Professional Documents
Culture Documents
9వ తరగతి తెలుగు వాచకము నోట్సు పూర్తిగా PDF
9వ తరగతి తెలుగు వాచకము నోట్సు పూర్తిగా PDF
9వ తరగతి తెలుగు వాచకము నోట్సు పూర్తిగా PDF
తెలుగు అభ్యాసదీపిక
తెలుగు పరిమళం - 9
(9వ తరగతి తెలుగు వాచకము నోట్సు )
రూపకల్పన :
మామిడిశెట్టి శ్రీనివాసరావు,
ఎమ్.ఏ; టి.పి.టి; నెట్; స్లెట్;
పాఠశాల సహాయకుడు (తెలుగు),
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి,
అంబాజీపేట మండలం, డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
తెలుగు పరిమళం - 9
తొమ్మిదో తరగతి - తెలుగు(ప్రథమ భాష)
విషయ సూచిక
పద్యభాగం
క్రమసంఖ్య పాఠం పేరు ప్రక్రియ కవి/రచయిత పుటలు
గద్యభాగం
క్రమసంఖ్య పాఠం పేరు ప్రక్రియ కవి/రచయిత పుటలు
నా విన్నపము
విజ్ఞు లైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నా నమస్సులు 🙏
. నేను పాఠ్య పుస్త కాన్ని మాత్రమే
ఆధారంగా చేసుకుని, నా అవగాహన మేరకు ఈ నోట్సును రూపొ ందించడం జరిగింది. ఇది ఏ ఒక్క స్ట డీ
మెటీరియల్సుకు అనుకరణ కాదు. ఎక్కడైనా దో షాలు గమనించినచో సహృదయంతో సవరించుకోగలరు.
ఎల్ల వేళలా మీ ఆదరణను ఆశిస్తూ ..
మామిడిశెట్టి శ్రీనివాసరావు.
1.ధర్మబో ధ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పద్యాలను రాగయుక్త ంగా పాడండి, వాటి భావాలు చెప్పండి.
జ). (ఉపాధ్యాయుడు పద్యాలను రాగయుక్త ంగా పాడేటప్పుడు విద్యార్థు లు శ్రద్ధగా గమనించి, అదే విధంగా
పాడటానికి ప్రయత్నిస్తా రు. పద్యాల భావాలను సొ ంతమాటల్లో చెబుతారు.)
2. అనుకూలవతి అయిన భార్యను గూర్చి కవి ఏం చెప్పాడు?
జ). భార్య అనుకూలవతి అయితే ఆ పురుషుడు గృహస్థ విధులైనట్టి యజ్ఞ ం, అగ్నిహో త్రం, అతిథిపూజ
మొదలైన సమస్త కర్మలు ఆచరించగలుగుతాడు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మంచి సంతానం
పొ ందగలుగుతాడు. ఎల్ల ప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించే గృహస్థు అందుకోవలసిన ఫలితాన్నంతటినీ
అందుకోగలుగుతాడు. ఈ విధంగా అనుకూలవతి అయిన భార్యను గురించి నన్నయకవి చక్కగా చెప్పారు.
3. శకుంతల రాజుతో "కొడుకును కరుణా దృష్టితో చూడుము" అని అన్నది. కరుణా దృష్టితో అంటే ఏమిటి?
జ). శకుంతల దుష్యంత మహారాజుకు సత్య వాక్య గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మాటలు అన్నది.
శకుంతల భార్య అయిన తనను, తమకు పుట్టిన సంతానమైన భరతుని గుర్తు లేనట్లు గా ప్రవర్తిస్తు న్న దుష్యంత
మహారాజుకు కణ్వమహర్షి ఆశ్రమంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ లను గుర్తు చేసింది. వాటిని నెరవేర్చి, భరతుని కొడుకుగా
స్వీకరించి, అతనిని కరుణా దృష్టితో చూడమని చెప్పింది. కరుణా దృష్టి అంటే దయతో, జాలితో చూడడం అని అర్థం.
తండ్రి ఎవరో తెలియని పిల్లవాడికి సమాజంలో విలువ ఉండదు. కాబట్టి తమ పిల్లవాడైన భరతుడు తండ్రి ఎవరో
తెలియని పిల్లవాడిగా ఉండకూడదని శకుంతల భావించింది. అందుకే శకుంతల దుష్యంత మహారాజుతో తమ
కొడుకును కరుణా దృష్టితో చూడమని అన్నది.
4. "ధర్మాలన్నింటి కంటే సత్యమే గొప్పది" ఎందుకు?
జ). ధర్మం కాలానుగుణమైనది. సత్యం సర్వకాలాలలోనూ మార్పు చెందక స్థిరంగా ప్రకాశవంతమైనదిగా
ఉంటుంది. ఒక త్రా సులో వేయి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు, సత్యాన్ని మరొకవైపు ఉంచి తూచితే
సత్యం వైపుకు ముళ్ళు మొగ్గు చూపుతుంది. సమస్త తీర్థా లను సేవించడం కంటే, వేదాలన్నింటినీ అధ్యయనం
చేయడం కంటే సత్యం గొప్పది. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్ల ప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని
అంటారు. సమస్త జగత్తు కు సత్యమే మూలం. కాబట్టి . "ధర్మాలన్నింటి కంటే సత్యమే గొప్పది" అని చెప్పవచ్చు.
5. శకుంతల మాటలు విని దుష్యంతుడు ఏమని సమాధానమిచ్చాడు.?
జ). శకుంతల మాటలు విని దుష్యంతుడు "ఓ శకుంతలా! మహారాజునైన నేనెక్కడ? ఆశ్రమంలో ఉన్న
నువ్వెక్కడ? కుమారుడెక్కడ? ఇంతకుముందు నిన్ను ఏనాడూ నేను చూడలేదు. స్త్రీలు అసత్యాలు చెప్తా రన్నట్లు గా
ఇలా మాట్లా డడం నీకు తగునా? ఇది నీకు సముచితం కాదు" అని సమాధానం ఇచ్చాడు.
6. కింది ప్రతిపదార్ధా న్ని చదవండి. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థం రాయండి. (2,8,10 పద్యాలు)
i). విమలయశోనిధీ! పురుషవృత్త మెరుంగుచునుండుc జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముcడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుcడు దక్కొననేర్చునె తన్ను మ్రు చ్చిలన్.
*ప్రతిపదార్థం :
విమల = నిర్మలమైన
యశోనిధీ = కీర్తికి నిలయమైన వాడా!
వేదములును = నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం)
పంచ భూతములు = భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే అయిదూను
ధర్మువు = ధర్మమున్నూ (ఆచరింపబడేది ధర్మం)
సంధ్యలు = ఉదయ సంధ్య, సాయం సంధ్య (రెండు ప్రొ ద్దు లకు మధ్యకాలం)
అంతః + ఆత్మయున్ = హృదయమూ (మనస్సూ)
యముడును = యమధర్మరాజూ (మృత్యువుకు అధిదేవత)
చంద్రసూర్యులు = చంద్రు డూ, సూర్యుడూ
అహంబును = పగలునూ
రాత్రియున్ = రాత్రీ
అన్ = అనెడి
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 4
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
💥సమాసాలు :
4. సభ + ఆసదులు = సభాసదులు = సవర్ణ దీరస ్ఘ ంధి
💥అలంకారాలు :
4. శకుంతలాదుష్యంతులు = శకుంతలయునూ, దుష్యంతుడునూ - ద్వంద్వ సమాసం
అ). ఉపమాలంకారం : ఒక వస్తు వును ప్రసిద్ధమైన మరొక వస్తు వుతో పో ల్చి రమ్యంగా చెబితే అది
ఉపమాలంకారం.
దీనిలో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమానధర్మం అనే నాలుగు అంశాలు ఉంటాయి.
ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం
ఉపమానమైన వెండికొండతో పో ల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఉపమాలంకారం అయినది. ( నాలుగు
💥ఛందస్సు :
లక్షణాలూ ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణో పమాలంకారం).
పాఠంలోని కింది పద్య పాదాలకు గురు - లఘువులను పరిశీలించండి. పద్య లక్షణాలను అన్వయం చేయండి.
IIU U I I UI U I I I UU U I U U I U
విపరీ | త ప్రతి | భాష లే | మిటికి | నుర్వీనా | థ! ఈ పు | త్త గ
్ర ా
స భ ర న మ య వ
I IU U I I U I U I I I U UU I UU I U
త్ర పరి | ష్యంగసు |ఖంబు సే | కొనుము | ముక్తా హా | ర కర్పూ | ర సాం
స భ ర న మ య వ
IIU UI I U I U I I I U UU I U U I U
ద్రపరా | గ ప్రస | రంబు జం | దనము | జంద్రజ్యో | త్స్నయుం బు | త్త గ
్ర ా
స భ ర న మ య వ
I IU U I I UI U I I I U U U I U U IU
త్ర పరి | ష్యంగము | నట్లు జీ | వులకు | హృద్యంబే | కడున్ శీ | తమే
స భ ర న మ య వ
పై పద్య పాదాలు గమనించండి. ప్రతి పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి కదా!
ప్రతి పాదంలోనూ 14వ అక్షరం (వి - ర్వీ, త్ర - క్తా , ద్ర - ద్ర, త్ర - ద్యం) లకు యతి చెల్లి ంది. ప్రతి పాదంలో ప్రా స రెండవ
అక్షరం "ప" ఉంది. ఈ లక్షణాలు ఉంటే అది మత్తేభపద్యం అవుతుంది.
@మత్తేభ పద్య లక్షణాలు :
1. మత్తేభం వృత్త జాతి పద్యం. 2. నాలుగు పాదాలు ఉంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 4. ప్రా స నియమం ఉంది.
5. ప్రతి పాదంలో స - భ - ర - న - మ - య - వ అనే గణాలు వరుసగా వస్తా యి.
👉
6. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థా నం.
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. మత్తేభ పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
IIU UI I U I U I I I UUU IUU I U
1. అవనీ | చక్రము | సంచరిం | పగది | వంబల్లా | డనాశా | చయం
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (అ - బ) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
I IU U I I UI U I I I UUU I U U I U
2. తమకా | ర్యంబు బ | రిత్యజిం | చియుబ | రార్ధప్రా | పకుల్ స | జ్జ నుల్
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (త - ర్ధ) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
IIU U I I U I U I I I UUU IUU I U
3. అదిగో | ద్వారక | యాలమం | దలవి | గోనందం | దుగోరా | డున (య్య)
స భ ర న మ య వ
*సమన్వయం : ఈ పద్య పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు ఉన్నాయి. పాదానికి 20
అక్షరాలున్నాయి. పద్య పాదంలోని 14వ అక్షరం (అ - నం) లకు యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదం మత్తేభం
పద్యానికి చెందినదని చెప్పవచ్చు.
*******
2.చైతన్యం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. రాయండి.
1. గేయాన్ని లయబద్ధ ంగా పాడండి. ప్రా స పదాలను గుర్తించి రాయండి.
జ). (గేయాన్ని ఉపాధ్యాయుడు పాడుతున్నప్పుడు విద్యార్థు లు ఆలకించి,లయబద్ధ ంగా పాడటానికి
ప్రయత్నిస్తా రు).
*ప్రా స పదాలు : పో కురా - కాకురా, పో యెరా - మానరా, శాసించవేమిరా - పురికొల్పవేమిరా, మానరా - పూనరా,
కాదురా - నూదరా, వీడరా - పాడరా, నుంకించరా - నురికించరా, కట్ట రా - పో గొట్ట రా, మీవెరా - చూపరా, చేయరా -
పేర్మోయరా, కాదురా - రాదురా, ఊగింపరా - తొలగింపరా
2. కవి తనకున్న రచనా శక్తితో ఏమి చేయాలని తెలియజేస్తు న్నాడు?
జ). కవి తనకున్న రచనా శక్తితో స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలని
తెలియజేస్తు న్నాడు. బడుగుల జీవన పో రాటాన్ని చూసి, వారిలో నూతనోత్తేజాన్ని నింపేలా రచనలు చేయాలి.
దుర్మార్గు ల కుతంత్రా లతో చరితల ్ర ో జరిగిన ఎన్నో యుద్ధా లలో ధైర్య సాహసాలు చూపిన వారి గురించి, వారు చేసిన
త్యాగాల గురించి కవి రచనలు చేయాలి. ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తు ందో తెలియక భీతిల్లు తున్న
దీనుల గుండెల్లో కవి తన రచనల ద్వారా ధైర్యాన్ని నింపాలి. ఎందరో మహనీయుల త్యాగఫలాలు కొందరు
దుర్మార్గు లు చేసే కుట్రల ఫలితంగా వృథాకాకుండా చూడాలి. నిత్యమూ ఆకలితో అలమటిస్తూ , బండబారిన బడుగు
జీవుల గుండెల్లో కవి తనకున్న రచనా శక్తితో స్ఫూర్తిదాయకమైన భావాలను నింపి వారిని చైతన్య పరచాలి.
3. కవి తన పేరును సార్ధకం చేసుకోవాలంటే ఏమి చేయాలి?
జ). విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం కవికి ఉంటుంది. అటువంటి రచన శక్తి కవికి మాత్రమే
సొ ంతం. కాబట్టి కవి స్వప్రయోజనం కోసం కాకుండా సమాజహితం కోసం రచనలు చెయ్యాలి. స్వార్థంతో చేసే ఏ పని
వలన ప్రయోజనం ఉండదని తెలుసుకొని,కవి ప్రజల కలల సాకారానికి పూనుకొని తన పేరును సార్థకం చేసుకోవాలి.
4. కింది వాక్యాలు చదివి గేయంలో ఆ వాక్యాల భావాలు వచ్చే పంక్తు లను గుర్తించి రాయండి.
అ. అన్ని దిక్కుల నుంచి కష్టా లు కమ్ముకొని వస్తు న్నాయి.
జ). తూర్పు పడమరలనక దొ ర్లు కొని వచ్చేటి దుఃఖవాహిని
ఆ. దుర్మార్గు ల కుతంత్రా ల వలన ఘోరమైన యుద్ధా లు జరిగాయి.
జ).క్రూ రులై కల్పించు ఘోర యుద్ధా లలో
ఇ. భయం భయంగా బ్రతుకుతున్న వాళ్ల ందరినీ ఒక్కటి చేయాలి.
జ). అదురుబెదురుల గుండెలన్నీ యొక్కటి చేసి
ఆ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
'యోగ్యతాపత్రం' ఇది తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ముందుమాట. అక్షర దివిటీలు చేపట్టి
పదాల ఫెళఫెళార్భాటాలతో తెలుగుకవితను కొత్త పుంతలు తొక్కించిన యుగకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థా నం కావ్యానికి
మరో మహాకవి చలం రాసిన ముందుమాట ఇది. తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని
తూచేరాళ్లు తన దగ్గ ర లేవు అన్నాడు చలం. తూచవద్దు అనుభవించి ఫలవరించమన్నాడు శ్రీశ్రీ. తనకీ, ప్రపంచానికీ
సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్ యుద్ధా రావమే కవిత్వం అంటాడు చలం. నెత్తు రునూ, కన్నీళ్ల నూ
తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేశారు శ్రీశ్రీ. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనానికి పాటల
రూపాన్నివ్వడం అతనికి తెలుసు. మాటల్ని కత్తు లూ, ఈటెలూ, మంటలుగా మార్చడం అతనికి చేతనవును.
పద్యాలు చదువుతుంటే అవి మాటలు కావు, అక్షరాలూ కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధా లు - అతని
హృదయంలోంచి మన హృదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తు రు కాలువలు అనిపిస్తు ంది. ఎందుకంటే
కృష్ణ శాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తా డు. శ్రీశ్రీ కవిత్వము, పాల్ రోబ్సన్
సంగీతము ఒకటే రకం అంటుంది సౌరీస్. ఆ రెండింటికీ హద్దు లూ, ఆజ్ఞ లూ లేవు. అప్పుడప్పుడూ లక్షణాలనూ,
రాగాలను మీరి చెవి కిర్రు మనేలా అరుస్తా రిద్దరూ. ఆ అరుపుల్లో ఎగిరిపడే సముద్రం, తుఫాను గర్జనం, మర ఫిరంగుల
మరణధ్వానం గింగురుమంటాయి. కంఠం తగ్గించి మూలిగారా, ఆ మూలుగులు దిక్కులేని దీనుల మూగవేదన,
నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపొ లం ఆర్త నాదం వినిపింపజేస్తా యి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి,
శాంతించి, రక్షించే అపూర్వ వ్యక్తి మీ చేతుల్లో ఉన్న ఈ పుస్త కం. ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు ఉంది? ఏం
చేస్తో ంది? అని దిబ్బరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్త రం. (మహాప్రస్థా నం ముందుమాట నుండి)
*ప్రశ్నలు :
1. మహాప్రస్థా నం కావ్యానికి ముందుమాట రాసింది ఎవరు?
జ). మహాప్రస్థా నం కావ్యానికి చలం ముందుమాట రాశారు.
2. శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్ ఎవరితో పో ల్చారని చలం చెప్పారు?
జ). శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్, పాల్ రోబ్సన్ సంగీతముతో పో ల్చారని చలం చెప్పారు.
3. సాయంకోరి బిగ్గ రగా అరవడం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). ఆర్త నాదం అనే పదం సాయంకోరి బిగ్గ రగా అరవడం అనే అర్థా న్నిస్తు ంది.
4. వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేయడం అంటే ఏమిటి?
జ). నిస్తేజంగా ఉన్న ప్రజల్లో చైతన్యం కలిగించేలా కవిత్వం రాయడం.
5. పై గద్యానికి ఒక శీర్షిక (పేరు) పెట్టండి.
జ). "యోగ్యతాపత్రం" అనే పేరు ఈ గద్యానికి చక్కగా సరిపో తుంది.
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
"ఆపరేషన్ అవకముందు నా మాటలో స్పష్ట త తగ్గ టం మొదలయింది. నా సన్నిహితులకే నా మాటలు
అర్థమయ్యేవి. అప్పుడు కనీసం ఆలోచనలైన వినిపించగలిగే వాడిని. సెకట ్ర రీకి డిక్టేషన్ ఇవ్వడం వల్ల సైంటిఫిక్
పేపర్లు రాయగలిగేవాడిని. నా మాటలను మరొకరు స్పష్ట ంగా మళ్ళీ పలుకుతుంటే సెమినార్ల లో ఉపన్యాసాలు
ఇవ్వగలిగేవాడిని. కానీ ట్రా కియాటమీ ఆపరేషన్ నా మాట్లా డే శక్తిని పూర్తిగా తగ్గించింది. కొద్దికాలం పాటు ఎవరైనా
అక్షరాలను చూపుతుంటే, నాకు కావాల్సిన అక్షరం చూపగానే కనుబొ మ్మలెత్తి సైగ చేయడం ద్వారా నేను
చెప్పాలనుకున్నది చెప్పేవాడిని. ఇలా మాట్లా డటమే అతి కష్ట మైన విషయం. ఇక సైంటిఫిక్ సెమినార్ల లో మాట్లా డడం
కుదరని పని. అయితే కాలిఫో ర్నియాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు 'వాల్ట్ వోల్టే జ్' ప్రత్యేకంగా నాకోసం
ఈక్విలైజర్ అనే ప్రో గ్రా ం రాసి పంపాడు. ఇందువల్ల తెరపై ఉన్న పదాలను నా చేతిలోని మీటను నొక్కడం వల్ల
ఎంచుకోగలుగుతాను. నేను చెప్పాలనుకున్న పదాలను ఎంచుకొని స్పీచ్ సింతసైజర్ కు పంపుతాను. నా మాటలను
కంప్యూటర్ పలుకుతుంది".
ప్రపంచ ప్రఖ్యాత శాస్త వ ్ర ేత్త స్టీఫెన్ హాకింగ్ బ్లా గు 'హాకింగ్ డాట్ ఆర్గెట్ యు.కె' లో హాకింగ్ అంతరంగ
భావవ్యక్తీకరణ ఇది. మానవమేధ భౌతిక పరిమితులకు లొంగదని నిరూపించిన శాస్త వ ్ర ేత్త హాకింగ్. శరీరం కదలికలు
లేక చక్రా ల కుర్చీకి పరిమితమైనా, అతని మేధ మాత్రం అనంత విశ్వరహస్యాలను అత్యద్భుతమైన రీతిలో
పరిశోధించి ఆవిష్కరించింది. స్టీఫెన్ హాకింగ్ రచించిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' ఆధునిక కాస్మాలజీని సామాన్య
మానవునికి చేరువచేసిన మహత్త ర పుస్త కం. కాల్పనిక నవలలకన్నా అధికంగా అమ్ముడుపో యిందీ శాస్త వ ్ర ేత్త
సిద్ధా ంత గ్రంథం. దీనిని 'కాలం కథ' పేరుతో తెలుగులోకి అనువదించారు. (- కాలం కథ నుండి)
*ప్రశ్నలు :
1. హాకింగ్ సైంటిఫిక్ పేపర్లు ఎలా రాయగలిగేవారు?
జ). హాకింగ్ తన సెకట ్ర రీకి డిక్టేషన్ ఇవ్వడం వల్ల సైంటిఫిక్ పేపర్లు రాయగలిగేవారు.
2. వాల్ట్ వోల్టే జ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం తయారుచేసిన ప్రో గ్రా ం ఏమిటి?
జ). వాల్ట్ వోల్టే జ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం "ఈక్విలైజర్" అనే ప్రో గ్రా ం తయారుచేశారు.
3. హాకింగ్ జీవితంలో నిన్ను ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటి?
జ). శరీరం సహకరించకపో యినా మేధ మాత్రం అనంత విశ్వరహస్యాలను అత్యద్భుతమైన రీతిలో పరిశోధించి
ఆవిష్కరించడం హాకింగ్ జీవితంలో నన్ను ఆశ్చర్యపరిచిన అంశం.
4. స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్త కం పేరేమిటి?
జ). 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనేది స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్త కం పేరు.
5. పై పేరా నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). స్టీఫెన్ హాకింగ్ బ్లా గు పేరేమిటి?
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. ఒక పౌరుడుగా కవి కర్త వ్యం ఏమిటని నీవు భావిస్తు న్నావు?
జ). కవి స్వేచ్ఛాజీవి. కవి తనకున్న రచనా శక్తితో స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం
రచనలు చేయాలి. బడుగుల జీవన పో రాటాన్ని చూసి, వారిలో నూతనోత్తేజాన్ని నింపేలా రచనలు చేయాలి..
ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తు ందో తెలియక భీతిల్లు తున్న దీనుల గుండెల్లో కవి తన రచనల ద్వారా
ధైర్యాన్ని నింపాలి. నిత్యమూ ఆకలితో అలమటిస్తూ , బండబారిన బడుగు జీవుల గుండెల్లో కవి తనకున్న రచనా
శక్తితో స్ఫూర్తిదాయకమైన భావాలను నింపిలా కవిత్వం రాసి, వారిని చైతన్య పరచడం కవి కర్త వ్యమని నేను
భావిస్తు న్నాను.
2. "స్వార్థ గానము మానరా! ఓ కవీ సార్ధకానికి పూనరా!" ఈ గేయ పంక్తు ల భావాన్ని మీ సొ ంతమాటలలో
వివరించండి.
జ). ఓ కవీ! విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనాశక్తి నీకు మాత్రమే
సొ ంతం. స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం నువ్వు రచనలు చేయాలి. స్వార్థంతో చేసే ఏ పని
వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు స్వార్థా న్ని విడిచిపెట్టి ప్రజల కలల సాకారానికి పూనుకోవాలి.
3. చైతన్యం పాఠాన్ని రాసిన కవిని గురించి రాయండి.
జ). చైతన్యం అనే పాఠాన్ని రాసిన కవి శ్రీ తాపీ ధర్మారావు గారు. 20వ శతాబ్దా నికి చెందిన ప్రముఖ కవి.
పాతపాళీ, కొత్త పాళీ, దేవాలయాల మీద బూతుబొ మ్మలెందుకు, పెళ్లి దాని పుట్టు పూర్వోత్త రాలు, రాలూ - రప్పలూ,
ఇనుప కచ్చడాలు, సాహితీ మొర్మరాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూర వేంకటకవి విజయవిలాస
ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లా స వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
4. గేయకవిత ప్రక్రియను గురించి రాయండి.
జ). గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. ఇది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తు ంది.
లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సునూ, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే
గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు.
5. చైతన్యం పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జ). కవిత్వానికి ఉండవలసిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలోని అసమానతల్ని
రూపమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా
నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొ ంత లాభం కోసం కాకుండా పరుల మేలుకోరి పనిచేయాలని
ప్రేరణనిస్తూ కవి తన ఆకాంక్షను వ్యక్త ం చేయడం ఈ పాఠ్యాంశానికి నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమి చేయాలో వివరిస్తూ వ్యాసం రాయండి.
జ). కుల,మత,లింగ, వర్గ, వర్ణా ల కారణంగా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని పరిగణించడమే
అసమానత. ఇది తొలగాలంటే మనుషులంతా సమానమే అనే భావనను ప్రతి ఒక్కరిలో బలపరచాలి. భారత
రాజ్యాంగం ఇచ్చిన పౌరులకు ఇచ్చిన ప్రా థమిక హక్కులు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అంటరానితనం
అమానుషమనే భావనను విస్త ృతంగా ప్రచారం చేయాలి.
ఆణగారిన వర్గా ల అభివృద్ది కోసం వారికి మెరుగైన విద్య, వైద్య సదుపాయాలను ఉచితంగా
అందించి వారిని ప్రో త్సాహించాలి. ప్రభుత్వాలు ఆర్థికంగా వారికి అండగా నిలవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో
పేదలకు ప్రా ధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు, స్థితిమంతులు అన్నార్తు లను అనాథలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరూ
తమకున్న దానిలో ఎంతో కొంత నిరుపేదలకు, నిర్భాగ్యులకు దానం చేయాలి. మన మనసుల్లో అనాదిగా
నాటుకుపో యిన ధనిక,పేద,కుల,మత, వర్గ భేదాలను పూర్తిగా చెరిపేయాలి.
2. నీవే కవివైతే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితను రాస్తా వు.
జ). నేనేగనుక కవినైతే అనాదిగా ప్రజల హృదయాలలో నాటుకుపో యిన కుల,మత,వర్గ భేదాలను రూపుమాపాలని
చెబుతూ, ప్రజల్లో చైతన్యం కలిగించేలా నాకున్న జ్ఞా నంతో ఒక కవిత రాస్తా ను.
జ). ఇకనైనా మారదాం….!
మనిషిగ పుట్టిన ఓ మనిషీ
మారొద్దు నువ్వు రాక్షసునిగా!
కులాల పేరుతో కుమ్ములాటలు సృష్టించి
మతాల పేరుతో మానవత్వాన్ని మంటగలిపి
వర్గా ల పేరుతో వైషమ్యాలు పెంచి
ఆ నెత్తు టి మంటల్లో చలి కాచుకుంటున్నావు.
కులమన్నది కూడు పెట్టదు
మతమన్నది మంచిని పెంచదు
వర్గ మన్నది వరాల్ని కురిపించదు
అనే అసలు నిజాన్ని మరిచి
మనుషుల మధ్య అంతరాల్ని పెంచుతున్నావు.
💥సంధులు :
ii).వ్యాకరణాంశాలు :
@గుణసంధి : "అ" కారానికి ఇ,ఉ,ఋ లు పరమైతే వరుసగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి
జరుగుతుందని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా!
అ). కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
1. రాజేశ్వరి = రాజ + ఈశ్వరి = గుణసంధి
2. పరోపకారం = పర + ఉపకారం = గుణసంధి
3. మహర్షి = మహ + ఋషి = గుణసంధి
💥
4. నూతనోత్సాహం = నూతన + ఉత్సాహం = గుణసంధి
👉
సమాసాలు :
కర్మధారయ సమాసం : విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగితే దాన్ని కర్మధారయ
సమాసం అంటారు. దీనిని సమానాధికరణం అని కూడా పిలుస్తా రు. ఈ పాఠంలో కర్మధారయ సమాసాలను గురించి
👉
తెలుసుకుందాం.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం : విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా: తెల్ల చొక్కా - తెల్లనైన చొక్కా
తెల్లని - విశేషణం (పూర్వపదం - మొదటి పదం)
చొక్కా - నామవాచకం (ఉత్త ర పదం - రెండవ పదం)
పై ఉదాహరణను గమనిస్తే తెల్ల - చొక్కా అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం "తెల్ల" విశేషణం,
రెండో పదం "చొక్కా" నామవాచకం. ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగింది కాబట్టి
'కర్మధారయ సమాసం'.
అ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపండి.
1. పాత రోజులు - పాతవైన రోజులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మంచి దారి - మంచిదైన దారి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కొత్త పుస్త కం - కొత్త దైన పుస్త కం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. నల్ల పూసలు - నల్ల నైన పూసలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. కొత్త కోక - కొత్త దైన కోక - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. ఎర్ర గులాబి - ఎర్రదైన గులాబి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
👉
7. లేత మొగ్గ - లేతదైన మొగ్గ - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం : విశేషణం ఉత్త రపదంగా (రెండవ పదంగా) ఉంటే ఆ సమాసాన్ని
"విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం" అంటారు.
ఉదా: కపో తవృద్ధ ము - వృద్ధ మైన కపో తము
కపో తము - నామవాచకం (ఉత్త రపదం - మొదటి పదం)
వృద్ధ ము - విశేషణం (ఉత్త రపదం - రెండవ పదం)
పై ఉదాహరణలో కపో తము, వృద్ధ ము అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం కపో తము
నామవాచకం(విశేష్యం) రెండో పదం వృద్ధ ము మొదటి పదం గుణాన్ని తెలుపుతుంది కాబట్టి విశేషణం. విశేషణ పదం
ఉత్త రపదంగా రావడం వలన ఇది విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం.
ఆ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసనామం తెలపండి.
1. తమ్ముకుఱ్ఱ - కుఱ్ఱ యైన తమ్ము - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
2. కవి శ్రేష్టు డు - శ్రేష్టు డైన కవి - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
3. ముఖ పద్మము - పద్మము వంటి ముఖము - ఉపమాన ఉత్త రపద కర్మధారయ సమాసం
4. కార్మిక వృద్ధు డు - వృద్ధు డైన కార్మికుడు - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
👉
5. వృక్ష రాజము - రాజమైన వృక్షము - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం : సమాజంలోని రెండు పదాలు విశేషణాలై ఉంటాయి.
ఉదా: శీతోష్ణ ం - శీతం, ఉష్ణ ం
శీతం - విశేషణం (పూర్వపదం - మొదటి పదం)
ఉష్ణ ం - విశేషణం (ఉత్త ర పదం - రెండవ పదం)
పై ఉదాహరణను గమనిస్తే శీతం, ఉష్ణ ం అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం శీతం (విశేషణం),
రెండో పదం ఉష్ణ ం (విశేషణం). ఇలా రెండు పదాలూ విశేషణాలే కావడం వలన ఈ సమాసం విశేషణ ఉభయపద
కర్మధారయ సమాసం అయింది.
ఇ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం నామం తెలపండి.
1. మృదుమధురం : మృదువు,మధురం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
2. సరసగంభీరం. : సరసం,గంభీరం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
3. నిమ్నోన్నతం : నిమ్నం,ఉన్నతం - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
💥అలంకారాలు :
4. ఎగుడు దిగుడు : ఎగుడు,దిగుడు - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
అ). అంత్యానుప్రా స అలంకారం : కింది తరగతిలో నేర్చుకున్న అంత్యానుప్రా స అలంకారం - గుర్తు చేసుకుందాం.
"భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథయే ముక్తి"
పై కవితలో పాదాలన్నింటి చివర ఒకే లయతో కూడిన ప్రా స పదాలు వచ్చాయి కదా! ఇలా అన్ని
పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రా స అలంకారం అవుతుంది. పై
ఉదాహరణలో "క్తి" అనే అక్షరం చివర ప్రా సగా వచ్చింది.
"వేదశాఖలు వెలిసెనిచ్చట
ఆదికావ్యం బలరెనిచ్చట"
పై ఉదాహరణలో 'ఇచ్చట' అనే పదం చివరలో ప్రా సగా రావడం జరిగింది. పాదాంతంలో లేదా పంక్తి
చివరలో ఒకే ఉచ్ఛారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని 'అంత్యానుప్రా స అలంకారం' అంటారు.
ఆ). పాఠాన్ని పరిశీలించండి. అంత్యాను ప్రా స కలిగిన పాదాలను గుర్తించి రాయండి.
ఉదా: పుట్టు గ్రు డ్డిగ పో కురా
వట్టి మ్రో డువు కాకురా
1. పాత రోజులు పో యెరా
రోత పాటలు మానరా!
2. స్వార్థగానము మానరా
సార్థకానికి పూనరా!
3. మెత్తదనమును వీడరా
కత్తి సామును పాడరా!
4. వెనుకాడగా కాదురా
వెనుక తరుణము రాదురా!
5. లోకాల నూగింపరా
శోకాల తొలగింపరా!
💥
👉
ఛందస్సు:
ఈ కింది చంపకమాల పద్య పాదాలకు గణవిభజన చేస,ి పద్య లక్షణాలు రాయండి.
I II I UI U I I I UI I UI I UI U I U
అ). జనిత| పరాక్ర| మ!క్రమ| విశార| ద!శార| దకంద| కుందచం
న జ భ జ జ జ ర
I I I I UI U I I I UI IUI I U I U I U
ఆ). దన ఘ| న సార| సార య| శ! దాశ| రథీ క| రుణా ప| యోనిధీ
న జ భ జ జ జ ర
👉
*ఈ రెండు పద్య పాదాలూ చంపకమాల పద్యానికి చెందినవి.
చంపకమాల పద్య లక్షణాలు :
1. చంపకమాల వృత్త పద్యం.
2. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో "న - జ - భ - జ - జ - జ - ర" అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
*******
3.హరివిల్లు
I). అవగాహన - ప్రతిస్పందన:
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. కోలాహలాద్రి తన పేరును ఎలా సార్ధకం చేసుకుంది?
జ). కోలాహల పర్వతంపై ఒకవైపు రకరకాల పక్షుల రాగాలాపన, మరొకవైపు నెమళ్ల క్రేంకార ధ్వనులు,
ఒక దిక్కునుండి అందమైన చిలకల పలుకులు, మరొక దిక్కునుండి వన దేవతల గానలహరి వినిపిస్తూ ఉంటాయి.
నిరంతరం దేవదేవేరుల వీణా వాయిద్యాలు, గోరువంకల సంభాషణలు, పక్షిపిల్లల స్తు తి వాక్యాలు, ఝుమ్మని
తుమ్మెద గుంపు చేసే అవ్యక్త మధుర గానాలు, అరటి పందిళ్లలో కిన్నెర కాంతల సంగీత కోలాహలంతో ఆ పర్వతం
ఎల్ల ప్పుడూ వీనుల విందు చేస్తు ంటుంది. ఈ విధంగా కోలాహలాద్రి నిత్య కోలాహలంతో తన పేరును సార్ధకం
చేసుకుంది.
2. మేఘాలను కవి ఎలా వర్ణించాడు?
జ). మేఘాలు దిక్కులనే ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఈనిన పిల్లలు ఆకాశమంతా వ్యాపించాయా
అన్నట్లు ఉన్నాయి. పెద్దపెద్ద పర్వతాలు పెనుగాలి తాకిడికి పెకలించుకుపో యి ఆకాశంలోకి ఎగిరినట్లు గా ఉన్నాయి.
పాతాళంలో ఉన్న దట్ట మైన చీకట్లు సూర్యుడ్ని మింగేయడానికి వచ్చినట్లు గా ఉన్నాయి. భూమికి నాలుగు వైపులా
ఉన్న సముద్రా లు అలలతో ఆకాశంపైకి వెలుతున్నట్లు గా ఉన్నాయి. ఈ విధంగా ఎఱ్ఱ న తన హరివంశం కావ్యంలో
మేఘాలను చక్కగా వర్ణించాడు.
3. అరణ్య వర్ణ నలో మీకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఏది?
జ). చిగుళ్ల కోసం ఏనుగు తొండం పైకెత్తి నపుడు దాని దంతకాంతి చుట్టూ ప్రసరించినట్లు గా వర్ణించిన
విధానం మాకు ఆశ్చర్యం కలిగించింది. పెద్ద పులులు వేట మాంసం తిని మత్తు గా పొ దలలో పడుకుంటే వాటి
మూతినుండి కారుతున్న చొంగ వాసనకు అడవి ఈగలు ముసిరినట్లు గా చెప్పిన వర్ణ న మాకు ఆశ్చర్యం కలిగించింది.
ఇలా పెద్దన 'మనుచరిత'్ర లో చేసిన అరణ్య వర్ణ నలో ప్రతి అంశం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ). కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మందారమకరందమాధుర్యమునc దేలు
మధుపంబు వోవునే? మదనములకు
నిర్మలమందాకినీవీచికలc దూcగు
రాయంచ చనునె? తరంగిణులకు
లతితరసాలపల్ల వఖాది యై చొక్కు
కోయిల సేరునే? కుటజములకుc
బూర్ణేందుచంద్రికాస్ఫురితచకోరక
మరుగునే? సాంద్రనీహారములకు
అంబుజోదరదివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుc జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయునేల?
*ప్రశ్నలు:
1. ఈ పద్యంలో పేర్కొన్న పక్షుల పేర్లు రాయండి.
జ). రాయంచ, కోయిల, చకోర పక్షులు ఈ పద్యంలో పేర్కొన్న పక్షులు.
2. పై పద్యంలో పొ గమంచు అని అర్థం వచ్చే పదం ఏది?
జ). పై పద్యంలో "నీహారిక" అనే పదం పొ గమంచు అనే అర్థా న్ని ఇస్తు ంది.
3. తుమ్మెదలు దేనిని ఆస్వాదిస్తా యి?
జ). తుమ్మెదలు మందార పుష్పములోని మకరందాన్ని ఆస్వాదిస్తా యి.
4. అంబుజోదరుడు - సమాసం తెల్పండి.
జ). అంబుజము ఉదరముగా గలవాడు - బహువ్రీహి సమాసం.
5. "లేత మామిడి చిగుళ్ళను తినే కోయిల కొండమల్లెలను కోరుకోదు" - ఇలాంటి మరొక
వాక్యాన్ని మీ సొ ంతంగా రాయండి.
జ). జంతువులను వేటాడి తినే పెద్దపులి పచ్చగడ్డి కోసం ప్రా కులాడదు.
5. వర్ణ న ప్రక్రియను గురించి రాయండి. (లేదా) హరివిల్లు పాఠ్యాంశ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). కవి చెప్పిన విషయం పాఠకుని మనసును తాకి, అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి.
ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తా డు. దీనిని వర్ణ న అంటారు. కావ్యాలలో
అష్టా దశ వర్ణ నలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణ నలకు పుట్టినిల్లు . కవిత్వమేదైనా వర్ణ నలతోనే రచనకు భావపుష్టి
కలుగుతుంది.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. వర్షం కురిసినప్పుడు మీరు పొ ందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రు డికి లేఖ రూపంలో రాయండి.
జ). ఎస్. మూలపొ లం,
18-08-2023.
ప్రియమిత్రు డు చక్రవర్తికి,
ఉభయకుశలోపరి .నీ లేఖ మొన్ననే నాకు అందినది. చాలా సంతోషం. ముఖ్యముగా
రాయునది ఏమనగా ఈ సంవత్సరం జూలై మాసంలో మా ప్రా ంతంలో వర్షా లు చాలా ఎక్కువగా కురిశాయి. మా
ఇంటి ముందరి ఖాళీస్థ లంలో నీరు బాగా నిలిచిపో యింది. నేను, మా పక్కింటి శంకర్ కాగితపు పడవలు చేసుకుని
ఆ వాననీటిలో వేసి ఎంతో ఆనందంగా గడిపాము. వాననీటిలో గెంతులువేస్తూ ,నీటిని ఒకరిపై ఒకరం
చిమ్ముకుంటుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేను. పచ్చని చెట్లపై నుండి జారిపడుతున్న వర్షపునీరు
పూలవానలా కనిపించి మనసుకు ఆహ్లా దాన్ని కలిగించింది. వర్షం కురిసినప్పుడు నీవు పొ ందిన అనుభూతిని
వర్ణిస్తూ తిరిగి లేఖ రాయగలవు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు చెప్పు. ఉంటాను మిత్రమా!
ఇట్లు
నీ ప్రియమిత్రు డు,
శ్రీనివాస్.
చిరునామా :
ఎమ్. చక్రవర్తి,
9వ తరగతి,
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల,
కె.పెదపూడి, అంబాజీపేట మండలం,
డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్- 533239
2. ఈ పాఠంలో దాశరథి చీకటిని వర్ణించిన తీరులో మీరు గుర్తించిన విశేషాలను రాయండి.
జ). చీకటి వెలుగుల సంగమమే జీవితం. చీకటి లేకపో తే వెలుగు ప్రా ధాన్యతని గుర్తించలేము. చీకటిని చాలామంది
నిరసనకి, అజ్ఞా నానికి, పాపానికి సంకేతంగా భావిస్తా రు. కానీ దాశరథి చీకటిలోని అందాన్ని గుర్తించి, కమనీయంగా
వర్ణించాడు.
దాశరథి "అమృతాభిషేకం" కావ్యంలో చీకటిని చంద్రబింబం వంటి ముఖం మీద పెట్టిన కస్తూ రి బొ ట్టు లా
వర్ణించారు. స్త్రీ కనుబొ మ్మలనే విల్లు కు తొడిగిన బాణంలా, స్త్రీ బంగారు చెక్కిలి మీద పెట్టిన అగరు చుక్కలా,
వెండికొండ మీద మబ్బులా చీకటిని వర్ణించారు.
ఇంకా చీకటిని చంద్రు డనే పొ లంలో జింకలా, ఆదిశేషుని మీద పడుకున్న విష్ణు వులా వర్ణించారు. ఇక్కడ
దాశరథి వర్ణ నకు తీసుకున్న వస్తు వులన్నీ నల్ల నివే. నల్ల ని చీకటిని కూడా పాఠకుల మనసుకు హత్తు కునేలా
వర్ణించిన తీరు నన్ను బాగా ఆకట్టు కుంది.
3. సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణ నకు ఎందుకింతటి ప్రా ధాన్యతనిచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి.
జ). సృష్టికర్త రచించిన మనోజ్ఞమైన మహాకావ్యమే ప్రకృతి. కొండలూ, గుట్ట లూ, నదులూ, పశుపక్ష్యాదులు
ప్రకృతిలో భాగమే. ప్రకృతి జీవ వైవిధ్యానికి నిలయం. అనాదిగా మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది.
ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, పారే సెలయేరు, చిరుగాలి సవ్వడి, చిమ్మచీకటి, చల్ల ని వెన్నెల ఇలా
ప్రకృతిలోని ప్రతీదీ మనిషిని ఆకర్షిస్తు ంది. ఇటువంటి ప్రకృతిని ఆదికవి మొదలు నేటి ఆధునిక కవుల వరకూ ప్రతి
ఒక్కరూ తమ కావ్యాలలో ఎంతో మనోహరంగా వర్ణించారు.
ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి ఆనందాశ్చర్యాలలో మునిగి తనను తానే మరచిపో తాడు.
మనిషికి హృదయానందాన్ని పంచే ఈ ప్రకృతి రమణీయతను కవులు బంగారు నగలో వజ్రా న్ని పో దిగినట్లు గా
పొ ందుపరిచారు. "విశ్వ శ్రేయః కావ్యమ్" అన్న పెద్దల వాక్కు ప్రకారం సమాజహితం కోసం రాసిన కావ్యం ప్రజా
హృదయాలను ఆకర్షించాలి. అప్పుడే కావ్య ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే జన జీవనంలో మమేకమైపో యిన
ప్రకృతి వర్ణ నలకు సాహిత్యంలో కవులు అధిక ప్రా ధాన్యతను ఇచ్చి ఉంటారు.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, దానిని ఉపయోగించి సొ ంతవాక్యం రాయండి.
1. భానుడు తూర్పున ఉదయిస్తా డు.
జ). భానుడు = సూర్యుడు
*సొ ంతవాక్యం : సూర్యుడు సమస్త విశ్వానికి వెలుగును ప్రసాదిస్తు న్నాడు.
2. శివుని తాండవం చూస్తే ఆనందం కలుగుతుంది.
జ). తాండవం = నాట్యం
*సొ ంతవాక్యం : మా అక్క కూచిపూడి నాట్యం చాలా బాగా చేస్తు ంది.
3. నాకు అమ్మ భాష అంటే మిక్కిలి ఇష్ట ం.
జ). మిక్కిలి = ఎక్కువ
*సొ ంతవాక్యం : నాకు గుత్తి వంకాయ కూరంటే ఎక్కువ ఇష్ట ం.
4. జింక తత్త రపాటుతో పొ దలోకి దూకింది.
జ). తత్త రపాటు = కంగారు
*సొ ంతవాక్యం : మా అన్నయ్య కుక్కను చూసి కంగారుపడి సైకిల్ పై నుండి కింద పడ్డా డు.
5. సాయంకాలం కాగానే సూర్యబింబం కనుమరుగైంది.
*జ). కనుమరుగవ్వు = కనిపించకుండా పో వు, మాయమవ్వు
సొ ంతవాక్యం : కాలుష్యం వల్ల పిచ్చుక జాతి కనిపించకుండా పో యే ప్రమాదం ఉంది.
ఆ). కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా: నభం = ఆకాశం,గగనం
*ఆకాశంలో నక్షత్రా లు మెరుస్తు న్నాయి. రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తు న్నాడు.
1. ధనువు = ధనుస్సు, విల్లు
*శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టా డు. ఆ విల్లు పెళపెళమంటూ శబ్ద ం చేస్తూ విరిగిపో యింది.
2. పయోధరము = మేఘము, అభ్రము
*ఆకాశంలో మేఘాలు దట్ట ంగా వ్యాపించాయి. ఆ అభ్రములు కరిగి వానగా కురిశాయి.
3. కేదారము = పొ లము, పంటభూమి
*మా ఊరిలో ఒకప్పుడు పచ్చని పొ లాలు ఉండేవి. ఇప్పుడు ఆ పంటభూములు చేపల చెరువులుగా
మారిపో యాయి.
4. సస్యము = పంట, పైరు
*వర్షా లు కురిస్తే పంటలు పండుతాయి. మా చేనులోని పైరు చూడముచ్చటగా ఉంది.
5. వెల్లు వ = ప్రవాహం, వెల్లి
*వెన్నెల ప్రవాహం చూడముచ్చటగా ఉంటుంది. ఆ వెల్లి లో ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్ట ం.
6. నెచ్చెలి = సఖి, స్నేహితురాలు.
* నా ప్రియసఖి లాస్య చాలా మంచి అమ్మాయి. ఆమె తన స్నేహితురాలికి ఎప్పుడూ సాయం చేస్తు ంది.
ఇ). కింది పదాలకు నానార్థా లు రాయండి.
1. ధర = భూమి, వెల
2. పంక్తి = వరుస, గుంపు
3. తారక = నక్షత్రం, కన్ను
4. చుక్క = నక్షత్రము, బిందువు
ఈ). కింది పదాలకు వ్యుత్పత్తు లు రాయండి.
1. సూర్యుడు = సమస్త కార్యములందు జీవులను ప్రేరేపించువాడు. (భానుడు)
2. ధర = సమస్త మును ధరించునది. (భూమి)
3. తోయజము = నీటియందు పుట్టినది. (తామర)
4. శైలము= శిలలతో కూడి ఉండునది. (పర్వతము)
💥
ii). వ్యాకరణాంశాలు :
👉
సంధులు :
వర్ణా ధిక్యంబు"
ఉదా : మా + అమ్మ = మాయమ్మ
👉
మీ + ఇల్లు = మీయిల్లు
సూత్ర వివరణ : సంధి జరగనప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు యడాగమం వస్తు ంది. స్వరం అంటే అచ్చు.
యట్+ఆగమం = య. "య"లో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది. "య్" అనేది ఆగమమవుతుంది.
తెలుగు భాషలో పూర్వపదాంత దీర్ఘా చ్చులకు సాధారణంగా సంధి జరగదు. ఇతర అచ్చులకు కూడా
కొన్ని సందర్భాలలో సంధి జరగదు. రెండు అచ్చుల్ని వరుసగా ఉచ్చరించడం కష్ట ం. కాబట్టి ఉచ్చారణ సౌకర్యం కోసం
వాటి మధ్యలో "య"కారం చేరుతుంది. దీన్నే యడాగమం అంటారు.
వర్ణా ధిక్యం అంటే ఒక వర్ణ ం అధికంగా వచ్చి చేరడం. "మిత్రవదాగమః" అని లక్షణం. ఆగమం మిత్రు ని
వంటిద.ి కాబట్టి ఒక వర్ణ ం మిత్రు నివలె పక్కకు వచ్చి చేరడం ఆగమమని గ్రహించాలి.
రూప సాధన : మా + అమ్మ
'మా' లోని 'ఆ' పూర్వ స్వరం. అమ్మలోని 'అ' కారం స్వరం కంటే పరమైన స్వరం.కాబట్టి దానికి ముందు 'య్' అనేది
ఆగమం అవుతుంది.
మా + అమ్మ = మా + య్ + అమ్మ = మాయమ్మ
మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీయిల్లు
ఈ యడాగమం కళలకు మాత్రమే అని గుర్తు ంచుకోవాలి. ద్రు తప్రకృతికాలకు సంధి లేనిచోట నుగాగమం
వస్తు ంది. (ద్రు తప్రకృతికాలు కాని వాటిని కళలు అంటారు.)
అ). కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి.
1. ఇందుండేగి = ఇందుండు+ ఏగి = ఉత్వసంధి
2. అయ్యెడన్ = ఆ + యెడన్ = త్రికసంధి
3. సుధాంశుడు = సుధ + అంశుడు = సవర్ణ దీరస ్ఘ ంధి
4. బ్రహ్మాదులు = బ్రహ్మ + ఆదులు = సవర్ణ దీరస ్ఘ ంధి
5. దుగ్ధా ంబునిధి = దుగ్ధ+ అంబునిధి = సవర్ణ దీరస ్ఘ ంధి
ఆ). పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి.
1. సవర్ణ దీరస ్ఘ ంధి :
i). మధురానుభూతి = మధుర + అనుభూతి
ii). వేంకటాచార్యుడు = వేంకట+ ఆచార్యుడు
iii). రామాయణం = రామ + ఆయణం
2. ఉత్వసంధి :
i). చదువుతున్నప్పుడు= చదువుతు + ఉన్నప్పుడు
ii). కావ్యమనే = కావ్యము + అనే
iii). తినిపిస్తు ంటే = తినిపిస్తు + ఉంటే
3. త్రిక సంధి :
i). అయ్యెడ = ఆ + యెడ
💥సమాసాలు :
అ). ఖాళీలను పూరించండి.
సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
💥
అయ్యింది.
👉
ఛందస్సు :
మ స జ స త త గ
UUU I I U I U I I I U U U I U U I U
ఉదా : తారాస| స్యముపం| డినన్ గ| గనకే| దారంబు| నంజంద్ర| కా
*శార్దూ ల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థా నం.
👉
6. ప్రా స నియమం ఉంది.
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
I I I IUI U I I I U I I U I IUI U I U
1. ఉదయ| ధరాధ| రంబుప| యినుండి| హుటాహు| టినేగు| దెంచుచో
న జ భ జ జ జ ర
జ). ఇది చంపకమాల పద్యపాదము.
*చంపకమాల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
4.ఆత్మకథ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. శాలువా కప్పినప్పుడు కవికి ఎవరెవరు గుర్తు కు వచ్చారు? చెప్పండి.
జ). శాలువా కప్పినప్పుడు కవికి ఒంటినిండా బట్ట లేని వాళ్ళ జేజమ్మ మసకరూపం గుర్తు కువచ్చింది. ఆమె
రూపం గుర్తు కు వచ్చినప్పుడల్లా తన గుండెల్ని కోస్తు న్నట్లు గా కవిగారికి ఎంతో బాధగా అనిపిస్తు ంటుంది.
2. సన్మానం పొ ందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఎలా కనిపించింది?
జ). సన్మానం పొ ందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఊరి పొ లిమేర దగ్గ రే నిలబడ్డ ట్లు గా కనిపించింది.
3. ఆత్మకథ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జ). ఆత్మకథ పాఠ్యభాగ రచయిత డాII.ఎండ్లూ రి సుధాకర్. ఈయన 1959వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా
రావికుంటపల్లెలో పుట్టా రు. పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో
ఆచార్యునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. వర్త మానం, మల్లెమొగ్గ ల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం,
నల్ల ద్రా క్షపందిర,ి ఆటాజనిగాంచె, జాషువా సాహిత్యం పై విశ్లేషణ వీరి రచనలు. కవిరత్న, నవయుగ వచన కవితా
చక్రవర్తి అనేవి వీరి బిరుదులు.
ఆ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అమెరికాలోని శ్వేత జాతీయులు నల్ల వారిపై చూపే జాతి వివక్షకు వ్యతిరేకంగా పో రాడిన యోధుడు
మార్టిన్ లూథర్ కింగ్. ••••••••••••••••••••••••• 35 ఏళ్ళకే నోబెల్ శాంతి బహుమానం పొ ందాడు.
@ప్రశ్నలు :
1. మార్టిన్ లూథర్ కింగ్ భవిష్యత్తు ను గురించి ఏం కలకన్నాడు?
జ). అన్యాయం, అణచివేతలతో ఎడారి అయిన మిసిసిపి రాష్ట ం్ర స్వేచ్ఛ, న్యాయాల ఒయాసిస్సులను పొ ందే రోజు
వస్తు ందని మార్టిన్ లూథర్ కింగ్ భవిష్యత్తు ను గురించి కలకన్నాడు.
2. ఉద్యమాల ద్వారా అతను సాధించిన విజయాలేమిటి?
జ). పౌర హక్కుల కోసం పో రాటం చేసిన యోధుడిగా ప్రపంచం చేత గుర్తించబడ్డా డు. నల్ల జాతి ప్రజలను నడిపించిన
శక్తిగా కీర్తి పొ ంది, 35 ఏళ్ల కే నోబెల్ శాంతి బహుమానం పొ ందాడు.
3. పై పేరాలో 'కల' అని అర్థా న్నిచ్చే పదం ఏది?
జ). పై పేరాలో స్వప్నం అనే పదం కల అనే అర్థా న్ని ఇస్తు ంది.
4. ఆకలింపు చేసుకోవడం అంటే? ( ఆ )
అ). ఆవలించడం ఆ). అర్థం చేసుకోవడం ఇ). పో రాడడం
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?
ఇ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
20వ శతాబ్ద ం స్వేచ్ఛా స్వాతంత్ర్య ఉద్యమాలకు ఆలవాలం.•••••••••••••••••••• నాగప్పగారి సుందర్రా జు,
కొలకలూరి స్వరూపరాణి, చల్ల పల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని మొదలైన వారు దళిత కథా సాహిత్యాన్ని
పరిపుష్ట ం చేశారు.
@ప్రశ్నలు :
1. ప్రజల హక్కుల కోసం కవులు ఏమి చేస్తా రు?
జ). ప్రజల హక్కుల కోసం కవులు వ్యథార్థ జీవుల గాథలకు పట్ట ం కడుతూ రచనలు చేయడం మొదలెట్టా రు.
2. రాయలసీమ ప్రా ంతంలో దళిత జీవితాన్ని చిత్రించిన కథకులు ఎవరు?
జ). శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర
3. ప్రా తః స్మరణీయుడు అంటే అర్థం ఏమిటి?
జ). వేకువజామునే తలుచుకోదగిన మహనీయుడు అని అర్థం.
4. పై పేరా చదివి రచయిత్రు ల పేర్లు రాయండి.
జ). కొలకలూరి స్వరూపరాణి, చల్ల పల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని
5. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). "ఊరబావి" కథను ఎవరు రాశారు?
మౌనంగా భరించిన వారి కులంలో తరువాతి తరాలవారు కష్ట పడి చదువుకుని నలుగురికీ ఆదర్శవంతంగా
నిలిచారు. అందరిచేత సన్మానం చేయించుకునే స్థా యికి ఎదిగారు. విద్య వారిలోని అంటరానితనాన్ని పో గొట్టింది.
ఒకప్పుడు కులపరంగా అవమానించిన సమాజం నేడు వారిని విద్యావంతులుగా ఎంతో గౌరవిస్తు ంది.
ఇది కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో వచ్చిన మార్పుగా కవిగారు భావించారు. ఇదంతా విద్య
ద్వారానే సాధ్యమయ్యిందని నమ్మారు. అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత స్థితికి చేరుకున్న తన జీవితమే
అందరికీ ఆదర్శవంతం కావాలని కవిగారు భావించారు. అందుకే 'కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా
చదువుతుంద'ని కవిగారు అని ఉంటారు.
3. తమ గురించి తాము చెప్పుకోవడమే ఆత్మకథ. ఏదైనా ఒక వస్తు వు/ పక్షి/ జంతువును ఎంపిక చేసుకుని అవి
తమ గురించి తాము ఏమేమి చెప్పుకుంటాయో ఊహించి ఆత్మకథలా రాయండి.
జ). "నల్ల బల్ల ఆత్మఘోష"
హాయ్ పిల్లలూ..! నన్ను గుర్తు పట్టా రా! నేను..నల్ల బల్ల ను. నన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు కొస్తు ంది కదూ!
గతంలో నేను పాఠశాలల్లో ని ప్రతి తరగతి గదిలోనూ ఉండేదాన్ని. నన్ను ఆంగ్ల ంలో బ్లా క్ బో ర్డ్ అంటారు. ఒకప్పుడు
మీ తాతలకు, తండ్రు లకు విద్యాబుద్ధు లు నేర్పింది నేన.ే మీకు చదువుచెప్పే ఉపాధ్యాయులకు చదువు నేర్పింది
కూడా నేన.ే నా పైన సుద్ద ముక్కలతో వ్రా సి ఉపాధ్యాయులు విద్యార్థు లకు పాఠాలు బో ధించేవారు. నాపై వ్రా సిన
వ్రా తను నేర్చుకుని ఎంతోమంది వారి తలరాతను ఉన్నతంగా మలచుకున్నారు. ఇదంతా గతం.
ప్రస్తు తకాలంలో సాంకేతిక పరిజ్ఞా నం పేరుతో వస్తు న్న పెను మార్పుల ప్రభావం వల్ల నా ఉనికే
ప్రశ్నార్థకమయ్యింది. గత కొంతకాలంగా గ్రీన్ బో ర్డు లు, ఐ.ఎఫ్.పి ప్యానల్లు నా స్థా నాన్ని ఆక్రమించాయి. కొత్త దనాన్ని
స్వాగతించడం మంచిదే కానీ ఆ వంకతో పాతను పూర్తిగా పాతిపెట్టడం మంచిది కాదు కదా! ఇక్కడ అందరూ ఒక్కటి
గమనించాలి నేను మన్నినంత కాలం ఇవేవీ మన్నలేవు. ఇది మాత్రం వాస్త వం. నా చరిత్ర రాబో యే తరాలవారికి ఒక
కథగానైనా చెప్పుకుంటారని ఆశపడుతున్నాను. నన్ను ఇంతకాలం ఆదరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
తెలుపుకుంటూ హృదయవేదనతో నిష్క్రమిస్తు న్నాను. ఇక సెలవు.
4. 'మనుషులందరూ సమానమే' అనే అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జ). మనమంతా మనుషులం - లేదు మన మధ్య అంతరం
కులం వద్దు , మతం వద్దు - మానవత్వమే మనకు ముద్దు
ఐకమత్యమే మన బలం - అదే మన ఆయుధం
వైషమ్యాలు వదిలేద్దా ం - సొ దరుల్లా కలిసి జీవిద్దా ం
సంపదలు ఉన్నా, లేకున్నా - కలిసిమెలిసి జీవిద్దా ం
మమతను అందరికీ పంచుదాం - మనుషులమని చాటుదాం
మనమధ్య ఎలాంటి స్పర్థలూ వద్దు - సమానత్వమే దానికి హద్దు
III).భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింద ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం తెలుసుకొని సొ ంతమాటల్లో రాయండి.
1. నాలుగు రోడ్ల చౌరస్తా లో జాతీయ జెండా ఎగురవేశారు.
జ). చౌరస్తా = కూడలి
*అమలాపురం గడియారస్త ంభం కూడలిలో గాంధీ విగ్రహం ఉంది.
2. ఊరి గుడిసె అగ్నికి అర్పణం అయ్యింది.
జ). అర్పణం = సమర్పించడం/ఇవ్వడం
*వేంకటేశ్వరస్వామికి భక్తు లు విలువైన కానుకలు సమర్పించుకుంటారు.
3. ఆ పిల్లలు తెలివితేటల్లో చురకత్తు ల్లా ఉన్నారు.
జ). చురకత్తు లు = పదునైన కత్తు లు
*రాజులు యుద్ధా లు చేసేటప్పుడు పదునైన కత్తు లు ఉపయోగించేవారు.
ఆ). కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. స్వర్ణ ం = బంగారం, కనకం, పుత్త డి
2. సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు
3. కళ్ళు = నయనాలు, నేత్రా లు
4. దేహం = కాయం, మేను, శరీరం
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
💥
👉
ఆమ్రేడిత సంధి :
ఈ కింది ఉదాహరణలను పరిశీలించండి.
ఔరౌర = ఔర + ఔర
ఓహో హో = ఓహో + ఓహో
👉
ఏమేమి = ఏమి + ఏమి
సూత్రం - 1 : ఈ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తు ంది. ఇలా
👉
రెండు ఒక విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు.
సూత్రం - 2 : ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తు ంది.
ఉదా : అప్పటికిన్ + అప్పటికిన్ = అప్పటప్పటికిన్
అక్కడన్ + అక్కడన్ = అక్కడక్కడన్
అ). కింది పదాలు విడదీసి, సంధి పేరు తెలపండి.
1. పావనమైనది = పావనము + ఐనది = ఉత్వసంధి
2. ధర్మమొకటి = ధర్మము + ఒకటి = ఉత్వసంధి
3. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు = అత్వసంధి
💥
4. గుర్తు కొస్తు ంది = ఈ పదం తప్పుగా ఇవ్వబడింది.
👉
సమాసాలు :
👉
తత్పురుష సమాసం : ఉత్త ర పద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం.
ప్రథమా తత్పురుష సమాసం : ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం, ఉత్త ర పద అర్ధ ప్రా ధాన్యత కలిగినది
ప్రథమా తత్పురుష సమాసం. ప్రథమా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (డు, ము, వు, లు)
ఉదా : మధ్యాహ్నము - అహ్నము మధ్య భాగము
👉
నడిరేయి - రేయి నడిమి భాగము
ద్వితీయా తత్పురుష సమాసం : ద్వితీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (నిన్, నున్, లన్, కూర్చి,
గురించి)
ఉదా : కృష్ణా శ్రితుడు - కృష్ణు ని ఆశ్రయించినవాడు
👉
నెలతాల్పు - నెలను తాల్చినవాడు
తృతీయా తత్పురుష సమాసం : తృతీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (చేతన్, చేన్, తోడన్, తోన్)
ఉదా : వాక్కలహము - వాక్కు చేత కలహము
👉
విద్యాహీనుడు - విద్య చేత హీనుడు
చతుర్థీ తత్పురుష సమాసం : చతుర్థీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కొరకున్, కై)
ఉదా : ధనాశ - ధనము కొరకు ఆశ
👉
పొ ట్ట కూడు - పొ ట్ట కొరకు కూడు
పంచమీ తత్పురుష సమాసం : పంచమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (వలనన్, కంటెన్, పట్టి)
ఉదా : దొ ంగభయం - దొ ంగ వలన భయం
పాప విముక్తు డు - పాపము వలన విముక్తు డు
👉షష్ఠీ తత్పురుష సమాసం : షష్ఠీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్)
ఉదా : రాజపుత్రు డు - రాజు యొక్క పుత్రు డు
👉
యజ్ఞ ఫలం - యజ్ఞ ము యొక్క ఫలం
సప్త మీ తత్పురుష సమాసం : సప్త మీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (అందున్, నన్)
ఉదా : నీతి పారగుడు - నీతి యందు పారగుడు
మాటనేర్పరి - మాట యందు నేర్పరి
ఆ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి.
1. మేలు వస్త్రా లు - మేలైన వస్త్రా లు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
*వస్త్రా లు (నామవాచకం), మేలు (విశేషణం)
2. ముతక పంచెలు - ముతకవైన పంచెలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కొత్త దేవుళ్ళు - కొత్త వారైన దేవుళ్ళు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. వక్రధ్వనులు - వక్రమైన ధ్వనులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
💥అలంకారాలు :
5. నాలుగు పంక్తు లు - నాలుగు సంఖ్యగల పంక్తు లు - ద్విగు సమాసం
అ). రూపకాలంకారం :
(i)"మా అమ్మ చేతి వంట అమృతం".
పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం, అమృతం - ఉపమానం. అమ్మ చేతి వంటకు - అమృతానికి
భేదం లేదని (అభేదం) చెప్పడం కనిపిస్తు ంది.
*నిర్వచనం : ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు.
ఉదా : ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే!
*సమన్వయం : ఇక్కడ మహారాజు ఉపమేయం, ఈశ్వరుడు ఉపమానం. 'సాక్షాత్తు ' అనే పదం రాజుకు, ఈశ్వరునికి
భేదం లేదు అని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
(ii)"నా కడుపులో అవమానాల చురకత్తు లు గుచ్చుకుంటాయి".
అవమానాల చురకత్తు లు - అవమానాలనెడి చురకత్తు లు
*సమన్వయం : అవమానం - ఉపమేయం, చురకత్తు లు - ఉపమానం
💥
అవమానాలు - చురకత్తు లకు భేదం లేదని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
👉
ఛందస్సు :
కింది పద్య పాదాలకు గురు - లఘువులను గుర్తించండి. శార్దూ ల పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
ఉదా : U U U I I U I U I I I U U U I U U I U
ఆనందం| బుననా| ర్ధరాత్ర| ముల జం| ద్రా లోక| ముల్ కాయ| గా
మ స జ స త త గ
👉
* ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
శార్దూ లము పద్య లక్షణాలు :
1.ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి
2. ప్రతి పాదంలోనూ వరుసగా మ , స , జ , స , త , త , గ అనే గణాలు వస్తా యి.
3. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలోను 1 - 13 అక్షరాలకు యతి కుదురుతుంది.
5. ప్రా సనియమం ఉంటుంది.
*సమన్వయం: పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (ఆ - ద్రా ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.
U UU I IU I UI I I U UU I U U I U
1. మాయామే |య జగం| బె నిత్య| మని సం| భావించి| మోహంబు| నన్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
UU U I I U I U I I I U UU I U UI U
2. బావా యె| ప్పుడు వ| చ్చితీవు| సుఖులే| భ్రా తల్సు| తుల్ చుట్ట | ముల్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (బా - భ్రా ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి పైన ఇచ్చిన పద్య పాదము శార్దూ ల
వృత్తా నికి చెందినదని చెప్పవచ్చు.
UUU I IU IUI I I U U U I U U I U
3. ప్రా కారం| బు గదా| ప్రహార| ముల ను| త్పాటించి| యంత్రంబు| లున్
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (ప్రా - త్పా) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.
U U U II U I U I I I U UU I U UI U
4. కంటిన్ జా| నకి బూ| ర్ణ చంద్ర| వదనన్| గల్యాణి| నాలంక| లో
మ స జ స త త గ
*ఈ పద్యపాదము శార్దూ లము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1. మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
2. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
3. 1 - 13 అక్షరాలకు (క - గ) యతిస్థా నము చెల్లి ంది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూ ల వృత్తా నికి
చెందినదని చెప్పవచ్చు.
*******
5.స్నేహం
I).అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పాఠంలోని పద్యాలను రాగయుక్త ంగా పాడండి.
జ). (ఉపాధ్యాయుడు రాగయుక్త ంగా పాడుతున్నప్పుడు గమనిస్తూ , విద్యార్థు లు పాడటానికి ప్రయత్నిస్తా రు.)
2. పాఠంలో మీకు నచ్చిన స్నేహం గురించి మాట్లా డండి.
జ). ఈ పాఠంలో నాకు కృష్ణ కుచేలుల స్నేహం బాగా నచ్చింది. కృష్ణు డు, కుచేలుడు చిన్నతనంలో సాందీపుని
వద్ద విద్యాభ్యాసం చేశారు. అప్పుడు ఏర్పడ్డ వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. కాలక్రమంలో కుచేలుడు పరమ
దారిద్య్ర స్థితికి చేరుకున్నాడు. ఒకరోజు తన బాల్యమిత్రు డైన శ్రీకృష్ణు ని దర్శించడానికి కుచేలుడు అతని మందిరానికి
చేరుకున్నాడు. బాల్య స్నేహితుడిని చూడగానే శ్రీకృష్ణు డు హంసతూలికా తల్పం నుండి దిగి పరుగు పరుగున వచ్చి
అతనిని కౌగిలించుకున్నాడు. తన హంసతూలికా తల్పంపై కుచేలుడిని కూర్చోబెట్టు కున్నాడు. ఈ విధంగా వారిద్దరి
స్నేహం ధనిక, పేద భేదం చూపకుండా జీవితాంతం కొనసాగింది. కాబట్టి నాకు కృష్ణ కుచేలుల స్నేహం బాగా
నచ్చింది.
3. కింది మాటలు ఎవరు, ఎవరితో, ఎందుకన్నారో పాఠం ఆధారంగా రాయండి.
అ). మీ చిన్ననాటి మిత్రు ని వద్ద కు వెళ్లి రా!
జ). ఈ మాటలు కుచేలునితో అతని భార్య అన్నది. కుచేలుని కుటుంబం పరమ దారిద్య్ర స్థితిని
అనుభవిస్తు న్నది. ఆగర్భ శ్రీమంతుడైన శ్రీకృష్ణు డు కుచేలునికి బాల్యమిత్రు డు. అందువల్ల అతని వద్ద కు వెళితే
ఏమైనా సహాయం చేస్తా డేమో అనే ఉద్దేశంతో ఆమె ఈ మాటలు అన్నది.
ఆ). మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
జ). ఈ మాటలు హనుమంతుడు శ్రీరామునితో అన్నాడు. మహా పరాక్రమవంతుడైన శ్రీరాముడు, సర్వ
సమర్ధు డైన సుగ్రీవుల మధ్య స్నేహం కుదిరితే వారిరువురికీ లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో హనుమంతుడు ఈ
మాటలు అన్నాడు.
ఇ). నిశ్చలమైన ప్రేమతో ఇచ్చేదేదైనా స్వీకరిస్తా ను.
జ). ఈ మాటలు శ్రీకృష్ణు డు తన బాల్య మిత్రు డైన కుచేలునితో అన్నాడు. శ్రీకృష్ణు డు ఆగర్భ శ్రీమంతుడు.
కుచేలుడు కటిక దరిద్రు డు. అయినప్పటికీ కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను విప్పి శ్రీకృష్ణు డు ఆత్రంగా
తిన్నాడు. దీని ద్వారా శ్రీ కృష్ణు డు స్నేహానికి ధనిక, పేద భేదం లేదని, నిశ్చలమైన ప్రేమ ఉంటే చాలనే గొప్ప
సందేశాన్ని సమాజానికి చాటాడు.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేద.ి •••••••••••••• కొత్త గా వచ్చిన వారిని నమ్మరాదనీ,
దీనితో మనకు మైత్రి మంచిది కాదనీ తెలిపింది.(పంచతంత్ర కథ)(పూర్తి గద్యానికి పాఠ్య పుస్త కంలో 66వ పుట చూడగలరు)
@ప్రశ్నలు :
1. ఈ కథలో మంచి మిత్రు లు ఎవరు?
జ). ఈ కథలో కాకి, లేడి మంచి మిత్రు లు.
2. జింక నక్కను చూసి ఏమని భావించింది?
జ). జింక నక్కను చూసి 'ఆపదలో ఉన్నవారినైనా, ఆతిథ్యం కోరి వచ్చిన వారినైనా, స్నేహం ఆశించి వచ్చిన
వారినైనా ఆదరించడం కనీస ధర్మమని' భావించింది.
3. పై పేరాలో 'స్నేహం' అనే అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). పై పేరాలో "మైత్రి" అనే పదం స్నేహం అనే అర్ధా న్నిస్తు ంది.
4. నక్క స్వభావం ( అ )
అ). జిత్తు లమారి ఆ). మంచి గుణం కలది ఇ). తనపని తాను చేసుకొనేది.
5. పై పేరా ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి.
జ). కొత్త గా వచ్చిన వారిని నమ్మరాదని కాకి ఎవరితో అన్నది?
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశ స్వాతంత్రో ద్యమపు రోజులవి. ••••••••••••••••పేదరికంలో పుట్టినా న్యాయవాదిగా,
రాజకీయవేత్తగా,రాష్ట ్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మహో న్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం.(నా జీవితయాత్ర నుండి).
(పూర్తి గద్యానికి పాఠ్య పుస్త కంలో 66, 67 పుటలు చూడగలరు.)
@ప్రశ్నలు :
1. టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు ఏమిటి?
జ). "ఆంధ్రకేసరి" అనేది టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు.
2. ప్రకాశం తల్లిదండ్రు ల పేర్లు రాయండి.
జ). సుబ్బమ్మ, గోపాలకృష్ణ య్య గార్లు ప్రకాశం గారి తల్లిదండ్రు లు.
3. ఇమ్మానేని హనుమంతరావు గారు ఈ వృత్తి కి చెందినవారు. ( ఆ )
అ). వైద్యుడు ఆ). అధ్యాపక(ఉపాధ్యాయ) ఇ). వ్యవసాయం
4. పై పేరాలో నామవాచకాలను గుర్తించి రాయండి.
జ). భారతదేశం, బొ ంబాయి, మద్రా సు, పార్థసారథి, టంగుటూరి ప్రకాశం, సుబ్బమ్మ, గోపాలకృష్ణ య్య, ఇమ్మానేని
హనుమంతరావు నాయుడు. …..
5. పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి.
జ). సైమన్ కమీషన్ బొ ంబాయిలో ఎప్పుడు అడుగు పెట్టింది?
II).వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. శ్రీరామ, సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జ). హనుమంతుడు తన వాక్చాతుర్యంతో శ్రీరాముడు, సుగ్రీవుల మధ్య స్నేహాన్ని కుదిర్చాడు. తాము
ప్రా ణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులు ఇరువురు ప్రతిజ్ఞ చేశారు. సీతను
వెతకడంలో సుగ్రీవుడు ముఖ్య పాత్ర పో షించాడు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి
రాజుగా చేశాడు. ఈ విధంగా ఒక సమర్ధు డు మరొక సమర్ధు నితో స్నేహం చేసి స్వకార్యాన్ని, మిత్రకార్యాన్ని
చక్కబెట్టు కున్నారు. లోక కళ్యాణానికి కారకులయ్యారు. సమర్థు ల స్నేహానికి చక్కని ఉదాహరణగా శ్రీరామ,
సుగ్రీవుల మైత్రిని చెప్పవచ్చు.
2. మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలు రాయండి.
జ). స్నేహానికి సమానమైన ధర్మం ఈ భూమండలంలో లేదు. స్నేహం ఎంతో పవిత్రమైనది. మంచి స్నేహం
వివేకాన్నిస్తు ంది. మనలో ధైర్యాన్ని నింపుతుంది. మంచి స్నేహం వలన ఇరువురకూ మేలు జరుగుతుంది. కలలో
కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా ప్రా ణం ఉన్నంత వరకు స్నేహితులిద్ద రిని కలిపే ఉంచుతుంది. మనుషుల
మధ్య కుల, మత, వర్గ , ప్రా ంతీయ భేదాలను తొలగిస్తు ంది. మంచి స్నేహం వలన వ్యక్తిగత ప్రయోజనంతో పాటు
సమాజాభివృద్ధి కూడా జరుగుతుంది.
3. శ్రీకృష్ణ కుచేలులు మంచి స్నేహితులనడానికి కారణాలు రాయండి.
జ). శ్రీకృష్ణు డు, కుచేలుడు చిన్నతనంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు. శ్రీకృష్ణు డు ఆగర్భ
శ్రీమంతుడు. కుచేలుడు పరమ దారిద్య్ర స్థితిని అనుభవిస్తు న్నాడు. ఒకరోజు తన బాల్య మిత్రు డైన శ్రీకృష్ణు ని
దర్శించడానికి కుచేలుడు అతని మందిరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణు డు ఆప్యాయంగా ఆదరించి తన హంసతూలికా
తల్పంపై కుచేలుడిని కూర్చోబెట్టు కుని, అతడు తెచ్చిన అటుకుల మూటను విప్పి ఆత్రంగా తిన్నాడు. ఈ విధంగా
వారిద్దరి స్నేహం ధనిక, పేద భేదం చూడకుండా జీవితాంతం కొనసాగింది. ఈ సంఘటన ఆధారంగా శ్రీకృష్ణ కుచేలులు
మంచి స్నేహితులని చెప్పవచ్చు.
4. ద్రు పదుడు చేసిన తప్పు ఏమిటి? దాని వలన కలిగిన ఫలితమేమిటి?
జ). ద్రు పదుడు, ద్రో ణాచార్యుడు బాల్య స్నేహితులు. కాలక్రమంలో ద్రు పదుడు రాజయ్యాడు. ద్రో ణాచార్యుడు
అస్త శ్ర స్త ్ర విద్యలు నేర్పే గురువయ్యాడు. ఒకసారి ద్రో ణుడు తన బాల్యమిత్రు డైన ద్రు పదునితో తన పేదరికాన్ని గురించి
చెప్పి, ఒక ఆవును దానంగా ఇమ్మని కోరాడు. దానికి ద్రు పదుడు అతని పేదరికాన్ని అవహేళన చేస్తూ , తమ
ఇద్ద రిమధ్య ఎప్పటికీ స్నేహం కుదరదని ద్రో ణుని నిందించాడు. ఈ మాటలను మనసులో ఉంచుకుని ద్రో ణుడు
అర్జు నుని మంచి విలుకానిగా తయారుచేశాడు. అర్జు నిని ద్వారా ద్రు పదుని బంధింపజేసి తనకు జరిగిన
అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
5. "పద్యం" ప్రక్రియను గురించి రాయండి.
జ). సాహిత్య ప్రక్రియలలో విశిష్ట మైనది పద్యం. ఇది ఛందో బద్ధ మైనది. లయాత్మకంగా, గానయోగ్యంగా
ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రా చీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య
రచనకు ప్రా ముఖ్యత ఇచ్చారు. కవి తన రచనలలో భావవ్యక్తీకరణకు అనువుగా వృత్తా లు, జాతులు, ఉపజాతులు
అనే కొన్ని పద్య శైలులను ఎంచుకుంటాడు. పద్యం పఠితకు రసానుభూతిని, మానసిక ఆనందాన్ని కలిగిస్తు ంది.
విలోలుండు + ఐ = చలించువాడై
చూచి = చూసి
తల్పమున్ = పానుపును
దిగెన్ = దిగాడు
భావము : నిరంతర దారిద్య్ర పీడితుడు, కృశించిన అంగములు కలవాడు, చినిగిన వస్త మ ్ర ులు ధరించినవాడు,
ఆశాపూరిత చిత్తు డు, హాస్యానికి చిరునామా ఐనవాడు, అయిన కుచేలుడు వస్తు ంటే అల్ల ంత దూరంలో చూసిన
పద్మాల రేకులవంటి కన్నులుగల శ్రీకృష్ణు డు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు.
4. స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏఏ విషయాలలో జాగ్రత్త వహించాలి?
జ). స్నేహం పవిత్రమైనది. స్నేహానికి సమానమైన ధర్మం ఈ లోకంలో లేదు. స్నేహితుని ఎంపిక
చేసుకోవడంలో అనేక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మన పక్కన చేరి, మనల్ని పొ గుడుతూ ఉండేవారంతా
నిజమైన స్నేహితులు కాదని తెలుసుకోవాలి. కష్టా లు ఎదురైనప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడే
నిజమైన మిత్రు డని గ్రహించాలి. మనకి చెడు అలవాట్లు నేర్పే వారిని స్నేహితులుగా ఎంచుకోకూడడు. మనకి బాధ
కలిగినప్పుడు మనలో ధైర్యాన్ని నింపేవారే నిజమైన స్నేహితులని తెలుసుకోవాలి.
స్వార్థంతో ఆలోచించే వారితో స్నేహం చేయకూడదు. తమ మధ్య ఉన్న చిన్నచిన్న స్పర్థలను ఇతరులకు
చెప్పని వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి. స్నేహం కోసం ధనాన్ని వదులుకోవడానికి, కోరికలను అదుపులో
ఉంచుకోవడానికి సిద్ధపడేవారిని స్నేహితులుగా ఎంచుకోవాలి. ప్రతీ చిన్న విషయానికీ తగవులాడుతూ విడిపో వాలని
చూసే వారిని స్నేహితులుగా ఎంచుకోకూడదు. ధనిక, పేద, కుల, మత, వర్గ , ప్రా ంతీయ భేదాల్ని చూపకుండా
నిస్వార్థంగా స్నేహం చేసేవారిని స్నేహితులుగా ఎంచుకోవాలి.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా న్ని రాసి, వాటితో సొ ంత వాక్యాలు రాయండి.
ఉదా : మానవులు సంపదను మంచి మార్గ ంలో సంపాదించాలి.
జ). సంపద = ధనం
*ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు.
1. ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణ ంతో మెరుస్తు న్నాయి.
జ). సౌధము = భవనము
*మాకు రెండు అంతస్తు ల భవనము ఉంది.
2. కృష్ణు నికి, కుచేలుడు తండులములు బహుకరించాడు.
జ). తండులములు = వరి అటుకులు
*వరి అటుకులను నానబెట్టి, బెల్లం కలిపి దేవుని ప్రసాదంగా పంచుతారు.
3. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు.
జ). ప్రతిజ్ఞ = శపథం
*సైనికులు దేశరక్షణకు కట్టు బడి ఉంటామని శపథం చేస్తా రు.
4. చెడ్డ వారితో సఖ్యం మంచిది కాదు.
జ). సఖ్యం = స్నేహం
*ఎల్ల ప్పుడూ మంచివారితోనే స్నేహం చెయ్యాలి.
ఆ). కింది వాక్యాలు చదివి పర్యాయపదాలను గుర్తించి రాయండి.
1. మంచి మిత్రు లతో స్నేహం చేయాలి. నేస్తా లతో సరిగా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలలో
ఆదుకుంటారు.
జ). మిత్రు లు, నేస్తా లు, స్నేహితులు
2. ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి.ఆ శయ్యలు మెత్తనైనవి.ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది.
జ). తల్పము, శయ్య, పరుపు
3. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్ట ం. పుట్టినరోజున కొత్త వస్త్రా లు
ధరించింది.
జ). వసనములు, అంబరములు, వస్త్రా లు
4. ప్రతి ప్రా ణికి ఉదకం అవసరం. సలిలము లేనిదే మనుగడ లేదు. కావున జలమును వృధా చేయకూడదు.
జ). ఉదకం, సలిలం, జలం
5. తామర పత్రం నీటి బిందువులతో మెరుస్తు ంది. అందువల్ల ఆ దళం మరింత అందంగా కన్పిస్తు ంది.
ఆ ఆకుతో పూల పొ ట్ల ం కడతారు.
జ). పత్రం, దళం, ఆకు
ఇ). కింది పదాలకు సరియైన నానార్థా లను గుర్తించి రాయండి.
1. విభుడు ( ఆ ) అ). పండు, కార్యం, పరిణామం
2. కను ( ఇ ) ఆ). ప్రభువు, శివుడు, బ్రహ్మ
3. దళం ( ఈ ) ఇ). చూచు, వెదకు, జన్మనిచ్చు
4. ఫలం ( అ ) ఈ). ఆకు, భాగం, దండు
ఈ). కింది పదాలకు సరైన వ్యుత్పత్త ్యర్థా లను గుర్తించి రాయండి.
1. గురువు ( ఉ ) అ). మరణం లేనిది. (సుధ)
2. మిత్రు డు ( ఇ ) ఆ). గృహాన్ని ధరించేది. (ఇల్లా లు)
3. మోక్షం ( ఈ ) ఇ). సర్వభూతాల పట్ల స్నేహభావం గలవాడు. (సూర్యుడు)
4. పురంధ్రి ( ఆ ) ఈ). జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. (ముక్తి)
5. అమృతం ( అ ) ఉ). అజ్ఞా నమనే అంధకారమును చేదించువాడు. (ఉపాధ్యాయుడు)
ఉ). కింది పదాలను వివరించి రాయండి.
1. బ్రహ్మానందం : మాటల్లో చెప్పలేనంత ఆనందం అని అర్థం. మనం ఊహించిన దానికంటే అధిక ఆనందం
కలిగిన సందర్భంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
2. చక్రపాణి : చక్రము పాణి (చేయి) యందు గలవాడు అనే అర్థంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు. అనగా
విష్ణు మూర్తిని తెలియజేసే పదంగా ఈ చక్రపాణి అనే పదం వాడుకలో ఉంది.
3. కుంభవృష్టి : కుండపో తగా వర్షం కురవడం, ఎక్కువగా వర్షం కురవడం అనే అర్థా లలో ఈ పదబంధాన్ని
ఉపయోగిస్తా రు.
4. తళతళలాడు : ఎక్కువగా మెరుపు కలిగి ఉండటం, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరవడం అనే అర్థా లలో
ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
5. ప్రచండ వాయువు : గాలి బాగా ఎక్కువగా, భయంకరంగా వీస్తు న్నది అని తెలియజేయడానికి
ఈ పదబంధాన్ని ఉపయోగిస్తా రు.
ఊ). కింది వాక్యాలలో గల ప్రకృతి, వికృతులను గుర్తించి రాయండి.
1. హనుమంతుడు కార్యముకై రాముని దగ్గ రకు వెళ్ళెను. ఆ కర్జమును సాధించుకొని వచ్చెను.
జ). కార్యము (ప్రకృతి) - కర్జము (వికృతి)
2. రాజ గృహము బంగారు మయం. ఆ గీము సూర్య కాంతులతో మెరుస్తు న్నది.
జ). గృహము (ప్రకృతి) - గీము (వికృతి)
3. పెద్దల పట్ల గౌరవం కలిగివుండాలి. వారిని గారవించడం మన సంప్రదాయం.
జ). గౌరవం (ప్రకృతి) - గారవం (వికృతి)
4. రాముడు ధర్మం కలవాడు. ఆ దమ్మమే అతనిని కాపాడింది.
జ). ధర్మం (ప్రకృతి) - దమ్మం (వికృతి)
5. లక్ష్మి అంటే సంపద. ఆ లచ్చితో మన కష్టా లు తీరుతాయి.
జ). లక్ష్మి (ప్రకృతి) - లచ్చి (వికృతి)
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు:
💥సమాసములు :
5. చెప్పిన + అట్లు = చెప్పినట్లు = అత్వసంధి
💥అలంకారాలు :
👉ఛేకానుప్రా సాలంకారం : శబ్దా లంకారాలలో ఛేకానుప్రా సాలంకారం ఒకటి. దీని గురించి తెలుసుకుందాం.
కింది ఉదాహరణను పరిశీలించండి.
1. విచారింపని పని చేయరాదు.
పై ఉదాహరణను పరిశీలిస్తే "పని" అనే పదం వాక్యంలో అర్ధ భేదంతో పునరుక్త మయ్యింది. మొదటి "పని"
అనే పదం 'విచారింపని' లోని పదభాగం. రెండవ "పని" అనే పదం "కార్యం" అనే అర్థా న్నిస్తు ంది. కాబట్టి ఇది
ఛేకానుప్రా సము.
*లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : పై వాక్యంలో "పని - పని" అనే పదం (హల్లు ల జంట) అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది.
👉
అందువల్ల ఇది ఛేకానుప్రా సాలంకారం.
లాటానుప్రా సాలంకారం : లాటానుప్రా సాలంకారం కూడా శబ్దా లంకారమే. కింది ఉదాహరణ ద్వారా
తెలుసుకుందాం.
1. కమలాక్షు నర్చించు కరములు కరములు.
పై పద్య పాదంలో 'కరములు' అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది.
ఇక్కడ 'కరములు' అంటే చేతులు అని అర్థం. వాక్యంలో 'కరములు కరములు' అని వెంటవెంటనే ప్రయోగించడం వల్ల
"ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు" అనే తాత్పర్య భేదాన్నిస్తు న్నది. కావున ఇది
లాటానుప్రా సాలంకారం.
*లక్షణం : పద్య పాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థ భేదం లేకుండా తాత్పర్య బేధం కలుగునట్లు వెంట
వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రా సాలంకారం అంటారు.
అ). కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం సమన్వయం చేయండి.
1. శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ.
జ). ఈ వాక్యంలో లాటానుప్రా సాలంకారం ఉన్నది.
*లక్షణం : పద్య పాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థ భేదం లేకుండా తాత్పర్య బేధం కలుగునట్లు వెంట
వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రా సాలంకారం అంటారు.
*సమన్వయం :ఈ వాక్యములో ప్రయోగించిన "జిహ్వ" అనే పదానికి నాలుక అని అర్థం. అయితే ఇక్కడ
తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించిన "జిహ్వ" అనే పదానికి నిజమైన నాలుక అని
చెబుతున్నాము. అంటే ఇక్కడ "జిహ్వ" అనే పదానికి రెండుసార్లూ అర్థములో భేదము లేకపో యినప్పటికీ
తాత్పర్యములో భేదము ఉన్నది. కాబట్టి ఈ వాక్యంలో లాటానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.
2. నీటిలో పడిన తేలు తేలుతుందా.
జ). ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారం ఉన్నది.
**లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో అర్ధ భేదం కలిగిన హల్లు ల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్ల యితే దానిని
"ఛేకానుప్రా సాలంకారం" అంటారు.
*సమన్వయం : ఈ వాక్యంలో మొదటి "తేలు" అనే హల్లు ల జంట "వృచ్చికం" అనే అర్థా న్నిస్తు ంది. రెండవ "తేలు"
అనే హల్లు ల జంట "తేలడం" అనే పదంలోని భాగం. ఇక్కడ "తేలు" అనే హల్లు ల జంట వాక్యంలో అర్ధ భేదంతో
పునరుక్త మయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ఛేకానుప్రా సాలంకారము ఉన్నదని చెప్పవచ్చు.
💥ఛందస్సు :
👉ఆటవెలది పద్య లక్షణాలు : ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. పద్య లక్షణాలను పరిశీలిద్దా ం.
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2. 1వ, 3వ పాదాలు ఒక విధంగాను, 2వ, 4వ పాదాలు ఒక విధంగాను ఉంటాయి.
3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
4. 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి.
5. ప్రతిపాదంలో నాల్గ వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లు తుంది.
6. యతిలేని చోట ప్రా సయతి చెల్లు తుంది. 7. ప్రా స నియమం లేదు.
పై లక్షణాలను పరిశీలించినప్పుడు ఆటవెలది పద్యం ఇంద్రగణాలు, సూర్యగణాలచేత ఏర్పడుతుందని
తెలుస్తు ంది. వీటిని గురించి తెలుసుకుందాం.
*ఇంద్రగణాలు 6 - అవి : నల - నగ - సల - భ - ర - త
నలము - I I I I
నగము - I I I U
సలము - I I U I
భగణము - U I I
రగణము - U I U
తగణము - U U I
*సూర్యగణాలు 2 - అవి:
నగణము - I I I
👉
హగణము - U I
కింది ఉదాహరణ ద్వారా ఆటవెలది పద్య లక్షణాలను సమన్వయం చేద్దా ం.
I I I U I UI I I U I I I UI
1. బ్రతుక | వచ్చు | గాక | బహుబంద | నములైన
సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర
U I UI UI U I U I
వచ్చు | గాక | లేమి | వచ్చు | గాక
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య
UI I I I UI I I UI I I I I
జీవ | ధనము | లైన | జెడుగాక | పడుగాక
సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర
U I I I I UI U I I I I
మాట | దిరుగ | లేరు | మాన | ధనులు
సూర్య సూర్య సూర్య సూర్య సూర్య
*పై పద్యపాదాలను గణ విభజన చేయగా ఆటవెలది పద్య లక్షణాలను ఈ విధంగా సమన్వయం చేయవచ్చు.
* 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉండాలి. పై పద్య పాదాలలో అలాగే ఉన్నాయి.
2, 4 పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.ఆ
* ప్రతి పాదంలోని 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి యతి చెల్లు తుంది.
పై పద్యంలో…
1వ పాదంలో బ - బ లకు
2వ పాదంలో వ - వ లకు
3వ పాదంలో జీ - జె లకు
👉
4వ పాదంలో మా - మా లకు యతి చెల్లు తున్నది.
పాఠంలో ఉన్న ఆటవెలది పద్యాన్ని గణ విభజన చేస,ి లక్షణాలను సమన్వయం చేయండి.
1. సరస జేరి నిన్ను సంస్త వ మొనరించు ……………….. నిక్కమైన సఖుడు నీకు దలప
III UI UI U II I I U I
సరస | జేరి | నిన్ను | సంస్త వ | మొనరించు
న హ హ భ సల
UI UI I I I U I UI
వార | లెల్ల | సఖులు | గారు | నీకు
హ హ న హ హ
UI UI U I UI U U U I
కష్ట | కాల | మందు | గాచు వా | డొ క్కండె
హ హ హ ర త
UI UI I I I UI I II
నిక్క | మైన | సఖుడు | నీకు | దలప
హ హ న హ న
*సమన్వయం : ఈ పద్యంలో 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉన్నాయి. అలాగే
2వ, 4వ పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
* ప్రతి పాదంలో 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి (1వ పాదంలో స - స లకు, 2వ పాదంలో వా - గా లకు,
3వ పాదంలో క - గా లకు, 4వ పాదంలో ని - నీ లకు) యతి చెల్లి ంది.
2. మీరు మీరు కలిసి మిత్రు లౌటయ మాకు…………………యరయ సాధుజన సమాగమంబు
U I U I III UI U I I U I
మీరు | మీరు | కలిసి | మిత్రు లౌ | టయ మాకు
హ హ న ర సల
UI UI UI U I UI
జక్షు | రస్తి | భావ | చారి | తార్థ్య
హ హ హ హ హ
I I I UI U I UI I U U I
మఖిల | సృష్టి | సార | మైనది | యొక్కండె
న హ హ భ త
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 41
I I I U I I I I U I U I
యరయ | సాధు | జన స | మాగ | మంబు
న హ న హ హ
*సమన్వయం : ఈ పద్యంలో 1వ, 3వ పాదాలలో వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు ఉన్నాయి. అలాగే 2,
4 పాదాలలో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
* ప్రతి పాదంలో 1వ గణాద్యక్షరానికి - 4వ గణాద్యక్షరానికి (1వ పాదంలో మీ - మి లకు, 2వ పాదంలో జ - చా లకు,
3వ పాదంలో మ - మై లకు, 4వ పాదంలో య - మా లకు) యతి చెల్లి ంది.
*******
6.తీర్పు
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును కవి ఎలా వర్ణించాడో చెప్పండి.
జ). ఒకరోజు రాజకుమారులైన సిద్ధా ర్థు డు, దేవదత్తు డు వన విహారానికి వెళ్ళారు. వారికి ఆకాశవీథిలో
అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే
ఆకాశవీథి ల్లో గొప్ప రసార్ధ్ర భావంతో సంచారం చేస్తు న్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ
ఉన్నాయని కవి హంసల గుంపును మనోహరంగా వర్ణించాడు.
2. హంస ఎలా గాయపడింది?
జ). ఆకాశంలో సంచరిస్తు న్న హంసల గుంపును దేవదత్తు డు చూశాడు. హింసా ప్రవృత్తి తో ఒక పదునైన
బాణాన్ని ఆ హంసల గుంపుపై వదిలాడు. ఆ బాణం ఆ గుంపులోని ఒక హంసకు తగలడంతో అది గాయపడింది.
3. దేవదత్తు డు, గౌతములలో మీకు ఎవరి పాత్ర నచ్చింది? ఎందుకో చెప్పండి.
జ). దేవదత్తు డు, గౌతములలో నాకు గౌతముని పాత్ర బాగా నచ్చింది. ఆకాశంలో ఎగురుతున్న హంసల
గుంపును చూడగానే దేవదత్తు డు ఆ గుంపుపై క్రూ రమైన బాణం వదిలాడు. ఆ బాణం తగిలి గుంపులోని ఒక హంస
గాయపడింది. గాయపడిన హంసను గౌతముడు దయతో తన ఒడిలోకి తీసుకున్నాడు. దానిని బుజ్జ గించి, ప్రేమతో
లాలన చేస,ి దాని దిగులు పో గొట్టా డు. అందుకే హింసా ప్రవృత్తి కలిగిన దేవదత్తు ని కంటే దయాగుణం కలిగిన
గౌతముని పాత్ర నాకు బాగా నచ్చింది.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం ఎంతోమందికి మానసిక ఆనందాన్ని, చక్కటి విందును ఇస్తు ంది.
•••••••••••••••• ఆ ధీశాలి ఎవరో కాదు, అనితర సాధ్యమైన పో రాటంతో ఎన్నో దురాచారాలు రూపుమాపిన
సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్.
@ప్రశ్నలు :
1. జంతుబలిని అడ్డు కొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి ఎవరు?
జ). జంతుబలిని అడ్డు కొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి 'రాజా రామ్ మోహన్ రాయ్'.
2. పై పేరాలో మాట్లా డడం అని అర్థం వచ్చే పదం ఏది?
జ). పై పేరాలో 'ప్రసంగించడం' అనే పదం మాట్లా డడం అనే అర్థా న్నిస్తు ంది.
3. 'విస్తు పో వడం' అనే పదాన్ని ఉపయోగించి సొ ంతవాక్యం రాయండి.
జ). మా అన్నయ్య దొ ంగతనాలు చేస్తు న్నాడనే విషయం తెలిసి మా అమ్మ విస్తు పో యింది.
4. ఆజ్ఞా పించడం అంటే ( ఆ )
అ). ప్రా ర్థించడం ఆ). ఆదేశించడం ఇ). శిక్షించడం ఈ). రక్షించడం
5. పై పేరాకు శీర్షిక రాయండి.
జ). అనితర సాధ్యుడు రాజా రామ్ మోహన్ రాయ్.
ఇ). కింది అపరిచిత గద్యం చదవండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సభక్త జిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. •••••••••••• తదనంతర కాలంలో అతను చక్రవర్తి అయ్యి
గొప్ప కీర్తి ప్రతిష్ఠ లు సంపాదించాడు.
@ప్రశ్నలు :
1. సభక్త జిన్ ఎలా జీవించేవాడు?
జ). సభక్త జిన్ మొదట్లో సిపాయిగా జీవించేవాడు.
2. సభక్త జిన్ తన గుర్రం వెంట పరిగెత్తి వస్తు న్న తల్లి జింకను చూచి ఏమనుకున్నాడు?
జ). దొ రికిపో తానని తెలిసి కూడా పిల్ల కోసం తల్లి జింక పరిగెత్తి రావడాన్ని చూసి సభక్త జిన్ జాలి పడ్డా డు.
3. 'గాలించడం' అంటే అర్థం ఏమిటి?
జ). గాలించడం అంటే వెతకడం అని అర్థం.
4. పై పేరా నుంచి ఏదైనా ఒక ఆలోచనాత్మక ప్రశ్నను రాయండి.
జ). ఏ సన్నివేశం సభక్త జిన్ ను దయాళువుగా మార్చింది?
5. 'హృదయం కరగడం' ఉపయోగించి ఒక సొ ంతవాక్యం రాయండి.
జ). ఆకలితో బాధపడే పేదలను చూసినప్పుడు నా హృదయం కరిగిపో తుంది.
ఆ). కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
1. ఆకాశంలో మేఘాలు ఆవరించినపుడు గగనం నల్ల గా మారుతుంది.
జ). అంబరము = ఆకాశము, గగనము
2. వేటగాళ్ల కు బాణాలు తయారు చేయడం, అమ్ములు సంధించడం తెలుసు.
జ). శరం = బాణం, అమ్ము
3. సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలలూగుతున్నాయి.
జ). సరోవరం = సరస్సు, తటాకం
4. సజ్జ నుల మాటలు అమృతతుల్యాలు. వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి.
జ). వాక్కులు = మాటలు, పలుకులు
5. చేతులు భూషణాలకు మాత్రమే కాదు, హస్తా లు శ్రమించడానికి కూడా ఉపకరిస్తా యి.
జ). కరములు = చేతులు, హస్తా లు
ఇ). కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థా లను గుర్తించి రాయండి.
1. లక్ష్మీ ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు.
జ). శ్రీ = లక్ష్మి, సంపద
2. బాణము తగిలి పక్షి గాయపడింది.
జ). ఖగము = పక్షి, బాణము
3. చైతమ ్ర ాసంలో తేనె విస్తా రంగా దొ రుకుతుంది.
జ). మధు = తేన,ె చైతమ ్ర ు
4. ఆ పాత్రలలో నెయ్యి, నీరు నిండుగా ఉన్నాయి.
జ). ఘృతము = నెయ్యి, నీరు
5. పర్వత సానువులపై చంద్రు డు వెన్నెల కురిపిస్తు న్నాడు.
జ). సో మ = చంద్రు డు, పర్వతం
ఈ). ఈ కింది పదాలకు ప్రకృతి - వికృతి పదాలను రాయండి.
ప్రకృతి - వికృతి
1. లక్ష్మీ లక్ష్మి - లచ్చి
2. హంస హంస - అంచ
3. నాయము న్యాయము - నాయము
4. రతనము రత్నము - రతనము
5. అంకము అంకము - అంకె
6. భీతి భీతి - బీతి
7. త్రో వ త్రో వ - తోవ
8. పేనము ప్రా ణము - పేనము/పానము
9. రాక్షసి రాక్షసి - రక్కసి
10. సంతసము సంతోషం - సంతసం
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
💥సమాసాలు :
5. పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు = గుణసంధి
👉
తత్పురుష సమాసం అవుతుంది.
కింది వాక్యాలలో సమాసపదాలు, సమాసపదాలు కానివి గుర్తించండి.
వాక్యం సమాసంకాని పదాలు సమాస పదాలు
💥అలంకారాలు :
జ). దేవదత్త శౌద్ధోదనులు : దేవదత్తు డును, శుద్ధోదనుడును - ద్వంద్వ సమాసం
💥
*పై ఉదాహరణలలో ఉపమాన, ఉపమేయాలను పో ల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది.
👉
పాఠ్య భాగంలోని 2, 6, 8, 22 పద్యాలలోని అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం చేయండి.
2వ పద్యం : “క్రొ ందలిరాకు సౌరు గయికొన్న…….. తన్మయితా నిమగ్నముల్”
జ). ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో 3వ పాదంలో ఉపమేయమైన మానసమునకు, ఉపమానమైన అంబుజమునకు
👉
(కలువకు) భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
6వ పద్యం : "రెక్కలు దువ్వి, వీపు సవరించి………. గౌతమ కుమారుడు లాలన సేసె హంసమున్"
జ). ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
*స్వభావోక్తి అలంకారం లక్షణం : జాతి, గుణ, క్రియాదుల చేత ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారమంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో గౌతముడు గాయపడిన హంసకు సపర్యలు చేయడం గురించి చెప్పారు. ఇక్కడ
కరుణామూర్తియైన గౌతముడు హంస రెక్కలు దువ్వడం, వీపు సవరించడం, ప్రేమగా మాట్లా డడం వంటి పనులన్నీ
👉
ఉన్నవి ఉన్నట్లు గా వర్ణించి చెప్పబడ్డా యి. కాబట్టి ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
8వ పద్యం : "ఎక్కడనో జనించి, పరమేశ్వరుడిచ్చిన……. శరాగ్ను లోర్చునే?"
జ). ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నది.
*రూపకాలంకారం లక్షణం : ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు గా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో 4వ పాదంలో ఉపమేయమైన శరమునకు (బాణానికి), ఉపమానమైన అగ్నికి భేదం
👉
లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఈ పద్యంలో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
22వ పద్యం : "చెల్లి రావె! మంచిమల్లి రావె……… అంచతల్లి రావె!"
జ). ఈ పద్యంలో వృత్త ్యనుప్రా స అలంకారం ఉన్నది.
*వృత్త ్యనుప్రా స అలంకారం లక్షణం : వాక్యంలో గాని, పద్యంలో గాని, పద్యపాదంలో గాని ఒకే హల్లు అనేకసార్లు
రావడాన్ని వృత్త ్యనుప్రా స అలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యంలో “ల్లి” అనే హల్లు (ద్విత్వ హల్లు ) అనేకసార్లు వచ్చింది. కాబట్టి ఈ పద్యంలో వృత్త ్యనుప్రా స
💥ఛందస్సు :
అలంకారం ఉన్నదని చెప్పవచ్చు
కింది పద్య పాదాలకు గణవిభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి. పద్య లక్షణాలు రాయండి.
U I I UI U I I I U I I U I I U IU I U
1. ఈయది | శాస్త ్ర ధ | ర్మ మొక | యింత స | హించిన | లోక ధ | ర్మమిం
భ ర న భ భ ర వ
*ఇది ఉత్పలమాల పద్య పాదము.
*ఉత్పలమాల పద్య లక్షణాలు :
i). ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
ii). ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తా యి.
iii). ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
iv). ప్రతి పాదంలోనూ 1 - 10 అక్షరాలకు యతి చెల్లు తుంది.
v). ప్రా స నియమం కలదు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. పాదానికి మొత్త ం 20
అక్షరాలు ఉన్నాయి. 1 - 10 అక్షరాలకు (ఈ - యి) యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్యపాదం ఉత్పలమాల పద్యానికి
చెందినదని చెప్పవచ్చు.
I I I I U I U I I I UI I U I I U I UI U
2. గిలగి | ల మందు | వే యొరు | లు గిచ్చి | న కాలి | కి ముల్లు | గ్రు చ్చినన్
న జ భ జ జ జ ర
*ఇది చంపకమాల పద్యపాదము.
*చంపకమాల పద్య లక్షణాలు :
i). ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
ii). ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వస్తా యి.
iii). ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.
iv). ప్రతి పాదంలోనూ 1 - 11 అక్షరాలకు యతి చెల్లు తుంది.
v). ప్రా స నియమం కలదు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా వచ్చాయి. పాదానికి మొత్త ం 21
అక్షరాలు ఉన్నాయి. 1 - 11 అక్షరాలకు (గి - గి) యతి చెల్లి ంది. కాబట్టి ఈ పద్యపాదం చంపకమాల పద్యానికి
చెందినదని చెప్పవచ్చు.
*******
7. మాటమహిమ
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
1. పద్యాలను రాగయుక్త ంగా పాడండి.
జ). పద్యాలను ఉపాధ్యాయుడు రాగ, భావయుక్త ంగా పాడడం గమనించి, విద్యార్థు లు పాడటానికి
ప్రయత్నిస్తా రు.
2. పుకార్లు ఎలా వ్యాపిస్తా యో చెప్పండి.
జ). ఎక్కడో ఎవరో ఒక మహానుభావుడు ఉన్నవీ, లేనివీ కలిపి పుకార్ల ను పుట్టిస్తా డు. ఆ పుకార్లు పెద్ద
ఏనుగులా బలిసి, రాజసం ఉట్టిపడేలా నాలుగు దిక్కులకు వ్యాపిస్తా యి. అంటే ఎవరో ఎక్కడో పుట్టించిన పుకార్లు
నిజానిజాలతో పనిలేకుండా అతికొద్ది కాలంలోనే దిక్కుల చివరి వరకు వ్యాపిస్తా యి.
3. 'మచ్చలున్న నాలుక' గురించి కవయిత్రి ఏమని చెబుతున్నారు?
జ). మచ్చలున్న నాలుక ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లా డిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు
రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాట్లా డిన మాటలకు చక్కని సంసారాలు కూడా నాశనమైపో తాయి. మచ్చల
నాలుక చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టు కొనేదాకా తగాదాలు అవుతాయి.
4. నోటితో మాట్లా డుతూ నొసటితో వెక్కిరించడం అంటే ఏమిటి?
జ). ఈ లోకంలో నోటితో మాట్లా డుతూ, నొసటితో వెక్కిరించే కళాప్రవీణులు చాలామంది ఉంటారు. అంటే వాళ్లు
ఎదుటివారితో పైకి ప్రేమగా మాట్లా డుతున్నట్లు గా నటిస్తూ , మనసులో మాత్రం వారిపై చులకన భావంతో ఉంటారు.
వారు మాట్లా డే మాటల్లో వ్యంగ్యం ఉంటుంది. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
5. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థా లు రాయండి.
i). “కనులార మంచిని కాంచుటకేనేమొ ………….. దీని యాంతర్య మేమొ.” (7వ పద్యం - సీస పద్యం)
జ). ప్రతిపదార్థం :
కనులార = కళ్ళతో తనివితీరా
మంచిని = మంచిని
కాంచుటకు + ఏన్+ఏమొ = చూడడానికే కాబో లు
కన్నుదో యి = రెండు కన్నులు
పన్నుగా = అందంగా
అమరెను = కూర్చబడ్డా యి
వీనులార = చెవులారా
సువార్త = మంచిమాట
వినుటకు + ఏ = వినడానికే
కాబో లు = కావచ్చు
శవ్రణయుగము = రెండు చెవులు
సమకూర్చబడియెను = చక్కగా ఏర్పాటుచేయబడ్డా యి
చేతులార = చేతులతో
సుకృతమ్ము = మంచి పనిని
చేయుటకు+ఔను+ఏమో = చేయడం కోసమే కాబో లు
నరులకు = మానవులకు
కర యుగళము = రెండు చేతులు
కలుగుట = ఉన్నాయి
అమలిన పథమున = సన్మార్గ ంలో
గమియించుటకె = నడవడానికే
లెమ్ము = కాబో లు
పద ద్వయంబు = రెండు పాదాలు
తనరారుచుండు = ఆత్రు తపడుతుంటాయి.
అన్ని + అంగాలు = అన్ని అవయవాలు
రెండు + ఏసి = రెండేసి చొప్పున ఉన్నాయి
బంధువులు కూడా దగ్గ రౌతారు. మాటతీరు బాగుండటం వల్ల చేస్తు న్న రంగంలో అభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి
మాట వలననే సిరి సంపదలు కలుగుతాయని చెప్పవచ్చు.
2. పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు?
జ). ఈ లోకములో కొంతమంది మాయమాటలు చెప్పి రోజు గడుపుకుంటారు. కొందరు చాడీలు చెప్పి
తగాదాలు సృష్టిస్తు ంటారు. మరికొందరు రెచ్చగొట్టేలా మాట్లా డి ఎంతోకాలంగా కలిసి ఉన్నవారిని విడిపో యేలా
చేస్తా రు. ఇంకొందరు మనసునిండా విషాన్ని నింపుకొని తియ్యని మోసకారి మాటలతో ఎదుటివారిని నాశనం
చేస్తా రు. కొందరు ఒక్కో మనిషి దగ్గ ర ఒక్కో విధంగా మాట్లా డి అన్ని పనులనూ పాడుచేస్తా రు. ఇటువంటి
మోసపూరిత వ్యక్తిత్వం గల వ్యక్తు లతో జాగ్రత్తగా ఉండాలని కవయిత్రి చెబుతున్నారు.
3. నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి?
జ). నరం లేని నాలుక ఇష్ట ం వచ్చిన విధంగా మాట్లా డుతుంది. చెవుల ద్వారా విన్న విషయాన్ని నిజమో,
అబద్ద మో కూడా ఆలోచించకుండా ప్రచారం చేస్తు ంది. దానివల్ల మంచితో పాటు చెడుకూడా జరిగే ప్రమాదం ఉంది.
అందుచేత మనం ఏదైనా విషయాన్ని విన్నాగాని, అది ఎదుటివారి మనసుకు బాధ కలిగించేదిగా ఉంటే ఆ విషయం
విననట్లు గా ఊరుకోవాలి. ప్రతి ఒక్కరి పట్ల మనసులో మంచి ఆలోచన కలిగిఉండాలి. ఇలా చేస్తే నాలుకను
నియంత్రించుకోవచ్చు.
4. 'నరము లేని నాలుక' అంటే మీరేమి గ్రహించారో రాయండి.
జ). నరము లేకపో తే శరీర అవయవాలు తమ అదుపును కోల్పోతాయి. మనం తిప్పిన విధంగా
కీలుబొ మ్మల్లా తిరుగుతాయి. నరము లేని నాలుక కూడా ముందు,వెనుక ఆలోచించకుండా ఇష్ట ం వచ్చిన రీతిగా
మాట్లా డుతుంది. ఆ మాటల వల్ల అనేక అనర్థా లు జరుగుతాయి. కాబట్టి నరము లేని నాలుకను మంచి పనులకే
ఉపయోగించాలని నేను గ్రహించాను.
5. నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవింపబడతామో వివరించండి.
జ). పంచేంద్రియాల్లో అత్యంత ముఖ్యమైనది నాలుక. అలాంటి నాలుకను మంచిని పెంపొ ందించడానికి
ఉపయోగించాలి. నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లా డాలి. ఎదుటి వారిలోని
సుగుణాలను ప్రచారం చేయడానికే నాలుకను వాడాలి. నాలుక ఉందికదా అని మన చెవినబడిన ప్రతీ విషయాన్ని
ప్రచారం చేసెయ్యకుండా, పదుగురికీ మేలు చేసే విషయమైతేనే నలుగురికీ చెప్పాలి. నాలుకను ఈ విధంగా మితంగా
ఉపయోగించుకుంటే సమాజంలో అందరిచేత గౌరవింపబడతాము.
6. 'మాట మహిమ' పాఠ్యాంశ కవయిత్రి గురించి రాయండి.
జ). 'మాట మహిమ' పాఠ్యాంశ కవయిత్రి శ్రీమతి కొలకలూరి స్వరూపరాణి గారు. 1943వ సంవత్సరంలో
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రా మంలో జన్మించారు. పది పన్నెండు సంవత్సరాల వయస్సులోనే
కవిత్వం రాయడం మొదలుపెట్టా రు. ఉపాధ్యాయినిగా పనిచేశారు. స్త్రీల సమస్యలు, వరకట్నం, వైధవ్యం,
సహగమనం వంటి అంశాలపై రచనలు చేశారు. నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం, చంద్ర
గ్రహణం మొదలైనవి వీరి రచనలు. "కవయిత్రి తిలక" అనే బిరుదు పొ ందారు. 2022వ సంవత్సరంలో మరణించారు.
7. ఆధునిక పద్యం ప్రక్రియను పరిచయం చేయండి.
జ). తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిష్ట మైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే
జరిగేవి. ఆధునికమైన వస్తు వును తీసుకుని, ప్రా చీన పద్య లక్షణాలతో రాసే రచనను ఆధునిక పద్యం అనవచ్చు.
ఆధునిక రచయితలు చాలామంది తమ భావాలను ప్రా చీన పద్య శైలిలో స్పష్ట ంగా వ్యక్తీకరిస్తు న్నారు.
8. 'మాట మహిమ' పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జ). మనచుట్టూ ఉన్న మనుషుల్లో ఒక్కొక్కరి మాటతీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరి మాటలు
ప్రేమను పంచితే, కొందరి మాటలు మనసును ముక్కలు చేస్తా యి. కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే, మరికొందరి
మాటలు పిరికితనాన్ని నూరిపో స్తా యి. కాబట్టి మోసపు మాటల మాయలో పడకుండా నాలుకను అదుపులో
ఉంచుకొని మాట్లా డే స్వభావాన్ని పెంపొ ందించుకోవాలని తెలపడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. మాటతీరు సరిగా లేకపో తే కలిగే కష్ట నష్టా లను వివరించండి.
జ). మాటతీరు సరిగా లేకపో తే మన ఇంట సంపదలు ఉండవు. మాట తీరును అనుసరించే స్నేహం
నడుస్తూ ఉంటుంది. మాటతీరు సరిగా లేకపో తే ప్రా ణ స్నేహితులు కూడా మనకు దూరమైపో తారు. శత్రు వులు
పెరిగిపో తారు. అనవసరంగా లేనిపో ని తగవులు జరుగుతాయి. నరం లేని నాలుక ఇష్ట ం వచ్చిన రీతిగా
మాట్లా డుతుంది. అలా ముందు వెనక ఆలోచించకుండా మాట్లా డిన మాటల వల్ల పచ్చగా సాగుతున్న కాపురాల్లో
చిచ్చు రేగుతుంది.
ఆలోచన లేకుండా మాటలు మాట్లా డితే మనసు విరిగిపో యి, బంధుత్వ సంబంధాలు చెడిపో యి,
కుటుంబాలే నాశనమవుతాయి. మనం మాట్లా డే మాటకు ఎదుటివారి ప్రా ణాలే తీయగలిగేటంతటి శక్తి ఉంటుంది.
కత్తి కి కూడా లేని పదును మన మాటతీరుకు ఉంటుంది. ఒక్కొక్కరి మాటతీరు వల్ల ప్రపంచం మొత్త ం అతలాకుతలం
అయిపో యే పరిస్థితి వస్తు ంది. కాబట్టి మాట్లా డేటప్పుడు ఎదుటివారికి నష్ట ం కలిగించని విధంగా వారి మనసుకు
బాధ కలిగించని విధంగా మాట్లా డాలి.
2. 'మన మాటలే మన గౌరవం' అనే అంశంపై వ్యాసం రాయండి.
జ). మనిషి మనసులోని భావాలను వ్యక్త పరిచే సాధనం మాట, ఒక వ్యక్తి గురించి ఎదుటివారు అతడు
మాట్లా డే మాటలనుబట్టి ఒక అభిప్రా యం ఏర్పరచుకుంటారు. మనం మాట్లా డేటప్పుడు ఎదుటివారి మనసు
నొచ్చుకోకుండా ఉండే విధంగా మాట్లా డాలి. మనం మాట్లా డే మంచి మాటలే మనకు సమాజంలో గౌరవాన్ని
తెచ్చిపెడతాయి.
మనం మాట్లా డే మాటల్లో అసత్యానికి తావివ్వకూడదు. ఈ విషయాన్ని గురించి తైత్తరీయ ఉపనిషత్తు లో
విద్యాభ్యాసం పూర్త యిన విద్యార్థికి, వీడ్కోలు మాటలుగా గురువు 'సత్యం వద, ధర్మం చర' అంటూ సందేశం
ఇవ్వడాన్ని గమనించవచ్చు. సనాతన భారతీయ సంప్రదాయంలో మన పూర్వీకులు ధర్మాచరణకు ఎంత
ప్రా ముఖ్యతనిచ్చారో, సత్యంవాక్కుకూ అంతే ప్రా ధాన్యతనిచ్చారు. ఈ విషయం మాట గొప్పదనాన్ని తెలియజేస్తు ంది.
ఎదుటివాడు మనకన్నా చిన్నవాడా, పెద్దవాడా, మన స్థా యికి తగినవాడా, కాదా అనే విషయాలతో
సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా పలకరించాలి. మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఎదుటి వారిని
గౌరవిస్తే అదే గౌరవం మనకు తిరిగి లభిస్తు ంది. కాబట్టి మన మాటతీరులోని మంచితనమే మనకు గౌరవాన్ని
తెచ్చిపెడుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలి.
3. పాఠ్యాంశంలోని పద్యాలు ఆధారంగా సారాంశాన్ని ఏకపాత్ర రూపంలో ప్రదర్శించడానికి ప్రదర్శన పాఠం
రాయండి.
జ). నాలుక - ఏకపాత్రా భినయం
మిత్రు లారా! నన్ను గుర్తు పట్టా రా? నేను మిమ్మల్ని అందలానికి ఎక్కించగలను.. అదఃపాతాలానికీ
తొక్కెయ్యగలను. ఆ..! గుర్తొ చ్చాను కదూ! అవును నేన!ే నరంలేని నాలుకనే! నా మాట తీరుతోనే మీ ఇంట
సంపదలు నిలిచి ఉంటాయి. నా మాటతీరును బట్టే వ్యక్తు ల మధ్య స్నేహం చిగురిస్తు ంది. ఈ లోకంలో కొందరు నన్ను
ఉపయోగించి మాయమాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. కత్తి కి లేని పదును నాకు ఉంది. నన్ను
సక్రమంగా ఉపయోగించకపో తే అమృత హృదయాల్లో కూడా విషాన్ని నింపగలను.
నేను కావాలనుకుంటే సత్యాన్ని దాచిపెట్టగలను. అసత్యానికి ప్రచారం కల్పించగలను. నేను మాట్లా డే
మాటలకు ఎదుటివారి ప్రా ణాలే తీయగల శక్తి కూడా ఉంటుంది. మీ మానవులు ఇతరుల సుగుణాలకు గురించి
చెప్పడానికంటే ఇతరులలోని దుర్గు ణాలను బయట పెట్టడానికే నన్ను ఎక్కువగా ఉపయోగిస్తా రు.
నేను మిమ్మల్ని ఏమీ చేయలేను కాబట్టే నన్ను ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగించుకొని నా చేత
ఎన్నో క్రూ రమైన పనులు చేయిస్తు న్నారు. ఓ స్వార్థ మానవులారా! మీ స్వార్ధపు ఆలోచనలకు నన్ను పావుగా
వాడుకోకండి. నన్ను మంచి పనులకు ఉపయోగించుకొని మీ గౌరవాన్ని పెంచుకోండి. లోకమంతా గౌరవ
మర్యాదలతో మెలిగితే అదే నాకు ఆనందం. ఆ ఆనందాన్ని నాకు మిగులుస్తా రు కదూ! ఇక సెలవు.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, వాటిని ఉపయోగించి సొ ంతవాక్యాలు
రాయండి.
1. అమలిన పథమున గమియించుటకే లెమ్ము.
జ). పథము = మార్గ ము
*పెద్దలు చూపిన మార్గ ంలో పయనించి, అభివృద్ధి సాధించాలి.
2. పలుకుమాత్రము మితముగా పలుకుమన్న.
జ). మితము = కొంచెం
*కొంతమంది ఎంత సంపద ఉన్నా కొంచెం కూడా దానం చేయరు.
3. సృష్టికర్త కులాలుడై చేసె పెద్ద లోకభాండము.
జ). కులాలుడు = కుమ్మరి (కుండలు చేసేవాడు)
*కుమ్మరి బంకమట్టితో కుండలు చేస్తా డు.
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
💥ద్విరుక్తటకార సంధి :
*👉సూత్రము 1 : కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దా లలోని ఱ- డ లకు అచ్చు పరమైతే ద్విరుక్త "ట" కారం
ఆదేశంగా వస్తు ంది.
ఉదా : 1. కుఱు + ఉసురు = కుట్ట్ + ఉసురు = కుట్టు సురు
2. చిఱు + ఎలుక = చిట్ట్ + ఎలుక = చెట్టెలుక
3. కడు + ఎదురు = కట్ట్ + ఎదురు = కట్టెదురు
4. నడు + ఇల్లు = నట్ట్ + ఇల్లు = నట్టిల్లు
👉
5. నిడు + ఊరుపు = నిట్ట్ + ఊరుపు = నిట్టూ రుపు
సూత్రము 2 : ఆమ్రేడితం పరమైనపుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణా లకు అదంతమైన ద్విరుక్త టకారం
వస్తు ంది.
ఉదా : 1. పట్ట పగలు = పగలు + పగలు
2. కట్ట కడ = కడ + కడ
3. తుట్ట తుద = తుద + తుద
4. మొట్ట మొదట = మొదట + మొదట
5. చిట్ట చివర = చివర + చివర
*ద్విరుక్త ము అంటే ఒకే హల్లు రెండుసార్లు వచ్చుట.హల్లు కింద అదే హల్లు వచ్చుట.దీనినే ద్విత్వాక్షరం అంటారు.
అ). కింది పదాలు విడదీసి సంధి పేరు తెలపండి.
1. రసనేంద్రియం = రసన + ఇంద్రియం = గుణసంధి
2. పరస్పరానురాగం = పరస్పర + అనురాగం = సవర్ణ దీర్ఘ సంధి
3. పరాధీనము = పర + అధీనము = సవర్ణ దీర్ఘ సంధి
💥సమాసాలు :
4. ఉర్వియెల్ల = ఉర్వి + ఎల్ల = యడాగమ సంధి
💥అలంకారాలు :
8. ధీరోదాత్తు డు - ఉదాత్తు డైన ధీరుడు - విశేషణ ఉత్త రపద కర్మధారయ సమాసం
💥
దీనిలో "ట" అనే హల్లు పలుమార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం" అవుతుంది.
కింది ఉదాహరణలలో అలంకారాన్ని గుర్తించండి.
1. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము పో వునే మదనములకు
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
వృత్త ్యనుప్రా సాలంకారం లక్షణం : వాక్యంలో గానీ, పద్యపాదంలో గానీ ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని
వృత్త ్యనుప్రా సాలంకారం అంటారు.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "మ" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"
అవుతుంది.
2. అడిగెదనని కడువడిజను నడిగిన దన మగడు నుడవడని నడయుడుగన్
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "డ" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"
అవుతుంది.
3. దక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీకృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్షసేయక
జ). ఈ పద్యపాదంలో "వృత్త ్యనుప్రా సాలంకారం" ఉన్నది.
*సమన్వయం : ఈ పద్యపాదంలో "క్ష" అనే హల్లు అనేకసార్లు వచ్చుట వలన ఇది "వృత్త ్యనుప్రా సాలంకారం"
💥ఛందస్సు :
అవుతుంది.
👉
4). ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉన్నాయి.
కింది పద్య పాదాలకు గణవిభజన చేసి లక్షణ సమన్వయం రాయండి.
UI I U IU I I I UI I UI I UI U IU
1. చక్కని | కన్యకా | మణికి | జక్కని | వాడగు | ప్రా ణ నా | థుడున్
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*ఉత్పలమాల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తా యి.
5. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థా నం.
6. ప్రా స నియమం ఉంటుంది.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "చ" కి 10వ అక్షరం "జ" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని
చెప్పవచ్చు.
UI I U I U I I I UI I U I I UIU IU
2. ఎక్కడ | నుండి రా | కయిట | కెల్లరు | నున్ సుఖు | లేకదా | యశో
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 56
U I I U I U I I I U I I U I I UI U IU
3. ఏ మహ | నీయ సి | ద్ధి కొర | కీ బ్రతు | కున్ ముడి | వెట్టు కుం | టినో
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "ఏ" కి 10వ అక్షరం "కీ" లో ఉన్న "ఏ" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల
పద్యపాదము అని చెప్పవచ్చు.
UI I UIU I I I U I I U II U I U IU
4. చారు ని | శీధినీ | విమల | సాంద్ర సు | ధాకర | భాతి రో | దసీ
భ ర న భ భ ర వ
జ). ఇది ఉత్పలమాల పద్యపాదము.
*సమన్వయం : ఈ పద్యపాదానికి 20 అక్షరాలు ఉన్నాయి. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి.
పాదం మొదటి అక్షరం "చా" కి 10వ అక్షరం "సా" కి యతి చెల్లి ంది. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అని
చెప్పవచ్చు.
*******
1.ఇల్ల లకగానే
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. రాయండి.
1. స్నేహితురాలు గుర్తు చేసిన ఇల్లా లి గతం ఎలాంటిద? ి చెప్పండి.
జ). తన పేరు తానే మరచిపో యిన ఇల్లా లి పేరు శారద. ఆవిడ పదవ తరగతిలో స్కూలు ఫస్ట్ వచ్చింది.
కాలేజీలో జరిగిన మ్యూజిక్ పో టీల్లో ఫస్ట్ వచ్చింది అప్పుడప్పుడు మంచి మంచి బొ మ్మలు వేసేద.ి ఇదే తన పేరు
తానే మరచిపో యిన శారద అనే ఇల్లా లికి స్నేహితురాలు గుర్తు చేసిన గతం.
2. తన పేరేమిటన్న ఇల్లా లి ప్రశ్నకు పక్కింటావిడ చెప్పిన జవాబేమిటి?
జ). తన పేరేమిటన్న ఇల్లా లి ప్రశ్నకు పక్కింటావిడ కిసుక్కున నవ్వేసింది. ఆవిడ పేరును తాను ఎప్పుడూ
అడగలేదంది. ఆవిడ చెప్పనూ లేదంది. కుడిచేతివైపు తెల్ల మేడావిడ అనో, మందుల కంపెనీ మేనేజరు గారి భార్య
అనో, తెల్లగా పొ డుగ్గా ఉండే ఆవిడ అనో చెప్పుకుంటామని జవాబు చెప్పింది.
3. అజ్ఞా తవాసం అంటే మీకేమి అర్థమైంది?
జ). అజ్ఞా తవాసం అంటే ఎవరైనా తమ ఉనికిని కోల్పోయి, తాము ఎక్కడున్నామో కూడా ఎవ్వరికీ
తెలియకుండా సమాజంలో రహస్యంగా బ్రతకడం అని మేము అర్థం చేసుకున్నాము.
ఆ). ఇచ్చిన గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గణగణమంటూ స్కూల్ బెల్ మోగింది. పాఠశాల విడిచిపెట్టగానే పిల్లలందరూ తమతో పాటు తెచ్చుకున్న
క్యారేజీలు విప్పి తినడం ప్రా రంభించారు. అందులో ఒక అమ్మాయి మాత్రం తెచ్చుకున్న రొట్టె ముక్కలు, పళ్ళు
తమతో పాటు చదువుతున్న పేద విద్యార్థు లకు పంచి, వారితో కలిసి తింది. తెచ్చుకున్న తినుబండారాలు అందరికీ
సరిపడలేదు. మరుసటి రోజు అమ్మతో "అమ్మా! ఈ మధ్య నాకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటోంది. కాబట్టి నా
క్యారేజీలో నలుగురైదుగురికి సరిపడినంత పెట్టు " అంది . నిజమేననుకుని ఆ తల్లి నలుగురైదుగురికి సరిపడినన్ని
రొట్టెలు, పళ్ళు పెట్టి ఇచ్చింది.
సాయంత్రం ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చినప్పుడు అమ్మ క్యారేజీ తెరిచి చూసింది. అందులో చిన్న
రొట్టెముక్క గానీ, కనీసం ఒక పండుగానీ మిగల్లేదు. కూతురు ఇన్ని ఎలా తిందా! అని ఆశ్చర్యపో యింది. ఆమె
స్కూల్ టీచర్ని కలిసి తన కూతురు అన్ని పదార్థా లు ఎలా తింటుందో గమనించమని చెప్పింది. "నువ్వేం
భయపడవద్దు . నేను చూస్తా లే" అని టీచర్ ఆమెకు ధైర్యం చెప్పింది. మరునాడు ఆ అమ్మాయి తోటి పిల్లలకు ఆహార
పదార్థా లు పంచడం గమనించి, జరిగిన విషయం ఆమెతో చెప్పింది టీచర్. ఆ అమ్మాయి తల్లి ఎంతగానో
మెచ్చుకుంది. ముద్దు లాడింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రా ంతీయ భేదాలు మరచి, భారత స్వాతంత్ర్యం కోసం
ఎనలేని సేవలందించిన అనిబిసెంట్. చిన్ననాటి నుండి సత్ప్రవర్త న,ప్రేమ,సేవ,త్యాగం వంటి మంచి లక్షణాలను
అలవరచుకోబట్టే ఆమె 'మహామనిషి'గా ఎదిగింది.
*ప్రశ్నలు :
1. పై గద్యంలో 'తినదగిన పదార్థా లు' అనే అర్థం కలిగిన పదాన్ని గుర్తించి రాయండి.
జ). తినుబండారాలు అనే పదం 'తినదగిన పదార్థా లు' అనే అర్థా న్నిస్తు ంది.
2. అనిబిసెంట్ ను తల్లి ఎందుకు మెచ్చుకొని ముద్దు లాడింది?
జ). అనిబిసెంట్ తాను స్కూల్ కి తీసుకెళ్లి న ఆహార పదార్థా లు తోటి పిల్లలకు పంచింది. ఈ విషయం తెలిసి తల్లి,
అనిబిసెంట్ ను మెచ్చుకొని ముద్దు లాడింది.
3. 'దుష్ప్రవర్త న' ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గద్యంలో వెతికి రాయండి.
జ). 'దుష్ప్రవర్త న' ఈ పదానికి వ్యతిరేక పదం సత్ప్రవర్త న.
4. అనిబిసెంట్ భారతదేశానికి ఏ విషయమై సేవలను అందించింది?
జ). అనిబిసెంట్ భారత స్వాతంత్ర్యం కోసం ఎనలేని సేవలందించింది.
5. పై గద్యానికి తగిన శీర్షికను రాయండి.
జ). "మహామనిషి అనిబిసెంట్"
ఇ). కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
బండారు అచ్చమాంబ 1874లో కృష్ణా జిల్లా నందిగామలో పుట్టింది. తండ్రి వెంకటప్పయ్య, తల్లి
గంగమాంబ. ఆమెకు ఆరేళ్ళప్పుడు తండ్రి మరణించాడు. పదేళ్ల వయసులో మాధవరావుతో వివాహం జరిగింది.
పుట్టిన ఇద్ద రు పిల్లలూ ఏడాది వ్యవధిలో మరణించారు. దుఃఖం నుంచి మెల్లగా కోలుకుంది. కన్నీళ్ల ను కాగితాలపై
అక్షరాలుగా మలచింది. స్త్రీ అనంతశక్తిమంతురాలనీ, ఆమెకు విద్యావకాశాలు అందితే జాతికి మార్గ దర్శి కాగలదని
నిశ్చయంగా నమ్మింది. తినడం, పడుకోవడమే జీవితం కాదని, వెలుగుతూ వెలిగించడమేనని, నరాల్లో ఆవేశం,
గుండెల్లో చైతన్యం ఉబికివచ్చేలా ప్రసంగించేది. మాటలే కాదు చేతల్లో కూడా చేవ ఉన్న అచ్చమాంబ తన జీవితాన
ఎదురైన దుఃఖాన్ని ధైర్యంగా దిగమింగుకుంది. అదే చెప్పింది అందరిక.ీ నీకోసం బతకడం బతుకు కాదని,
నిర్భాగ్యులకు నీడనివ్వడమే పరమార్థమని ప్రసంగించేది. ఆచరించేది. ఓసారి ఓ బిచ్చగాతే ఇద్ద రు పిల్లలతో
అడుక్కుంటుంటే వారిని వారించి, ఓ ఆవును కొనిచ్చి, వారి కాళ్ల పై వారిని నిలబడేలా చేసింది. తన మరిదికి భార్య
చనిపో తే అందరినీ ఎదిరించి, దగ్గ రుండి మరీ ఓ వితంతువును అతనికిచ్చి పెళ్లి చేసింది. 1905లో మహారాష్ట ల
్ర ో ప్లేగు
వ్యాధి వ్యాపించింది. ఓ గర్భిణి రోగాన పడింది. ఎవరూ తోడు లేరు. దగ్గ రుండి తానే పురుడు పో సింది అచ్చమాంబ.
ఆ మహమ్మారి ఆమెనూ కబళించింది. 1905 జనవరి 18న మూడు పదుల వయస్సులోనే అచ్చమాంబ
కన్నుమూసింది.
*ప్రశ్నలు :
1. అచ్చమాంబకు వివాహమైన తరువాత కలిగిన దుఃఖం ఏమిటి?
జ). ఆమెకు పుట్టిన ఇద్ద రు పిల్లలూ ఏడాది వ్యవధిలోనే మరణించడం.
2. 'మార్గ దర్శి కావడం' అంటే ఏమిటి?
జ). మార్గ దర్శి కావడం అంటే ఇతరుల జీవితాలకు ఒక మంచి దారి చూపే వ్యక్తిగా ఎదగడం. లేదా నలుగురూ
అనుసరించే వ్యక్తిగా ఎదగడం.
3. ఏ మహమ్మారి అచ్చమాంబను కబళించింది? ( ఇ )
అ). కలరా ఆ). మలేరియా ఇ). ప్లేగు ఈ). టైఫాయిడ్
4. 'కన్ను మూయడం' అనే పదాన్ని దేనికి పర్యాయపదంగా వాడుతారు?
జ). కన్ను మూయడం అనే పదాన్ని చనిపో వడం, మరణించడం అనే పదాలకు పర్యాయపదంగా వాడుతారు.
5. 'తన కాళ్ళపై తాను నిలబడడం' అంటే మీకేమి అర్థం అయ్యింది?
జ). 'తన కాళ్ళపై తాను నిలబడడం' అంటే తమ సొ ంత సంపాదనపై ఆధారపడి బతకడమని నాకు
అర్థమయ్యింది.
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో జవాబులు రాయండి.
1. "నా పేరేమిటో చెప్పమ్మా" అన్న ఇల్లా లికి తల్లి చెప్పిన చరిత్ర ఏమిటి?
జ). "నా పేరేమిటో చెప్పమ్మా!" అన్న ఇల్లా లితో ఆమె తల్లి "అదేమిటమ్మా! నువ్వు మా పెద్దమ్మాయివి.
నీకు బి.ఏ దాకా చదువు చెప్పించి, యాబైవేలు కట్నమిచ్చి పెళ్లి చేశాం. రెండు పురుళ్ళు పో శాం. ప్రతి పురిటికి
ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకు ఇద్ద రు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం. చాలా మంచివాడు
కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు." అంటూ చరిత్ర మొత్త ం చెప్పుకొచ్చింది.
2. "అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్" అన్న శారద భర్త మాటలను బట్టి మీరు ఏమి
గ్రహించారు?
జ). "అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్" అన్న శారద భర్త మాటలను బట్టి శారద
ఇల్ల ంతటినీ ఎంతో చక్కగా తీర్చిదిద్దేదని గ్రహించాము. ఆవిడ ఇంట్లో లేకపో తే కనీసం ఆ ఇంటిని అలికి ముగ్గు లు
పెట్టేవారు కూడా అక్కడ ఎవరూ లేరని మేము గ్రహించాము. శారద రెండు రోజులు పుట్టింటికి వెళ్లే సరికి ఇంట్లో ని
సామాన్ల న్నీ గజిబిజిగా పడి ఉన్నాయి. కాబట్టి శారద వాటినన్నింటినీ సర్ది, ఇంటిని అందంగా ఉంచుతుందనే
ఉద్దేశంతో శారద భర్త ఈ మాటలను అని ఉంటాడని మేము గ్రహించాము.
3. ఇల్లా లు తన పేరు తానే మరచిపో వడానికి గల కారణాలు రాయండి.
జ). పెళ్లయిన వెంటనే ఇల్లా లుతో ఆమె భర్త "ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది" అని చెప్పాడు. వెంటనే ఆమె
ఆ ఇంటిని అందంగా అలికి ముగ్గు లు పెట్టింది. దానికి ఆమె భర్త మెచ్చుకుని "నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి.
ముగ్గు లు వేయడంలో అంతకన్నా నేర్పరివి. శభాష్!" అంటూ మెచ్చుకుని భుజం తట్టా డు. దాంతో ఆ ఇల్లా లు తెగ
మురిసిపో యి ఇల్ల లకటమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె భర్త ఆమెను ఎప్పుడూ పేరు పెట్టి
పిలవలేదు. ఏమోయ్! అనే పిలిచేవాడు. పనిమనిషేమో అమ్మగారు అని పిలిచేద.ి పిల్లలు అమ్మా! అని పిలిచేవారు.
బయటి వాళ్ల ందరూ మిసెస్ మూర్తి అనేవారు. ఆవిడను అసలు పేరెట్టి ఆ ఇంటిలోగాని, బయట గానీ పిలిచే పరిస్థితి
లేకుండా పో యింది. దానితో ఆ ఇల్లా లు ఇంటిపనుల్లో లేనమైపో యి తన పేరును తానే మరచిపో యింది.
4. ఇల్ల లకగానే పాఠ్యాంశ రచయిత్రి గురించి రాయండి.
జ). 'ఇల్ల లకగానే' పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి గారు. 20వ శతాబ్ది కి చెందిన రచయిత్రి. సత్యవతి
కథలు, ఇల్ల లకగానే, మత్తు నగరి, మెలకువ, రాగభూపాలం మొదలైన కథా సంపుటాలు; పడుచుదనం, రైలుబండి,
గొడుగు, ఆ తప్పు నీది కాదు వంటి నవలలు రాశారు. ఉర్దూ రచయిత్రి 'ఇస్మత్ చుగ్తా య్' కథలను తెలుగు
అనువాదం చేశారు. చాసో స్ఫూర్తి పురస్కారం,తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఆంధ్రపద ్ర ేశ్ ప్రభుత్వం
నుంచి 'కళారత్న' ఉగాది పురస్కారం వంటి పురస్కారాలు పొ ందారు.
5. కథ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ
పాత్ర ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో, గుండెకు హత్తు కొనేలా చెప్పే వచన రచనే కథ. ప్రస్తు తం కథ, కథానిక అనే
రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని
పరిపుష్ట ం చేస్తు న్నారు.
ఆ). కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. కథలో ఇల్లా లు తన పేరు మరచిపో వడాన్ని మీరు సమర్థిస్తా రా? ఎందువల్ల ?
జ). 'ఇల్ల లకగానే'పాఠంలోని ఇల్లా లు పెళ్లయిన కొత్త లో 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది' అని చెప్పిన భర్త
మాటలకు పొ ంగిపో యి, వెంటనే ఇంటిని అందంగా అలికి ముగ్గు లు పెట్టింది. ఆమె అలుకుని, ముగ్గు లను భర్త
మెచ్చుకోవడంతో తెగ మురిసిపో యి ఇల్ల లకటమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఈ హడావిడిలో ఆమె
తన పేరుని మరచిపో యింది. ఆ ఇల్లా లు చదువుకునే రోజుల్లో పదవ తరగతి స్కూలు ఫస్ట్ వచ్చింది. కాలేజీలో
జరిగిన మ్యూజిక్ పో టీల్లో కూడా ఫస్ట్ వచ్చింది. అప్పుడప్పుడు మంచి మంచి బొ మ్మలు వేసేద.ి
ఆమెలోని ఆ జ్ఞా నమంతా పెళ్ళికాగానే ఇంటి పనుల్లో పడిపో యి కనుమరుగైపో యింది. భర్త ను ఆఫీసుకు
సాగనంపడం, పిల్లలను తయారుచేసి బడికి పంపడం, ఇంటిపని, వంటపనులతో విసుగూ, విరామం లేకుండా ఇంటికే
అంకితమైపో యింది. దీనితో ఆమె తీరిక లేని జీవితంలో చివరికి తన పేరునే మరచిపో యింది. ఈనాటి సమాజంలో
కూడా ఎంతోమంది చదువుకున్న ఆడవాళ్ళు ఇంటికే అంకితమైపో యి తమ ఉనికిని కోల్పోతున్నారు. కాబట్టి
'ఇల్ల లకగానే' కథలో శారద అనే ఇల్లా లు తన పేరు మరచిపో వడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తా ను.
2. మరచిపో యిన తన పేరును తెలుసుకోవడానికి ఇల్లా లు చేసిన ప్రయత్నాలు ఏవి?.
జ). మరచిపో యిన తన పేరు తెలుసుకోవడానికి ఇల్లా లు అనేక ప్రయత్నాలు చేసింది. ఇంటిలో కిటికీ దగ్గ ర
నిలబడి తల గోక్కుంటూ తెగ ఆలోచించింది. అయినా ఆవిడకు తన పేరు గుర్తు కు రాలేదు. తన పేరేమిటో చెప్పమని
ఇంట్లో పనిచేసే పని మనిషిని అడిగింది. దానికి ఆమె 'ఎప్పుడూ అమ్మగారూ! అని పిలవడం తప్ప, తమ పేరు
తెలుసుకునే అవసరం రాలేదని' సమాధానం చెప్పింది.
బడి నుండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన పిల్లలను తన పేరేమిటో చెప్పమని అడిగింది.
పిల్లలు ఆశ్చర్యపో తూ 'నిన్ను అమ్మా! అని పిలవడం తప్ప, మాకు ఇంకేం తెలియదు.' అని తెగేసి చెప్పేశారు.
పేరంటం పిలవడానికి వచ్చిన పక్కింటావిడను తన పేరేమిటో చెప్పమని అడిగింది. ఆవిడ తాను ఎప్పుడూ మీ పేరు
అడగనూ లేదు. మీరు చెప్పనూ లేదు. కాబట్టి మీ పేరు నాకు తెలియదని చెప్పేసింది.
భర్త ను అడిగితే 'నీ పేరు నాకు గుర్తు లేదు. కొత్త పేరు ఏదైనా పెట్టు కో' అని నిరుత్సాహపరిచాడు.
చదువుకున్న సర్టిఫికెట్లలో తన పేరు ఉంటుందని ఆత్రు తతో వాటిని వెతికింది. కానీ అవి దొ రకలేదు. పుట్టింటికి వెళ్లి
వాళ్ళ అమ్మను అడిగితే నువ్వు 'మా పెద్దమ్మాయివి..' అంటూ ఆమె పెళ్లి , పేరంటం గురించి చెప్పిందే గాని పేరు
మాత్రం చెప్పలేదు. చివరికి తన చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల కనిపించి తనను పేరు పెట్టి పిలిచింది. ఆమెకు
పో యిన ప్రా ణం లేచి వచ్చినట్ల యింది. తన స్నేహితురాలి ద్వారానైనా తన పేరు తెలిసినందుకు ఎంతో ఆనందించింది.
3. ఇల్లా లు, స్నేహితురాలిని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయండి.
జ). స్నేహితురాలు : శారదా!.. శారదా!.. పిలుస్తు ంటే పలకకుండా వెళ్ళిపో తున్నావేమే?
ఇల్లా లు : హాయ్.. ప్రమీలా! ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు?
స్నేహితురాలు : అదేంటే ఏమని పిలుస్తా ను. నీ పేరుపెట్టి శారద అనేకదా పిలిచాను.
ఇల్లా లు : హమ్మయ్య నీ పిలుపుతో పో యినప్రా ణం లేచి వచ్చిందే ప్రమీలా.
స్నేహితురాలు : అదేంటే అలా అంటున్నావు?
ఇల్లా లు : నిజమే ప్రమీలా! నేను ఇంటి పనుల్లో పడిపో యి నా పేరును కూడా మరచిపో యాను తెలుసా!
స్నేహితురాలు : మరి మీ ఇంట్లో వాళ్ళను ఎవరినైనా అడిగితే చెప్పేవారు కదా!
ఇల్లా లు : ఆ సంబరమూ అయ్యింది. ఒక్కరు కూడా నా పేరు గుర్తు లేదన్నారు.
స్నేహితురాలు : అప్పట్లో నువ్వు టెన్త్ స్కూల్ ఫస్టు వచ్చావు. కాలేజీలో మ్యూజిక్ పో టీల్లో కూడా ఫస్టు
వచ్చావు.
ఇల్లా లు : నిజమే ప్రమీలా! నువ్వు చెబుతుంటే పాత సంగతులన్నీ గుర్తు కు వస్తు న్నాయి.
స్నేహితురాలు : అంతేనా! బొ మ్మలు ఎంత అందంగా వేసేదానివో!
ఇల్లా లు : నిజమే. కానీ కుటుంబ బాధ్యతల్లో పడి ఆ జ్ఞా నమంతా మరుగున పడిపో యింది.
✍️మామిడిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల సహాయకుడు(తెలుగు), డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 9493646591.
తెలుగు పరిమళం - 9 తొమ్మిదో తరగతి - తెలుగు (ప్రథమభాష) 60
1. తీరము దరి
2. గౌరవం గారవం
4. భాష బాస
💥వాక్యాలు :
5. ఆశ్చర్యం అచ్చెరువు
2.రంగస్థ లం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. నాటకం అంటే ఏమిటో చెప్పండి?
జ). ప్రజల వినోదం కోసం సంభాషణ, సంగీతం, నృత్య సమన్వితంగా తయారుచేయబడ్డ ఒక కళాత్మక ప్రక్రియ
నాటకం. ఇది వినోద ప్రధానమైన కళ. కవి రాసిన వాక్యాలకు, సృష్టించిన పాత్రలకు నటీనటులు జీవం పో స్తా రు.
విస్త ృతమైన లోకానుభవం, లోతైన మానవ సంబంధాలు, మానవ స్వభావాలు, నటీనటుల అభినయం కలగలిసి
జీవితానికి సమాంతరంగా సాగేది నాటకం. ఇది అనేక కళల సమాహారం.
2. పౌరాణిక నాటకాల విశేషత గురించి రాయండి.
జ). పౌరాణిక నాటకాలు జనరంజకంగా ఉండేవి. వాటిలో మంచి మంచి పద్యాలు, సంభాషణలు ఉండేవి. ఆ
కాలంలో ఉద్ద ండులైన పండితులే కాకుండా, ఏమీ చదువుకోని పామరులు కూడా పౌరాణిక నాటకాలలోని పద్యాలను
రాగ, భావ యుక్త ంగా అలవోకగా ఆలపించి వీనుల విందు చేసేవారు. అప్పట్లో ఈ నాటకాలు ప్రదర్శించని ఊరంటూ
ఉండేదికాదు. ఈ విధంగా పౌరాణిక నాటకాలు ఎంతో విశేషత పొ ందాయి.
3. ఏకపాత్రలో నటించాలంటే నటుడు ఏఏ అంశాలపై దృష్టి పెట్టా లి?
జ). ఏకపాత్ర ఒక రకమైన నాటక ప్రక్రియ. ఒక నటుడు ఒకే పాత్రను అభినయించడాన్ని ఏకపాత్రా భినయం
అంటారు. ఏకపాత్రలో నటుడు ఏ పాత్రను పో షిస్తు న్నాడో ఆ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా
అర్థం చేసుకోవాలి. వేషధారణ ఆ పాత్రకు జీవం పో స్తు న్నట్లు గా ఉండాలి. నటుని ఆంగికం, వాచకం నటిస్తు న్న పాత్రకు
తగిన విధంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నటుడు తాను నటిస్తు న్న పాత్రను ప్రేక్షకుల హృదయాలలో
జీవింపజేయాలి.
4. వీథి నాటకానికి, వేదిక నాటకానికి తేడాలు రాయండి.
జ). ఊరూరా తిరుగుతూ నాలుగురోడ్ల కూడలిలో, ఖాళీ మైదానాల్లో ప్రదర్శించే నాటకాన్ని వీథి నాటకం
అంటారు. దీనిలో నటులు అతి తక్కువ ఆహార్యం, దుస్తు లతో వలయాకారంగా నిలబడి,అందరికీ కనపడేలా,
వినపడేలా కాగడాల వెలుతురులో నాటకాన్ని ప్రదర్శిస్తా రు. ఈ నాటకాలలో సామాజిక సమస్యలు ప్రధాన
ఇతివృత్త ంగా ఉంటాయి.
ఒకచోట వేదికను ఏర్పాటు చేసుకుని ప్రదర్శించే నాటకాన్ని వేదిక నాటకం అంటారు. చక్కటి వేషధారణ
కలిగిన నటులు గాజు దీపాల వెలుగులో వేదికపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తా రు. రంగురంగుల వస్త్రా లతో వేదిక వెనుక,
రెండు ప్రక్కలా తెరలుగా కడతారు. ప్రేక్షకులు ఆ నాటకం ప్రదర్శించే చోటుకే వచ్చి చూడవలసి ఉంటుంది.
ఆ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒక కుర్రా డు 23 దేశాల నుంచి వచ్చిన 120 చిత్రా లతో పో టీకి నిలిచి ఎంపికైన 35 చిత్రా లలో ఒక దానికి
దర్శకత్వం వహించి గుర్తింపు సాధించాడు. …………………… ఆ చిన్న చిత్రం వేలాది పేద బాలల అనాధల బాల
కార్మికుల జీవితాలకు ప్రతిబింబమైంది. (పూర్తి గద్యం కొరకు పాఠ్య పుస్త కం చూడగలరు)
@ప్రశ్నలు :
1. ఆషికుల్ సాధించిన ఘనత ఏమిటి?
జ). 11 ఏళ్ల వయస్సులోనే అనాధ బాలల జీవితాన్ని చిత్రించేలా "ఆమి - ఐయామ్" అనే లఘుచిత్రం తీయడం.
2. బాల కార్మికుల జీవితాలు తెలిపే లఘుచిత్రం పేరు ఏమిటి?
జ). బాల కార్మికుల జీవితాలు తెలిపే లఘుచిత్రం పేరు "ఆమి - ఐయామ్".
3. దృష్టిలో పడడం అంటే ఏమిటి?
జ). దృష్టిలో పడడం అంటే ఎదుటివారి మనసును ఆకర్షించడం
4. ముక్టనీర్ సంస్థ ఉన్న ప్రా ంతం ఏది? ( ఆ )
అ). బెంగాల్. ఆ). మధ్యగ్రా మ్ ఇ). ధార్వాడ ఈ). హైదరాబాద్
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). "ఆమి - ఐయామ్". లఘుచిత్రంలోని ఇతివృత్త ం ఏమిటి?
ఇ). కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
స్థా నం నరసింహారావు శ్రీ పాత్రలు ధరించడంలో దిట్ట. ……………………………… నటుడిగా ధ్వని
అనుకరణలో విశేష ప్రతిభ చూపిన నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగు ప్రజలకు "వెంట్రిలాక్విజమ్" అనే నూతన కళను
పరిచయం చేశారు. (పూర్తి గద్యం కొరకు పాఠ్య పుస్త కం చూడగలరు)
@ప్రశ్నలు :
1. పై పేరాలో స్త్రీ పాత్రలు పో షించిన పురుష నటుల పేర్లు రాయండి.
జ). స్థా నం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు గార్లు స్త్రీ పాత్రలు పో షించిన పురుష నటులు.
2. వేమూరి గగ్గ య్య గారి నటనా విశేషం ఏమిటి?
జ). కంసుడు, యముడు, రావణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి రౌద్ర పాత్రలు పో షించడం వేమూరి
గగ్గ య్య గారి నటనా విశేషం.
3. సత్య హరిశ్చంద్ర పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొ ందిన నటుడు ( ఆ )
అ). స్థా నం నరసింహారావు ఆ). డి.వి.సుబ్బారావు ఇ). బందా కనక లింగేశ్వరరావు
4. పాత్రలో ఒదిగి పో వడం అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు?
జ). 'ఇచ్చిన పాత్రను చక్కగా పో షించడంలో లీనమైపో వడం' అని అర్థం చేసకున్నాను.
5. మిమిక్రీ అనే ఇంగ్లీషు పదానికి సమానార్ధక తెలుగు పదం ఏది?
జ). 'ధ్వని అనుకరణ' అనేది మిమిక్రీ అనే ఇంగ్లీషు పదానికి సమానార్ధక తెలుగు పదం.
ఈ). మీ ఉపాధ్యాయుడిని అడిగి కింది నాటికలను వాటిని రాసిన రచయితలతో జతపరచండి.
1. ఆత్మవంచన - అ). గొల్ల పూడి మారుతిరావు ( 7 )
2. తేలుకుట్టిన దొ ంగలు - ఆ). బళ్లా రి రాఘవ ( 6 )
3. కప్పలు - ఇ). మునిమాణిక్యం ( 5 )
4. కంఠాభరణం - ఈ). పానుగంటి ( 4 )
5. గృహప్రవేశం - ఉ). ఆత్రేయ ( 3 )
6. సరిపడని సంగతులు - ఊ). పొ ట్లూ రి వెంకటేశ్వరరావు ( 2 )
7. సత్యంగారిల్లెక్కడ - ఎ). బుచ్చిబాబు ( 1 )
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. సాంఘిక నాటకాలు సమాజాన్ని చైతన్యపరచడానికి ఏవిధంగా కృషిచేస్తు న్నాయి?
జ). ప్రా రంభంలో పురాణాలు, దేవతల చుట్టూ తిరిగిన నాటకం కాలానుగుణంగా తన మార్గా న్ని
మార్చుకుంది. ప్రజల కష్టా లు, కన్నీళ్లు , వేదనలు, పో రాటాలు ఇతివృత్తా లుగా నాటక రచన ప్రా రంభమైంది.
బాల్యవివాహాలను నిరసిస్తూ , అర్థం పర్థం లేని ఆచారాలను వేళాకోళం చేస్తూ , వితంతు వివాహాలని ప్రో త్సహిస్తూ
గురజాడ అప్పారావు గారు రాసిన 'కన్యాశుల్కం' నాటకం మొదలుకొని సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి
భాస్కరరావు కలసి రచించిన 'మాభూమి', బో యి భీమన్న గారు రాసిన 'పాలేరు', కాళ్ళకూరి నారాయణరావు గారు
రాసిన 'వర విక్రయం', ప్రస్తు త కాలంలో వస్తు న్న అనేక సాంఘిక నాటకాలు వరకూ సామాజిక సమస్యలను సాంఘిక
దురాచారాలను ఎత్తి చూపుతూ, సమాజాన్ని చైతన్య పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ నేఉన్నాయి.
2. నాటక రంగంలో రేడియో నాటకాల ప్రత్యేకతను వివరించండి.
జ). 1967 నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రా రంభమైంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
రాసిన 'గణపతి' హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1967లో ప్రసారమైంది. రేడియో నాటకానికి
సంభాషణలే ప్రా ణం. నండూరి సుబ్బారావు, పుచ్ఛా పూర్ణా నందం, వి.బి.కనకదుర్గ , శారదా శ్రీనివాసన్, చిరంజీవి,
రేడియో అన్నయ్య - అక్కయ్యలుగా పేరుపొ ందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు
తమ గాత్రా లతో ఎన్నో పాత్రలకు ప్రా ణం పో శారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో నాటకానికి ఎంతో ప్రా చుర్యం
కల్పించింది. రేడియో ద్వారా వినిపించే శ్రవ్య నాటకాలు శ్రో తలను విశేషంగా ఆకర్షించాయి.
3. తెలుగు నాటకరంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి.
జ). తెలుగు నాటక రంగంలో కన్యాశుల్కం, పాలేరు, మాభూమి, వంటి నాటకాలు పెను సంచలనం
కలిగించాయి. గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకం బాల్యవివాహాలను నిరసిస్తూ , అర్థం పర్థం లేని
ఆచారాలను వేళాకోళం చేస్తూ , వితంతు వివాహాలను ప్రో త్సహిస్తూ , ఆనాటి సమాజంలో గొప్ప సంచలనం
కలిగించింది. బో యి భీమన్న గారి 'పాలేరు' నాటకం ప్రభావంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత
స్థా నాలను అధిరోహించారు. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు కలిసి రచించిన 'మా భూమి' నాటకం
పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇలా అనేక నాటకాలు తెలుగు
నాటకరంగంలో సంచలనం కలిగించాయి.
ఇ). కింది వాక్యాలను పరిశీలించండి. ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్ధా లు రాయండి.
1. పుస్త క పఠనం మనసుకు ఉల్లా సం కలిగిస్తు ంది.
జ). ఉల్లా సం = సంతోషం, ప్రకాశము
2. ఎంచుకున్న మార్గ ం మంచిది అయితే విజయం చేరువ అవుతుంది.
జ). చేరువ = సమీపము, సమూహము
3. కళాక్షేత్రం భవనాన్ని నూతనంగా నిర్మించారు.
జ). నూతనం = కొత్త , యువ
4. కరువు కాలంలో భుక్తి గడవడం కష్ట ం.
జ). కాలం = సమయము, నలుపు
5. ఆమె చేసిన కృషి వల్ల నే విజయం సాధించింది.
జ). కృషి = ప్రయత్నం,వ్యవసాయం
💥
ii). వ్యాకరణాంశాలు :
👉
సంధులు :
రుగాగమ సంధి :
1. పేదరాలు = పేద + ఆలు
2. బీదరాలు = బీద + ఆలు
3. బాలింతరాలు = బాలెంత + ఆలు
4. మనుమరాలు = మనుమ + ఆలు
👉
*పై ఉదాహరణలలో పూర్వపదాలుగా పేద, బీద, బాలెంత, మనుమ అనే పదాలున్నాయి. పరపదంగా "ఆలు" శబ్ద ం ఉంది.
* సూత్రం - 1 : కర్మధారయ సమాసంలో పేదాది శబ్ద ములకు "ఆలు" శబ్ద ం పరమైతే రుగాగమం వస్తు ంది.
ఉదా : 1. పేద + ర్ + ఆలు = పేదరాలు
2. బీద + ర్ + ఆలు = బీదరాలు
3. బాలెంత + ర్ + ఆలు = బాలింతరాలు
4. మనుమ + ర్ + ఆలు = మనుమరాలు
👉
(పేదాదులు - పేద, బీద, ముద్ద , బాలెంత, కొమ, గొట్టు ,అయిదవ,మనుమ … )
సూత్రం - 2 : కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు "ఆలు" శబ్ద ం పరమైతే పూర్వపదం చివర ఉన్న
అత్వానికి ఉత్వం, రుగాగమం వస్తా యి.
ఉదా : 1. ధీర + ఉ + ర్ + ఆలు = ధీరురాలు
2. గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు
3. విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
4. శ్రీమంత + ఉ + ర్ + ఆలు = శ్రీమంతురాలు
5. అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
*పూర్వపదమైన తత్సమానికి "అకారమునకు" ఉకారం వచ్చింది. దీనిని రుగాగమసంధి అంటారు.
అ). కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1. లోకానుభవం = లోక + అభినయం = సవర్ణ దీరస ్ఘ ంధి
2. అత్యుత్త మం = అతి + ఉత్త మం = యణాదేశసంధి
💥సమాసాలు :
3. మూకాభినయం = మూక + అభినయం = సవర్ణ దీరస ్ఘ ంధి
💥వాక్యాలు :
4. మయసభ - మయునిచే కట్ట బడిన సభ - తృతీయా తత్పురుష సమాసం.
💥అలంకారాలు :
జ). శశిధర్ పరుగెత్తా డు. శశిధర్ అలసిపో యాడు.
👉స్వభావోక్తి అలంకారం :
ఉదా : జింకలు బిత్త ర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.
వివరణ : పై వాక్యంలో జింకల స్వభావసిద్ధమైన స్థితిని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి చెప్పారు.
లక్షణం : జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లు గా మనోహరంగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం
అంటారు.
ఉదా : 1. చల్ల ని గాలికి పూలతోటలోని మొక్కలు తలలూపుతున్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో చల్ల టి గాలికి పూలతోటలోని మొక్కలు ఊగుతుండటాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
2. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తు న్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో ప్రకృతికి అనుగుణంగా నెమలి నాట్యం చేస్తు న్న విధానాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి
చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
3. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరచి గెంతుతున్నాయి.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో కొండపైనుండి ప్రవహిస్తు న్న సెలయేటిలో చేపలు ఈదటాన్ని ఉన్నది ఉన్నట్లు గా
వర్ణించి చెప్పారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
4. మంచు కొండలలో ముంచే మంచును తట్టు కుంటూ సైనికులు పహారా కాస్తు న్నారు.
జ). ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉన్నది.
సమన్వయం : ఈ వాక్యంలో మంచుకొండల్లో సైనికులు పహారా కాయడాన్ని ఉన్నది ఉన్నట్లు గా వర్ణించి చెప్పారు.
కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అయ్యింది.
*******
3. ప్రియమైన నాన్నకు
I). అవగాహన ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. ప్రియమైన నాన్నకు కథ రచయిత్రి గురించి రాయండి.
జ). ప్రియమైన నాన్నకు కథ రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి గారు. ఈమె 1946వ సంవత్సరంలో
తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తు తం కాకినాడ జిల్లా ) కాట్రా వులపల్లెలో జన్మించారు. తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ
భాషల్లో రచనలు చేశారు. ఒక చీకటి - ఒక వెన్నెల, పొ గమంచులో సూర్యోదయం, నాన్నకు రాయని ఉత్త రం,
కుసుమ కోమలి, గృహప్రవేశం మొదలైనవి వీరి రచనలు. మహిళా సాధికారత, స్వాతంత్య్రం, చదువు, ఉద్యోగం,
కుటుంబ విలువలు వీరి రచనలలో ఇతివృత్తా లుగా ఉంటాయి. 1992వ సంవత్సరంలో మరణించారు.
2. కృష్ణ మూర్తి గారికి ఫో న్లో మాట్లా డడం కన్నా ఉత్త రాలు రాయడం అంటేనే ఎందుకు ఇష్ట ం?
జ). ఫో న్లో సంభాషణలు అంత సంతృప్తికరంగా ఉండవు. సమయం గడుస్తు న్నకొద్దీ డబ్బులు ఎక్కువై
పో తాయని గాబరా పడుతూ చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పకుండానే ఫో ను పెట్టేస్తు ంటాము. అదే
ఉత్త రాల్లో అయితే చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా రాయగలుగుతాము. ఎదుటివారి మనసును
ఆకట్టు కునేలా చక్కని మాటల్ని గుర్తు కు తెచ్చుకుని మరీ రాయటానికి వీలుంటుంది. అందుకే కృష్ణ మూర్తి గారికి
ఫో న్లో మాట్లా డడం కన్నా ఉత్త రాలు రాయడం అంటేనే ఇష్ట ం.
3. చిన్నతనంలో రచయిత్రి తండ్రిగారైన కృష్ణ మూర్తి గారు ఆమెతో ఏ ఏ పుస్త కాలు చదివించారు?
జ). రచయిత్రి తండ్రిగారైన కృష్ణ మూర్తి గారు చిన్నతనంలో ఆమెతో దక్షయజ్ఞ ం, బంగారురాజు కథ,
జంతువుల - పక్షుల పుస్త కాలు, చందమామ, బాలమిత్ర పుస్త కాలు; ఠాగూర్, శరత్ చంద్ర, బంకించంద్ర ఛటర్జీల
అనువాదాలు; చలం, కొడవటిగంటి గార్ల కథలు; రామాయణం, భారతం, భాగవతం వచన రచనలు; పెర్ల్బక్, స్టీన్జెక్,
టాల్స్టాయ్, ఓహెన్రీ కథలూ; షేక్స్పియర్ నాటకాలు వంటి పుస్త కాలు చదివించారు.
4. రచయిత్రి తండ్రికి ఎప్పుడు, ఎందుకు ఉత్త రం రాయవలసి వచ్చింది?
జ). రచయిత్రి తన తండ్రి మరణించిన తరువాత ఆయనకు ఉత్త రం రాసింది. ఆమె తన తండ్రితో ఎక్కువగా
టెలీఫో న్లో మాట్లా డేద.ి ఆయనకు ఫో న్లో మాట్లా డటం అంత సంతృప్తిగా అనిపించేది కాదు. రచయిత్రి గారేమో ఆమెకు
వీలుకుదరక తండ్రి బ్రతికుండగా ఉత్త రం రాయలేకపో యారు. ఇప్పుడు ఆయనతో ఫో న్లో మాట్లా డదామన్నా ఆయన
ఎవరికీ అందని లోకాలకు వెళ్లి పో యారు. కాబట్టి ఇప్పుడు తండ్రితో తన అనుబంధాన్ని, జ్ఞా పకాలను నెమరు
వేసుకోవడానికి ఏకైక సాధనం ఉత్త రం మాత్రమే. తన తండ్రికి ఇష్ట మైన ఉత్త రం రాస్తు ంటే తండ్రితో మాట్లా డుతున్న
అనుభూతిని పొ ందవచ్చు. అందుకే రచయిత్రి తన తండ్రి మరణానంతరం ఆయనకు ఉత్త రం రాసింది.
5. "కమ్యూనికేషన్ గ్యాప్" అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు?
జ). రెండు తరాలకు చెందిన వ్యక్తు ల మధ్య ఆలోచనలు,జీవన విధానంలో అంతరాలను కమ్యూనికేషన్
గ్యాప్ అంటారని నేను అర్థం చేసుకున్నాను. పూర్వ కాలములోని వారు సమాచార సాధనంగా లేఖలను
ఉపయోగించేవారు. ప్రస్తు త కాలంలో సమాచారాన్ని తెలియజేసుకోవడానికి ప్రతి ఒక్కరూ మొబైల్ ఫో న్,
కంప్యూటర్ల పై ఆధారపడుతున్నారు. ఇక్కడ రెండు తరాల మధ్య సమాచార సాధనాల్లో అంతరం కనిపిస్తు ంది. ఈ
అంతరాలను కమ్యూనికేషన్ గ్యాప్ అంటారని నేను అర్థం చేసుకున్నాను.
ఆ). కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నా కళ్ళు అందమైనవి అంటుంది అమ్మ. నిజమే నా కళ్ళు పెద్దవే కానీ ఏమి లాభం.
••••••••••••••••••••••••••••••••••••••••••• అమ్మ కళ్ళకు ఏమీ కనిపించవు. కనిపించినా వాటి గురించి అమ్మ
పట్టించుకోదు. ఆడవాళ్ళ కళ్ళే ఇట్లా ఎందుకుంటాయో! (సురక్ష - ఆంధ్రపద ్ర ేశ్ పో లీసు మాసపత్రిక, రాజకీయ కథలు -
శ్రీమతి ఓల్గా ) (*పూర్తి గద్యం కొరకు పాఠ్యపుస్త కంలోని 135,136 పుటలు చూడగలరు)
@ప్రశ్నలు :
1. రచయిత్రికి ఏడుపు అంటే ఇష్ట ం లేదు ఎందుకు?
జ). రచయిత్రి గారు ఏడిస్తే తన కళ్ళు బాగుండవని, మొహమంతా నల్ల గా కాటుకవుతుందని ఆమె అభిప్రా యం.
అందుచేత రచయిత్రికి ఏడుపు అంటే ఇష్ట ంలేదు.
2. 'నోరు మూసుకో లేకుంటే కళ్ళు మూసుకో' అని అమ్మ ఎందుకన్నది?
జ). ఆడపిల్లలకు ఏదైనా విషయం తెలిసినా దానిని బయటికి చెప్పకూడదు. ఏదైనా చూసినా చూడనట్లు గా
ఉండాలి. అనే అభిప్రా యం వాళ్ళ అమ్మగారికి ఉంది. అందుకే ఆమె ఈ మాటలు అన్నది.
3. ఆపదలో ఉన్న వాళ్ల కు సాయం చేయడంలో ఆడ, మగ తేడాలుంటాయా?
3. 'ఉత్త రాలు రాయడం, టెలిఫో న్ లో మాట్లా డడం' వీటిలో ఏది ఉపయోగకరమైనదని నీవు భావిస్తు న్నావు?
మీ సమాధానాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జ). 'ఉత్త రాలు రాయడం, టెలిఫో న్ లో మాట్లా డడం' వీటిలో ఏది ఉపయోగకరమైనదని అడిగితే సమాధానం
చెప్పడం కొంచెం కష్ట మే. కాలానుగుణంగా రెండూ వేటికవే గొప్పవని చెప్పవచ్చు.
ఉత్త రాలలో చెప్పదలచుకున్న విషయాల్ని బాగా ఆలోచించుకుని, ప్రశాంతంగా, వీలు కుదిరినప్పుడు
రాయవచ్చు. చక్కని పదజాలం ఉపయోగించి ఎదుటివారి మనస్సును ఆకర్షించేలా రాయవచ్చు. ఉత్త రాలను
మనకు సమయం దొ రికినప్పుడు చదువుకుని ఆనందించవచ్చు. ఉత్త రాలు ఆయా కాలాలకు సంబంధించిన
సామాజిక, రాజకీయ పరిస్థితులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఆయా ప్రా ంతాలకు చెందిన మాండలిక
భాషాంశాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉత్త రాల ద్వారా సమాజానికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఉత్త రాల
ద్వారా ముందు తరాలవారి స్థితిగతులను రాబో యే తరాలవారు తెలుసుకునే వీలుంటుంది.
టెలిఫో న్ విషయానికి వస్తే సమాచారాన్ని అప్పటికప్పుడు చేరవేసే సాధనంగా దీనిని చెప్పవచ్చు. టెలిఫో న్లో
ఎక్కడో దూరప్రా ంతంలో ఉన్నవారితో కూడా మన ఎదురుగానే ఉన్నట్లు గా మాట్లా డవచ్చు. కొన్ని ముఖ్యమైన
సమాచారాలను అప్పటికప్పుడు చేరవేయడానికి టెలిఫో నే సరైన సాధనం. ఒక్కొక్కసారి బిల్లు ఎక్కువగా
వచ్చేస్తు ందనే బెంగతో మాట్లా డాల్సిన విషయాన్ని పూర్తిగా మాట్లా డకుండానే ముగించే పరిస్థితి రావచ్చు. దీనిలో
మనం మాట్లా డిన మాటలు మనకు వీలు కుదిరినప్పుడు విందామంటే కుదరదు. టెలిఫో న్లోని సంభాషణలు భవిష్యత్
తరాలకు అందే అవకాశం లేదు. మొత్తా నికి ఆలోచించి చూస్తే తాత్కాలిక ఆనందాన్ని అందించే టెలిఫో న్ కంటే,
భవిష్యత్ తరాలకు కూడా సమాచారాన్ని అందించే ఉత్త రమే ఎక్కువ ఉపయోగకరం అని నేను భావిస్తు న్నాను.
4. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన కింది టెలిఫో న్ సంభాషణను పొ డిగించి రాయండి.
కూతురు : నాన్నా… నేను
తండ్రి : ఎలా ఉన్నావు తల్లీ?
కూతురు : బాగున్నాను నాన్న… నువ్వు వేళకు మందులు వేసుకుంటున్నావా? అమ్మ ఎలా ఉంది?
తండ్రి : మీ అమ్మా, నేనూ బాగానే ఉన్నాము తల్లీ!
కూతురు : మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా?
తండ్రి : నా ఆరోగ్యానికేం తల్లీ నిక్షేపంగా ఉంది.
కూతురు : మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది. ఒక్కసారి మా ఊరు రావచ్చు కదా నాన్నా!
తండ్రి : ఈ వయస్సులో మేము అంతదూరం ప్రయాణం చేయలేము తల్లీ! మీరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి
మమ్మల్ని చూసి పో వచ్చుగా!
కూతురు : మీ అల్లు డుగారికి సెలవులు ఉండటంలేదు నాన్నా. ఈ దసరా సెలవులకు ఊరు రావడానికి
ప్రయత్నిస్తా ము.
తండ్రి : వచ్చేటప్పుడు మా మనవల్ని కూడా తీసుకురండి.
కూతురు : తప్పనిసరిగా నాన్నా! వాళ్ళుకూడా మీ దగ్గ రకు రావాలని ఎంతో ఆతృతగా ఉన్నారు.
తండ్రి : ఒక్కసారి అల్లు డు గారికి ఫో న్ ఇవ్వు తల్లీ! ఆయనతో కూడా రమ్మని చెప్పాలి కదా!
కూతురు : ఆయన ఆఫీస్ నుండి ఇంకా రాలేదు నాన్నా. వచ్చాక నేను చెబుతానులే. ఆయన ఏమీ అనుకోరు.
తండ్రి : సరే తల్లీ. అల్లు డుగారు వచ్చాక ఫో న్ చెయ్యి. ఆయనతో మాట్లా డతాను.
కూతురు : సరే నాన్నా.. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. మీ అల్లు డుగారు వచ్చాక ఫో న్ చేస్తా లే.
తండ్రి : దసరా సెలవులకు రావడం మాత్రం మరచిపో కండి తల్లీ. మీ కోసం ఎదురు చూస్తు ంటాము.
కూతురు : తప్పనిసరిగా వస్తా ము నాన్నా.. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇక ఉంటాను మరి.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసి వాటిని సొ ంతవాక్యాల్లో రాయండి.
1. ఏరు చిన్నపిల్లలా ఉరకలు వేస్తో ంది.
జ). ఉరకలు = దుముకు
*కోతులు ఒక చెట్టు పై నుండి మరో చెట్టు పైకి దుముకుతాయి.
2. వర్షా భావం వల్ల కొన్ని ప్రా ంతాల్లో కరువు నీడలు అలముకున్నాయి.
జ). కరువు = క్షామం
*పంటలు పండకపో తే క్షామం వస్తు ంది.
1 స్త్రీ ఇంతి
2 శ్రీ సిరి
3 కుమారుడు కొమరుడు
4 క్షేమము సేమము
5 ఆశ ఆస
ఉదా : ప్రతి కుటుంబానికి స్త్రీ - సిరితో సమానం. ఆ ఇంతియే ఇంటికి వెలుగు.
1. మనదేశం శ్రీలు పొ ంగిన జీవగడ్డ . సిరియే సకల సుఖాలకూ కారణం.
2. దశరథుని పెద్ద కుమారుడు శ్రీరాముడు. శ్రీ కృష్ణు డు యశోద కొమరుడు.
3. మనం ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే వారు కూడా మన సేమాన్ని కోరుకుంటారు.
4. ఇతరుల సంపదలకు ఆశ పడకూడదు. దేనికీ ఆస పడని వ్యక్తి ఆనందంగా జీవిస్తా డు.
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
👉
మారుతున్నాయి. ఇలా పరుషాల స్థా నంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు.
కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. రాcగలడు = రాన్ + కలడు = సరళాదేశ సంధి
2. వచ్చెcదల్లీ = వచ్చెన్ + తల్లీ = సరళాదేశ సంధి
3. పట్టు cబట్టెను = పట్టు న్ + పట్టెను = సరళాదేశ సంధి
4. రావణుcజంపె = రావణున్ + చంపె = సరళాదేశ సంధి
💥సమాసాలు :
5. చాయcబో లె = చాయన్ + పో లె = సరళాదేశ సంధి
💥
4. పఠనలేఖనములు = పఠనమును, లేఖనమును - ద్వంద్వ సమాసం
వాక్యాలు - రకాలు :
అ). కింది వాక్యాలను పరిశీలించండి.
1. నీవు పాఠం చదువు.
2. చిత్రం గురించి వివరించండి.
పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తు న్నాయి. ఇలా విధిగా చేయమని
చెప్పే వాక్యాలు విధ్యర్ధక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకురా.
2. పాఠం శ్రద్ధగా వినండి.
3. మీరు తొమ్మిది గంటలకల్లా పాఠశాలకు రావాలి.
4. మీరు వేకువ జామునే నిద్ర లేవండి.
ఆ). కింది వాక్యాలను పరిశీలించండి.
1. ప్రతి ఆదివారం సెలవు.
2. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తా డు.
పై వాక్యాలలో సమాచారం స్పష్ట ంగా కచ్చితంగా తెలుస్తో ంది. ఇలా కచ్చితంగా సమాచారాన్నిచ్చే
వాక్యాలను నిశ్చయార్ధక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. మా నాన్నగారు ఊరినుండి రేపు (తప్పక) వస్తా రు.
2. రాము ఈ రోజు (తప్పకుండా) బడికి వస్తా డు.
💥అలంకారాలు :
2. నీవు తరగతి గదిలోకి రావద్దు .
4.ఆశావాది
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
1. ఆశావాది ప్రకాశరావు తల్లిదండ్రు ల గురించి చెప్పండి.
జ). కుళ్ళాయమ్మ, పక్కీరప్ప గార్లు ఆశావాది ప్రకాశరావు గారి తల్లిదండ్రు లు. పక్కీరప్ప గారు ప్రా థమిక
పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. పక్కీరప్ప, కుళ్ళాయమ్మ దంపతులకు ఏడుగురు మగపిల్లలు, ముగ్గు రు
ఆడపిల్లలు కలిపి మొత్త ం పదిమంది సంతానం.
2. ఆశావాది ప్రకాశరావు రచనలు పేర్కొనండి.
జ). పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్త ము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన
కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణం, అవధాన వినోదం - సరస ప్రసంగం, ప్రత్యూష పవనాలు,
వరదరాజ శతకము, మొదలైనవి ఆశావాది ప్రకాశరావు గారి రచనలు.
3. ఆశావాది పూరించిన ఒక సమస్య చెప్పండి.
జ). ఒకసారి తెలుగు శాఖాధ్యక్షుల వారైన డాక్టర్ నండూరి రామకృష్ణ మాచార్యులవారు ఆశావాది ప్రకాశరావు
గారికి "ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్" అనే సమస్యనిచ్చి పూరించమన్నారు. ప్రకాశరావు గారు…
"ప్రశ్నలపై వడి ప్రశ్నలు
ప్రశ్నించెడి తనదు భర్త భావంబేమో
ప్రశ్నించుచు తన యెదలో
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్" అని ఆ సమస్యను చక్కగా పూరించారు.
ఆ). కింది పేరా చదివి ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.
తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రా చీన ప్రక్రియ. •••••••••••••••••••••••• సాయికృష్ణ యాచేంద్ర
గారు 'సంగీత గేయధార'తో అవధానంలో కొత్త ఒరవడి సృష్టించారు.
@ప్రశ్నలు :
1. తెలుగు సాహిత్యంలో ఒక ప్రా చీన ప్రక్రియ పేరు రాయండి.
జ). తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రా చీన ప్రక్రియ.
2. అష్టా వధానం అంటే ఏమిటి?
జ). అష్టా వధానం అంటే ఒకే సమయంలో ఎనిమిది విషయములపై మనస్సును ఏకాగ్రతతో నిలపడం.
3. అష్టా వధానంలో ప్రశ్నలు అడిగేవారిని …………….. అంటారు.
జ). అష్టా వధానంలో ప్రశ్నలు అడిగేవారిని పృచ్ఛకులు అంటారు.
4. అష్టా వధానంలోని అంశాల సంఖ్య? ( ఇ )
అ). 6 ఆ). 7 ఇ). 8. ఈ). 9
5. పై పేరాలను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి.
జ). అవధానంలో సమాధానం ఇచ్చేవారిని ఏమంటారు?
ఇ). కింది పేరా చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
ఒకసారి ఒక అబ్బాయి పక్కింటివారి ధాన్యం కొట్ట ంలో కూర్చొని చిన్న దీపం పెట్టు కుని
చదువుకుంటున్నాడు. ••••••••••••••••••••••••• ఆ అబ్బాయి ఇంకెవరోకాదు, ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి
చీకట్లో వెలుగులు అందించిన థామస్ ఆల్వా ఎడిసన్.
@ప్రశ్నలు :
1. సృజనాత్మకత అంటే ఏమిటి?
జ). కొత్త విషయాన్ని కనిపెట్టడం కోసం చేసే ప్రత్యేకమైన ఆలోచనను సృజనాత్మకత అంటారు.
2. "పట్టు వదలని విక్రమార్కుడు" సొ ంతవాక్యంలో ప్రయోగించండి.
జ). కష్ట పడి పట్టు వదలని విక్రమార్కునిలా కృషిచేస్తేనే చేసే పనిలో విజయం సాధించగలం.
3. 'తండ్రి' పర్యాయపదాలు రాయండి.
జ). తండ్రి = అయ్య, నాన్న, పిత
4. మీ అమ్మ దగ్గ ర నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్న ఒక్క సందర్భం రాయండి.
జ). నా చిన్నతనంలో నేను ఒకరోజు బడికని బయలుదేరి బడికి వెళ్ళకుండా దారిలో గుడిదగ్గ ర కూర్చున్నాను.
అమ్మ గట్టిగా గదిమేసరికి నిజం ఒప్పుకుని అమ్మను క్షమించమని అడిగాను.
చిరునామా :
ఎమ్. ఆదిత్య
తండ్రి శ్రీనివాసరావు గారు,
ఎస్. మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డాII.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్ - 533211
2. మీకు దగ్గ ర్లో ని రైతు/ ఆరోగ్య కార్యకర్త / శ్రా మికుడు/ పో లీసు/ ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ముఖాముఖి
(ఇంటర్వ్యూ) నిర్వహించేందుకు 10 ప్రశ్నలు తయారు చేయండి.
జ). ప్రజాప్రతినిధితో ముఖాముఖి నిర్వహించడానికి ప్రశ్నావళి :
1. నమస్కారం ఎమ్.ఎల్.ఏ గారు! ఎలా ఉన్నారు?
2. మీరు రాజకీయాల్లో కి వచ్చి ఎంతకాలం అవుతుంది?
3. మీరు రాజకీయాల్లో కి రాకముందు ఏమిచేసేవారు?
4. మీకు రాజకీయాల్లో కి రావాలని ఎందుకనిపించింది?
5. మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు?
6. మీరు రాజకీయాల్లో కి రావడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
7. మీ నియోజకవర్గ ంలో ఎంతమంది ఓటర్లు న్నారు?
8. మీ నియోజకవర్గ ంలోని సమస్యలపై మీకు అవగాహన ఉందా?
9. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకూ నెరవేర్చారు?
10.ప్రస్తు త రాజకీయాల్లో పెరిగిపో తున్న అవినీతిపై మీ అభిప్రా యం ఏమిటి?
11.భవిష్యత్తు లో మీకు పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉందా?
12.రాజకీయాల్లో కి రావాలనుకునే నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
3. ఈ కింది కవిత చదవండి. ఆలోచించండి. కవితను పొ డిగించి రాయండి.
నాకూ ఒక 'కల' ఉంది
ఆకాశం పైన అడుగులు వేయాలని
👉
4. అష్ట + ఐశ్వర్యం = అష్టైశ్వర్యం = వృద్ధిసంధి
వృద్ధిసంధి : అకారానికి ఏ,ఐ లు పరమైతే ఐకారము, ఓ,ఔ లు పరమైనప్పుడు ఔకారము ఆదేశమవుతాయి.
ఈ). కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. మధుర భాషణము = మధురమైన భాషణము - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మూడు సంవత్సరాలు = మూడు సంఖ్య గల సంవత్సరాలు - ద్విగు సమాసం
👉ప్రత్యక్ష కథనం :ఒక్క వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.
కింది ఉదాహరణను చూడండి.
👉
ఉదా : "నేను తలచుకుంటే ఏదైనా సాధించగలను" అని వర్షిత్ అన్నాడు.
పరోక్ష కథనం : వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు.
*ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధ రణ చిహ్నాలలో " ………… "చూపించాలి.
పరోక్ష కథనంలో ఉద్ధ రణ చిహ్నాలు ఉండవు.
*ప్రత్యక్ష కథనంలో 'నేను' పరోక్ష కథనంలో 'తను' అవుతుంది.
నేను - తాను, తను; నా - తన; నాతో - తనతో; నన్ను - తనను;
నాకు - తనకు; మా - తమ; మాకు - తమకు; మేము - తాము;
అ). కింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
1. "నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి" అని రఫీ చెప్పాడు.
జ). తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు.
2. "పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ంది" అని వాళ్ళ నాన్నగారు అన్నారు.
జ). పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ందని వాళ్ల నాన్నగారు అన్నారు.
3. "మీరంతా ఎక్కడి నుండి వస్తు న్నారు?" అని శైలజ పిల్లల్ని అడిగింది.
జ). మీరంతా ఎక్కడి నుండి వస్తు న్నారని శైలజ పిల్లల్ని అడిగింది.
4. "నాకు ఈత అంటే ఎంతో సరదా. ఈత కొట్ట డం ఆరోగ్యం కూడా" అని అక్షయ అన్నది.
జ). తనకు ఈత అంటే ఎంతో సరదా అని, ఈత కొట్ట డం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది.
ఆ). కింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
1. చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు.
జ). "చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యము" అని ఉపాధ్యాయులు చెప్పారు.
2. తన జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరానని కలామ్ అన్నారు.
జ). "నా జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరాను' అని కలామ్ అన్నారు.
3. తామంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు.
జ). "మేమంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటాము" అని పిల్లలు చెప్పారు.
4. తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు.
జ). "నేనొక ప్రకృతి ఆరాధకుడిని" అని విజయ్ అన్నాడు.
*******
5.ఏదేశమేగినా•••!
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). పాఠ్యభాగం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
1. రచయిత్రి విదేశీ పర్యటనలో ఏయే ప్రా ంతాలు సందర్శించింది.
జ). రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటనలో
భాగంగా వారి విదేశీ పర్యటనలో బెర్లిన్ నగరం, హాల్ నగరం, చెకొస్లో వేకియా, విల్నూస్, మాస్కో, మాంట్రియల్
ప్రా ంతాలు సందర్శించింది.
2. డాక్టర్ క్లా రాకు భారతీయ సాహిత్యంపై అపార గౌరవం ఉన్నదని ఎలా చెప్పగలవు?
జ). డాక్టర్ క్లా రా గారు హంగరీలోని బుడాపెస్టు యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్టు మెంటులో
పనిచేసేవారు. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తు న్న మహానుభావుడు. ఆయనకు
భారతీయ సాహిత్యంపై,భగవద్గీతపై అపారమైన గౌరవాదరాలు ఉన్నాయి. భారతీయ సాహిత్యంపై ఉన్న
గౌరవభావంతో ఆయన తన భార్య పేరును 'పద్మ' అని మార్చుకున్నారు. తన కుమార్తెకు 'అమృత' అని పేరు
పెట్టా రు.
3. జర్మనీ భాషలోకి ఏఏ భాషల నుండి అనువాదాలు జరిగాయి?
జ). భారతీయ భాషలైన సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషలనుండి జర్మనీ భాషలోకి అనువాదాలు
జరిగాయి.
4. రూబెన్ పండితుడు భారతీయ స్త్రీలను గురించి ఏమని చెప్పాడు?
జ). దుష్యంతునిచే తిరస్కరించబడిన శకుంతల అతనిని గడ్డిపో చ వలె భావించి, తన స్వశక్తితో కుమారుడైన
భరతుని సర్వవీరునిగా తీర్చిదిద్దిందని రూబెన్ పండితుడు చెప్పాడు. అలాగే సీత, ద్రౌ పది వంటి స్త్రీలను
స్వీయత్యాగంతో, లోకహితాన్ని సాధించిన మహిళామణులుగా కీర్తించాడు. ఇటువంటి త్యాగగుణం భారతీయ స్త్రీలకే
సొ ంతమని రూబెన్ పండితుడు చెప్పాడు.
ఆ). కింది వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పో తం జానకమ్మ. ••••••••••••••••••• 146 సంవత్సరాల తర్వాత
కాళిదాసు పురుషో త్త ం ఈ గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు.
@ప్రశ్నలు :
1. జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్త కానికి పెట్టిన పేరేమిటి?
జ). జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్త కానికి "పిక్చర్స్ ఆఫ్ ఇంగ్ల ండ్" అనే పేరు పెట్టా రు.
2. 'జిజ్ఞా స' అంటే అర్థం ఏమిటి?
జ). జిజ్ఞా స అంటే తెలుసుకోవాలనే కోరిక.
3. ఇంగ్లా ండ్ లో కుటుంబ జీవితాలపై రచయిత్రి ఆలోచన ఏమిటి?
జ). ఇంగ్లా ండ్ లో కుటుంబ జీవితాలు బాగున్నాయని, స్త్రీలకు అన్ని చోట్లా సమాన అవకాశాలు లభిస్తు న్నాయని
రచయిత్రి చెప్పారు.
4. సౌతాంప్ట న్ రైల్వేస్టేషన్లో రచయిత్రి గమనించిన ప్రత్యేక అంశం ఏది?
జ). సౌతాంప్ట న్ రైల్వేస్టేషన్లో ఉద్యోగులంతా స్త్రీలే ఉండటం రచయిత్రి గమనించిన ప్రత్యేక అంశం.
5. ఈ కథనం నుంచి ఆలోచింప చేసే ఓ ప్రశ్నను రాయండి.
జ). తెలుగులో తొలి యాత్రా రచయిత్రి ఎవరు?/ పారిస్ ఎలాంటి నగరం?
ఇ). కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. •••••••••••••••• ఆంధ్ర మహిళాసభ
వ్యవస్థా పకురాలైన శ్రీమతి దుర్గా బాయి దేశముఖ్.
@ప్రశ్నలు :
1. కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? ( ఇ )
జ). అ). విజయవాడ ఆ). బాపట్ల ఇ). కాకినాడ ఈ). చీరాల
2. తెగేసి చెప్పడం అంటే అర్థం ఏమిటి?
జ). నిర్మొహమాటంగా చెప్పడం
3. దుర్గా బాయిని ప్రధాన ద్వారం వద్ద ఎందుకు నిలబెట్టా రు?
జ). కాంగ్రెస్ మహాసభలకు వస్తు న్న వారి దగ్గ ర టిక్కెట్టు చూసి లోపలికి పంపడానికి.
4. నిన్ను ఎవరైనా పెద్దలు భుజం తట్టి మెచ్చుకున్న ఏవైనా రెండు సందర్భాలు రాయండి.
జ). i). నేను మట్టితో చేసిన గణపతి విగ్రహం చూసి మా పాఠశాల ఉపాధ్యాయులు భుజం తట్టి మెచ్చుకున్నారు.
ii). నేను పరుగు పందెంలో గెలిచినప్పుడు మా నాన్నగారు నన్ను భుజం తట్టి మెచ్చుకున్నారు.
5. ఈ పేరాకు తగిన శీర్షికను రాయండి.
జ). "కర్త వ్య దీక్షాదక్షురాలు దుర్గా బాయి"
ఈ). మీ ఉపాధ్యాయుని సహాయంతో కింది యాత్రా రచన - వాటి గ్రంథకర్త ను జతపరచండి.
1. 'ఆటా'జనికాంచె ( ఊ ) అ). అక్కినేని నాగేశ్వరరావు
2. ఇనుపతెర వెనుక ( ఇ ) ఆ). వాసా ప్రభావతి
3. నవ భారతి ( ఈ ) ఇ). రావూరి భరద్వాజ
4. రష్యాలో స్నేహయాత్ర ( ఆ ) ఈ). మాలతీ చందూర్
5. నేను చూసిన అమెరికా ( అ ) ఉ). ఏనుగుల వీరాస్వామి
6. కాశీయాత్రా చరిత్ర ( ఉ ) ఊ). ఎండ్లూ రి సుధాకర్
II). వ్యక్తీకరణ - సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
1. లిథువేనియా కవి సర్ ఎడ్వర్డ్ దాస్ రచయిత్రికి అందించిన గౌరవం ఏమిటి?
జ). సర్ ఎడ్వర్డ్ దాస్ రష్యా లోని విల్నూస్ నగరానికి చెందినవారు. ఆయన లిథువేనియా భాషలో గొప్పకవి.
'మాయ్ నో రామ-మాయినో ఇండిష్కీ' అనే కావ్యాన్ని వ్రా శారు. ఆయన లక్ష్మీకాంతమ్మ గారిని సంస్కృత కవయిత్రి
అని తెలుసుకుని గౌరవంతో 'బెల్ట్ ఆఫ్ పొ యిట్స్' అని పిలవబడే ఒక బెల్టు ను బహూకరించారు.
2. కాళిదాసు సాహిత్యాన్ని గూర్చి రూబెన్ పండితుడు ఏమన్నారు?
జ). కాళిదాసు రచనలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేసి జర్మనీ భాషలో మహా గ్రంథాలను రచించిన
మహామనీషి రూబెన్ పండితుడు. మహాకవి కాళిదాసు సృష్టించిన పాత్రలన్నీ ఎంతో ఉత్కృష్ట మైనవని రూబెన్
పండితుడు చెప్పాడు. దుష్యంతునిచే తిరస్కరింపబడిన శకుంతల అతని అవినయాన్ని, ధన మదాంధత్వాన్ని
సహించక, గడ్డిపో చవలె తిరస్కరించిందని కాళిదాసు చెప్పిన తీరు అద్భుతమని రూబెన్స్ పండితుడు అన్నాడు. 3.
ప్రొ ఫెసర్ మోడే పండితుని చూచి రచయిత్రి ఆశ్చర్యపో వడానికి కారణం ఏమిటి?
జ). మోడే పండితుడు గొప్ప విశ్వసాహిత్యవేత్త. ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రా భిమాని. ఆయన హాల్
నగరంలో నివసించేవారు. ఆయన గ్రంథాలయంలో భారతీయ శిల్ప,చిత్ర,నాట్య,సంగీత,సాహిత్యాది వివిధ కళలపై
ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వేదవేదాంగములు, శాస్త ప ్ర ురాణేతిహాసములు, బౌద్ధ వాఙయ సంపుటాలు, రవీంద్రు ని
వ్రా తప్రతులు, మాక్స్ ముల్ల ర్ వ్రా తప్రతులను ఎంతో గౌరవభావంతో భద్రపరచుకొన్నారు. మన తెలుగు సాహిత్యాన్ని
గురించి లెక్కలేనన్ని ఆంగ్ల వ్యాసాలు సేకరించారు. ఆయన తన పేరును 'మోద' అని తన నగరాన్ని 'శాల' అని
పిలవమనేవారు. ఈ విధంగా భారతీయ సాహిత్యంపై మోడే పండితునికి గల అభిమానాన్ని చూసి రచయిత్రి
ఆశ్చర్యపో యింది.
4. ఏ దేశమేగినా.. పాఠ్యాంశ రచయిత్రి గురించి రాయండి?
జ). ఏ దేశమేగినా పాఠ్యాంశ రచయిత్రి శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు. ఈమె నాళం కృష్ణా రావు,
సుశీలమ్మ దంపతులకు 1917లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుండి
ఉభయభాషాప్రవీణ పట్టా పొ ందారు. ఆంధ్రు ల కీర్తనవాఙయసేవ, ఆంధ్ర కవయిత్రు లు, అఖిల భారత కవయిత్రు లు,
హంస విజయము, అభిజ్ఞా నశాకుంతలము, జాతిపిత, ఒక చిన్నదివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ , సరస్వతీ
సామ్రా జ్య వైభవము, సాహితీ రుద్రమ, అమృతవల్లి మొదలైనవి వీరి రచనలు.
5. యాత్రరచన ప్రక్రియను పరిచయం చేయండి.
జ). యాత్రికుడు తాను పొ ందిన యాత్రా నుభవాలను గ్రంథస్థ ం చేయడాన్ని యాత్రా రచన అంటారు. ప్రముఖ
వ్యక్తు లు స్వదేశంలో కానీ, విదేశంలో కానీ విశిష్ట త కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొ ందిన
అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణ నాత్మకంగా చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞా నయాత్రలు కావచ్చు,
విహారయాత్రలు కావచ్చు, ఆధ్యాత్మికయాత్రలైనా కావచ్చు.
6. ఏ దేశమేగినా పాఠ్యాంశం నేపథ్యం రాయండి.
జ). శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు
పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆమె వివిధ ప్రదేశాలు సందర్శించారు. భారతీయ సంస్కృతిపై, సాహిత్యంపై
అభిమానం గల ఎంతోమంది ప్రముఖ విదేశీ రచయితలను, వ్యక్తు లను ఆమె కలిశారు. ఆ పర్యటన సాగిన విధానం,
ఆమె పొ ందిన అనుభవాలు, విశేషాలను పాఠకులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
చిరునామా :
ఎమ్. జాహ్నవి,
తండ్రి - శ్రీనివాసరావు గారు,
ఎస్.మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్- 533211
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా న్ని గుర్తించి రాయండి.
(కలవరం, పతివ్రత, కలయిక, ఎక్కిన, గొప్పగా, నమస్కారాలు)
1. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి.
జ). జోతలు = నమస్కారాలు
2. మంచి మిత్రు లతో సమాగమం మనకు మేలు చేస్తు ంది.
జ). సమాగమం = కలయిక
3. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది.
జ). సాధ్వి = పతివ్రత
4. బయటకు వెళ్లి న పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పలికింది.
జ). కలగుండు = కలవరం
5. చదువుకుంటే జీవితం ఉత్కృష్ట ంగా మారుతుందని పెద్దలు అంటారు.
జ). ఉత్కృష్ట ంగా = గొప్పగా
6. బచేంద్రిపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ.
జ). అధిరోహించిన = ఎక్కిన
ఆ). కింది వాక్యాల్లో ఒకే అర్థా న్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి.
1. ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రు ల మధ్య ఉత్త రాలు రాసుకోవడం పరిపాటి. లేఖలు
ఎప్పటికీ ఆత్మీయ రేఖలు.
జ). జాబు, ఉత్త రం, లేఖ
2. పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞ ను పాటించాలని
ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి అనుజ్ఞ ను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేసాము.
జ). ఆదేశం, ఆజ్ఞ , అనుజ్ఞ
3. చదివిన అంశాలను జ్ఞ ప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి. అవసరమైనప్పుడు
జ్ఞా పకం వస్తా యి.
జ). జ్ఞ ప్తి, స్మృతి, జ్ఞా పకం
ఇ). ప్రకృతి - వికృతులను జతపరచండి.
1. దీపము ( ఈ ) అ). జాతర.
2. మాణిక్యం ( ఉ ) ఆ). జతనం
3. యత్నం ( ఆ ) ఇ). నిచ్చెలు
4. యాత్ర ( అ ) ఈ). దివ్వె
5. నిత్యము ( ఇ ) ఉ). మానికం
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
👉అనునాసిక సంధి :
వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా! వర్ణ మాలలోని 'క' వర్గ ంలో
పంచమాక్షరం 'ఙ'. కింది పట్టికను గమనించండి.
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
👉కింది పదాల సంధి, విసంధి రూపాలను గమనించండి.
1. వాఙ్మయం = వాక్ + మయం
2. రాణ్మణి = రాట్ + మణి
3. జగన్నాటకం = జగత్ + నాటకం
*పై మూడు ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క, ట, త లు ఉన్నాయి.
👉
*పరపదంలో మొదట న, మ అనే అనునాసికాలు ఉన్నాయి.
వీటికి సంధి జరిగినపుడు..
క్ + మ = ఙ్మ ( క బదులుగా 'ఙ' ఆదేశంగా వచ్చింది)
ట్ + మ = ణ్మ ( ట బదులుగా 'ణ' ఆదేశంగా వచ్చింది)
త్ + నా = న్నా ( త బదులుగా 'న' ఆదేశంగా వచ్చింది)
*వర్గ ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లకు 'న' గాని 'మ' గాని పరమైతే అదే వర్గ అనునాసికాలు ఙ, , ణ, న,
మ లు ఆదేశంగా వస్తా యి. దీనిని అనునాసిక సంధి అంటారు.
అ). కింది పదాలను విడదీసి, సంధి సూత్రంతో సరిచూడండి.
1. మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి
2. జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి
3. రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం = అనునాసిక సంధి
*అనునాసిక సంధి సూత్రం : *వర్గ ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లకు 'న' గాని 'మ' గాని పరమైతే అదే వర్గ
అనునాసికాలు ఙ, , ణ, న, మ లు ఆదేశంగా వస్తా యి.
*పై మూడు పదాలలో పూర్వపదం చివరన వర్గ ప్రథమాక్షరాలైన త్, ట్ లు ఉన్నాయి.
పరపదంలో మొదట న, మ అనే అనునాసికాలు ఉన్నాయి. సంధి జరిగి ఆయావర్గా ల అనునాసికాక్షరాలు న, ణ లు
ఆదేశంగా వచ్చాయి. కాబట్టి ఈ మూడు పదాలు అనునాసిక సంధులే.
ఆ). కింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి.
1. వాక్ + మహిమ = వాఙ్మహిమ
2. షట్ + ముఖుడు = షణ్ముఖుడు
3. సత్ + నుతి = సన్నుతి
💥సమాసాలు :
4. చిత్ + మయం = చిన్మయం
💥అలంకారాలు :
4. యాత్రా నుభవం = యాత్ర వలన అనుభవం - పంచమీ తత్పురుష సమాసం
💥వాక్యాలు రకాలు :
లేనట్లు గా చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యములో రూపకాలంకారం ఉన్నదని చెప్పవచ్చు.
👉కర్తరి, కర్మణి వాక్యాలు : 'కర్త ' ప్రధానంగా రాసే వాక్యాలను 'కర్త రి' వాక్యాలనీ, 'కర్మ' ప్రధానంగా రాసే వాక్యాలను
'కర్మణి' వాక్యాలనీ అంటారని తెలుసు కదా!
అ). కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1. రవి జామకాయను తిన్నాడు.
జ). రవి చేత జామకాయ తినబడింది.
2. భావన ప్రా జెక్టు పనిని పూర్తి చేసింది.
జ). భావన చేత ప్రా జెక్టు పని పూర్తిచేయబడింది.
3. హర్షిత్ కబడ్డీ జట్టు ను గెలిపించాడు.
జ). హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది.
ఆ). కింది వాక్యాలను కర్త రి వాక్యాలుగా మార్చి రాయండి.
1. "చెట్టు కవిత' ఇస్మాయిల్ చే రాయబడింది.
జ). 'చెట్టు కవిత'ను ఇస్మాయిల్ రాశారు.
2. గాంధీజీగారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది.
జ). గాంధీజీగారు ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు.
3. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డా యి.
జ). చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు.
*******
6.నా చదువు
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. ఆడవారి మాటలలో నుండి శ్రీపాదవారు తెలుగుభాషను నేర్చుకున్న విధానం గురించి మాట్లా డండి,రాయండి.
జ). స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను పట్టివేసే జాతీయత ఉండటాన్ని శ్రీపాదవారు గమనించారు.
భోజనాలయ్యి, ఇళ్ళు సర్దు కోవడం అయ్యాక తటవర్తి సుబ్బమ్మ గారు, మైలవరపు జోగమ్మ గారు, బుద్ధ వరపు
సీతమ్మ గారు శ్రీపాదవారి ఇంటికి వచ్చి వారి అమ్మగారితో గోష్ఠి జరిపేవారు. దాట్ల దివాకరరాజు గారి భార్య బుచ్చి
వెంకయ్యమ్మ గారు కూడా ఆ గోష్ఠిలో కలిసేవారు. వారి గోష్ఠిలో ఛలోక్తు లు, శ్లేషలు, సామెతలు, పలుకుబళ్ళతో
నవరసాలు నాట్యమాడేవి. ఆడవారి మాటల్లో ని విశేషాన్ని గమనించిన శ్రీపాదవారు నలుగురు స్త్రీలు ఎక్కడ
మాట్లా డుకుంటున్నా రహస్యంగా వింటూ తెలుగు భాషను నేర్చుకున్నారు.
2. పాఠం ఆధారంగా కింది వ్యక్తు లు, ప్రదేశాల గురించి మీరేమీ అర్థం చేసుకున్నారో చెప్పండి, రాయండి.
అ). లక్ష్మీపతి సో మయాజులు : వీరు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తండ్రిగారు. పొ లమూరు గ్రా మంలో
నివసించేవారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త ం్ర , మంత్రశాస్త్రా లలో పండితులు.
ఆ). సీతారామశాస్త్రి గారు : వీరి పూర్తిపేరు గుంటూరి సీతారామశాస్త్రి. 'జల్లిసీమ'లోని మోగల్లు వీరి స్వగ్రా మం. వీరు
వల్లూ రులో శ్రీపాదవారికి విద్య నేర్పిన గురువుగారు. వల్లూ రు గ్రా మస్తు లు తమ ప్రా ంతంలోనివారికి సాహిత్య విద్య
నేర్పడం కోసం సంవత్సరానికి కొంత ధనం ఇస్తూ వీరిని తమ గ్రా మంలో ఉంచుకున్నారు.
ఇ). వల్లూ రు గ్రా మం : ఇది ప్రస్తు తం డాII.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని రామచంద్రా పురం తాలూకాలో
మండపేట పట్ట ణానికి రెండు మూడు మైళ్ళ దూరంలో ఉన్న గ్రా మం. పెద్ద రైతాంగంతో, పాడిపంటలతో
తులతూగుతున్న ఊరు.
ఈ). దేవాలయ గోపురం : వల్లూ రు గ్రా మంలోని దేవాలయ గోపురం శ్రీపాద వారి కలలకు, కల్పనలకు వేదిక.
శ్రీపాదవారు చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం సమయంలో ఆ గోపురం పై అంతస్తు లో కూర్చుని చదువుకునేవారు.
ఆ పరిసరాలు శ్రీపాదవారి చదువుకు అనుకూలంగా ఉండేవి.
3. శ్రీపాద వారికి చదువు పట్ల ఉన్న శ్రద్ధ గురించి చెప్పండి, రాయండి.
జ). శ్రీపాద వారికి చదువుపట్ల చాలా శ్రద్ధ ఉండేద.ి ఆడవారు మాట్లా డుకునే మాటలను రహస్యంగా గమనిస్తూ
తెలుగు భాషను చక్కగా నేర్చుకున్నారు. వారు తన తండ్రి దగ్గ రే జ్యోతిషం, వేదం నేర్చుకున్నారు. వల్లూ రు
గ్రా మంలో వారాలు చేసుకుంటూ సాహిత్యవిద్యను నేర్చుకున్నారు. మధ్యాహ్నం సమయంలో దేవాలయ గోపురం పై
అంతస్తు లో కూర్చుని చదువుకునేవారు. చదువుకునే సమయంలో దినచర్యను క్రమశిక్షణతో పాటించేవారు. ఎన్ని
అవాంతరాలు ఎదురైనా చదువును నిర్ల క్ష్యం చేసేవారుకాదు.
ఆ). కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త ం్ర కాదు. •••••••••••••••••••••• కాలం అనే కొలతలతో పాటు బుద్ధి
అనేది కొలతగా పనిచేస్తు ందని దీనినే 'బుద్ధి కొలతవాదం' అనే పేరుతో ప్రతిపాదించిన వీరు 1980 ఆగస్టు 17 న
మరణించారు.
@ప్రశ్నలు :
1. శాస్త ం్ర - సాహిత్యం వీటికి ఉండాల్సిన లక్షణాలేవి?
జ). శాస్త ం్ర ప్రకృతి రహస్యాలను వివరించాలి. సాహిత్యం మానవ జీవితంలోని ప్రతికోణాన్ని చూపించాలి.
2. రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత ఏమిటి?
జ). 13 సంవత్సరాల వయస్సులోనే రచనకు శ్రీకారం చుట్ట డం రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత.
3. పై పేరాలోని కథలు, గల్పికల పేర్లు రాయండి.
జ). కొత్త జీవితం, నిరుద్యోగం, అద్దెకొంప, బాహుకుడు అనేవి కథలు. మాయాపో రు, భూతదయ, ధర్మయుద్ధ ం
అనేవి గల్పికలు.
4. 'బుద్ధి కొలతవాదం' దేని గురించి చెప్పింది?
జ). ఈ జగత్తు కు స్థ లం, కాలం అనే కొలతలతో పాటు బుద్ధి అనేది కొలతగా పనిచేస్తు ందని చెప్పింది.
5. పై పేరాకు శీర్షిక పెట్టండి.
జ). ఈ పేరాకు “బుద్ధి కొలతవాదం” అనే శీర్షిక సరిపో తుంది.
1 సత్యశోధన మహాత్మాగాంధీ
పాఠాలను గురువుగారి వీలునుబట్టి చెప్పించుకునేవారు. స్త్రీలు వంట మొదలుపెట్టక ముందే వెళ్ళి 'వారాలు'
చెప్పుకునేవారు. రాత్రి భోజనం చేశాక వెలుగుతున్న దీపం దగ్గ ర కూర్చుని చదువుకునేవారు.
3. ఆనాటి విద్యావిధానంలో వారాల భోజన పద్ధ తి గురించి వివరించండి.
జ). ఆనాటి విద్యావిధానంలో వారాల భోజన పద్ద తి ఉండేద.ి పొ రుగూరు చదువు కోసం వెళ్ళిన విద్యార్థు లు
రోజుకు ఒక ఇంటికి చొప్పున వెళ్లి , ఆ ఇంటివారు పెట్టే భోజనం చేస్తూ విద్యను కొనసాగించేవారు. ఆ ఇళ్ళవారు
అణకువ, విధేయత ఉన్న వారికే వారాలు ఇవ్వడానికి అంగీకరించేవారు. ఇలా భోజనం పెట్టేటప్పుడు కొంతమంది
ప్రేమగా వడ్డించేవారు. కొందరైతే విసుక్కుంటూ వడ్డించేవారు. ఈ వారాల పద్ధ తి వల్ల చదువుతోపాటు గృహకృత్యాలు
నిర్వహించుకునే నేర్పు అబ్బేది. ఇంగిత జ్ఞా నం, సంస్కారం అలవడేవి.
4. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి రాయండి.
జ). శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు గురుకుల విధానంలో సాహిత్య విద్యను నేర్చుకోవడం కోసం పొ రుగూరైన
'వల్లూ రు' వెళ్ళారు. అక్కడ వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. వారాల భోజనంలో వింతవింత అనుభవాలు
కలిగేవి. ఒక వారం భోజనం సులభంగా దొ రికిత,ే మరొక వారం ఎంతో కష్ట పడితే గాని దొ రికేదికాదు. దీని ద్వారా
ఇంగిత జ్ఞా నం, సంస్కారం అలవడ్డా యి. గురుకుల వాసంలో తన పనులన్నీ తానే చేసుకోవాల్సివచ్చేది. దీనితో
ఆయనకు క్రమశిక్షణ అలవడింది.
5. అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను రాయండి.
జ). అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన లక్ష్యాన్ని మరచిపో కూడదు. తన ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లో నూ
మార్చుకోకూడదు. చేస్తు న్న సాధనను విడిచిపెట్టకూడదు. చేస్తు న్న పనిపై ఏకాగ్రతను కోల్పోకూడదు. నిద్రా హారాలు
కరువైనా, ప్రా ణభయం కలిగినా వెనుకడుగు వేయకూడదు. విజయం వరించినా, పరాజయం వచ్చినా తన
సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇవి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు.
6. నా చదువు పాఠ్యాంశ రచయిత గురించి రాయండి.
జ). నా చదువు అనే పాఠ్యాంశ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. 20వ శతాబ్దా నికి చెందిన గొప్ప కథా
రచయిత. తూర్పుగోదావరి జిల్లా పొ లమూరులో జన్మించారు. వడ్ల గింజలు, మార్గ దర్శి, గులాబీ అత్త రు మొదలైన
75కథలు, మిథునానురాగం, శ్మశానవాటిక మొదలైన నవలలు, ప్రేమపాశం,రాజరాజు మొదలైన
నాటకాలు,ఆయుర్వేద యోగ ముక్తా వళి వంటి వైద్యశాస్త ్ర గ్రంథాలు రచించారు. ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకం
అందుకున్నారు.
7. ఆత్మకథ ప్రక్రియను పరిచయం చేయండి.
జ). ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే పుస్త క రూపంలో రాసుకుంటే దానిని ఆత్మకథ అంటారు.
ఆత్మకథను స్వీయచరిత్ర అనికూడా అంటారు. ఆత్మకథ ఉత్త మ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను
చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తు న్న అనుభూతి చెందుతాడు. ఆత్మకథ వ్యక్తిగతమైనదే
అయినప్పటికీ దానిలో సమకాలీన ఆర్థిక, సాంఘిక, రాజకీయ విశేషాలు ప్రతిబింబిస్తా యి. ఆత్మకథ ఇతరులకు
ప్రేరణ కలిగిస్తు ంది.
8. నా చదువు పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జ). తెలుగులో వచన కవిత్వానికి పట్ట ం కట్టిన ప్రముఖ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు
అగ్రగణ్యులు. వారికి చిన్నతనంలో విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి
మార్గ దర్శకం. వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకొని రచయితగా ఎదిగిన తీరుని
తన ఆత్మకథ "అనుభవాలూ - జ్ఞా పకాలూనూ"లో వివరించారు. అందులో వారి బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే
సంఘటనలే ఈ పాఠ్యాంశానికి నేపథ్యం.
ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవాలయ గోపురం నుండి కనిపించే దృశ్యాన్ని వర్ణించారు కదా! మీ ఇంటి
ముందు నిలబడి చూస్తే మీ వీధి ఎలా కనిపిస్తు ందో వర్ణిస్తూ రాయండి.
జ). మూలపొ లం గ్రా మంలో రామాలయం ప్రక్కన ఉండే వీథిలో మేము నివాసం ఉంటున్నాము. మా
వీథిలో సుమారుగా 20 ఇళ్ళు ఉంటాయి. మా వీథిలో మాదే చివరి ఇల్లు . వీథిలో రోడ్డు కు ఇరువైపులా రకరకాల
జాతులకు చెందిన పచ్చని వృక్షాలు ఉంటాయి. మా ఇంటి ముందు నిలబడి చూస్తే మా వీథిలోని ఇళ్ల న్నీ ఒక
క్రమపద్ధ తిలో ఉండక, అక్కడక్కడ దూరం దూరంగా ఉంటాయి. అవన్నీ ఆకాశంలో చిందరవందరగా విసిరేసినట్లు న్న
నక్షత్రా ల వలె అందంగా కనిపిస్తా యి.
రోడ్డు ప్రక్కనున్న పూలచెట్లనుంచి రాలుతున్న పూలు స్వర్ణ పుష్పాలను తలపింపజేస్తా యి.
చెట్లపైనుంచి వీస్తు న్న పైరగాలి వీథిలో వెళ్తు న్న వారి మనసులను ఆనందభరితం చేస్తు ంది. ఇరువైపులా ఉన్న చెట్ల
తలలు ఒకదానిలో ఒకటి కలిసిపో యి వీథికి ఆకుపచ్చని గొడుగు పట్టినట్లు గా కనిపిస్తా యి. ఒక్క మాటలో
చెప్పాలంటే మా వీథి సొ గసును చూసి ఆస్వాదించాలేగాని మాటల్లో వర్ణించలేము.
2. నేటి విద్యా విధానంలో విద్యార్థు లకు లభిస్తు న్న సౌకర్యాలను తెలియజేస్తూ కరపత్రం తయారుచేయండి.
జ). అందరూ విద్యావంతులు కావాలి!
ప్రియమైన సో దర సో దరీమణులారా!
మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే అనే విషయం అందరికీ తెలిసినదే.
పూర్వకాలంలో విద్యను అభ్యసించడానికి ఎన్నో కష్టా లు పడాల్సివచ్చేది. నేటి విద్యా విధానంలో విద్యార్థు లకు
ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తు న్నాయి. అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థు ల తల్లు ల బ్యాంకుఖాతాలలో
డబ్బులు వేస్తు న్నారు. పాఠ్య పుస్త కాలు, నోటు పుస్త కాలు, బ్యాగులు, బట్ట లు, బూట్లు , బెల్టు లు వంటివి విద్యార్థు లకు
ఉచితంగా అందజేస్తు న్నారు. నాడు - నేడు పేరుతో పాఠశాలలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దు తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం బడి పిల్లల ఆకలి తీరుస్తు ంది.
విద్యలో సాంకేతికతను జోడించి ట్యాబ్లు , IFP ప్యానెల్లు ఉపయోగించి పాఠాలు బో ధిస్తు న్నారు. విద్యను
బో ధించడానికి తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విశాలమైన క్రీడాస్థ లాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా మీ
చెల్లెళ్ళకు, తమ్ముళ్ల కు, ఇరుగుపొ రుగు వారికి ఈ విషయాలు తెలియజేస,ి ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా
ప్రో త్సహిస్తా రని ఆశిస్తు న్నాము.
సౌకర్యాలను వినియోగించుకోండి - చక్కగా చదువుకోండి.
కె.పెదపూడి, ఇట్లు
22 - 12 - 2023. 9వ తరగతి విద్యార్థినీ విద్యార్థు లు,
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి.
3. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ గురువు సీతారామశాస్త్రి గారి గొప్పతనం గురించి చెప్పారు కదా!
అలాగే మీ ఉపాధ్యాయుని గొప్పతనం గురించి పది వాక్యాలు రాయండి.
జ). మా పాఠశాలలో గంగారావు గారు అనే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన మాకు సాంఘిక శాస్త ం్ర
బో ధిస్తా రు. తరగతి గదిలో మాకు కేవలం పాఠ్య పుస్త కంలోని విషయాల్ని మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను
ప్రస్తు తకాలానికి అన్వయించి బో ధిస్తా రు. సమాజ స్థితగతులను కళ్ళకు కట్టినట్లు వివరిస్తా రు. వారు నిరంతరం అనేక
కొత్త పుస్త కాలను అధ్యయనం చేస్తు ంటారు. ఆయన ఇల్లు ఒక పెద్ద గ్రంథాలయంలా ఉంటుంది. వారి ఇంటిలో సగం
స్థ లానికిపైగా ఆ పుస్త కాలకే సరిపో తుంది.
విద్యార్థు లు ఏదైనా సందేహం అడిగితే విసుక్కోకుండా సమాధానం చెబుతారు. ముఖ్యంగా మా
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవసరమైన మెళకువలను కూడా మాకు చెబుతారు. విద్యార్థు లను తన
కన్నబిడ్డ ల్లా చూసుకుంటారు. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అనే మాటకు ఆయన పూర్తిగా అర్హు లు. అందుకే
ఆత్మీయతకు చిరునామాగా నిలిచిన గంగారావు మాష్టా రు అంటే మా పాఠశాలలో అందరికీ ఎంతో అభిమానం.
III). భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది పదాలకు సరైన అర్థా లను గుర్తించి రాయండి. వాటిని సొ ంతవాక్యాల్లో ప్రయోగించండి.
వెళ్ళిపో వడం, పొ ందదగినది, నడవడిక, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు, నిష్ణా తుడు
ఉదా : సఫలం = విజయవంతం
మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్ధక్యం.
1. ప్రా ప్యం = పొ ందదగినది
*మనం ఎంత ఆశపడినా మనకు ప్రా ప్యం లేనిది మనకు దక్కదు.
2. పారంగతుడు = నిష్ణా తుడు
*అర్జు నుడు విలువిద్యలో పారంగతుడు.
3. ప్రవర్త న = నడవడిక
* మంచి ప్రవర్త న కలిగిన పిల్లలనే అందరూ ఇష్ట పడతారు.
4. దీక్షాపరుడు = అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు
*శ్రీరాముడు పితృవాక్య దీక్షాపరుడు.
5. ఉడాయించడం = వెళ్ళిపో వడం(పారిపో వడం)
*దొ ంగ షాపులోని వస్తు వులను దొ ంగిలించి అక్కడినుండి ఉడాయించాడు.
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
👉
2. నవోదయం = నవ + ఉదయం = గుణసంధి
గుణసంధి సూత్రం : ‘అ’ కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తా యి.
3. విద్యార్థు లంటే = విద్యార్థు లు + అంటే = ఉత్వసంధి
4. పో రుగూళ్ళు = పొ రుగు + ఊళ్ళు = ఉత్వసంధి
👉ఉత్వసంధి సూత్రం : ఉత్తు నకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యంగా వస్తు ంది.
👉సరళాదేశ సంధి సూత్రా లు :
5. కలగcజొచ్చింది = కలగన్ + చొచ్చింది = సరళాదేశ సంధి
i). ద్రు తప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తా యి. (కలగన్ + జొచ్చింది)
ii). ఆదేశ సరళాలకు ముందున్న ద్రు తానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తా యి.
👉టుగాగమసంధి :
(కలగcజొచ్చింది/కలగంజొచ్చింది/కలగన్జొచ్చింది)
👉
టుగాగమసంధి అంటారు.
సూత్రం1: కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర 'ఉ' ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు 'ట్' ఆగమంగా
వస్తు ంది.
*కింది ఉదాహరణలను పరిశీలిద్దా ం.
ఉదా : పేరుటురము = పేరు + ఉరము = పేరుట్ + ఉరము
చిగురుటాకు = చిగురు + ఆకు = చిగురుట్ + ఆకు
పై ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వపదం చివరి అక్షరంలో 'ఉత్తు ' ఉన్నది. (పూర్వపదంలోని పదాలన్నీ పేర్వాది
శబ్దా లున్నాయి. పేరు, చిగురు, పొ దరు మొదలైన శబ్దా లను పేర్వాదులు అంటారు. ఈ పదాల చివరి అక్షరంలో ఉత్తు
ఉన్నది.)
పరపదం మొదటి అక్షరంగా అచ్చులున్నాయి. ఇందులో పూర్వపదంలోని చివరి అక్షరంలో గల 'ఉత్తు ' అలాగే ఉంది.
పరపదంలోని 'అచ్చు' స్థా నంలో టుగాగమం వస్తు ంది.
👉
అంటే ఉ = టు గాను, ఆ = టా గాను మార్పు చెందినది. కాబట్టి ఇది టుగాగమసంధి.
సూత్రం 2 : కర్మధారయంబునందు పేర్వాది శబ్దా లకు అచ్చు పరమగునపుడు టుగాగమం విభాషగానగు.
అ). కింది పదాలను విడదీసి, సంధిపేరు తెలిపి సూత్రీకరించండి.
1. పొ దరుటిల్లు = పొ దరు + ఇల్లు = టుగాగమసంధి
2. తూగుటుయ్యేల = తూగు + ఉయ్యేల = టుగాగమసంధి
3. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమసంధి
4. పండుటాకు = పండు + ఆకు = టుగాగమసంధి
5. పెంకుటిల్లు = పెంకు + ఇల్లు = టుగాగమసంధి
*టుగాగమసంధి సూత్రం : కర్మధారయంబునందు పేర్వాది శబ్దా లకు అచ్చు పరమగునపుడు టుగాగమం
💥సమాసాలు :
విభాషగానగు.
💥ఆధునిక వచనం :
6. కొత్త వీధి - కొత్త దైన వీధి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
*******
7. ఆకుపచ్చ శోకం
I). అవగాహన - ప్రతిస్పందన :
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
1. 'ఆకుపచ్చ శోకం' పాఠ్యాంశాన్ని భావయుక్త ంగా చదవండి.
జ). (వచనాన్ని, వచన కవితను ఉపాధ్యాయుడు చదివేటప్పుడు విద్యార్థు లు గమనించి, భావయుక్త ంగా
చదవడానికి ప్రయత్నిస్తా రు.)
2. మనిషిని కవి ఆక్టో పస్ తో ఎందుకు పో ల్చారో చెప్పండి.
జ). ఆక్టో పస్ చాలా ప్రమాదకరమైన జీవి. దానికి అన్నివైపులా చేతులవంటి అవయవాలు ఉంటాయి.
దాని సమీపానికి ఇతర జీవులు రాగానే ఆ చేతులతో పట్టు కుని వాటిని ఆహారంగా తినేస్తు ంది. అలాగే మనిషి కూడా
విచక్షణ లేకుండా కనిపించిన చెట్టు నల్లా నరికేస్తు న్నాడు. ఆక్టో పస్ వల్ల జలచరాలకు నష్ట ం వాటిల్లు తున్నట్లే మనిషి
వల్ల పర్యావరణానికి కూడా ముప్పు పొ ంచివుంది. అందువల్ల మనిషిని కవి ఆక్టో పస్ తో పో ల్చారు.
3. ‘లెక్కల్లో మునిగిపో యిన మనిషి మొక్కల్నేం పట్టించుకుంటాడు' అని కవి ఎందుకు అన్నారు?
జ). మనిషి స్వార్థజీవి. మనిషి ఏ పనిచేసినా దానిలో లాభనష్టా లను అంచనావేసుకునే చేస్తా డు. తనకు
లాభం కలిగించే పనిని ఎంత కష్ట మైనా చేస్తా డు. తనకు లాభం లేదనుకుంటే అస్సలు ఏ పనీ చేయడు. చేసే
ప్రతిపనిని లెక్కలేసుకుని చేసే మనిషికి మొక్కల్ని పట్టించుకునే తీరికే ఉండటం లేదని కవి ఆవేదనతో ఈ మాటలు
అన్నారు.
4. పచ్చటి లోకాన్ని ముందు తరాలకు హామీగా ఇవ్వాలంటే మనమేం చేయాలి?
జ). పర్యావరణానికి హితాన్ని కలిగించే మొక్కలను ఎక్కువగా పెంచాలి. వాటిని బాధ్యతతో సంరక్షించాలి.
మన ఇంటిలో పుట్టినరోజు, వివాహం వంటి శుభకార్యాలు జరిగే సమయాల్లో ఆ రోజుకు గుర్తు గా కొన్ని మొక్కల్నైనా
నాటాలి. మన అవసరాల కోసం చెట్లను విచ్చలవిడిగా నరకకూడదు. చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి హాని
కలుగుతుందని అందరికీ తెలిసేలా ప్రచారం చెయ్యాలి. ఈ విధంగా చేయడం ద్వారా పచ్చటి లోకాన్ని ముందు
తరాలకు హామీగా ఇవ్వవచ్చు.
ఆ). కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
తులసి గౌడ కర్ణా టక రాష్ట ం్ర లోని హూన్నాలి గ్రా మానికి చెందినది. ఆమె పర్యావరణ రక్షకురాలు.
•••••••••••••••••••••• ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 26 జనవరి 2020న 'పద్మశ్రీ' పురస్కారంతో
గౌరవించింది.
@ప్రశ్నలు :
1. తులసి గౌడను స్థా నికులు ఏమని పిలుస్తు న్నారు?
జ). తులసి గౌడను స్థా నికులు 'వృక్షదేవి' అని పిలుచుకుంటారు.
2. తులసి గౌడ మొక్కల్ని ఎలా భావించింది?
జ). తులసి గౌడ మొక్కల్ని కన్నబిడ్డ లుగా భావించింది.
3. తులసి గౌడను ఏ అవార్డు తో సత్కరించారు? ( ఇ )
అ). పద్మ ఆ). భారతరత్న ఇ). పద్మశ్రీ
4. ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అని అర్ధా న్నిచ్చే పదం ఏది?
జ). విజ్ఞా న సర్వస్వం అనే పదం ఎన్నో విషయాలు తెలిసి ఉండడం అనే అర్థా న్నిస్తు ంది.
5. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జ). తులసి గౌడ ఒక్క ఏడాది కాలంలో ఎన్ని మొక్కలు నాటింది?
ఇ). కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
నటరాజన్ పుట్టింది తమిళనాడులోని పుదుక్కోటలో. నటరాజన్ కి రెండేళ్లు ఉన్నప్పుడే తల్లి భాగీరధి
చనిపో యింది. •••••••••••• శారద అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఈయన శారద నటరాజన్ గా ప్రసిద్ధు డు.
@ప్రశ్నలు :
1. వంట పట్టించుకోవడం అంటే అర్థం ఏమిటి?
జ). వంట పట్టించుకోవడం అంటే పూర్తిగా నేర్చుకోవడం అని అర్థం.
2. నటరాజన్ జీవితంలో మీకు గొప్పగా అనిపించిన అంశం ఏమిటి?
జ). బ్రతుకుతెరువు కోసం గారెలు, బజ్జీలు అమ్ముతూ, సాహిత్యంపై ప్రేమతో రచనలు చేయడం నటరాజన్
జీవితంలో నాకు గొప్పగా అనిపించింది.
నేను మీకు ఎన్నో రకాలుగా మేలుచేస్తా ను. ఎండనుండి, వాననుండి మీకు రక్షణ కల్పిస్తా ను. నేను
మనుష్యులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకు అంతెందుకు ఈ భూమిమీద బ్రతికే ప్రతిజీవికీ ఆహారాన్ని
అందిస్తా ను. స్వచ్ఛమైన గాలిని అందిస్తా ను. నన్ను ఆశ్రయించి బతికే పక్షుల కువకువ రాగాలు ఎంతో
వీనులవిందుగా ఉంటాయి.
నేను ఎవ్వరిమీదా ఆధారపడకుండా గాలి, సూర్యకాంతి ద్వారా సొ ంతంగా ఆహారం తయారు
చేసుకోగలను. మీకు ఇన్ని విధాలుగా ఉపయోగపదుతున్న నన్ను మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్ట మొచ్చినట్లు
నరికేస్తు న్నారు. భవిష్యత్తు లో ఇది మీ మనుగడకే ప్రమాదం అని తెలుసుకోండి. నా బ్రతుకు నన్ను బతకనివ్వండి.
లేదంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. తస్మాత్ జాగ్రత్త.
2. గ్లో బల్ వార్మింగ్ ద్వారా సంభవించబో యే విపత్తు ల గురించి రచయిత చేసిన హెచ్చరికలను
మీ సొ ంతమాటల్లో వ్యాసంగా రాయండి.
జ). భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తూ ఓజోన్ పొ ర సమస్త
జీవులనూ కాపాడుతుంది. అటువంటి ఓజోన్ పొ ర, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం వల్ల తరిగిపో తోంది. దీనినే
"గ్లో బల్ వార్మింగ్" లేదా "భూమి వేడెక్కడం" అని అంటారు. ఈ గ్లో బల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక విపత్తు లను
ఎదుర్కోవలసివస్తు ంది.
గ్లో బల్ వార్మింగ్ ప్రభావం వల్ల కార్బన్డ యాక్సైడ్ వంటి విషవాయువులు పెరిగి భూగోళం తాపంతో
మరిగిపో తుంది. భూతాపం వల్ల ఇరుధ్రు వాల్లో ని మంచుఖండాలు కరిగ,ి సముద్రా లు పొ ంగిపొ ర్లు తాయి. కాలంతో
సంబంధం లేకుండా ఉష్ణ తాపం పెరిగిపో తుంది. పచ్చికబయళ్ళు ఎడారులుగా మారిపో తాయి. భూగర్భ జలాలు
ఇంకిపో తాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమ్మీద మానవులతో పాటు సమస్త జీవుల మునుగడ ప్రశ్నార్థకం
అవుతుంది. అంటూ కవి గ్లో బల్ వార్మింగ్ ద్వారా సంభవించబో యే విపత్తు ల గురించి హెచ్చరించారు.
3. పల్లె,పట్నం తేడాలేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రు నికి లేఖ రాయండి.
జ). కె.పెదపూడి,
22-02-2024.
ప్రియమిత్రు డు జగదీష్ కృష్ణ ఆదిత్యకు,
ఉభయకుశలోపరి. ప్రస్తు త కాలంలో పల్లె,పట్నం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ చెట్లు
కనుమరుగు అవుతుండడాన్ని మనం చూస్తూ నే ఉన్నాము. పెద్దపెద్ద భవనాలు నిర్మించుకోవడం కోసం చెట్లు
అడ్డు గా ఉన్నాయనే నెపంతో వాటిని తొలగిస్తు న్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన కలప కోసం చెట్లను
అవసరానికిమించి నరికేస్తు న్నారు. పరిశమ ్ర ల నిర్మాణానికి విశాలమైన స్థ లాలు అవసరం కావడంతో ఆ స్థ లాలలో
ఉన్న చెట్లను ఇష్టా నుసారం తీసిపారేస్తు న్నారు. ఇంకా కరెంటు తీగలకు తగులుతున్నాయనో, రహదారుల విస్త రణకు
అడ్డొస్తు న్నాయనో అనేక చెట్లను నరికేస్తు న్నారు.
ఇలా చెట్లను విచ్చలవిడిగా నరికేయడం వల్ల కాలుష్యం ఎక్కువై, భూతాపం పెరిగిపో తుంది. దీనివల్ల
రాబో యే కాలంలో ఈ భూమ్మీద జీవరాశి మనగడే ప్రశ్నార్ధకం అవుతుంది. కాబట్టి మనమంతా ఇప్పటికైనా కళ్ళు
తెరిచి ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూక్తిిలోని పరమార్థం గ్రహిద్దా ం. జరగబో యే అనర్ధా న్ని ముందుగానే గుర్తించి ఉన్న
చెట్లను రక్షించుకుందాం. కొత్త మొక్కలను విరివిగా నాటుదాం. ఈ విషయంపై నీ అభిప్రా యాన్ని కూడా తెలియజేస్తూ
లేఖ రాయగలవు. ఉంటాను మిత్రమా!
ఇట్లు
నీ ప్రియమిత్రు రాలు,
జాహ్నవిశ్రీ షణ్ముఖ లాస్య.
చిరునామా :
ఎమ్.జగదీష్ కృష్ణ ఆదిత్య,
తండ్రి - శ్రీనివాసరావు గారు,
ఎస్. మూలపొ లం గ్రా మం,
అయినవిల్లి మండలం,
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా .
పిన్ కోడ్ : 533211
III).భాషాంశాలు :
i). పదజాలం :
అ). కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధా లు రాసి వాక్య ప్రయోగం చేయండి.
1. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.
జ). హరితం = పచ్చదనం
*కాలుష్యం కోరల్లో చిక్కి చెట్లు పచ్చదనాన్ని కోల్పోతున్నాయి.
2. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది.
జ). ఉపద్రవం = ప్రమాదం
*విద్యుత్తు తో చెలగాటం ప్రా ణాలకే ప్రమాదం.
3. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి.
జ). బాహువులు = చేతులు
*మానవ మృగాల చేతుల్లో అబలల జీవితాలు బలైపో తున్నాయి.
4. వేసవికాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు.
జ). ఛాయ = నీడ
*మూర్ఖు నితో స్నేహం పాము పడగ నీడలో తలదాచుకోవడంతో సమానం.
5. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితమవుతున్నాయి.
జ). గరళం = విషం
*లోకక్షేమం కోసం పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు.
ఆ). కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తా యి.
జ). చెట్లు = వృక్షాలు, తరువులు
2. పెళ్లి లో వధూవరులను ముస్తా బు చేశారు.
జ). ముస్తా బు = అలంకరణ, అందంగా తయారవ్వడం
3. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు.
జ). జాడ = ఆచూకి, ఆనవాలు
💥సంధులు :
ii). వ్యాకరణాంశాలు :
అ). కింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటోంది.
జ). కళ్ళెదుట = కళ్ళ+ ఎదుట = అత్వసంధి
2. మనందరికీ చెట్టొ క ప్రా ణమిత్రు డు.
జ). చెట్టొ క = చెట్టు + ఒక = ఉత్వసంధి
3. నగరాల్లో చల్ల ని జానెడు నీడేద? ి
జ). నీడేది = నీడ + ఏది = అత్వసంధి
4. ప్లా స్టిక్ కొబ్బరి చెట్లు ముస్తా బైన శవాల్లా దర్శనమిస్తు ంటాయి.
జ). ముస్తా బైన = ముస్తా బు + ఐన = ఉత్వసంధి
ఆ). కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. తేనెటీగ = తేనె + ఈగ = టుగాగమ సంధి
2. పడకటిల్లు = పడక + ఇల్లు = టుగాగమ సంధి
3. పర్యావరణం = పరి + ఆవరణం = యణాదేశ సంధి
4. బాలింతరాలు = బాలింత + ఆలు = రుగాగమ సంధి
💥సమాసాలు :
జ). కర్త రి వాక్యం : గోపి మొక్కను నాటాడు.
*******
🌹 🌹
కృషితో నాస్తి దుర్భిక్షం
శుభం
రూపకల్పన :
మామిడిశెట్టి శ్రీనివాసరావు,
ఎమ్.ఏ; టి.పి.టి; నెట్; స్లెట్.
పాఠశాల సహాయకుడు (తెలుగు),
జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల, కె.పెదపూడి,అంబాజీపేట మండలం,
డాII.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా . :9493646591