Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 13

Sub: తెలుగు Topic: మాతృభావన

Grade:10 Name: _______________________________ Date:

Learning Objective: ప్రశ్నలు -జవాబులు

I. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్త్రీలను గౌరవించాలనే ఉదాత్త సందేశాన్నిచ్చిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి. (March 2015)
జవాబు:
1. కవి, కాలము : కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు, (1894-1980) ఆధునిక కాలము, కడపజిల్లా , జమ్మల మడుగు
తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రా మ వాస్త వ్యులు.
2. రచనలు : మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి.
3. బిరుదు : కవితా వతంస / కవిసింహ | అవధాన పంచానన
4. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖులు, శతావధాని, బానిసత్వాన్ని నిరసించారు.

ప్రశ్న 2.
మాతృభావన నేపథ్యం వ్రా యండి.
జవాబు:
కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చాడు.
శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దా రు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని రాణివాసాన్ని కూడా బంధించి
తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత పాఠ్యభాగం మొదలవుతుంది.

ప్రశ్న 3.
మాతృభావన రచయిత గూర్చి వ్రా యండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసంలోనిది
ప్రస్తు త పాఠ్యాంశం.

శాస్త్రిగారు కడప జిల్లా లోని జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్ళ దిన్నె గ్రా మానికి చెందిన వారు. వారి తల్లిదండ్రు లు
నరసమాంబ, రామయ్యగార్లు , శాస్త్రిగారు ప్రొ ద్దు టూరు మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశారు. శాస్త్రిగారు
శతావధాని. వీరు మరొక శతావధానియైన రాజశేఖర శతావధాని గారితో కలిసి, కావ్యనాటకాలు రచించారు.
ప్రశ్న 4.
మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గూర్చి వ్రా యండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శివభారతంలోని తృతీయాశ్వాసం నుండి
ప్రస్తు త పాఠ్యాంశం గ్రహించబడింది.

గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతం” గుర్తు కు వస్తుంది. బానిసత్వాన్ని నిరసించి, స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన
మహాకావ్యం శ్రీ శివభారతం.

మురారి, పుష్పబాణ విలాసం, మల్లికామారుతం, శ్రీనాథ కవితా సామ్రా జ్యం, రఘునాథీయం మొదలైన అనేక గ్రంథాలు
శాస్త్రిగారు రచించారు.

శాస్త్రిగారికి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను సాహితీ విమర్శకులు ఇచ్చారు.

ప్రశ్న 5.
‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు’ అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
గడియారము వేంకటశేషశాస్త్రి కవిగారు ‘మాతృభావన’ అనే పాఠంలో, భారతదేశంలో అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి
పతివ్రతలున్నారని వారు పుట్టింటిని, మెట్టింటిని తమ పాతివ్రత్యంతో రక్షించారని చెప్పారు.

‘కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం. స్త్రీలు భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే
కల్పవృక్షాల వంటి వారని కవి ఉద్దే శ్యం.

స్త్రీలను గౌరవిస్తే భారతదేశం సౌభాగ్యముగా సర్వసంపదలతో సుఖంగా ఉంటుందని కవి ఉద్దే శ్యం.

ప్రశ్న 6.
శివాజీ స్త్రీలపట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారిని గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
శివాజీ స్త్రీల పట్ల గౌరవభావం చూపినట్లే , మా గ్రా మ సర్పంచి కూడా స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు. వారు ఎదురు పడితే
మాతృభావంతో మెలిగేవాడు. గ్రా మంలోని స్త్రీలను ఎవరైనా ఏమన్నా వేధించడానికి చూస్తే ఊరుకొనేవాడుకాదు. వాళ్ళకు
తగినబుద్ధి చెప్పేవాడు. ఇతర స్త్రీలను మన తల్లిలాగా, సో దరిలాగా భావించి గౌరవించాలని బో ధించేవాడు.

ప్రశ్న 7.
“స్త్రీలు పూజ్యనీయులు” అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
జవాబు:
సో దేవుడు కళ్యాణి దుర్గా న్ని జయించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీని కూడా, ఆ సర్దా రుతో పాటు బంధించి తెచ్చాడు. అది
చూసి శివాజీ కోపంతో ఉగ్రు డైనాడు. స్త్రీలను తల్లు లలాగా, తోబుట్టు వుల్లా గా గౌరవించాలనేది శివాజీ అభిప్రా యం.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు ఈ భరతమాత కన్నబిడ్డ లు.
అగ్నిజ్వాలల వంటి స్త్రీలకు అపచారం చేసేవారు ధ్వంసమైపో తారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు
పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానమూ చేయకూడదనేది శివాజీ మాటల వెనుక ఆంతర్యం.

ప్రశ్న 8.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. శివాజీ :
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తా డు. స్త్రీలకు అవమానం జరిగితే
సహించడు. స్త్రీలకు కష్టా న్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తా డు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.

2. సో న్ దేవుడు :
శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తు లు కలవాడు. ‘కళ్యాణి’ దుర్గం జయించాడు.
రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డా డు. క్షమార్పణ చెప్పి శాంతింపజేశాడు. తన తప్పును తాను
తెలుసుకొని పశ్చాత్తా పపడే స్వభావం కలవాడు.

ప్రశ్న 9.
మీ తోడి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తా వు?
జవాబు:
మేము మా తోడి బాలికలను అక్కలుగా, చెల్లె ళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తా ము. వారికి ఏ సహాయం
కావలసినా, మేము మాతోడి బాలురతో కలిసి సాయం చేస్తా ము. మా తోడి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి
తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తా ము. ఎవరైనా ఆకతాయి, అల్ల రి పిల్ల లు, వారిని అల్ల రి
పెడితే, మేము ఆ పిల్ల లను బెదరించి వారిని తరిమి వేస్తా ము. అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తా ము. మా
తోడి బాలికలకు స్వంత అన్నదమ్ములవలె మేము చేదో డు వాదోడుగా నిలబడతాము.

అవసరం అయితే వారి కోసం మేము మా ప్రా ణాలు కూడా ఇచ్చి సాయం చేస్తా ము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము .

ప్రశ్న 10.
పుట్టినిల్లు , మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెట్టిన కొందరు స్త్రీలను గురించి వివరించండి.
జవాబు:
అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తన పాతివ్రత్యంతో, త్రిమూర్తు లను చంటిబిడ్డ లుగా చేసి, వారికి జోలపాట పాడింది.
సావిత్రి అనే ఇల్లా లు యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రా ణాన్ని రక్షించుకొంది. సీతా మహాదేవి, భగభగమండే అగ్ని
గుండంలో దూకి, పూలరాశిలో తిరిగినట్లు బయటకు సురక్షితంగా వచ్చింది. సుమతి అనే పతివ్రత తన భర్త ప్రా ణాలను
రక్షించడం కోసం, సూర్యుడు ఉదయించకుండా సూర్యోదయాన్ని నిలిపి వేసింది. ఈ ఇలా ఎందరో భారతీయ స్త్రీలు, తమ
పాతివ్రత్య భాగ్యంతో, తమ పుట్టింటికీ, అత్త వారింటికీ కీర్తిని తెచ్చి,
గౌరవాన్ని నిలబెట్టా రు. ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

10th Class Telugu 1st Lesson మాతృభావన 4 Marks Important


Questions and Answers
ప్రశ్న 1.
“స్త్రీలు పూజింపదగినవారు వారికి ఏ అవమానం చేయకూడదు” అని చాటి చెప్పిన శివాజీ వ్యక్తిత్వాన్ని “మాతృభావన” పాఠం
ద్వారా విశ్లేషించండి. (S.A. I – 2018-19)
జవాబు:
వ్యక్తిత్వం అంటే మాటకూ, చేతకూ తేడా లేనితనం. శివాజీ పరస్త్రీలను సైతం కన్నతల్లు లవలె, సో దరీమణులవలె చూసి
గౌరవించేవాడు. శివాజీ ధర్మప్రభువు. శత్రు దుర్గా లపై దండెత్తి నపుడు అక్కడ ఉండే స్త్రీలకూ, బ్రా హ్మణులకూ అపకారం తల
పెట్టవద్దని, తన సర్దా రులను హెచ్చరించేవాడు.

తన సర్దా రు సో దేవుడు కళ్యాణి దుర్గా న్ని జయించినా, అతడు యవనకాంతను బంధించి తెచ్చినందుకు అతడిపై శివాజీ
కోపపడ్డా డు. వెంటనే ఆ యవనకాంతను విడిపించి, తన సర్దా రు తొందరలో తప్పు చేశాడనీ, తనను క్షమించమనీ ఆమెను
కోరాడు. ఆమెను సత్కరించి తనవారిని తోడిచ్చి, ఆమెను ఆమె ఇంటికి తిరిగి పంపాడు.

శివాజీ క్షమామూర్తి, తప్పు చేశానని అంగీకరించిన సో దేవుడిని క్షమించాడు. శివాజీ స్త్రీలపై అత్యధిక గౌరవం కలవాడు.
పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని, వారు అగ్నిజ్వాలల వంటివారని, స్త్రీలకు అపచారం చేస్తే నశిస్తా రనీ, వారి సంపదలు
నశిస్తా యనీ శివాజీ తలంచేవాడు. శివాజీ శత్రు వులను సైతం అవమానించని ధర్మమూర్తి. శివాజీది మహో న్నత వ్యక్తిత్వం.

ప్రశ్న 2.
‘మాతృభావన’ పాఠ్యాంశం ఆధారంగా దానిని రచించిన కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
మాతృభావన పాఠం ‘శివభారతము’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యాన్ని గడియారం వేంకటశేషశాస్త్రి గారు రాశారు. శివభారతము
బానిసత్వాన్ని నిరసించి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన కావ్యం.

శివాజీ హిందూమత ధర్మంపై గొప్పభక్తి గౌరవాలు కలవాడు. స్త్రీలందరినీ, కన్నతల్లు ల వలె శివాజీ గౌరవించాడు.

గడియారంవారు కూడా, గొప్ప దేశభక్తు లు. శివాజీ వంటి దేశభక్తు లైన చారిత్రక పురుషులపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు.
గడియారంవారు శివభారతము రచించే రోజుల్లో మన దేశానికి స్వాతంత్ర్యము రాలేదు. అందుకే మన భారతీయులలో
స్వాతంత్ర్యంపై కోరికను ఉద్దీ పింపజేయడానికి శివభారతాన్ని గడియారం వారు వ్రా శారు.
ఈ పాఠాన్ని బట్టి గడియారంవారు, గొప్ప దేశభక్తు లని, హిందూమతంపై భక్తి గౌరవాలు కలవారని, గొప్ప స్వాతంత్ర్య వీరులనీ,
మహాకవులనీ మనం గ్రహించగలము. వీరు స్త్రీల పై గౌరవం కలవారు.

అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు గడియారం వారు.

ప్రశ్న 3.
సో న్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
జవాబు:
అబ్బాజీసో దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సో దేవుడు, శివాజీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా
పాటిస్తా డు. శివాజీ, సో దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సో దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం
కల్యాణి దుర్గా న్ని జయించి, దాని సర్దా రులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా
బంధించి వెంట తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సో న్ దేవునిపై మండిపడ్డా డు.

వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సో దేవుడిని ఆజ్ఞా పించాడు. రాజభక్తి గల సో
దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సో దేవుడు,
శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన
లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సో న్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సో న్ దేవుడు గొప్ప
రాజభక్తి కల సర్దా రు.

ప్రశ్న 4.
సో న్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దు కొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
జవాబు:
సో న్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సో న్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సో న్
దేవుడు కల్యాణి దుర్గా న్ని జయించి, దాని సర్దా రును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ
వద్దకు తీసుకువచ్చాడు.

పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ
మహారాజు సో న్ దేవునిపై ఉగ్రు డయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తు ల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సో న్
దేవుడిని ఆజ్ఞా పించాడు.

సో న్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దు కొనే స్వభావం కలవాడు. అందువల్ల నే సో న్ దేవుడు మరో మాట మాట్లా డకుండా,
తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని
బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి
సో న్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దు కొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.
ప్రశ్న 5.
శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం
కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రా యము. అందుకే కళ్యాణి దుర్గంలోని
అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సో దేవుడి పై శివాజీ మండిపడ్డా డు. వెంటనే ఆమెను విడిపించి,
ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తా నన్నాడు.

స్త్రీలు భారతభూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి
పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్త వారింటికీ కీర్తిని తెచ్చారని, శివాజీ మెచ్చుకున్నాడు.

పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తా రనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ శివాజీ చెప్పాడు.
స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రా యపడ్డా డు.

ప్రశ్న 6.
శివాజీ యవనకాంతను ఎందుకు క్షమాపణ కోరాడో వివరించండి.
జవాబు:
శివాజీ, సో దేవుడు అనే సైన్యాధిపతిని కల్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. శివాజీ దండయాత్రకు తన సైన్యాన్ని
పంపేటప్పుడు, పతివ్రతలయిన స్త్రీలకు ఎటువంటి అపచారము చేయవద్దని వారిని హెచ్చరించేవాడు.

కాని సో దేవుడు కళ్యాణి దుర్గా న్ని జయించిన ఉత్సాహంతో, దాని సర్దా రునూ, అచటి అంతఃపురకాంతలనూ బంధించి
తెచ్చాడు. అంతఃపుర స్త్రీలను బంధించి తీసుకురావడం తప్పని శివాజీ అభిప్రా యము.

పతివ్రతలయిన స్త్రీలు అగ్నిజ్వాలల వంటివారని, వారిపట్ల అపచారం చేసేవారు, సంపదలు పో గొట్టు కొని సర్వనాశనం
అవుతారనీ, వారి వంశం కూడా నిలువదనీ, శివాజీ అభిప్రా యము. పతివ్రతలు భారతదేశపు భాగ్య కల్పలతలని శివాజీ,
నమ్మకము.

అందుకే శివాజీ తన సర్దా రు తొందరపడి తప్పు చేశాడనీ, ఆ దోషానికి బాధపడవద్దనీ, తన తప్పును క్షమించమనీ
యవనకాంతను కోరాడు. ఆమెను తన తల్లిగా, చెల్లె లుగా భావించి, తన చేతులపై ఆమెను నడిపిస్తా ననీ, ఓర్పు చూపించి,
తనను సహించి క్షమించమనీ శివాజీ ఆమెను కోరాడు.

ప్రశ్న 7.
సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లు లుగా, తన సో దరీమణులయిన అక్కాచెల్లెండ్రు గా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తి తో
చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తా రో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా
చూడాలి.

ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సో దరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు .
చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తికొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి,
పో రాడాలి. అవసరం అయితే పో లీసులకు తెలియజేయాలి.

స్త్రీలు అందరూ మనకు తల్లు లవంటివారు. స్త్రీలు, పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తా రు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా,
ఇంకొకరికి కన్నబిడ్డ గా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు.
వారు అనల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే , వారి వంశమూ, సంపదలూ నశిస్తా యి. కాబట్టి స్త్రీలను
దేవతామూర్తు లవలె, మాతృమూర్తు లవలె గౌరవించాలి.

ప్రశ్న 8.
నిజ జీవితంలో స్త్రీలను ఎప్పుడు ఎలా గౌరవించాలో వివరించుము.
జవాబు:
స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. స్త్రీలలో చిన్న పిల్ల లను మనం ప్రేమగా చూడాలి. బాలికలను మనం కన్నబిడ్డ ల వలె
ఆదరించాలి. తోడి బాలికలను మన స్వంత అక్కాచెల్లె ళ్ళ వలె ప్రేమతో ఆదరంగా చూడాలి. మనకంటే పెద్దవారైన ఆడవారిని,
మన కన్నతల్లు లుగా చూసి గౌరవించాలి..

సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న స్త్రీలను దేవతా మూర్తు లుగా గౌరవించాలి. ప్రహ్లా దుడు పరస్త్రీలను మాతృమూర్తు లుగా
భావించి గౌరవించేవాడు. స్త్రీలు ఆపదలో ఉంటే, మన శక్తియుక్తు లను అన్నింటినీ ధారపో సి, వారికి మనం సహాయం చెయ్యాలి.
మన బడిలో మనతో చదువుకొనే బాలికలను, మన చెల్లె ళ్ళవలె వాత్సల్య భావంతో చూడాలి. వారికి కావలసిన సహాయం
చేయాలి. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. స్త్రీలు శక్తి స్వరూపిణులు. స్త్రీల పట్ల సర్వకాల సర్వావస్థలలోనూ గౌరవమూ, ప్రేమ,
వాత్సల్యమూ, ఆదరమూ కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవిస్తే సకల సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది. అన్ని విద్యలను సరస్వతి
ఇస్తుంది.

మాతృభావన Important Questions and Answers

ప్రశ్న 1.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో, వివరిస్తూ మీ మిత్రు నకు లేఖ రాయండి.
జవాబు:

మిత్రు నకు లేఖ

రాజమహేంద్రవరం,
xxxxx

ప్రియ మిత్రు డు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీ లేఖ అందింది. సమాజంలోని స్త్రీల పట్ల మనం ఎలా నడచుకోవాలో ఈ లేఖలో
నీకు రాస్తు న్నా.

స్త్రీలు దేశ సౌభాగ్యానికి కల్పలతల వంటివారు. స్త్రీలు, కన్నబిడ్డ లు, కన్నతల్లు లుగా, సో దరీమణులుగా మనకు
ప్రేమాదరములను పంచిపెడుతున్నారు. నేడు సంఘంలో స్త్రీల పట్ల అపచారాలు పెరుగుతున్నాయి. స్త్రీలపట్ల
అపచారం చేసేవారిని నిర్భయ చట్టంతో శిక్షించాలి.

మనము తోటి స్త్రీలను మన అక్కాచెల్లె ళ్ళుగా చూడాలి. మన తోటి చిన్నవారైన బాలికలను ప్రేమగా లాలనగా
చూడాలి. పెద్దవారైన స్త్రీలను మన తల్లు లవలె చూసి వారిని గౌరవించాలి. స్త్రీలను గౌరవిద్దాం. సంఘాన్ని కాపాడుదాం.

ఇట్లు ,
నీ మిత్రు డు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10 వ తరగతి, మునిసిపల్ హైస్కూలు,
కుప్పం, చిత్తూ రు జిల్లా , ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
స్త్రీలకు ధైర్యాన్ని పురికొల్పుతూ, ఒక కరపత్రా న్ని తయారుచేయండి.
జవాబు:
సో దరీమణులారా ! ఈ రోజుల్లో మీ పై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ అరాచకాలను చూసి మీలో
కొందరు పాఠశాలలు, కళాశాలలు మాని, ఇళ్ళల్లో నే ఉండిపో తున్నారు. సంఘంలో స్త్రీలు కూడా పురుషులతో అన్ని విధాల
సమం. దేశంలో మీరు ఇంచుమించుగా 50% మంది ఉన్నారు. మీరు నిర్భయంగా ముందుకు వచ్చి మీ స్నేహహస్తా న్ని
అందించకపో తే, సంఘాభివృద్ధి కుంటుపడుతుంది.

మీరు నిర్భయంగా ముందుకు రండి. మీకు మేము తోడుగా ఉంటాం. పో లీసులు తోడుగా ఉంటారు. నిర్భయ చట్టం వచ్చింది.
ఆకతాయి వారిని నిర్దా క్షిణ్యంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫో టో కెమేరాలు వచ్చాయి. దుండగులు ఎంతటి వారైనా దొరుకుతారు.
శిక్ష పడుతుంది. మీరు శక్తి స్వరూపిణులు. ధైర్యమే మీ ఆయుధం.
మేము మీకు రామదండులా తోడు ఉంటాము. నేరస్తు లను పట్టు కొని ప్రభుత్వానికి అప్పచెపుతాము. మేము అంతా మీ
అన్నదమ్ముల్లా మీకు సాయం చేస్తా ము. నిర్భయంగా మీరు సంఘంలో తిరిగి హాయిగా మీ చదువులు సాగించండి.
దేశాభివృద్ధి కి మీ చేయూత నివ్వండి. రండి. సాహసించండి.

ఇట్లు ,
గాంధీ ‘యువజన సంఘం,
కాకినాడ.

ప్రశ్న 3.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తా రు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డ లను కని, వారిని చక్కగా పెంచి,
విద్యాబుద్ధు లు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్ల లకూ కడుపు నింపుతుంది.
బిడ్డ లను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డ లకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో
ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది.

దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికీ, కుటుంబ
రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొ దుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి
తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పో షిస్తు న్నారు. నేడు
పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లు లుగా, అక్కాచెల్లె ళ్ళుగా గౌరవించాలి.

స్త్రీలు పిల్ల లను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధు లు నేర్పిస్తా రు. పిల్ల లకు, కన్నతల్లు లే మొదటి గురువులు. స్త్రీలు
విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లు గా, ఇంజనీర్లు గా, MLA లుగా, MP లుగా
ముఖ్యమంత్రు లుగా దేశ సేవ చేస్తు న్నారు.

స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తు న్నారు. దేశాభివృద్ధి కి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత
నిస్తు న్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధి కైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు
మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.

ప్రశ్న 4.
‘స్త్రీ గౌరవం’ అనే అంశంపై ఒక వ్యాసం వ్రా యండి.
జవాబు:
స్త్రీ గౌరవం,

‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు
ఆనందంతో నాట్యం చేస్తా రని అర్థం. కాబట్టి స్త్రీలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు అంటే లక్ష్మి, సరస్వతి,
గాయత్రి, శివుడు, విష్ణు వు మొదలైనవారు. వారంతా కొలువై ఉంటే డబ్బుకు, చదువుకు, ఆనందానికి, ఆరోగ్యానికి
లోటుండదు.

మనకు జన్మనిచ్చిన స్త్రీని తల్లిలా పూజించాలి. గౌరవించాలి. తల్లి ఆలన పాలన చూడకపో తే శ్రీ రామచంద్రు డైనా లేడు కదా! 9
నెలలు తన కడుపులో మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లిఋణం తీర్చుకోవటం మగజన్మకు సాధ్యంకాదు. కాని సమాజంలోని
ప్రతి స్త్రీలోను తల్లిని దర్శించడం ద్వారా కొంత ఋణం తీరుతుంది.

‘స్త్రీలను గౌరవించాలి. వారి మనసుకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. స్త్రీల మనసు సుకుమారమైనది. స్త్రీకి కోపం కలిగేలా
ప్రవర్తిస్తే నాశనం తప్పదు. రావణుడు, దుర్యోధనుడు మొదలైనవారు అలాగే నశించారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్ల దు’ అన్నారు పెద్దలు. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరవు,
కాటకాలు, దరిద్రం వస్తా యి.

అందుకే శివాజీ వంటి గొప్పవారు స్త్రీలను గౌరవించారు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రా లు చదివిన వారెవ్వరూ
స్త్రీని బాధపెట్టే సాహసం చేయరు. ఇది భారతీయతత్వం.

ఇవేవీ నమ్మని వారు కూడా గుర్తు పెట్టు కోవలసినది మన చట్టా లు. చట్ట ప్రకారం స్త్రీని బాధిస్తే చాలా కఠిన శిక్షలకు గురి
అవుతారు. సమాజంలో వెలివేయబడతారు. అందుచేత స్త్రీలను గౌరవించడమంటే మనను మనం గౌరవించుకోవడం అని
గుర్తు పెట్టు కోవాలి.

ప్రశ్న 5.
స్త్రీల చైతన్యంపై 10 నినాదాలు తయారుచేయండి.
జవాబు:

1. అబలలన్నది పాతమాట – సబలలన్నది నేటిమాట


2. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
3. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు – స్త్రీలు పూజ్యార్హలు
4. ఆడది చదువుకుంటే – ఆ ఇంట్లో సంస్కారం ఉంటుంది
5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
6. స్త్రీలను అవమానిస్తే – శ్రీదేవిని కాలదన్నినట్లే
7. చదివిస్తే స్త్రీలు – నేర్వలేని విద్యలేదు
8. ఆడవాళ్ళను – అగ్రస్థా నంలో ఉంచండి
9. మహిళలు – మన జాతి మాణిక్యాలు
10. వనితలన్న – నీవు ఎపుడు తల్లి చెల్లిలాగ చూడు
ప్రశ్న 6.
“మహిళల రక్షణ మన కర్తవ్యం” అనే అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
(“మహిళల రక్షణ మన కర్తవ్యం “)

సో దర సో దరీ మణులారా ! చెప్పడానికి, సిగ్గు వేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ మన మహిళలకు అవమానం నిత్యం
జరుగుతూనే ఉంది. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. యాసిడ్, దాడులు, ఈవ్
టీజింగ్లు , హింసాకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మన ఇంట్లో మన తల్లిని, అక్క చెల్లె ళ్ళను మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన ప్రక్క మహిళలను సైతం, మనమే
రక్షించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే, లోకం సహించదు అనే విషయం దుర్మార్గు లకు తెలియాలి.

మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీరు సహించకండి. ఉగ్రనరసింహరూపం ఎత్తి అన్యాయాన్ని అరికట్టండి. అవసరం
అనుకుంటే ప్రక్కవారి సాయం తీసుకోండి. పో లీసుల సాయం కోరండి. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

మనం అంతా ఉద్యమిస్తే నే, మన మహిళకు రక్షణ దొరుకుతుంది. మనం మహిళలను గౌరవించి, మన పవిత్ర భారతమాత
ఖ్యాతిని నిలుపుకుందాం. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

జైహింద్

ప్రశ్న 7 .
శివాజీకి, సో న్ దేవుడికి మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
శివాజీ : సో న్ దేవా ! ఏంటీ ! రాణివాసాన్ని బంధించి తెచ్చావా? హిందువు అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తా డా? నా ఆజ్ఞ నీకు
గుర్తు లేదా? అర్థం కాలేదా? చావాలని అనుకుంటున్నావా? నీ గర్వాన్ని ఎంతమాత్రం
సహించను. తక్షణం వెళ్ళి వారి బంధాలు విడిపించి తీసుకురా! వెళ్ళు.

సో న్ దేవుడు : చిత్తం మహారాజా !

శివాజీ : వెంటనే వెళ్ళు

సో న్ దేవుడు : (అంతఃపుర కాంతను తీసుకువచ్చి) అయ్యా (ప్రభూ!) నన్ను క్షమించండి. విజయోత్సాహంతో నా కళ్ళు
మూసుకుపో యాయి. చెడ్డ చేయాలనే ఆలోచన నాకులేదు. మీ ఆజ్ఞ అతిక్రమించాలనే సాహసం లేదు. మీ పాదాలపై ఒట్టు .

శివాజీ : సో న్ దేవా! తప్పు చేశావు. స్త్రీలను పూజించాలి. వారిని అవమానించకూడదు. నా సైన్యాధిపతులు ఈ విషయాన్ని
బాగా గమనించాలి. సరేలే నీ మనస్సు నేను గ్రహించాను. నీలో తప్పులేదు. ఇక ముందు జాగ్రత్త . వెళ్ళు.
ప్రశ్న 8 .
స్త్రీలను దేవతలుగా భావించి పూజించాలి’ అనే మాటలను సమర్ధించండి.
జవాబు:
గడియారం వేంకటశేష శాస్త్రిగారు చెప్పినట్లు స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు. అనసూయ పాతివ్రత్యంతో త్రిమూర్తు లను
పురుటి బిడ్డ లుగా చేసి వారికి జోలపాడింది. సావిత్రి యమధర్మరాజుతో పో రాడి భర్త ప్రా ణాలను తిరిగి తెచ్చుకుంది. సీతాదేవి
పూలరాశిలో దూకినట్లు అగ్నిగుండంలో దూకింది. సుమతి తన భర్తను బ్రతికించుకోడం కోసం సూర్యోదయాన్ని నిలిపివేసింది.

స్త్రీలు అందరూ దేవతామూర్తు లే. స్త్రీలను గౌరవించిన చోటనే దేవతలు విహరిస్తా రని పెద్దలంటారు. స్త్రీలు మనకు జన్మనిచ్చే
మాతృమూర్తు లు. మనకు పాలిచ్చి పెంచే సహనమూర్తు లు. వంటవండి మనకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టే దేవతలు. ఆ
దేవతల వంటి స్త్రీలపై దౌర్జన్యాలు, మానభంగాలు చేయడం మహాపాపం.

స్త్రీలను గుడిలో దేవతామూర్తు ల వలె పూజించాలి. గౌరవించాలి. స్త్రీలను తల్లు లుగా, సో దరీమణులుగా, మాతృమూర్తు లుగా
గౌరవించాలి.

మనదేశంలో అరుంధతి, అనసూయ వంటి పతివ్రతలు ఎందరో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇందిర, దుర్గా బాయి,
మీరాకుమారి, మహాజన్, సరోజినీనాయుడు, మాంటిసో రీ వంటి దేవతాస్వరూపిణులు ఎందరినో మనం చూస్తు న్నాం.

ప్రశ్న 9 .
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’ సో దరులారా ! మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తు న్నాం. పేపరు తెరిస్తే , టివి
పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లు లకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీ మూర్తు లకు అవమానం జరిగిందని వార్త చూస్తాం.
మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోటి విద్యార్థినులపై, పొ రుగున ఉన్న ఇల్లా లిపై అత్యాచారాలు. వెంటనే
అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లు ల వంటివారు, అక్కచెల్లె ళ్ళవంటి వారు.
స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త . స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డు పైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది.
జాగ్రత్త .

స్త్రీమూర్తు లను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే
ఉగ్రనరసింహునిలా భయంకరంగా శిక్షించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే , దుర్గా దేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే . లలితాసహస్రం పారాయణ చేసినట్లే . గుర్తుంచుకోండి.
స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు ,
x x x x.

ప్రశ్న 10 .
తోటి స్త్రీలను సో దరీమణుల్లా , మాతృమూర్తు ల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రు నికి లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
xxxxx

ప్రియ మిత్రు డు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తా ను. ఈ లేఖలో తోటి స్త్రీలను
సో దరీమణుల్లా , మాతృమూర్తు ల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తు న్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసే వారు ధ్వంసమైపో తారు. సమూలంగా వారి వంశం
నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సో దరీమణుల్లా ,
మాతృమూర్తు ల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తు న్నాను.

ఇట్లు ,
నీ ప్రియమిత్రు డు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10 వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూ రు జిల్లా .

You might also like