Professional Documents
Culture Documents
Reflections On FATHER's CENTENARY
Reflections On FATHER's CENTENARY
Reflections On FATHER's CENTENARY
తల్లి గారికి ఆస్తిక వారసత్వం ఉన్నది. వైష్ణవ మతానికి చెందిన దాక్షిణాత్య గురువులు దేశాటనం చేస్తూ
శిష్యులకు బో ధ , వైష్ణవీకరణ ( చక్రా ంకితము-వారి ధర్మం ప్రకారం సమాశ్రయణం) చేస్తా రు. వైష్ణవ
నామకరణం కూడా చేస్తా రు నారాయణ, జానకీరామ నామధేయాలు ఆలా వచ్చినవే. పేర్ల వరకే గాని
పిచ్చమ్మగారి గాఢ భక్తి సంతానానికి రాలేదు. ఆవిడ ప్రతి ఉదయం స్నానం చేసి తిరుచూర్ణ ం, తిరుమణి
ధరించి, పెరుమాళ్ళ కైంకర్యం చేసి, నాలాయిరమ్ ప్రబంధ పాశుర పఠనం గావించి, పల్లా ండు చెప్పేటప్పటికీ
11 గంటలయ్యేది. ఇవేమి లేకపో గా నారాయణ గారు నాస్తికత్వం ఒంటబట్టించుకున్నారు త్రిపురనేని
రామస్వామి చౌదరి గారి సూత పురాణము - 4 సంపుటాలు, శంబూక వధ లాంటి పుస్త కాలు చదివి
నాస్తికతను పెంచుకున్నారు తాను నమ్మిన దానిని ఆచరించి, అందరికి చెప్పేవారు, కానీ ఎవరిని మారమని
చెప్పేవారు కాదు.
ఏది ఎలా ఉన్న, కుటుంబ ఆర్ధిక పరిస్థితి, వెనుకటి పొ లం కొనుగోలు వ్యవహారం ఆయనలో నిరాశావాదాన్ని
పెంచాయి.
యావనం (1940-1952)
1937 లో కాంగ్రెస్ నుండి విడివడిన కమ్మూనిస్టు లు రెండవ ప్రపంచ యుద్ధ ం సమయంలో (1939-1945)
కార్యక్రమాలను పెంచారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా లో సంపన్న కుటుంబాలవారు కూడా ఉద్యమంలో
పాల్గొ న్నారు. మార్క్స్ ఎంగెల్స్ పుస్త కాలూ బహుళ ఆదరణను పొ ందాయి. నారాయణ రావు గారు కూడా
ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో, 1943 ఏప్రిల్ నెలలో వారికి వివాహమయ్యింది పెనమకూరికి చెందిన
మైనేని రవ్వామణి గారితో. వారికి కూడా సామ్యవాద కుటుంబ వాతావరణం, సభ్యులు ఉండటంతో వీరి
శ్రద్ధా సక్తు లు పెరిగాయి. ఇంతలో స్వతంత్రం వచ్చింది. అప్పటికి దంపతులకు ఇద్ద రు పిల్లలు- బాబురావు
(1944), ప్రమీలారాణి (1947) కలిగారు .తరువాత 1950 లో మూడవ సంతానం నిర్మల ఉదయించింది.
రవ్వామణి వారి తల్లి తండ్రు లకు ఏకైక సంతానం, వివాహ సమాయానికే ఆమె తండ్రి గతించారు . ఆవిడ
తల్లితో పెనమకూరు లో ఉండేవారు. ఈయనకూడా అక్కడే వుంటూ ఇంటల్లు డి స్వేచ్చాసుఖాల్ని కొన్నాళ్ళు
అనుభవించారు.
1948 లో కమ్మూనిస్టు లు నిజాం రాష్ట ం్ర లో సాయుధ పో రాటం చేసిన నేపథ్యంలో దానిని దేశమంతా వ్యాప్తి
చెయ్యాలి అని అనుకున్నారుకానీ ఎలా చెయ్యాలో గుర్తించలేక పొ య్యారు ఆ పార్టీ ముఖ్యులు కృష్ణా జిల్లా
లోనే ఉండేవారు. చండ్ర రాజేశ్వర రావు గారు ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్సి( తరువాత అఖిల
భారతానికి కార్యదర్సి అయ్యారు) ఈ జిల్లా వారే . కేంద్ర ప్రభుత్వం దీనిని సాయుధ తిరుగుబాటులా తీసుకొని
మిలిటరీ ని పో లీసులకి సహాయకారి గా తెప్పించి క్రూ రంగా అణచి వేశారు.ఇల్లిల్లు వెదికేవారు.
సానుభూతిపరులను కూడా వదిలి పెట్టలేదు ఆరోజులలో వారికీ ఆశ్రయం ఇవ్వటం ఆత్మహత్యా
సదృశమయినా వీరు కేవలం సానుభూతి పరుడైనా , ధైర్యం చేసి కొంత మందికి రక్షణ కల్పించారు. ఆఖరికి,
రాష్ట ్ర పార్టీ సమావేశం కూడా ఒక సారి వీరి ఇంట్లో రాజేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వపు
మలబారు పో లీసులు కొద్దీ రోజులలోనే జిల్లా లో 400 మందిని కాల్చివేశారు . ఇంతలో 1952 మొదటి
సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ సందర్బంగా కమ్యూనిస్టు ల మీద ఆంక్షలు తీసివేశారు. ప్రజలలో వారి
యెడల సహానుభూతి కారణంగా తరువాతి ఎన్నికలలో వారి పార్టీ కృష్ణా జిల్లా లో అఖండ విజయం
సాదించింది. ఆంధ్ర రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత 1955 లో కమ్యూనిస్టు లు ప్రకాశం గారి ప్రభుత్వాన్ని పడగొట్టి
మధ్యంతర ఎన్నికలు తెచ్చారు కానీ విజయం వరించలేదు. అప్పటినుండి ఆ పార్టీకి తిరోగమనమే, అది
నారాయణ రావు లాంటి వారికి శరాఘాతమయింది.
చదువుకుందామంటే కుదరలేదు. నమ్మిన సిద్ధా ంతాలు, పార్టీ పో కడలు నిరుత్సాహం కలిగిస్తు న్నది .
ముందునుంచి వున్ననిరాశావాదం విజృంభించి ఆత్మ విశ్వాసాన్ని, నిర్ణ య సామర్ధ్యాన్ని తగ్గించింది.
గార్హస్త్యం (1952-1975)
నిర్మల జననం తరువాత క్రమేపి రవ్వామణి గారి ఆరోగ్యం క్షీణించింది. 1952 ఎన్నికలప్పటి నుండి ఆవిడ
అప్పికట్ల లోనే కాపురం. కొద్దిరోజుల తరువాత వారి తల్లి అన్నపూర్ణ మ్మ కూతురికి సహాయంగా పూర్తిగా
అప్పికట్ల వచ్చేశారు డాక్టర్లు రవ్వామణి గారికి బీ.ఎం.ఆర్. బాగా తక్కువగా ఉందని చెప్పి మందులు
వాడారు . ఆయనని వాసెక్టమీ ఆపరేషను చేయించుకోమన్నారు. అప్పటికి ఆపరేషనుకు సంఘంలో ఏమాత్రం
ఆమోదం లేదు, సరి గదా న్యూనతా భావం ఉంది. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆపరేషన్
చేయించుకున్నారు.
కుటుంబ బాధ్యతలు పెరిగాయి .వ్యవసాయదారులకు సంపాదన ఎలా పెరుగుతుంది? వూళ్ళో వ్యాపార
పంటలు అలవాటు కాలేదు. పైగా ఆయనకు సంపాదించే విద్యలు ఏవీ రావు. కాబట్టి ఒక నిర్ణ యానికి
వచ్చారు ఖర్చు తగ్గించు కోవటమే సంపాదించడమని .
మిత వ్యయం , నకారాత్మక సంవిధానం ఆయన జీవన విధానం అయ్యాయి.
తనకి బాగా ఇష్ట మైన పొ గాకు చుట్ట మాని వేశారు, పిల్లలకు, పెద్దలకు బట్ట లు చిరిగిపో తేనే కొనటం . ఎలాగూ
కమ్యూనిస్టు సిద్ధా ంతం కాబట్టి పండగలకి, పబ్బాలకి ఖర్చు లేదు .దినసరి ఖర్చు అన్నపూర్ణ మ్మ గారి పాడి
సంపాదనతో జరిగి, రోజు వెళ్లి పో యేది. ఒక సంవత్సరం పంట ఒకసారి వస్తే, 365 రోజులు దాని జాగ్రత్తగా
వాడాలి. ఇలా అలోచించి , దానిని అమలులో పెట్టేసరికి, ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంట్లో నూ,
ఊళ్లో నూ, అయినా ఆయన గుండె దిటవుతో దేనిని లెక్క చెయ్య లేదు.
ఏది ఎలా వున్నా జ్ఞా న దాహం మాత్రం తగ్గ లేదు. ఇంట దుష్కర ఆర్ధిక కూపంలోకూడ కొత్త విషయాలు
తెలుసుకోవాలనే కోరిక, అప్పుడే కాదు, ఆజన్మాన్త ం ఆయనతోనే వుంది.
పిల్లలు పెద్దవాళ్ల వుతున్నారు. కొడుకు SSLC (11 వ క్లా సు) స్కూలు ఫస్టు గా పాసయ్యాడు. పై చదువులు
ఎలా? ఆయన కింకర్త వ్యతా విమూధుడయ్యారు ఇంతలో అన్నపూర్ణ మ్మ గారు తన కొంచెం పొ లం అమ్మి
కుటుంబాన్ని ఆదుకున్నారు.
కొడుకు కాలేజి , యూనివర్సిటీ చదువులు ముగిసి 1963 లో సంపాదనపరుడయ్యాడు ఆడ పిల్లలు కూడా
స్కూల్ చదువు పూర్తి చేసారు ప్రమీల కాలేజీ లో ఒక సంవత్సరం చదివిన తరువాత పెళ్లి చేసారు. నిర్మల
డిప్లొ మా లో చేరి పూర్తి చేసింది.
ఈసమయంలో జానకి రామయ్య గారు నారాయణ గారిని రాయగడ వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు అమ్మే పొ లాలు
ఇతరులతో కలిసి కొని వ్యవసాయం చేయమన్నారు.ఈయన అంగీకరించారు. బ్యాంకులు ఆర్థిక సహాయం
చేసాయి కాలక్రమేణా 1965 లో నారాయణ గారు, రవ్వామణి గారు అక్కడికి తరలి వెళ్లా రు. అప్పికట్ల
పొ లాలు ఆప్త జ్ఞా తులు కొడాలి రాధాక్రిష్ణయ్య గారు , వారి కుమారుడు రాజా రామమోహనరావు గారు
చూచేవారు
70 వ దశకంలో నిర్మలకు , బాబూరావుకు పెళ్లి ళ్లు అయినాయి, తర్వాత 1975 లో రుణవిముక్తు డనయ్యానని
ఆయన భావించారు.
వారసత్వం
నారాయణ రావు గారి వలన వారి బిడ్డ లకు సంక్రమించిన గుణాలు /విధానాలు
1. జ్ఞా న సంపాదనకు పెద్ద పీట, వస్తు , వస్త ,్ర హిరణ్య మోహ రాహిత్యము
2. ఆర్ధిక క్రమశిక్షణ - ఉన్న దానితో సరిపెట్టు కోవడం
3. సాహస ప్రవృత్తి పట్ల విముఖత(Risk averse ), ఉన్నది చాలు, పో గు చెయ్యక్కరలేదు - అనే స్వభావం
4. యోగం కన్నా క్షేమం ముఖ్యం ,సంపాదించటం కన్నా ఉన్నది జాగ్రత్త చేసుకోవడం అనే పధ్ధ తి
5. ఆతిధేయిగా ఆనందం అల్పం
6. ఇవ్వటం లో కలిగే పరస్పర ఆనందం మితం
7. తోటివారిలా వస్తు సంగ్రహణలో ఉత్సాహం లేకపో వడం
8. వినిమయ తత్వ (consumerism ) విముఖత
లౌకికదృష్టితో చూస్తే ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రగతి సాధనాలు కాని , పరిణామశీల సామాజిక అవసరాలకు
సహాయకారులు కావు
అన్నట్టు ముందు ఉన్న ఇంగ్లిష్ పద్యం ఆయనే వారి అబ్బాయికి నేర్పించారు. విచిత్రమేమిటంటే ఆయన
చదివింది 7 వ తరగతి, వారి అబ్బాయి చదువు మొదలే 8 వ తరగతి తో
పద్యానికి స్వేచ్చానువాదం
అంతుతెలియని సాగరాంతరాల చీకటి లోతుల్లో
స్వఛ్చచ్ఛవిమయ రత్నమణిపవ
్ర ాళాలు ఎన్నో,ఎన్నెన్నో
సువిశాల నిర్మానుష్య సైకతపు ఎడారి గోతుల్లో
వికసించి నశించే సౌగంధ పుష్పాలు ఎన్నో,ఎన్నెన్నో
Gray గారి పద్యంలో చెప్పినట్లు నారాయణ రావు గారు అగాథ సంద్రంలో అజ్ఞా తంగా ఉన్న ఆణిముత్యమో ,
మరుభూమిలోని అనాఘ్రా త సౌరభ సుమమో కాలమే నిర్ణ యిస్తు ంది