Professional Documents
Culture Documents
Amarakosam
Amarakosam
https://te.quora.com 2/6
16/11/2023, 16:43 (4) Quora
అమరకోశంలో శివ శబ్ద మునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జ న మనాంసి ఇతివా' -
సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును
శివునియందు పెట్టా రు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధ ముగా భక్తి అనే తేనెతో
నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి
హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టు కొని రమించిపోతున్నదో,
ఎవరు శృతి ప్ర మాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి
చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.
అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్ల యితే శివుడిని ఏ
రకంగానయినా పట్టు కుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధ రించగలడని చెప్పబడింది. శివనామము
పంచాక్ష రీ మంత్ర ములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్ష రీ మంత్ర ము.
‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్ట డి చేసి ఎంతో జాగ్ర త్త గా చెప్పింది. మనకి
వేదములు నాలుగయినా, సంప్ర దాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తా ము. అందుకే
శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్ర యీవేద్యం హృద్యం త్రి పురహర
మాద్యం త్రి నయనం' అన్నారు.
త్ర యీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ
మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి
ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు.
కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన
ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక
బ్ర హ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్ర యీవేద్యం అంటారు. ఒక దేవాలయ
ప్రాంగణం ఉన్నట్లు గా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో
వున్నది యజుర్వేదము.
యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రా కారము నాల్గ వ
కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గ వది వుంది. ఈ నాల్గ వ
కాండలో రుద్రా ధ్యాయం ఉంది. రుద్రా ధ్యాయంలో మధ్యలో అష్ట మానువాకం వస్తుంది.
అష్ట మానువాకమును మీరు చదివినట్ల యితే -
నమస్సోమాయ చ రుద్రా య చ నమస్తా మ్రా య చ అరుణాయ చ
నమశ్శంజ్గా య చ పశుపతయే చ నమ ఉగ్రా య చ భీమాయ చ
నమో అగ్రే వధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ
నమో వృక్షే భ్యో హరికేశేభ్యో నమ స్తా రాయ నమశ్శంభవే చ మయోభవే చ
నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రా ధ్యాయం -
అష్ట మానువాకం-1 - 11)
అష్ట మానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టా రు.
ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే
గురువు. గురూపదేశంతో పంచాక్ష రిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్ట మొదట ఈ
https://te.quora.com 3/6
16/11/2023, 16:43 (4) Quora
శివనామమును ప్ర చారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు.
ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షా త్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం
రుద్రా ధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్ది నే చ వ్యుప్త కేశాయ చ' అని.
'కపర్ది నే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్త కేశాయ చ' అంటే అసలు వెంట్రు కలు
లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా
కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే
వున్న నామంలో ఒక్క వెంట్రు క కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా
సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి
వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి
గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షి ణామూర్తి గా ఉన్నప్పుడు కూడా శివుడు
జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి
అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పిం.
వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్ర తిపాదన చేస్తూ చెప్పారు -
'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'
'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో
ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు
శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టు కొని
యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.
నమః కపర్ది నే చ - పరమశివుడు. వ్యుప్త కేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ
శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రా ధ్యాయం ఎప్పుడో
రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రా ధ్యాయం చెప్పింది.
ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ
సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టు తో ఉన్నవాడి నుంచి ప్రా రంభమయిన ఈ
గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య
స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ
గురుపరంపరే నడుస్తు న్నది.
ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్ర మాణమును చెడగొట్ట డానికి అవైదికమైన వాదములు
ప్ర బలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు.
కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్ర చారమును చేశారు. ఆయన ప్ర బోధించిన
భగవద్గీ త ప్ర స్థా నత్ర యంలో ఒకటిగా భాసిల్లు తున్నది. అంతటి భగవద్గీ తను మనకు
అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్ర హ్మ తత్త్వం.
అదే ఒకనాడు కృష్ణు డిగా భాసించింది. అటువంటి భగవద్గీ తను యిచ్చిన కృష్ణ పరమాత్మ
అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్ర మాదములనుండి ఉద్ధ రించ గలిగినంత
జ్ఞా నబోధ చేయ్యలేదు? దానికి ఒక్కటే కారణం.
ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్ల లోకి వెళ్ళిపోయింది.
https://te.quora.com 4/6
ద్వా
16/11/2023, 16:43 ర్మ ర్వీ (4) Quora
కృష్ణా వతార ప్రా రంభం నుండే ఆయన ఎంతో రాక్ష స సంహారం చేశాడు. పూతనా
సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్ష సులను చంపాడు. జరాసంధాది
రాక్ష సులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షే త్రంలో నిజంగా పాండవులు
నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షే త్ర యుద్ధంలో
సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీ త రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు.
కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్ర కోపములు చాలా
ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టి గా పట్టు కోనడానికి
ప్ర యత్నించాలి. దానికి ప్ర స్థా నత్ర యభాష్యంతో మొదలుపెట్టి , ఈశ్వరుడిని స్తో త్రం చెయ్యడం
వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞా నబోధ తప్ప యింకొక
ప్ర యత్నమూ కాని, పని కాని పెట్టు కోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత
స్థా పనాచార్యులై శృతి ప్ర మాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తో త్ర ములు చెప్పి
శివానందలహరి, సౌందర్యలహరి, బ్ర హ్మసూత్ర భాష్యము వంటివి ఎన్నో చేశారు
శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు
అయిపోతాయి.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!
అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞా నబోధ చేశారు. శుభం
కళ్యాణం శ్రే యం భద్రం శోభనం – యివన్నీ జ్ఞా నంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞా నం కన్నా గొప్ప
కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రే యం, శోభనం ఇంక ప్ర పంచంలో లేవు. అటువంటి
జ్ఞా నమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద
నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు
గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి
నమస్కరిస్తూ ఉండాలి.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దే వో మహేశ్వరః!
గురుస్సాక్షా త్ పరంబ్ర హ్మ తస్మైశ్రీ గురవేనమః!!
అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ
ప్ర దుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తా రని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గ ర నుంచి
మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ
శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని
గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్ష జాతి, సనాతన
ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట
ఎంత భద్ర మో ఎంత శ్రే యస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా
ఎంత పరవశము పొందుతామో గ్ర హించాము.
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థ లం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లా సికిన్
https://te.quora.com 5/6
16/11/2023, 16:43 (4) Quora
https://te.quora.com 6/6