Professional Documents
Culture Documents
Home National Real Bharat Ratnam
Home National Real Bharat Ratnam
Home National Real Bharat Ratnam
O
HOME » NATIONAL » REAL BHARAT RATNAM
మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో
ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం.ఫో న్|| 9390 999 999, 8008 56 7898
మౌన ముని..
ఆయన మాటల మనిషి కాదు. చేతల మనిషి. సముద్రమంత లోతైన మనసున్న లోపలి మనిషి.
పదిహేడు భాషలు
‘పలుకు’ను బంగారం కన్నా పొ దుపుగా వాడి మాటకున్న శక్తిని మౌనంగానే నిరూపించిన అపర బృహస్పతి.
సంక్షోభంలో చిక్కుకుని.. అదుపు తప్పిన ద్రవ్యోల్బణ సుడిగుండంలో పడి
నిప్పులగుండంలాంటి నిత్య
ముఖ్యమంత్రిగా ఇక్కడ భూసంస్కరణలు.. ప్రధానిగా అక్కడ ఆర్థిక సంస్కరణలతో పచ్చటి భవితకు బాటలు వేసిన
చాణక్యుడు!
ఇన్ని మాటలేల.. భరతమాత సిగను ధరించిన నిజమైన రత్నం పీవీ! ప్రభుత్వం ఇప్పుడిచ్చిన భారతరత్న పురస్కారం
లాంఛనమే!!
సంస్కరణల సారథి
పీవీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రా రంభించారు. ఆయన పగ్గా లు
చేపట్టేనాటికి మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అంతర్జా తీయ ఏజెన్సీలు భారత
ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సూచించాయి. విదేశీ రుణాలు పుట్టడం కష్టతరమైంది. రుణ
చెల్లింపులను వాయిదా వేయడం కూడా గగనమైంది. ద్రవ్యలోటు జీడీపీలో 8 శాతానికి,
విదేశీ అప్పులు జీడీపీలో 41 శాతానికి చేరుకోవడంతో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో
మునిగి ఉన్నదని, దిగుమతులకు చెల్లించడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం
రెండువారాలకు మాత్రమే సరిపో తాయని ఆయన గమనించారు. ఇలాంటి దుర్భర
పరిస్థి తుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ సాహసో పేతంగా వాటిని అమలు చేసి
దేశంలో నూతన ఆర్థిక సంస్కృతికి ఒరవడి దిద్దిన నేత నరసింహారావు. దేశంలో ప్రజల
జీవన నాణ్యత పెరుగుదల పీవీ చలవేనంటే అతిశయోక్తి కాదు. అలాగే.. ఈ సంస్కరణల
అమలు క్రమంలో ఆయన ఎన్నో సాహసో పేత నిర్ణయాలు తీసుకుని ఎన్నో పథకాలకు
ఆద్యుడుగా నిలిచారు. ప్రధానమంత్రి రోజ్గార్యోజన, ఎంపీ లాడ్స్పథకం, పార్లమెంటు
స్థా యీసంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టడం వంటివి ఇందుకు ఉదాహరణలు. ఆర్థిక
సంస్కరణలను అమలు చేసేవిషయంలో పీవీ.. మన్మోహన్సింగ్ను ఒక ఉపకరణంగా
మాత్రమే ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన వెంటనే
ఆయన.. అప్పటి క్యాబినెట్సెక్రటరీ నరేశ్చంద్ర, ఫైనాన్స్సెక్రటరీ ఎస్.పి.శుక్లా , ప్రధాన
ఆర్థిక సలహాదారు దీపక్నయ్యర్ను పిలిచి దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఆర్థిక
మంత్రిగా రాజకీయ నాయకుడిని కాక ఒక ఆర్థిక వేత్త ను నియమించాలని
నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన తనకు సన్నిహితుడైన పీసీ అలెగ్జాండర్
(ఇందిరాగాంధీ కాలంలో ప్రిన్సిపల్సెక్రటరీ) సలహా తీసుకున్నారు. తొలుత లండన్
స్కూల్ఆఫ్ఎకనమిక్స్డైరెక్టర్, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ఐజీ పటేల్
(ఇంద్రవదన్గోవర్థన్భాయి పటేల్)ను ఆర్థిక మంత్రిగా నియమించాలనుకున్నారు. కానీ
ఆయన అందుకు అంగీకరించపో వడంతో మన్మోహన్సింగ్ను ఎంపిక చేశారు.
ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపో యాక 2018 డిసెంబర్లో తన పుస్త కం ‘ఛేంజింగ్
ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా మన్మోహన్సింగ్మాట్లా డుతూ.. తాను
యాదృచ్ఛికంగా ఆర్థిక మంత్రిని అయ్యానన్న విషయాన్ని అంగీకరించారు.
నిర్ణయం తీసుకోకపో వడమూ..
పీవీ హయాంలో పృథ్వి, అగ్ని క్షిపణి పరీక్షలు జరిగాయి. పృథ్వి క్షిపణితో ఇస్లా మాబాద్
పై దాడి చేయగల శక్తి సమకూర్చుకుంటే.. అగ్ని క్షిపణితో చైనాపై కూడా దాడి చేయగల
సామర్థ్యాన్ని సంపాదించుకున్నాం. 1995 డిసెంబర్లో అణు పరీక్షలకు కూడా పీవీ
రంగం సిద్ధం చేశారు. ఆ విషయాన్ని అమెరికా పసిగట్టడంతో వాటిని తాత్కాలికంగా
వాయిదా వేసి ఆ బాధ్యతను వాజపేయికి అప్పజెప్పారు. పీవీ మరణించిన తర్వాత
వాజపేయి ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తూ ఈ విషయాన్ని చెప్పారు ‘‘అణు పరీక్షల
నిజమైన ఘనత పీవీదే. ఆయనే అణు పరీక్షలకు సిద్ధం చేసి.. ‘సామాగ్రి తయార్హై’
అని నాకు చెప్పారు..’’ అని గుర్తు చేసుకున్నారు.
ఐక్యరాజ్యసమితికి వాజపేయిని పంపి..
అభివృద్ధి మీకొద్దా ?
చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా పలు
ప్రాంతాల్లో రోడ్ల విస్త రణ చేపట్టా రు. ఈ రోడ్ల విస్త రణ కారణంగా నష్టపో తున్న పీవీ
సన్నిహితులు, బంధువులు కొందరు.. ‘ఈ సీఎంకు చెక్పెట్టా లంటే పీఎంను
కలవాల్సిందే’ అనుకుంటూ ఢిల్లీ బాట పట్టా రు. తన ఇంటికి వచ్చినవారిని సాదరంగా
ఆహ్వానించిన పీవీ.. వారు వచ్చిన పని గురించి అడిగి తెలుసుకున్నారు. అంతా
మౌనంగా విని.. పార్లమెంటు నుంచి వచ్చాక సాయంత్రం వారితో సావకాశంగా
మాట్లా డతానని చెప్పారు. ఈలోగా ఢిల్లీ చూసి రావాలంటూ వారికి ఒక ఏసీ వాహనం
ఏర్పాటు చేశారు. వారు ఆ వాహనంలో ఢిల్లీని చుట్టబెట్టి సాయంత్రా నికి పీవీ ఇంటికి
చేరారు. అప్పటికే ఇంటికి వచ్చి ఉన్న పీవీ.. ‘వచ్చారా. ఢిల్లీ బాగుందా?’ అని అడిగారు.
అందరూ ముక్తకంఠంతో.. ‘చాలా బాగుంది’ అని చెప్పారు. ‘మరి ఇలాంటి రోడ్లు
కావాలన్నా.. మీ ఊరు అభివృద్ధి చెందాలన్నా రోడ్ల విస్త రణ చేయాల్సిందే కదా?’ అని
అడగడంతో వారి వద్ద సమాధానం లేకపో యింది.
సాహితీ మూర్తి
యుగయుగాల అన్యాయం
నగుమోముల దిగమ్రింగగ
పీఠాధిపతి అవుదామనుకుంటే..
సంస్కరణలు ఎందుకంటే..
సర్వనాశే సముత్పన్నే..
కంప్యూటర్భాషలూ..