాలి రాముడు రాజుగా. అటువంటివాడు రాజుగా లేకపో తే మా బ్రతుకు
ఎందుకయ్యా ఇంక అందుకు అడుగుతున్నాము రాముడిని. అంతేకానీ నువ్వన్నావని మేమనటము
లేదు ఇదీ రాముడి దగ్గ ర ఉన్న గుణము.
అన్నిటికన్నా ఇంకా గొప్ప గుణము ఏమిటో తెలుసా వ్యసనేషు మనుష్యాణా౦ భృశ౦ భవతి
దుఃఖితః, ఉత్పనేషు చ సర్వేషు పితేన పరితుష్యతి. రాముడు వ్యసనేషు మనుష్యాణా౦ భృశ౦ భవతి
దుఃఖితః, ఉత్పనేషు చ సర్వేషు పితేన పరితుష్యతి. రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి
సంతోషినట్టు సంతోషిస్తా డు, తండ్రి ప్రేమకు అవధి ఉండదు. అందుకే భర్త ృ ప్రేమ, మాతృ ప్రేమ, తల్లి
ప్రేమ, తండ్రి ప్రేమ వీటిని ప్రేమ అని పిలుస్తా రు, ప్రేమ అన్నమాటకు అర్ధ ము ఏమిటో తెలుసాండీ,
తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపో యినా, తాను అనుభవించకపో యినా,
తనవారు అనుభవిస్తు ంటే వారనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడము ప్రేమ
అని పేరు.
అనేసరికి సువర్ణా దీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి, శుక్ల మాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ
మధుసర్పిషీ, అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి, చతురంగబలం చైవ గజం చ
శుభలక్షణమ్, చామరవ్యజానే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురమ్, శతం చ శాతకుంభానామ్
కుంభానామాగ్నివర్చసామ్, హిరణ్యశృంగమ్ ఋషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ, ఉపస్థా పయత ప్రా తః
అగ్న్యగారం మహీపతేః. వశిష్టు డు అన్నాడు అక్కడుండేటటు వాళ్ళ౦దరినీ పిలిచి మీరివన్నీ సిద్ధము
చెయ్యండి ఏవి రత్నాల్ని సిద్ధము చెయ్యండి, తెల్లటి వస్త్రా ల్ని సిద్ధము చెయ్యండి, పేలాల్ని సిద్ధము
చేయండి, పేలాలూ శుభము కోరుతాయి. ఒక్కొక్కదానికి ఒక శక్తి ఉంటుంది, ఘంటానాదము చేస్తే
దేవతలకు పిలుపు, బిందె చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపు, బిందెలో చప్పుడు చేస్తే దెయ్యాలకి
భూతాలకు పిలుపు, క౦చాన్ని చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపు. అందుకే ఒక్కొక్కచోట
ఒక్కొక్క క్రియాకలాపము చేస్తు న్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేయిస్తూ ంటారు. శంఖానాదము చేస్తే
విజయానికి పిలుపు, పేలాలు ఇంట్లో చల్లినా, ఇంట్లో తిన్నా, ఇంట్లో చేతుల్లో పట్టు కున్నా, ఇంట్లో
పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారు. అందుకే పేలాలు నైవేద్యము పెట్టినా, పేలాలు బెల్లము
నైవేద్యము పెట్టినా, పేలాలు చేతిలో పట్టు కుని తింటున్నా, ఇంట్లో పిల్లలు పేలాలు తింటూ అక్కడా
ఇక్కడా పడేసన
ి ా దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తు ంది.
ప్రవేశించి చిత్రము చూడండి, రామవర్మాహంభో అభివాదయే అని రాజులు అయితే చిట్ట చివర
వర్మ పెట్టు కుంటారు, బ్రా హ్మణులు అయితే శర్మ పెట్టు కుంటారు. చతుస్సాగర పర్యంతం
గోబ్రా హ్మణేభ్యః అని ప్రవర చెపుతారు, చెప్పి తండ్రిగారి పాదముల వంక చూసి నేను రామవర్మను
వచ్చాను అని చెప్పి చెవులు పట్టు కుని ఆయన పాదాలకు శిరస్సు తగిలేటట్టు నమస్కారము
చేసాడుట రామచంద్రమూర్తి. చూసారుట దశరధమహారాజుగారు రాముడి వంక, ఈ గుణాల వల్ల కదా
రామా నేను కట్టు బడిపో యాను, ప్రజలందరూ సంతోషిస్తా రు, రోజు రోజుకీ వృద్ధిలోకి వచ్చినా నా
పాదములు కనపడగానే ఒంగి నమస్కారము చేస్తా వు, ఇంత పితృభక్తి కలిగినవాడివి కాబట్టే రామా
నాకింత ప్రీతి అనుకున్నాడుట. దశరధమహారాజుగారి మనస్సులో కలిగిన భావమేమిటో ఎంత
సున్నితముగా, ఎంత అందముగా వాల్మీకి మహర్షి చెప్తా రో చూడండి.
ఇవ్వాళ ఉపవాసము అంటే ఏమిటో అసలు ఉపవాసము అంటే ఏమిటో ఎంత తేడా
ఉంటుందో మీరు చూద్దూ రుగాని. అందుకని రాముడు బయలుదేరి వెళ్లి పో యాడు, మంత్రు లందరితో
కలిసి అక్కడ ఉన్న జానపదుల్ని, పౌరుల్ని వెళ్లి పొ మ్మన్నాడు. ఒక్క రాజులున్నారు, మంత్రు లు
ఉన్నారు వాళ్ళతో అన్నాడు మీరు ఇంకొకసారి ఆలోచించండి నేను పెట్టు కున్న ముహూర్త ము
వశిష్టు డు పక్కన ఉండగా, పుష్యమీ నక్షత్రములో యవ్వరాజ్య అభిషేకము చేస్తా నని.
దశరధమహారాజుగారి కారెక్టెర్ లో ఉన్న పెద్ద బలహీనత తొందరబాటు. పక్కన వశిష్టు డు ఉన్నా
అడగడు, నేనెప్పుడు చెయ్యను యవ్వరాజ్య పట్టా భిషేకము అని. అప్పటికి తనకి తోచిందనుకోండి
extempore చూసారా, ఎప్పటికి ఏదనిపిస్తే అది వెంటనే చేసేయ్యాలనుకుంటాడు. అందుకని
పుష్యమీ నక్షత్రములో నేను అభిషేకము చేస్తా నన్నాను మీరు కూడా ఆలోచించారా చెయ్యనా
అన్నాడప్పుడు.
అంటే వాళ్ళు అన్నారు తప్పకుండా చెయ్యి అన్నారు. అన్న తరువాత వాళ్ళను కూడ
పంపించేసాడు. పంపించేసి అంతఃపురములోకి వెళ్ళాడు. వెళ్ళిపో యిన తరువాత సుమంత్రు డిని
పిలిచాడు, మళ్ళీ వెళ్ళి రాముడిని తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరధుడి హృదయము
బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరికీ తెలియకూడని రహస్యాలు రాముడి దగ్గ ర మాట్లా డుతాడు,
సుమంత్రు డు మళ్ళీ వెళ్ళి మీ నాన్నగారు ఎందుకో మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రావడము
రాకపో వడము నీ ఇష్ట ము అన్నాడు. ఎందుకని, ఇప్పుడేకదండీ మానాన్నగారితో మాట్లా డాను,
మళ్ళీ రావడము ఏమిటండీ అని రాముడు అంటాడేమో అని. కానీ తండ్రి పిలుపు కన్నా గొప్పది
రామచంద్రమూర్తికి ఇంకొకటి లేదు. ఇదిగో వస్తు న్నాను అని రధము ఎక్కాడు మళ్ళీ వెళ్ళాడు,
తండ్రిగారు కూర్చుని ఉన్నాడు ఒక ఉన్నతాసనము మీద, సింహాసనము కాదు అది
అంతఃపురములో ఉన్నాడు రాముడు మాత్రము వెళ్ళి కూర్చోడు అదీ గొప్పతనము. దూరముగా
నుంచుని నమస్కారము చేసి నిలబడ్డా డు, రామా వచ్చి కూర్చో అన్నాడు, అంటే వెళ్ళి
కూర్చున్నాడు.
నాకు పీడకలలు వస్తు న్నాయి, పైగా పగటిపూట ఉల్ఖ లు కింద పడుతున్నాయి, తోక
చుక్కలు కనపడుతున్నాయి, అన్నిటినీ మించి నా జన్మానక్షత్రా న్ని ఇవ్వాళ సూర్యుడు, కుజుడు,
రాహువు అనేటటువంటి మూడు పాప గ్రహములు ఆవరించి ఉన్నాయి. అందుకని ప్రమాదము
ముంచుకు వచ్చేస్తో ంది, ఈ శరీరము పెద్దదయిపో యింది, ఇది పడిపో తుంది అని నేను బెంగ
పెట్టు కోవడము లేదు రామా, కానీ ప్రజలు దిక్కు లేని వారు కాకూడదు, నీకు తొందరగా
పట్టా భిషేకము చేసేస్తా ను, పుష్యమీ నక్షత్రములో నీ అభిషేకము పూర్త యిపో తుంది.
అందుకని ఎందుకు పట్టా భిషేకము పూర్తి చేస్తు న్నానో తెలుసా, ఎంత గుంభనమయిన మాట
వాడేశాడో చూడండి నతద్యావదేనా మే చేతో న విము౦చతి రాఘవ, తావదేవాభిషించస్వ చలా హి
ప్రా ణినాం మతిః. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టా భిషేకము చెయ్యాలని, ఈ మనస్సు
మారిపో కముందే పట్టా భిషేకము పూర్తి అయిపో నీ రామా. అయితే నీకొక్కటి చెపుతాను విప్రో షితశ్చ
భరతో యావదేవ పురాదితః, తావదేవాభిషేకస్తే ప్రా ప్త కాలో తతో మమ భరతుడు చలా మంచివాడు.
దూరముగా యుధాజిత్తు వాళ్ళ మేనమామగారి దగ్గ ర ఉన్నాడు, భరతుడు రాకముందు నీ
పట్టా భిషేకము పూర్తి అయిపో వాలి రామా. భరతుడు రాకముందు పట్టా భిషేకము అయిపో వాలని
అంటున్నానని, భరతుడు నీకు పట్టా భిషేకము జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడని
అనుకుంటున్నావేమో అతను ధర్మాత్ముడు, శిక్షింపడిన బుద్ధి కలవాడు, నిన్ను
అనువర్తించేటటువంటి స్వభావము ఉన్నవాడు, చాలా మంచివాడు.
కానీ రామా నేనొక్క మాట చెపుతాను కింతు చిత్త ం మనుష్యాణామ్ అనిత్యమితి మే మతిః,
సతా౦ తు ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానము ఉంది, ఎంత
ధర్మము నందు బుద్ధి ఉన్న పెద్దలయినా, ఎంత సాదుపురుషులు అయినా మనస్సు
మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా నేనంె దుకు చెప్పానో భరతుడు వాళ్ళ మేనమామగారి
ఇంటినుంచి తిరిగి వచ్చే లోపల ఎల్లు ండి నీకు యవ్వరాజ్య పట్టా భిషేకము పూర్తి అయిపో వాలి.
అందుకని రామా తొందరగా నీ పట్టా భిషేకము అయిపో తుంది, జనకుడికి, కేకయ రాజుకీ కూడా
చెప్పను ఇది దృష్టిలో పెట్టు కో ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తా యి, నీ
స్నేహితులు అందరినీ కూడా అప్రమత్తు లయి ఉండమని చెప్పు, నువ్వు ఉపవాసములోకి వెళ్ళు,
వెళ్ళి దేవతలను ప్రా ర్ధ న చెయ్యి, సీతాసహితుడవై ధర్భాసనము మీద పడుకో.
ఇది భరతుడు వస్తే యుధాజిత్తు కు తెలిసినా కేకయ రాజుకి తెలిసినా నువ్వు ఇక్ష్వాకు
వంశములో ఉండి సత్యము తప్పుతున్నావంటారు. వియ్యంకుడు అయినా జనకమహారాజుగారు
వస్తే పో నీ రాముడి తరుపన తీర్పు చెప్పడు, జనకుడు పెద్దవాడు మహాజ్ఞా ని, తన అల్లు డిని దృష్టిలో
పెట్టు కుని అదేమిటయ్యా పెద్దవాడికి పట్టా భిషేకము చేయ్యొచ్చు అనడు జనకుడు. ఎందుకనడు,
ఆయన జ్ఞా ని, తప్పయ్యా సత్యము తప్పకూడదు, భరతుడికే పట్టా భిషేకము చెయ్యి అంటాడు.
అందుకని కాలము లేదని చెప్పేస్తా ను, వేళ లేదని చెప్పేస్తా ను, ఎల్లు ండి పట్టా భిషేకము చేసస
ే ్తా ను.
అటు జనకుడిని పిలవను ఇటు కేకయ రాజుని పిలవను, భరతుడిని పిలిస్తే ఇంత అర్జెంట్ గా
భరతుడు ఎందుకు అని అడిగితే మళ్ళీ వాళ్ళకు తెలుస్తు ంది అందుకని భరతుడిని పిలవను. అసలు
భరతుడుకు కూడా ఇది తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. అందుకని భరతుడు లేకుండా
ఈ పట్టా భిషేకము అయిపో వాలి, రామా నువ్వు జాగ్రత్త పడు అన్నాడు.
ఇంత గుట్టు కడుపులోపెట్టు కుని చెప్పకుండ చెప్పాడు, రాముడికి పట్టా భిషేకము
చేయడానికి సిద్దపడి ఉపవాసము చెయ్యమన్నాడు. ఉపవాసము అంతే ఏమి చేసాడో తెలుసాండీ
రాముడు, వశిష్టు డిని పిలిచి వెళ్ళి ఉపవాసము చేయించమన్నాడు, ఆయన వెళ్ళి మంత్రపూరిత
మయిన ఉపవాసము ఏమిటో చెప్పాడు. వశిష్టు డు అక్కడకు వెడితే చెయ్యిచ్చి దింపాడు,
నమస్కారము చేసాడు, కూర్చోపెట్టా డు ఉపదేశము చేసేసి ఎలా చేయాలో ఉపవాసము
మహానుభావుడు మంత్రపూరిత ఉపవాసాన్ని చెప్పి రధము ఎక్కి వశిష్టు డు వెళ్లి పో యాడు.